పాపను సంపిన అగాంతకులపై వెంటనే కేసు నమోదు చేయాలి
భూపాలపల్లి యాదవ సంఘం నాయకులు
భూపాలపల్లి నేటిధాత్రి
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో రజక కులస్తులపైన దాడి చేసి, ఒక పాప మృతికి కారణమైన నిందితులను చూడకుండా కఠినంగా శిక్షించాలి తన చావుకు కారణమైన అగ్రవర్ణ కుల అహంకారాన్ని యాదవ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలపై పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ వారిని కోరుకుంటున్నాము. ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరిగితే బిసి కులాలన్నీ ఐక్యంగా ఉద్యమాలు చేయాలని అందులో యాదవుల పాత్ర ముందు వరసలో ఉంటుందని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు పెంట సదానందం పోలవేణి అశోక్ యాదవ్ నలినీటి సతీష్ యాదవ్ మెరుగుల మహేందర్ యాదవ్ గారవేన సమ్మయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు
