235 కోట్ల రూపాయలతో మంజూరైన 650 పడకు ఆసుపత్రి నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ
నేటి దాత్రి నాగర్ కర్నూలు జిల్లా
నాగర్ కర్నూలు జిల్లాలో మెడికల్ కాలేజీకి అనుసంధానంగా 10 ఎకరాల స్థలంలో 235 కోట్లతో మంజూరు అయిన 650 పడకల ఆసుపత్రిని ఈరోజు నవ తేజ నిర్మాణ సంస్థ యజమాన్యంతో కలిసి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు
వీలైనంత త్వరగా ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే గారు సంస్థ వారికి సూచించడం జరిగింది ఎక్కడ కూడా పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడకూడదని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే గారు సూచించారు
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణారావు ప్రిన్సిపల్ సంబంధిత అధికారులు పట్టణ మాజీ కౌన్సిలర్ నాయకులు పాల్గొన్నారు
