నిందితులను కఠినంగా శిక్షించాలి..

నిందితులను కఠినంగా శిక్షించాలి

ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో రజక కులస్తులపైన దాడి చేసి, ఒక పాప మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా, కుమ్మేర గ్రామంలో మూడు రోజుల కిందట 18 -2-26 తేదీన శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా, రజక కుటుంబం ,స్వామివారి దర్శనం కోసం టికెట్టు లేకుండా గుడిలోకి ప్రవేశించారని,గ్రామ సర్పంచ్, మరియు ,అగ్రకుల పెత్తందారులు,రజకులను దుర్భాషలాడుతూ, విచక్షణ రహితంగా దాడి చేసి, అసభ్య పదజాలం తో దూషించి , రెండు నెలలు నిండిన పసిపాపన్ని నిర్దాక్షణంగా, కిరాతకంగా తన్ని, పాపని చంపడం దురహంకార చర్య అని, ఇంత దారుణానికి ఒడి కట్టిన అగ్రకుల పెత్తందారులకు అధికారులు, పోలీస్ లు సహకరిస్తూ, కొమ్ము కాస్తున్నారని,రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నప్పటి నుండి దళితులు, బలహీన వర్గాల పైన నిత్యం దాడులు జరుగుతున్నాయని, ఈ ప్రభుత్వంలో బలహీన వర్గాలకు రక్షణ కరువైందని,ఇకనైనా ప్రభుత్వం స్పందించి నిందితులపైన కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేణుకుంట్ల మహేష్ మాదిగ, జిల్లా కార్యదర్శి బచ్చల చిరంజీవి మాదిగ, నియోజకవర్గ ఇంచార్జి శిలపాక హరీష్ మాదిగ,మాలహర్ మండల అధ్యక్షులు మంత్రి రాజబాబు మాదిగ తదితరులు పాల్గొన్నారు..

పాపను సంపిన అగాంతకులపై వెంటనే కేసు నమోదు చేయాలి..

పాపను సంపిన అగాంతకులపై వెంటనే కేసు నమోదు చేయాలి

భూపాలపల్లి యాదవ సంఘం నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో రజక కులస్తులపైన దాడి చేసి, ఒక పాప మృతికి కారణమైన నిందితులను చూడకుండా కఠినంగా శిక్షించాలి తన చావుకు కారణమైన అగ్రవర్ణ కుల అహంకారాన్ని యాదవ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలపై పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ వారిని కోరుకుంటున్నాము. ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరిగితే బిసి కులాలన్నీ ఐక్యంగా ఉద్యమాలు చేయాలని అందులో యాదవుల పాత్ర ముందు వరసలో ఉంటుందని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు పెంట సదానందం పోలవేణి అశోక్ యాదవ్ నలినీటి సతీష్ యాదవ్ మెరుగుల మహేందర్ యాదవ్ గారవేన సమ్మయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు

రజకులు గుడిలోకి వెళితే… రెడ్డి చేతిలో చావేనా…

రజకులు గుడిలోకి వెళితే… రెడ్డి చేతిలో చావేనా…?

గణపురం నేటి ధాత్రి

 

డి.ఎస్.పి జిల్లా ప్రధాన కార్యదర్శి కండి రవి

గణపురం మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండే రవి మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా, కమ్మెర గ్రామంలో రజక (చాకలి )కులస్తులు గుడిలోకి వచ్చారని రెడ్డి కులానికి చెందిన తుకారాం రెడ్డి తన అనుచరులు, రజకులను విచక్షణ రైతంగా కొట్టి రెండు నెలల పసికందును కాలితో తన్ని చంపిన విషయాన్ని ధర్మ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రెడ్డి వెలమలకు ఓట్లు వేస్తే గుడికి వెళ్లిన బడికి వెళ్లిన అణగారిన వర్గాలకు చెందిన వారు చనిపోవాలా? ఇదేనా ప్రజా పాలన అంటే? రెడ్డి అగ్ర కులానికి చెందిన వీరిపై మర్డర్ కేస్ నమోదు చేయాలి .సర్పంచ్ పదవి నుండి తొలగించాలి. ఇలాంటి దాడులు మళ్లీ పునరావృతం కాకుండా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని భారత రాజ్యాంగం కల్పించిన సమన్యాయం కల్పించాలని పోలీస్ యంత్రాంగానికి, ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version