బీఆర్ఎస్ రజతోత్సవ సభ జయప్రదం చేద్దాం ఎమ్మెల్యే.!

బీఆర్ఎస్ రజతోత్సవ సభ జయప్రదం చేద్దాం ఎమ్మెల్యే మాణిక్ రావు

◆ఈనెల 27 న ఎల్కతుర్తి లో జరిగే సభను కలిసి కట్టుగా విజయవంతం చెయ్యాలి

◆కోహిర్ మండల పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు అన్నారు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

మాజి మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు, శనివారము మండలంలోని ఎస్ఎస్ ఫంక్షన్ హాలులో మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతుందని అన్నారు. 10 లక్షల మంది తో జరిగే సభకు గ్రామ గ్రామం నుంచి పార్టీ కార్యకర్తలు బయలుదేరి రావాలని పిలుపునిచ్చారు.రజతోత్సవ సభ రాష్ట్రంలో గులాబీ పండగ వలె జరుపుకుంటున్నామని.. ఈ పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

MLA Manik Rao

 

కోహిర్ మండలం నుండి పెద్ద ఎత్తున కదలిరావాలని ఎమ్మెల్యే మాణిక్ రావు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ రామకృష్ణ రెడ్డి,కొహిర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు , జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,మాజి జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు మొహిద్దీన్ , ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మాజి కేతకీ ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్,
సీనియర్ నాయకులు కలీం, కొహిర్ పట్టణ అధ్యక్షులు ఇఫ్టేకార్,యువ నాయకులు మిథున్ రాజ్,మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్ ,మాజి సర్పంచ్ లు నర్సింలు , మొలయ్య,రమేష్ ,మాజి ఎంపీటీసీ లు సంపత్,విఠల్ రెడ్డి ,నాయకులు నర్సింహ రెడ్డి,మాజి విజిలెన్స్ కమిషన్ మెంబర్ రామకృష్ణ బంటు,గ్రామ పార్టీ అధ్యక్షులు & కార్యవర్గం ,ముఖ్య నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవానికి రావలసిందిగా.

ఎదురు గట్ల శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవానికి రావలసిందిగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఆహ్వానం

వేములవాడ రూరల్ నేటిధాత్రి

 

 

వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో వైభవంగా నిర్వహించే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను రావాల్సిందిగా కోరుతూ దేవస్థాన కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎదురుగట్ల మాజీ సర్పంచ్ సోయినేని కరుణాకర్, దేవస్థాన కమిటీ ఛైర్మెన్ సంపేట గంగరాజు, వైస్ చైర్మన్లు పొన్నం బాలయ్య, నరేడ్ల రాఘవరెడ్డి, కమిటీ సభ్యులు కోడెం గంగాధర్, పొన్నం మల్లేశం సోయినేని రాజు పొన్నం నాగేందర్ అర్చకులు కార్తీక్, మకులభరణం శ్రీనివాస్ వంగపల్లి మల్లేశం బండ శ్రీనివాస్ సంఘ స్వామి పొన్నం రాజేశం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మాటలతో మభ్యపెట్టే ఎమ్మెల్యే ,కార్పొరేటర్ మాకొద్దు..!

మాటలతో మభ్యపెట్టే ఎమ్మెల్యే ,కార్పొరేటర్ మాకొద్దు – తమ కాల్ నేను అభివృద్ధి చేసే నాయకులు కావాలి :
స్థానిక కాలనీ మహిళలు

మల్కాజిగిరి నేటిధాత్రి

05 ఏప్రిల్

41 సంవత్సరాల నుండి అన్ని రాజకీయ పార్టీ నాయకులకు ఓట్లు వేసి గెలిపిస్తున్న , కేవలం రోడ్లు, మోరీలు తప్ప తమ బస్తీకి ఏ ఒక్క నాయకుడు చేసింది ఏమీ లేదని, ఇందిరా నెహ్రూ నగర్ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నెహ్రూ నగర్ కాలనీలో రాజకీయ నాయకులు తమ సమస్యలను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ ఏర్పడి 41 సంవత్సరాలు గడిచిన ఈరోజు వరకు కాలనీలో ఒక కమ్యూనిటీ హాల్ లేకపోవడం విడ్డూరం. మహిళలు సమైక్య గ్రూపులు చేసుకోవాలన్న, యువత ఏదైనా మీటింగులు పెట్టుకోవాలన్న, అన్ని రోడ్లమీదనే కొనసాగుతున్నాయని, కాలనీలో కమిటీ హాల్ కోసం ఉన్న 60 గజాలలో నిర్మాణం జరపడానికి నిధులు. 

MLA .

 

లేవని నాయకులు చెప్పడం తమ దౌర్భాగ్యం అని అన్నారు. ఓట్ల సమయంలో తమకు ఏ సమస్య లేకుండా చేస్తామని మభ్యపెట్టి తమతో ఓట్లు వేయించుకోని గెలిచిన తర్వాత ఏ ఒక్క నాయకుడు తమ వద్దకు వచ్చి తమ సమస్యలను తీర్చిన దాఖలాలే లేవని అన్నారు. గతంలో నాయకులు కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరుపుతామని పలుమార్లు కొబ్బరికాయలు కొట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చి వెళ్లారు తప్ప ఈరోజు వరకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఊసే లేదు అని నాయకుల తీరుపై మండిపడ్డారు. జనరల్ ఎలక్షన్స్ సమయాన తమకు బోర్ వేయించిన ప్రస్తుత కార్పొరేటర్, 14 నెలలు గడిచిన ఈరోజు వరకు దానికి స్టార్టర్ ఏర్పాటు చేయకపోవడం హాస్యస్పదమని అన్నారు. స్థానికులు సొంత డబ్బులతో స్టార్టర్ ఏర్పాటు చేసుకుంటే, చాలా రోజుల నుండి బోరు వాడకపోవడంతో బోర్ లో నుండి నీళ్లు రావడం లేదని తెలిపారు. ఐదేళ్లకోసారి ఎలక్షన్స్ అప్పుడు వచ్చి తమను మభ్యపెట్టే నాయకులు ఇకపై తమకు వద్దని, తమ కాలనీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, నాయకులకే తాము అండగా ఉంటామని గంటపదంగా చెప్తున్నారు. మరి ఇప్పటికైనా స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే స్పందించి, పనిచేయని బోరును వెంటనే మరమ్మతులు చేయించాలని, అదేవిధంగా 41 సంవత్సరాల నుండి తాము ఎంతగోనో ఆశగా ఎదురు చూస్తున్నా కమిటీ హాల్ నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. అవి చేయకుండా ఓట్ల కోసం వారి వద్దకు వస్తే మాత్రం నాయకులకు వ్యతిరేకంగా ఓట్లు వేసి వారిని ఓడకొట్టి గుణపాఠం చెప్తామని అన్నారు.

డా; బాబా జగ్జీవన్ రామ్ గారికి నివాళులు అర్పించిన.!

డా; బాబా జగ్జీవన్ రామ్ గారికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

డా; బాబా జగ్జీవన్ రామ్ గారి 117వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు. 

MLA.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కులరహిత సమాజం కోసం పాటుపడిన బడుగు, బలహీన వర్గాల నేత, దేశ స్వాతంత్ర్యం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత, దేశ మాజీ ఉప ప్రధాని ‘బాబూజీ’ అని అన్నారు.ఎమ్మెల్యే గారితో పాటుగా న్యాల్కల్ మండల జెడ్పీటీసీ స్వప్న భాస్కర్,పాక్స్ చైర్మన్ మచ్చెందర్ ,మాజి మున్సిపల్ చైర్మన్ తంజిమ్,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మొహిద్దీన్,మాజి మొగుడంపల్లి మండల సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు సురేష్,మాజి సర్పంచ్ లు విజయ్ , జగ్దిష్,దేవదాస్,యువ నాయకులు మిథున్ రాజ్,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,గణేష్, చంద్రయ్య,వినోద్,ప్రభాకర్,దీపక్,శంత్ కుమార్,నగేష్,ప్రవీణ్ మెస్సీ,తదితరులు పాల్గొన్నారు.

మోహన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే..

మోహన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే..

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు , ఎస్సీ సెల్ నియోజవర్గ అధ్యక్షులు బండి మోహన్ జన్మదిన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్ కటింగ్ నిర్వహించి జన్మదిన శుభాకంక్షలు తెలిపిన శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు,మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప, మాజి ఆత్మ చైర్మన్ లు విజయ్ కుమార్, పెంట రెడ్డి ,న్యాల్కల్ మాజి జెడ్పీటీసీ స్వప్న భాస్కర్ ,పాక్స్ చైర్మన్ మచ్చెందర్ , మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ ,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు , మాజి మున్సిపల్ చైర్మన్ తంజిమ్,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మొహిద్దీన్,మాజి న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింహ రెడ్డి,యువ నాయకులు మిథున్ రాజ్,సీనియర్ నాయకులు మేతరి ఆనంద్ ,తులసి దాస్ గుప్తా,మాజి సర్పంచ్ రాజ్ శేఖర్ ,బి ఆర్ ఎస్వీ ఇన్చార్జి రాకేష్,దీపక్ ,నర్సింహ రెడ్డి,చంద్రయ్య,నరేష్ రెడ్డి,అలి ,సందీప్,నగేష్ ,శ్రీకాంత్,సురేష్,మనోజ్ ,శివ తదితరులు

వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే .

వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే .

నాగర్ కర్నూల్/నేటి దాత్రి:

 

 

ఈరోజు తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో శ్రీ మహాలక్ష్మి గోదాసమేత శ్రీ వేంకటేశ్వర స్వామి తృతీయ బ్రహ్మోత్సవాలకు ( జాతార) సందర్భంగా స్వామి వారి కల్యాణ మహోత్సవం లో పాల్గొన్న మన ప్రియతమ నేత ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది.

అలాగే ఆవంచ గ్రామంలో మహా గణపతి స్వామి వారిని దర్శించుకున్నారు.

ఈకార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు,మండల నాయకులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు..

వల్మిడి శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం.!

వల్మిడి శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే

 

పాలకుర్తి నేటిధాత్రి

 

 

పాలకుర్తి మండలంలోని వల్మిడి గ్రామంలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈనెల 6న జరగబోయే శ్రీ సీతారాముల వారి కల్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశిస్తూ పాలకుర్తి ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి ఈరోజు ఆలయ పరిసరాల్లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ అధికారులు, పోలీస్ శాఖ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, భక్త సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి గారు మాట్లాడుతూ, వల్మిడి శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం ప్రతి ఏడాది వేలాది మంది భక్తులను ఆకర్షించే పవిత్ర ఉత్సవం. ఈ వేడుకలు భక్తులంతా భద్రంగా, ఆధ్యాత్మికంగా అనుభవించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ పరిసరాల్లో శుభ్రత, తాగునీరు, శాశ్వత టెంట్‌ల ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ వంటి చర్యలు తీసుకోవాలి. పోలీస్ శాఖ భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. పెను తాకిడిని దృష్టిలో ఉంచుకుని వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా చూడాలి అని తెలిపారు. అలాగే, అన్నదానం, ప్రసాద విభాగాల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో క్యూలైన్లను మెరుగు పరిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, హరికథలు నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించాలి అని పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్డీవో, తహసీల్దార్, పోలీస్ అధికారులు, ఆలయ ధర్మకర్తలు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. వల్మిడి శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం విశేషంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.

బాక్స్‌ డ్రైన్‌ పనులు ప్రారంభించిన కార్పొరేటర్ MLA.

బాక్స్‌ డ్రైన్‌ పనులు ప్రారంభించిన. కార్పొరేటర్, ఎమ్మెల్యే

మల్కాజిగిరి నేటిధాత్రి 02:

 

 

నేరేడ్‌మెట్‌ డివిజన్‌ లోని ఎంప్లాయీస్ కాలనీ నుంచి సాయికృష్ణ ఎన్‌క్లేవ్‌కి 2 ఏళ్ల క్రితం పెట్టిన బాక్స్‌ డ్రైన్‌ పనులకు అనుమతి రావడంతో, 6.2 కోట్లు ఎన్‌డీపీ కింద ఇవ్వాల కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన. స్థానిక కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి , మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.

గతంలో ఎస్‌ఎన్డీపీ కింద 40 కోట్లతో యాప్రాల్‌లో పనులు పూర్తి చేసి యాప్రాల్‌కి వర్షాకాలంలో 20 సంవత్సరాల నుండి పెద్ద సమస్య పరిష్కరించడం జరిగింది

MLA

అలాగే ఈ పనులు కుడా పూర్తి అయిపోతే ఇక్కడ కాలనీ వాళ్ళకి కూడా వర్ష కాలం ఎలాంటి ఇబ్బంది ఉండదు అని స్థానిక కార్పొరేటర్ చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ఆదిత్య, పరమేష్, శర్మ, సత్యనారాయణ, రాజి రెడ్డి, పర్వతాలు,శ్యామ్, అకారం సాయి, పవన్, నవీన్ గౌడ్, ఆల్బర్ట్, పంకజం, సుదర్శిని, షాలిని, ఎస్‌ఎన్డీపీ అధికారులు, కాలనీ సభ్యులు మరియు పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సామాన్యుడు సంకల్పం ఉంటే చక్రవర్తి కావచ్చు.

‘సామాన్యుడు.. సంకల్పం ఉంటే చక్రవర్తి కావచ్చు’

మహబూబ్ నగర్ /నేటి ధాత్రి

 

సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 315 వర్థంతిని పురస్కరించుకుని మహబూబ్ నగర్ పట్టణం లోని పద్మావతి కాలనీ లోని గ్రీన్ ఫీల్డ్ లో గల సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సామాన్యుడు కూడా సంకల్పం ఉంటే చక్రవర్తి కావచ్చు అని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మొగల్ చక్రవర్తులను ఎదిరించి రుజువు చేశారని ఆయన గుర్తు చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్పూర్తి తో ప్రజా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ఆయన తెలిపారు. భావితరాలకు వారి చరిత్రను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని, వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇస్తున్న నిజమైన నివాళి అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, డిసిసి ఉపాధ్యక్షులు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, ప్రవీణ్ కుమార్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తిరుమల వెంకటేష్, ఖాజా పాషా, మోసిన్, అంజద్, నాయకులు కిషన్ నాయక్, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆర్ ఇందిర తదితరులు పాల్గొన్నారు.

సీఎం ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం.

నిరుపేదల కలను సాకారం చేసిన సీఎం ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం.

చిట్యాల, నేటిధాత్రి :

 

చిట్యాల మండలంలోని తిరుమలాపురం గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి* ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని తిరుమలాపురం గ్రామ శాఖ అధ్యక్షులు గజ్జి రవి అధ్యక్షతన..
ప్రారంభించడం జరిగింది. అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది . తిరుమలాపురం ఎంపీటీసీ పరిధి ఇంచార్జ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య* మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం ,పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చి మహిళలకు నిరుద్యోగులకు ,రైతులకు ,కూలీలకు ఎన్నో పథకాలను తీసుకొచ్చి ఆదుకుంటున్ రేవంత్ రెడ్డి
కి దక్కింది , అలాగేభూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు* గెలిచి 15 నెలలు గడిచిన కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను కోట్లాది రూపాయలను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నాడు.. రోజుకు 18 గంటలు అహర్నిశలు కష్టపడుతూ ప్రజల శ్రేయస్సు అభివృద్ధిలో దూసుకుపోతున్నారు….. ఈ రాష్ట్రం ప్రభుత్వం ఎస్సీ ,ఎస్టీ ,బీసీ మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. రాబోయే రోజులలో ఇంకెన్నో పథకాలు తీసుకొచ్చి పేదలను అదుకునే దిశగా కృషి చేస్తున్నారు అని అన్నారు,ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గజ్జి రవి గ్రామ సీనియర్ నాయకులు గోపగాని శివకృష్ణ, కంచర్ల రాంబాబు, బొంపల్లి కిషన్ ,కంచర్ల కిట్టయ్య, కొర్రి రాజు ఎళగొండ శ్రీకాంత్, కలవేణి ప్రవీణ్,చెన్న నిశాంత్, నాగిరెడ్డి శంకర్, కొర్రి అశోక్, గద్దల భద్రయ్య, గద్దల తిరుపతి, నీలేష్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. .

మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుని పరామర్శించిన MLA వివేక్.

మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుని పరామర్శించిన ఎమ్మెల్యే వివేక్

జైపూర్,నేటి ధాత్రి:

 

చెన్నూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అనారోగ్యంతో హైదరాబాదులోని బ్రీనోవా ట్రాన్స్లేషన్ కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాస్పటల్ వెళ్లి నల్లాల ఓదెలు నీ పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని మనోధైర్యాన్ని చేకూర్చారు.

సీఎం రేవంత్ ఎమ్మెల్యే గండ్ర చిత్రపటానికి పాలాభిషేకం.

సీఎం రేవంత్ ఎమ్మెల్యే గండ్ర చిత్రపటానికి పాలాభిషేకం.

చిట్యాల, నేటిధాత్రి :

 

చిట్యాల మండలం నైన్ పాక గ్రామంలోని రేషన్ షాప్ నెంబర్ : 1 మరియు రేషన్ షాప్ నెంబర్ 2 లో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుపేదలకు ఉచిత సన్న రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి అనంతరం గ్రామ ప్రజలతో కలిసి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి* చిత్రపటానికి మరియు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు* చిత్రపటానికి పాలభిషేకం చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు తొట్ల రాజయ్య , కుమ్మరి పల్లె గ్రామ శాఖ అధ్యక్షుడు తానేష్ , కనకనాల శంకర్ , కంచర్ల రాములు , పాలడుగుల రఘుపతి , ఎలావెణ శివకుమార్ , కట్టెకొల్ల మల్లేష్ , చెలుపురి రాజయ్య , జంగ మల్లేష్ , నగునూరి వెంకటేష్ , జంబుల నరసయ్య , రాయరాకుల రమేష్ అందుగుల రాజు , జంగా కుమార్ , కంచర్ల ప్రభాకర్ , మొగిలి , గడ్డి రాములు , శ్యామల శ్రీనివాస్ , రాజు , కుమార్ తదితరులు పాల్గొన్నారు..

సన్నబియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.

సన్నబియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.

 

చిట్యాల, నేటి ధాత్రి :

 

జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని వెంకట్రావుపల్లి సి గ్రామంలో ఏర్పాటుచేసిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో మంగళవారం రోజున భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా పాల్గొ హాజరై, ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రేషన్ కార్డులోని ఒక్కో కుటుంబ సభ్యునికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం ను అందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ సంవత్సరంన్నర కాలంలో సీఎం రేవంత్ రెడ్డి చేసి చూపెట్టారని. గతంలో రేషన్ బియ్యం పంపిణీ మాఫియాలు ఉండేవని ఇప్పుడు వాటిని శాశ్వతంగ నిర్మూలించామని అన్నారు, ఈ కార్యక్రమంలో తహసిల్దార్ హేమ, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య ,జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మధు వంశీకృష్ణ, చిలుకల రాయకుమురు, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు దబ్బట అనిల్ బుర్ర శ్రీనివాసు, చిలుముల రాజమౌళి ,అల్ల కొండ కుమార్ కాంగ్రెస్ కార్యకర్తలు దితరులు పాల్గొన్నారు.

పత్తి పువ్వమ్మ పాట ఆవిష్కరించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.

పత్తి పువ్వమ్మ పాట ఆవిష్కరించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

చిట్యాల, నేటిధాత్రి :

 

 

ఉగాది పండుగ పర్వదినాన పురస్కరించుకొని భూపాలపల్లి జిల్లా జరిగిన శ్రీ వివేకానంద సేవా సమితి ఫౌండర్ కే సంజీవరావు అధ్యక్షతన పుష్ప గ్రాండ్ పంక్షన్ హాల్ లో అవార్డ్ కవుల, కళాకారులుకు అవార్డు ప్రదానోత్సవం జరిగినది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధి గా భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ పాల్గొని పత్తి పువ్వు పాట ఆవిష్కరణ చేయడం జరిగింది సమాజంలో మేలుకొలిపే పాటలు రాయాలని పేర్కొన్నారు పాట రచయిత దాసారపు నరేష్ బాగా రాసారని అభినందించారు ఈ కార్యక్రమంలో సినీ నటులు ఆర్ఎస్ నంద గాయకులు మధు రోజా సంధ్య మ్యూజిక్ డైరెక్టర్ కిట్టు ఎన్ఎస్ఆర్ ఫౌండర్ సంపత్ రావు , కవులు గాయకులు పాల్గొన్నారు.

మహిళపై అత్యాచారం ఎమ్మెల్యే ఆగ్రహం.

మహిళపై అత్యాచారం.. ఎమ్మెల్యే ఆగ్రహం

జడ్చర్ల / నేటి ధాత్రి

నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలో జరిగిన సామూహిక అత్యాచార సంఘటనలో నిందితులు ఎవరైనా వదిలేది లేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ వారిని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీని కోరానని వెల్లడించారు. ఊర్కొండలోని ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలో ఆరుగురు యువకులు ఒక వివాహిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సోమవారం జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ తో ఫోన్లో మాట్లాడిన అనిరుద్ రెడ్డి పవిత్ర ప్రదేశంలో ఈ దురాగతానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. అత్యాచారానికి పాల్పడిన వారు బిఆర్ఎస్ పార్టీకి చెందిన వారని తన దృష్టికి వచ్చిందని అయితే ఈ సంఘటనకు పాల్పడింది ఎవరైనాప్పటికీ తాను రాజకీయాలు చేయదలుచుకోలేదని బాధిత యువతికి న్యాయం చేయాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. ఈ సంఘటనలో బాధిత యువతికి అండగా ఉంటానని అనిరుధ్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సంఘటన నేపథ్యంలోని ఊర్కొండ పోలీసులతో కూడా మాట్లాడి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చి రాత్రి పూట బస చేసే భక్తులకు రక్షణ కల్పించాలని కోరారు. గ్రామంలోనీ యువతులు కూడా జరిగిన సంఘటన పట్ల భయాందోళనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కూడా అనిరుధ్ రెడ్డి ఆదేశించారు.

ఈద్గ ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర.

ఈద్గ ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర

 

భూపాలపల్లి నేటిధాత్రి

 

ముస్లిం సోదరులకు,వారి కుటుంబ సభ్యులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి.
ముస్లింల పవిత్రదినం రంజాన్ పండుగ సందర్బంగా భూపాలపల్లి బాంబులగడ్డలోని ఈద్గలో నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రార్ధన కార్యక్రమంలో పాల్గొన్ని ముస్లిం సోదరీ సోదరులకు వారి కుటుంబ సభ్యులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపి,మీ కష్ట నష్టాలల్లో, ముస్లిం మైనారిటీ ప్రజల అభ్యున్నతిలో బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ సోదరులు పాల్గొన్నారు

ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసిన మేరు సంఘం.

ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసిన మేరు సంఘం జిల్లా నాయకులు

చిల్పూర్(జనగాం)నేటి ధాత్రి

 

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అన్ని విధాల కృషి చేస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

ఈ సందర్భంగా స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని హనుమకొండలోని ఆయన స్వగృహంలో మేరు సంఘం జిల్లా కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసినారు.

ఈ సందర్భంగా మేరు సంఘ సభ్యులు ఎమ్మెల్యే తో మాట్లాడుతూ మేర కులానికి అందవలసిన ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో పాటు జిల్లా, నియోజకవర్గంతో పాటు మండల కేంద్రంలో మేరు సంఘ భవన నిర్మాణంతోపాటు జనగాం జిల్లాలోని మేరు కుటుంబాలకు జూకి మిషన్లు అందించాలన్నారు.

దీంతోపాటు ఇల్లు లేని మేరు కులస్తులకు ఇందిరమ్మ ఇల్లు అందించాలన్నారు.

అంతేకాకుండా ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పథకాల్లో జిల్లాలోని మేరు కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా మేర సంఘం కమిటీ సభ్యులు పేర్కొంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మెమోరండం అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి వారితో మాట్లాడుతూ ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పథకాల్లో మేరు కులస్తులకు ప్రాధాన్యత కల్పించే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మేరు సంఘం స్టేషన్గన్పూర్ మండల అధ్యక్షుడు దీకొండ మురళి, కార్యదర్శి వెన్ను సంపత్, కోశాధికారి సోమ రాజేందర్, పట్టణ అధ్యక్షులు దీకొండ సత్యనారాయణ, ముఖ్య సలహాదారులు గూడూరు నరేందర్,రాపర్తి సుధాకర్, మేరు సంఘం జిల్లా కమిటీ సభ్యులు అధ్యక్షులు రాపర్తి ప్రశాంత, కొత్తకొండ అజయ్ కుమార్,దీకొండ విష్ణు తో పాట లింగాల గణపురం, రఘునాథ్ పెళ్లి, జఫర్గడ్, చిల్పూర్, మండలాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి.

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి

 

రామాయంపేట మార్చ్ 31 నేటి ధాత్రి (మెదక్)

 

మెదక్ జిల్లా కేంద్రం గాంధీనగర్ లోని ఈద్గా వద్ద మైనారిటీ సోదరులు రంజాన్ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు.
ఈ వేడుకల్లో మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి. సుభాష్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు బట్టి జగపతి,అకిరెడ్డి కృష్ణారెడ్డి,మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ లు పాల్గొని ముస్లిం మతం పెద్దలకు, సోదరులకు రంజాన్ (ఈద్ ముబారక్) శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈద్గా వద్ద ముస్లిం మత పెద్దలు సర్దార్ మమ్మ హుస్సేన్, శంషుద్దీన్, మహ్మద్ అలీ, కురనోద్దిన్ యూసుఫ్ లు ప్రార్థనలు చేశారు.
అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ అంటూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ సందర్భంగా పద్మదేవేందర్ రెడ్డి, శేరి. సుభాష్ రెడ్డి లు మాట్లాడుతూ రంజాన్ పవిత్రత త్యాగం, శాంతి, సమానత్వానికి ప్రతీక అని అన్నారు.
మత సామరస్యాన్ని పెంపొందించేందుకు ఇలాంటి వేడుకలు ఎంతో దోహదపడతాయన్నారు. అన్ని మతాల ప్రజలలు స్నేహభావంతో కలిసి ఉండాలని ఆకాంక్షించారు.
ముస్లిం సోదర సోదరీమణులంతా పండగ పర్వదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ మాజీ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు, కొ కన్వీర్ కృష్ణ గౌడ్, జుబేర్ అహ్మద్, నాయకులు మహమ్మద్, ఫజిల్, మధు, మోహన్, నాగేందర్, సంతోష్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

శాయంపేటలో ఉచిత సన్న బియ్యం పంపిణీ చేసిన.

శాయంపేటలో ఉచిత సన్న బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే

రాష్ట్రంలోని పేద ప్రజల ఆహార భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

శాయంపేట నేటి ధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రం లోని సింగరకొండ రమేష్ గుప్తకు చెందిన రేషన్ షాపు వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని ఆహార భద్రతకార్డు ఉన్న లబ్దిదారులకు భూపాల పల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణరావు ప్రారం భించి పంపిణీ చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లా డుతూ రాష్ట్రంలో ఈ సంవ త్సరం ఉగాది పండుగ చరిత్ర పుటల్లో లిఖించదగ్గ రోజుగా నిల్వనున్నదని ,దేశంలోనే తొలిసారిగా పేద ప్రజల ఆహార భద్రతకు మన ముఖ్య మంత్రి ఎనుములరేవంత్ రెడ్డి సారథ్యంలో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టిందని దారిద్రరేఖకు దిగువన ఉన్న పేదలతో పాటు మధ్యతరగతి ప్రజలకు ఆహార భద్రత కల్పిం చాలన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కలను రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిందని అన్నారు.

Congress

 

ఈ పథకం కింద రాష్ట్ర జనాభాలో సుమారు 80% ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం లబ్ది చేకూరుతుందని,రాష్ట్రంలోని పేద ప్రజల ఆహారభద్రతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు.

దొడ్డు బియ్యం తినేందుకు ప్రజలు అనాసక్తత కనపరచడంతో పాటు దళారులకు అమ్ముకోవ డం వలన పక్కదారి పడు తున్నాయని అన్నారు.

వీటన్నింటిని అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకానికి నిర్ణయం తీసుకుం దని అన్నారు అర్హులందరికీ నూతన రేషన్ కార్డులు అందజేస్తామన్నారు.

పేద ప్రజలకు సన్న బియ్యం పథకాన్ని ప్రవేశ పెట్టినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు.

Congress

అనంతరం 32 మంది సిఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు రూ. 10,63,500/- విలువ గల చెక్కులను అందజేశారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పని చేస్తుంది.

లక్షలు ఖర్చుచేసి ప్రైవేటు, కార్పొరేట్ వైద్యశా లల్లో చికిత్స చేయించుకోలేని వారికి సీఎంఆర్ఎఫ్ పథకం కొండంత అండగా నిలుస్తుంద న్నారు.

ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ,శాయంపేట ఎమ్మార్వో మండలములోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, అన్ని గ్రామాల కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.

ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆకస్మిక తనిఖీ

సమయానికి హాజరుకాని సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారికి ఆదేశాలు

 

పాలకుర్తి నేటిధాత్రి

 

పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలోని పరిస్థితిని నేరుగా పరిశీలించిన వారు అక్కడి నిర్వహణ, సిబ్బంది హాజరు, ఔషధాల లభ్యత వంటి అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా వారు ఆసుపత్రిలో కొంతమంది వైద్యులు, సిబ్బంది విధుల్లో హాజరు కాని పరిస్థితిని గమనించారు. ప్రజలకు సేవ చేయాల్సిన వారే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించటం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా వైద్యాధికారికి డిఎం అండ్ హెచ్ ఓ కి ఫోన్ చేసి, డ్యూటీలో గైర్హాజరైన సిబ్బంది పై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల ప్రాణాలతో చెలగాట మాడే విధంగా ప్రభుత్వ వైద్య సిబ్బంది వ్యవహరించటం సరికాదు. సమయానికి విధులకు హాజరు కావడం ప్రతి ఉద్యోగి బాధ్యత. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవు అని ఎమ్మెల్యే ఘాటుగా హెచ్చరించారు. ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి, అందిస్తున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, అవసరమైన ఔషధాల సరఫరా, శానిటేషన్ మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. అలాగే, మాతా-శిశు విభాగాన్ని కూడా పరిశీలించి, ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ తనిఖీలో వారితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మండల అధికారులు కూడా పాల్గొన్నారు. ఆసుపత్రిలో సిబ్బంది హాజరు, పనితీరు పట్ల ప్రజల్లో దీర్ఘకాలంగా ఉన్న అసంతృప్తికి ఈ ఆకస్మిక తనిఖీ ఓ సందేశంగా నిలిచిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version