సామాన్యుడు సంకల్పం ఉంటే చక్రవర్తి కావచ్చు.

‘సామాన్యుడు.. సంకల్పం ఉంటే చక్రవర్తి కావచ్చు’

మహబూబ్ నగర్ /నేటి ధాత్రి

 

సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 315 వర్థంతిని పురస్కరించుకుని మహబూబ్ నగర్ పట్టణం లోని పద్మావతి కాలనీ లోని గ్రీన్ ఫీల్డ్ లో గల సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సామాన్యుడు కూడా సంకల్పం ఉంటే చక్రవర్తి కావచ్చు అని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మొగల్ చక్రవర్తులను ఎదిరించి రుజువు చేశారని ఆయన గుర్తు చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్పూర్తి తో ప్రజా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ఆయన తెలిపారు. భావితరాలకు వారి చరిత్రను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని, వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇస్తున్న నిజమైన నివాళి అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, డిసిసి ఉపాధ్యక్షులు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, ప్రవీణ్ కుమార్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తిరుమల వెంకటేష్, ఖాజా పాషా, మోసిన్, అంజద్, నాయకులు కిషన్ నాయక్, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆర్ ఇందిర తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version