మాటలతో మభ్యపెట్టే ఎమ్మెల్యే ,కార్పొరేటర్ మాకొద్దు – తమ కాల్ నేను అభివృద్ధి చేసే నాయకులు కావాలి :
స్థానిక కాలనీ మహిళలు
మల్కాజిగిరి నేటిధాత్రి
05 ఏప్రిల్
41 సంవత్సరాల నుండి అన్ని రాజకీయ పార్టీ నాయకులకు ఓట్లు వేసి గెలిపిస్తున్న , కేవలం రోడ్లు, మోరీలు తప్ప తమ బస్తీకి ఏ ఒక్క నాయకుడు చేసింది ఏమీ లేదని, ఇందిరా నెహ్రూ నగర్ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నెహ్రూ నగర్ కాలనీలో రాజకీయ నాయకులు తమ సమస్యలను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ ఏర్పడి 41 సంవత్సరాలు గడిచిన ఈరోజు వరకు కాలనీలో ఒక కమ్యూనిటీ హాల్ లేకపోవడం విడ్డూరం. మహిళలు సమైక్య గ్రూపులు చేసుకోవాలన్న, యువత ఏదైనా మీటింగులు పెట్టుకోవాలన్న, అన్ని రోడ్లమీదనే కొనసాగుతున్నాయని, కాలనీలో కమిటీ హాల్ కోసం ఉన్న 60 గజాలలో నిర్మాణం జరపడానికి నిధులు.
లేవని నాయకులు చెప్పడం తమ దౌర్భాగ్యం అని అన్నారు. ఓట్ల సమయంలో తమకు ఏ సమస్య లేకుండా చేస్తామని మభ్యపెట్టి తమతో ఓట్లు వేయించుకోని గెలిచిన తర్వాత ఏ ఒక్క నాయకుడు తమ వద్దకు వచ్చి తమ సమస్యలను తీర్చిన దాఖలాలే లేవని అన్నారు. గతంలో నాయకులు కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరుపుతామని పలుమార్లు కొబ్బరికాయలు కొట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చి వెళ్లారు తప్ప ఈరోజు వరకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఊసే లేదు అని నాయకుల తీరుపై మండిపడ్డారు. జనరల్ ఎలక్షన్స్ సమయాన తమకు బోర్ వేయించిన ప్రస్తుత కార్పొరేటర్, 14 నెలలు గడిచిన ఈరోజు వరకు దానికి స్టార్టర్ ఏర్పాటు చేయకపోవడం హాస్యస్పదమని అన్నారు. స్థానికులు సొంత డబ్బులతో స్టార్టర్ ఏర్పాటు చేసుకుంటే, చాలా రోజుల నుండి బోరు వాడకపోవడంతో బోర్ లో నుండి నీళ్లు రావడం లేదని తెలిపారు. ఐదేళ్లకోసారి ఎలక్షన్స్ అప్పుడు వచ్చి తమను మభ్యపెట్టే నాయకులు ఇకపై తమకు వద్దని, తమ కాలనీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, నాయకులకే తాము అండగా ఉంటామని గంటపదంగా చెప్తున్నారు. మరి ఇప్పటికైనా స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే స్పందించి, పనిచేయని బోరును వెంటనే మరమ్మతులు చేయించాలని, అదేవిధంగా 41 సంవత్సరాల నుండి తాము ఎంతగోనో ఆశగా ఎదురు చూస్తున్నా కమిటీ హాల్ నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. అవి చేయకుండా ఓట్ల కోసం వారి వద్దకు వస్తే మాత్రం నాయకులకు వ్యతిరేకంగా ఓట్లు వేసి వారిని ఓడకొట్టి గుణపాఠం చెప్తామని అన్నారు.