ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ గా వ్యవహరించిన కొణిజేటి రోశయ్య జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి వేడుకలను జరిపారు రోశయ్య చిత్రపటానికి కలెక్టర్ డాక్టర్ సత్య శారద పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డి ఆర్ ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిఆర్డీఓ కౌసల్యాదేవి, డిబిసిడిఓ పుష్పాలత, కలెక్టరేట్ ఏ.ఓ విశ్వ ప్రసాద్, ఇతర అధికారులు, సంఘ నాయకులు, కలెక్టరేట్ లోని వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో ప్రపంచ మెకానిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జూలై 3న జరుపుకుంటారు. మందమర్రి పాత బస్టాండ్ ప్రాంతంలో మెకానిక్ యూనియన్ సభ్యులందరూ కలిసి జెండా ఎగరవేసి మిఠాయిలు పంచి పెట్టడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మందమర్రి యూనియన్ అధ్యక్షుడు చిరుత మల్లేష్, యూనియన్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.ఆయన మాట్లాడుతూ..ఈ రోజున, వాహనాలు, యంత్రాలు మరియు ఇతర సాంకేతిక పరికరాలను సరిచేయడంలో నిర్వహించడంలో నైపుణ్యం కలిగిన మెకానిక్ల కృషిని, ప్రాముఖ్యతను గుర్తిస్తారు. ఆ మెకానిక్స్ డేను జరుపుకోవడం యొక్క ప్రాముఖ్యత మెకానిక్ల పాత్రను గుర్తించడం. వాహనాలు,యంత్రాలు సజావుగా పనిచేయడానికి మెకానిక్ల కృషి ఎంతో అవసరం.ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెకానిక్ల కృషిని గుర్తించి,అభినందించడానికి ఈ రోజున జరుపుకోవడం జరుగుతుందని మెకానిక్స్ రోజు అనేది సాంకేతిక పరిజ్ఞానం మెకానికల్ నైపుణ్యాల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. సమాజానికి సేవనందించే విధంగా మెకానిక్ సేవలు మన జీవితాలను సులభతరం చేస్తాయిని మన కృషి లేకుండా మనం వాహనాలను లేదా ఇతర యంత్రాలను సరిగ్గా ఉపయోగించలేముని ఈరోజు మెకానిక్లకు అందరికీ ధన్యవాదాలు తెలుపుదాంఆని మన జీవితాలను సులభతరం చేయడానికి చేసే కృషిని గుర్తుంచుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎర్రోజు బ్రహ్మం, ప్రధాన కార్యదర్శి ముత్యం పల్లి భాస్కర్, మర్రి రాము,మెరుగు కిషన్,కస్తూరి సత్యం, కుమార్,ఓ శ్రీనివాస్, తుమ్మల శ్రీనివాస్,సురేష్, మున్నా,ఓదెలు,శ్రీను, జగదీష్,శంకర్,తదితరులు పాల్గొన్నారు.
త్యాగానికి ప్రతీకగా మొహర్రంను నిర్వహిస్తారు. జిల్లాలో పీర్లపండుగ(మొహర్రం) పెద్దఎత్తున ప్రారంభమైంది. కర్బలా మైదానంలో మహమ్మద్ ప్రవక్త మనుమడు ఇమాం హుస్సేన్ బలిదానాన్ని స్మరిస్తూ ముస్లింల్లోని ఓవర్గం మొహర్రంను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇస్లామిక్ క్యాలెండరు ప్రకారం మొదటి మాసాన్ని మొహర్రం నెలగా భావిస్తారు. ఈమాసంలోనే పది రోజులు పవిత్ర దినాలుగా భావిస్తూ మొహర్రం నిర్వహిస్తారు.
హిందూ ముస్లింలు కలిసిమెలిసి..
పూర్వకాలం నుంచి హిందూ ముస్లింలు కులమతాలకతీతంగా జరుపుకునే మొహర్రం పర్వది నానికి గ్రామాల్లో ఎంతో ప్రత్యేకత ఉంది. పట్టణాలు, గ్రామాలు అన్నతేడా లేకుండా వారం రోజుల పాటు హిందూ ముస్లింలు భాయి.. భాయి.. అంటూ మొహర్రం పర్వదినంలో పాల్గొని పూజలు నిర్వహిం చడం ఆనవాయితీగా వస్తోంది. ముస్లింలకు సంబంధించిన ఏపర్వదినానికి లేనివిధంగా మొహర్రం (పీర్ల పండుగ)ల్లో హిందువులు పెద్దఎత్తున పాల్గొనడం ప్రత్యేకతగా నిలుస్తుంది. జిల్లాలోని అనేక గ్రామాల్లో విస్తృత ఏర్పాట్లు చేపట్లారు.
మొహర్రం చరిత్ర
ముహర్రం ఇస్లామిక్ చరిత్రలో గొప్ప ప్రాముఖ్యత కలిగిన నెల, మరియు దాని చరిత్ర విషాదం మరియు నష్టాలతో నిండి ఉంది. ఈ నెల ఇస్లామిక్ సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది మరియు దీనిని “అల్లాహ్ పవిత్ర మాసం” అని పిలుస్తారు. అయితే, 1400 సంవత్సరాల క్రితం ఈ నెలలో జరిగిన సంఘటనలు నేటికీ ముస్లిం సమాజానికి ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. క్రీ.శ. 680లో, ప్రవక్త ముహమ్మద్ మనవడు ఇమామ్ హుస్సేన్, ఖలీఫా యాజిద్కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసి, అతనికి వ్యతిరేకంగా విప్లవానికి నాయకత్వం వహించాడు.దురదృష్టవశాత్తు, ఇమామ్ హుస్సేన్ మరియు అతని అనుచరులు కర్బలా యుద్ధంలో సంఖ్యాపరంగా ఎక్కువగా ఉండి దారుణంగా చంపబడ్డారు]. నేడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఇమామ్ హుస్సేన్ మరియు అతని అనుచరుల మరణానికి ఊరేగింపులు, ప్రసంగాలు మరియు ఇతర మతపరమైన ఆచారాల ద్వారా సంతాపం తెలుపుతూ ముహర్రం మాసాన్ని పాటిస్తారు. ఇది ముస్లిం సమాజానికి జ్ఞాపకం, ప్రతిబింబం మరియు సంతాప నెల.
ముహర్రం యొక్క ప్రాముఖ్యత
ముహర్రం ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెల మరియు ఇస్లాంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. యుద్ధం నిషేధించబడిన సంవత్సరంలోని నాలుగు పవిత్ర నెలలలో ఇది ఒకటిగా పరిగణించబడుతుంది. పవిత్రమైన ముహర్రం మాసాన్ని “ముహర్రం ఉల్ హరామ్” అని కూడా పిలుస్తారు మరియు ఇస్లామిక్ క్యాలెండర్లో అత్యంత పవిత్రమైన నెలల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది రంజాన్ తర్వాత రెండవ అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించబడుతుంది.ఈ నెల ఉపవాసం మరియు సంతాప ఆచారాలకు ప్రసిద్ధి చెందింది మరియు ఇస్లామిక్ విశ్వాసంలో ముఖ్యమైన జ్ఞాపక దినమైన అషురా అని పిలువబడే పదవ రోజుతో గుర్తించబడింది.ముహర్రం ముస్లింలకు ఆత్మపరిశీలన మరియు ఆత్మపరిశీలన చేసుకునే నెల, మరియు ఈ సమయంలో వారు దైవభక్తి మరియు మంచి పనులలో పాల్గొనమని ప్రోత్సహించబడ్డారు. ముహర్రం సమయంలో ఉపవాసం ఉండటం చాలా మంచిది, మరియు ఆషూరా దినాన్ని ఉపవాసం గడపడం వల్ల ముస్లిం యొక్క గత పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.
మొహర్రం ఎలా జరుపుకుంటారు?
ముహర్రం అనేది భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఈ పండుగ ఇస్లామిక్ నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుంది మరియు దీనిని సమాజం పవిత్రమైన మరియు ముఖ్యమైన పండుగగా భావిస్తుంది. వివిధ ముస్లిం సమూహాలలో ముహర్రం వివిధ మార్గాల్లో జరుపుకుంటారు, అయితే భారతదేశంలో ముహర్రం జరుపుకోవడానికి కొన్ని సాధారణ మార్గాలు ఉపవాసం ఉండటం మరియు మసీదులు లేదా ప్రైవేట్ ఇళ్లలో ప్రార్థన సమావేశాలకు హాజరు కావడం.భారతదేశంలో, షియా ముస్లిం సమాజం కూడా ముహర్రంను సంతాప దినంగా పాటిస్తుంది. వారు ప్రవక్త ముహమ్మద్ మనవడు ఇమామ్ హుస్సేన్ మరియు అతని సహచరులు 680 ADలో జరిగిన కర్బలా యుద్ధంలో బలిదానం చేసినందుకు గుర్తు చేసుకుంటారు. ఈ సందర్భాన్ని గుర్తుచేసుకోవడానికి షియా ముస్లింలు “తాజియా” మరియు “ఆలం” అని పిలువబడే ఊరేగింపులలో పాల్గొంటారు. ఊరేగింపుల సమయంలో, వారు ఇమామ్ హుస్సేన్ సమాధి ప్రతిరూపాలను, రంగురంగుల జెండాలను తీసుకువెళతారు మరియు ఆయన జ్ఞాపకార్థం ఎలిజీలను పఠిస్తారు.
భారతదేశంలో మొహర్రం ఆచారాలు మరియు ఆచారాలు వైవిధ్యమైనవి మరియు ప్రాంతం నుండి ప్రాంతానికి మారుతూ ఉంటాయి. దేశంలోని కొన్ని ప్రాంతాలలో, దేవునికి కృతజ్ఞత చూపించడానికి ప్రజలు పేదలకు మరియు పేదలకు దాతృత్వం అందిస్తారు మరియు ఆహారం మరియు స్వీట్లు పంపిణీ చేస్తారు. భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో, గంభీరమైన సందర్భానికి గౌరవ చిహ్నంగా ప్రజలు మొహర్రం సమయంలో సంగీతం ఆడటం లేదా వివాహాలు నిర్వహించడం మానేస్తారు.
2025 మొహర్రం సెలవులను ఎక్కడ గడపాలి?
ముహర్రం ఇస్లామిక్ పండుగలలో అత్యంత ముఖ్యమైన మరియు ముఖ్యమైన పండుగలలో ఒకటి. కర్ణాటక, కేరళ మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు ముహర్రంను గొప్పగా జరుపుకుంటాయి. ప్రజలు తమ కుటుంబ సభ్యులను మరియు స్నేహితులను కలుసుకుంటూ పండుగ నిర్దిష్ట ఆహారం మరియు స్వీట్లను ఆస్వాదిస్తారు. అయితే, ఇది శోకం మరియు ఉపవాసం యొక్క పండుగ కాబట్టి, భక్తులు బహుళ రోజులు ఉపవాసం ఉండటానికి ఎంచుకుంటారు కాబట్టి, ఈ పండుగలు చాలా సరళంగా ఉంటాయి. మీరు భక్తుడైతే లేదా 2025 ముహర్రం అనుభవంలో మునిగిపోవాలని ప్లాన్ చేస్తుంటే , ఈ మూడు రాష్ట్రాలను సందర్శించడం ఈ పండుగ యొక్క అందం మరియు సరళతను ఆస్వాదించడానికి అనువైనది కావచ్చు.
ఈరోజు మహిళా శిశు దివ్యాంగులు వయవృద్ధులు మరియు ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సంక్షేమ శాఖ తరపున జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాలతో ఆడిటోరియంలో గర్భిణీ మహిళలకు బాలింతలకు అంగన్వాడీ టీచర్లకు యోగ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని మహిళల ఆరోగ్యాన్ని మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఆర్య జనని అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా ముఖ్యంగా మహిళలు గర్భిణీ సమయంలో బాలింత సమయంలో చేయవలసినటువంటి ప్రత్యేక ఆసనాలు ప్రత్యేక ధ్యానం ప్రత్యేక యోగా పద్ధతుల గురించి వివరించడం జరిగింది. ఈ పద్ధతులను ఉపయోగించడం ద్వారా పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండడంతో పాటు సాధారణ ప్రసవాలు జరుగుతాయని జిల్లా సంక్షేమ అధికారి పి.లక్ష్మీరాజం వివరించారు. అలాగే జిల్లా వైద్యాధికారి రజిత మాట్లాడుతూ యోగ పద్ధతులు నేర్చుకోవడం ద్వారా సాధారణ ప్రసవాలు జరుగుతాయనిచెప్పారు. మన దేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరియు సిరిసిల్ల జిల్లా సి సెక్షన్ లలో అత్యధిక శాతంతో ముందున్నాయి.
కాబట్టి యోగ నేర్చుకోవడం ఆసనాలు ధ్యానం ద్వారా మనం సాధారణ ప్రసవాలకు మళ్ళించవచ్చని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో రామకృష్ణ మఠం నుండి డాక్టర్ అంజలి,దీప్తి చాలా సాధారణ పద్ధతులతో ఏ విధంగా యోగాను పూర్తి చేయవచ్చు ధ్యానం గురించి కూడా వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చాలా క్షుణ్ణంగా అర్థమయ్యేలాగా ఒక్కో మెట్టు గురించి వివరించడం జరిగింది. పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు గురించి వివరించారు. మంచి సంకీర్తన వినడం మంచి చిత్రాలు చూడడం ఆహ్లాదకర వాతావరణము ప్రశాంత వాతావరణము సమయానికి ఆహారం తీసుకోవడం కనీసం 8 గంటల నిద్ర ఇలాంటివి కూడా తప్పనిసరిగా పాటించాలని సూచించారు.. అలాగే ఈ కార్యక్రమానికి డాక్టర్ సురేంద్రబాబు పీడియాట్రిషన్ అతిథిగా హాజరై పిల్లల ఆరోగ్యానికి మంచి చేస్తాయని యోగా ధ్యానం పద్ధతులు వాడుకుని ఏకాగ్రతను జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చని తెలిపారు. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అని సదస్సుకు హాజరైన అందరు సిబ్బందికి తెలియజేశారు… ఈ కార్యక్రమంలో సిడిపివోలు సౌందర్య ఉమారాణి జిల్లా మిషన్ కోఆర్డినేటర్ రోజా సూపర్వైజర్లు పోషణ అభియాన్ కోఆర్డినేటర్ బాలకిషన్ ఇన్చార్జ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ , చైల్డ్ హెల్ప్ లైన్ కో ఆర్డినేటర్ పరమేశ్వర్, సఖి కో ఆర్డినేటర్ మమత, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరువలేనివని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కంబగోని సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్ లు అన్నారు. తెలంగాణ సిద్ధాంత కర్త, జయశంకర్ వర్ధంతి పురస్కరించుకొని రామకృష్ణాపూర్ పట్టణంలోని జయశంకర్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ శ్రేణులు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన నష్టాలను, కష్టాలను.. తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని ప్రజలకు వివరిస్తూ, ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని జయశంకర్ సార్ రగిలించారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే శ్వాసగా, ధ్యాసగా వారు నడిపిన పోరాటం, జీవితం మహోన్నతమైనదని, మీరు కలలుగన్న తెలంగాణ ప్రగతి సాక్షిగా మీకివే మా నివాళులు అని అన్నారు.తెలంగాణ ప్రాంతం ఆంధ్ర పాలకుల వల్ల అణగారిపోయి అభివృద్ధికి నోచుకోకుండా ఉందని వారి నుండి విముక్తి కోసం తెలంగాణ ఉద్యమ కర్త కెసిఆర్తో వెన్నంటి ఉండి తెలంగాణ ప్రాంతంలో మన నీళ్లు,మన నిధులు,మన ఉద్యోగాలు కావాలని, కోరుకునే వ్యక్తులలో మొదటి వ్యక్తి జయశంకర్ అని అన్నారు. ఆశయాలను బంగారు తెలంగాణ కోసం నిత్యం తపించే గొప్ప ఆదర్శవాది అని అన్నారు. వారి మరణం తెలంగాణ ప్రాంత ప్రజలకు తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు రెవెల్లి ఓదెలు, అనిల్ రావు, పోగుల మల్లయ్య, జాడి శ్రీనివాస్, జిలకర మహేష్, సీనియర్ నాయకులు అలుగుల సత్యం, జక్కన బోయిన కుమార్, రామిడి లక్ష్మి కాంత్, గోనె రాజేందర్, ఖలీం,చంద్రకిరణ్, కుర్మ దినేష్ తదితరులు పాల్గొన్నారు.
మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిధిగా చిట్యాల ఎ ఎం సి వైస్ చైర్మన్ మహ్మద్ రఫీ పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణి చేశారు.అనంతరం రఫీ మాట్లాడుతూ. దేశ వ్యాప్తంగా ప్రతి గుండెను హత్తుకునేలా చేపట్టిన జూడో యాత్రతో ప్రజల కష్టాలను దగ్గరుండి చూసిన రాహుల్ గాంధీ ప్రతి పక్షనేతగా పేద ప్రజలకు న్యాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేస్తూ. దేశ ప్రజల అభ్యున్నతికై అనుక్షణం పరితపించే మృధుస్వభావి రాహుల్ గాంధీ అని. అలాంటి మహా నాయకునికి మొగుళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ఈవేడుకల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కళ్లపెల్లి రాజు, నడిగోటి రాము,ఏలేటి శివారెడ్డి, ఆకుతోట కుమార్, నీల రాజు, మంగళపల్లి శ్రీనివాస్, చంద్రబోస్, నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ భవన్/హనుమకొండ పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత,ఎంపీ శ్రీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను గురువారం రోజు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.యువజన కాంగ్రెస్ శ్వేత ఆధ్వర్యంలో నిర్వహించిన రక్త దానం శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర మీడియా,కమ్యూనికేషన్ చైర్మన్ శ్రీ సామ రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిస్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి రాహుల్ గాంధీ జన్మదినం ఓ మంచి కార్యక్రమం కావాలని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.దాతలకు సర్టిఫికేట్స్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వతంత్ర దేశం నుంచి నేటి వరకు ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేస్తున్న ఏకైక కుటుంబమని,రాహుల్ గాంధీ అట్టడుగు వర్గాలకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేపట్టిన రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన రేషన్ కార్డులు,ఆరోగ్యశ్రీ,ఫీజు రీయింబర్స్ మెంట్ లాంటి ఎన్నో పథకాలతో నేడు పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఈ వేడుకల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్నాకర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యువజన కాంగ్రెస్ జిల్లా ఇన్చార్జి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలువాల కార్తిక్ హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ వారి యొక్క జన్మదిన సందర్భంగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం వల్ల చాలామంది ప్రమాదాల్లో గాయపడిన వారికి బ్లడ్ లేక చ చాలా సందర్భాల్లో చనిపోయిన సంఘటన ఎన్నో ఉండడం జరిగింది.
రాకుండా ఉండడానికి దేశం రాహుల్ గాంధీ యొక్క జన్మదిన సందర్భంగా బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది రాహుల్ గాంధీ
ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినప్పుడు నరేంద్ర మోడీ ఒకటి ధనిక దేశం మరొకటి పేదరిక దేశాన్ని
రెండు విభజించి పాలిస్తున్నారు రెండు దేశాలు ఉండొద్దు కేవలం భారతదేశం ఒక్కటే అనే ఉద్దేశంతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ప్రతి పేద వాడిని మీకు అండగా నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే
ఈ దేశంలో పేదరిక కుటుంబాలు లేకుండా చేస్తామని మహా పాదయాత్ర చేసిన నాయకులు రాహుల్ గాంధీ అంతేకాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి బహిరంగ సభలో బీసీలకు అత్యధిక రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన
మాటకు కట్టుబడి తెలంగాణ అసెంబ్లీలో బీసీ బిల్లును ఆమోదం చేయటంలో క్రియాశీలక పాత్ర పోషించింది నాయకులు రాహుల్ గాంధీ అంతేకాకుండా
ఈ భారత దేశంలో కూడా అన్ని రాష్ట్రాల్లో బీసీ కులగణాల జరగాలని పెద్ద ఎత్తున పోరాటంలో చేస్తున్న క్రమంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తలవంచి ఈరోజు దేశవ్యాప్తంగా కులగనలు చేయడానికి ముందుకు వచ్చిందంటే మీ యొక్క మహోన్నతమైనటువంటి నాయకుడు వలన
ఈ దేశ ప్రజలకు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని ఎప్పటికప్పుడు తన వంతు పోరాటాలు చేస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ నాయకుడి కోసం రాబోయే రోజులలో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యేవరకు మా యువజన కాంగ్రెస్ నాయకులు కంకణం కట్టుకొని ఒక సైనికుల పనిచేసి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ ముందుకు వెళ్లాలని వారు మాట్లాడం జరిగింది ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు ప్రసాద్ రాజు, రాహుల్ తరుణ్ ఆర్తి సురేష్ ప్రేమ్ మధుకర్ అశోక్ ప్రమోద్ నది అక్షిత్ రాజ్ తదితరులు పాల్గొన్నారు
నగరంలోని 14 వ డివిజన్ ఎనుమాముల ముసలమ్మ కుంట పేస్ వన్ లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత పార్లమెంట్ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు గురువారం రోజున సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాశెట్టి కమలాకర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి వరంగల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ విచ్చేసి కేక్ కట్ చేసి అనంతరం పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ దేశానికి విశ్వసనీయత కలిగిన వారని, ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసే నిజమైన ప్రజా నాయకులు ఆయన నాయకత్వంలో దేశంలో సామాజిక న్యాయం సమనత్వం ప్రజాస్వామ్యం బలపడుతున్నాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ అడుప మహేష్. జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కరాటే ప్రభాకర్. ఎస్టీ సెల్ హనుమకొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పులి చేరి రాధాకృష్ణ.డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పస్తం శంకర్ ఏనుమాముల గ్రామ పార్టీ అధ్యక్షులు సౌరం చిన్ని సుందరయ్య నగర్ గ్రామ అధ్యక్షుడు త్రికోవేల శ్రీను. ఇందిరమ్మ కమిటీ మెంబర్ ఏకామ్రాచారి దస్రు నాయక్ పార్టీ సీనియర్ నాయకులు ఖల్నాయక్ సౌరం ప్రభాకర్ సౌరం మాణిక్యం సౌరం జయకర్ సంగారబోఎన రాజు సంగార బోయిన రాజేష్ కన్నా ఇందిరమ్మ కాలనీ డెవలప్మెంట్ కమిటీ ప్రధాన కార్యదర్శి బండ్ల సురేందర్ తోట శీను పల్లకొండ చందు ముక్తార్ మహేష్. మహిళలు మొద్ధసాని మాధవి. గుగులోతు మంగ కార్యకర్తలు పాల్గున్నారు
జూన్ 19.రాహుల్గాంధీ జన్మదిన సందర్భంగా రాయికల్ పట్టణంలో గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారతదేశానికి మార్గదర్శనం చేయగలిన యువ తేజం రాహుల్ గాంధీ అని ఆయన దెబ్బకు బిజెపి ఇతర పార్టీలతో జట్టు కట్ట వలసి దుస్థితి వచ్చిందని అన్నారు.దేశ స్వతంత్ర అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వలు రక్షణ రంగంలో భారత్ ను ఓక అజేయశక్తి గా నిలిపాయన్నారు.యువతకు ఉద్యోగాలు కల్పించల్సిన కేంద్ర ప్రభుత్వం యువతను నిరాశకు గురిచేస్తోందని ఆరోపించారు.నిరుద్యోగ సమస్యను గుర్తిచడంలో కేంద్రం ప్రభుత్వం విఫలమైందన్నారు. దేశంలో సుస్థిరమైన ప్రజా పాలన అందించగల ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని మత చాందస వాదులు మతాల పేరు చెప్పి ఎంత గెలిచే ప్రయత్నం చేసిన బడుగు బలహీనవర్గాల సంక్షేమం పట్ల ఆలోచన గలిగిన రాహుల్ గాంధీ దేశంలోనే అత్యున్నతమైన నాయకుడిగా పేరుపొందిరని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ,మండల అధ్యక్షులు మ్యాకల రమేష్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి మహేందర్ గౌడ్,జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షాకీర్,హనుమాన్ ఆలయ చైర్మన్ దాసరి గంగాధర్, యూత్ కాంగ్రెస్ మండల,పట్టణ అధ్యక్షులు ఏలేటి జలంధర్ రెడ్డి,బత్తిని నాగరాజు,నాయకులు ఎద్దండి భూమారెడ్డి,కొయ్యేడి మహిపాల్ రెడ్డి,బాపురపు నర్సయ్య,బత్తిని భూమయ్య,వాసం దిలీప్,కొమ్ముల ఆదిరెడ్డి,కడకుంట్ల నరేష్,అశోక్,మోబిన్,మండ రమేష్, రాకేష్ నాయక్,తలారి రాజేష్,బాపురపు రాజీవ్,జక్కుల సాగర్,రాజేష్,నరసింహారెడ్డి,ఆనంద్,పాసం భూమయ్య,పల్లికొండ రమేష్,కాటి పెల్లి రాజశేఖర్, రాజేందర్,రవీందర్,తదితరులు పాల్గొన్నారు.
ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ జన్మ దిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గంగాధర మండలంలో గురువారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని మధురానగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీ పేరు రాసి ఉన్న కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీని భావి భారత ప్రధానమంత్రిని కొనియాడారు. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయపతాకం ఎగురవేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, నాయకులు జాగీరపు శ్రీనివాస్ రెడ్డి,దుబ్బాసి బుచ్చన్న,సత్తు కనుకయ్య, మార్కేట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్,పడితపల్లి కిషన్,కొలిపాక స్వామి,వేముల అంజి,వేముల భాస్కర్,గుజ్జుల బాపురెడ్డి, కర్ర బాపురెడ్డి,కోలపురం లక్ష్మణ్,రుద్ర మల్లేశం,గరిగంటి కరుణాకర్,బెజ్జంకి కళ్యాణ్,మంత్రి మహేందర్,పానుగంటి సత్యం, గంగాధర సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు జమ్మికుంట నేటిధాత్రి:
యూత్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి మరియు హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు, యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ ఆధ్వర్యంలో, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జమ్మికుంట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా, జమ్మికుంట యూత్ కాంగ్రెస్ పక్షాన రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు
అనంతరం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ మాట్లాడుతూ; దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబానికి చెందిన నాయకుడు, 150 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి నాలుగవ తరం వారసులు రాహుల్ గాంధీ అని కొనియాడారు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన 75 యేళ్లలో దాదాపు 50 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించిందని అన్నారు. రాహుల్ గాంధీ 2004లో భారత రాజకీయాల్లోకి ప్రవేశించి ఎంపీగా గెలిచి, ఆ తదుపరి ఎఐసిసి అధ్యక్షులుగా యువ నాయకత్వాన్ని వహించారన్నారు. భారత్ జోడో యాత్ర పేరిట కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు 3500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి, అదే విధంగా న్యాయ యాత్ర ద్వారా పేద అట్టడుగు మరియు వెనుకబడిన ప్రజల కోసం ప్రజాస్వామ్యాన్ని తిరిగి పొందడానికి జై భీమ్, జై బాపు, జై సంవిదాన్ అనే కార్యక్రమంతో ప్రజలకు రాజ్యాంగం యొక్క గొప్పతనం తేలవాల్సిన అవసరం ఉందని, దాని కోసం ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. రేపటి ఉజ్వల భవిష్యత్తు కోసం భారతదేశ ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడు రాహుల్ గాంధీ అని రానున్న రోజుల్లో ఈ దేశ ప్రజల ఆశీర్వాదంతో వారిని ప్రధానమంత్రిగా చూడబోతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో; యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు, కార్యదర్శి దొడ్డె సంధ్య నవీన్, పింగిలి చైతన్య రమేష్, అసెంబ్లీ కార్యదర్శి పాతకాల రమేష్, రోమాల రాజ్ కుమార్, మండల ఉపాధ్యక్షులు దేవునూరి వినయ్, ప్రధాన కార్యదర్శి బిజిగిరి శ్రీకాంత్, కార్యదర్శి యేబుషి అజయ్, పైడిపల్లి వెంకటేష్, నాయకులు జావిద్, సూర్య రెడ్డి, ఇల్లందుల శివ, బండి పవన్, అష్రఫ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్ లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
దేశంలోని సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల పక్షాన నిలబడుతున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని టిపిసిసి ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు పల్లె రాజు లు అన్నారు. ఏఐసీసీ అగ్ర నాయకుడు,ఎంపీ రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ చౌరస్తా వద్ద గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. అనంతరం వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యతను కల్పిస్తూ కాంగ్రెస్ కార్యకర్తను కాపాడుకుని రానున్న రోజుల్లో తిరుగులేని శక్తివంతమైన పార్టీగా కీర్తించడంలో అగ్రనేత రాహుల్ గాంధీ వ్యూహాలు ప్రణాళికలు అమలు చేయడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కళ సీనియర్ నాయకులు సమ్మయ్య, లాడెన్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కుర్మ సురేందర్, బత్తుల వేణు, నగేష్ రాజేష్ నాగులు ప్రేమ్ సాగర్ మహిళా నాయకురాళ్ళు పుష్ప, సునీత,శారద, దీప తదితరులు పాల్గొన్నారు.
మెట్ పల్లి లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు ఆదేశాల మేరకు వారి నివాసములో లోక్ సభ పతి పక్షనేత,ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన కేకును మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబోదీన్ పాషా,రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మారుతి,ఇబ్రహీంపట్నం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నల్లూరి సాగర్,మాజీ ఎంపిటిసి సిగారపు అశోక్,మాజీ ఉప సర్పంచ్ సల్ల సునీల్,కల్లెడ గంగాధర్,ఎండి జాఫర్,ఇప్పపెల్లి గణేశ్,బైండ్ల శ్రీకాంత్,కోరే రాజ్ కుమార్,కనక దినేశ్,మహేష్ కాంగ్రెస్ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు గురువారం కోహిర్ మండల పోతిరెడ్డిపల్లి గ్రామ చౌరస్తా వద్ద 11వ వార్డు మాజీ కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున యువకులు పాల్గొని కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబానికి చెందిన నాయకుడని పొన్న రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని గాంధీ చౌక్ లో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ నా వేడుకలు భాగంగా ఈరోజు సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత బడుగు బలహీన వర్గాల నేత, రాహుల్ గాంధీ 55వ జన్మదినం సందర్భంగా గాంధీ చౌక్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించడం జరిగింది అంతేకాకుండా రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర చేపట్టి, పేద ప్రజల మన్ననలు పొందిన వ్యక్తిగా, ప్రజా నాయకుడిగా శక్తిగా ఎదిగిన రాహుల్ గాంధీ ఎల్లవేళలా ఆరు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. గ్రంధాలయ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ లోని కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన వ్యవస్థగా పేద ప్రజలకు అండగా ముందుకు సాగుతుందని రాహుల్ గాంధీ లాంటి నాయకుడు మా అందరికీ ముందుండి నడిపిస్తాడని ఆశిస్తున్నాను అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, గ్రంధాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు సంగీతం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎనమల తిరుపతి రెడ్డి స్వరూప, జిల్లా మహిళా అధ్యక్షురాలు కామూని వనిత నలినీకాంత్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సూర దేవరాజు , గడ్డం నరసయ్య వైద్య శివప్రసాద్, తదితర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోనీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, బావి భారత ప్రధాని అగ్రనేత పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలో కులమతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వాలకు పార్టీలకు బుద్ధి చెప్పడం కోసం పేద ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడం కోసం భారత్ జోడో యాత్ర ప్రారంభించి 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశ ప్రజలందరినీ ఒకే తాటిపై నడిపించిన ప్రజా నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు.. రాహుల్ గాంధీ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండి ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నాయకులు పోలేబోయిన తిరుపతయ్య, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు, మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్, మండల నాయకులు పూజారి వెంకన్న , వగలబోయిన శ్రీను, దంచనాల రాజేంద్రప్రసాద్, గాంధర్ల రామనాథం, గోగు కిరణ్ కుమార్, మేడి శ్రీను, అశ్రపునిస, పోలేబోయిన సుజాత,కార్యకర్తలు, మహిళలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు..
జూలై 7 న ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా చేయాలి.
జహీరాబాద్ నేటి ధాత్రి:
shine junior college
జహీరాబాద్ నియోజకవర్గ పట్టణ కేంద్రం గా స్థానిక రభాసా అతిథి గృహంలో అబ్రహం మాదిగ అధ్యక్షతన ఉల్లాస్ మాదిగ సమన్వయంతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిలు గా విచ్చేసిన ఎమ్మార్పీఎస్ సంగారెడ్డి జిల్లా ఇంచార్జిలు రామరాపు శ్రీనివాస్ మాదిగ,విఎస్ రాజు మాదిగలు మాట్లాడుతూ…ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఆవిర్భవించిన తరువాత,మందకృష్ణ తన పేరు పక్కన మాదిగ అని చేర్చుకున్న తరువాత మాదిగ సమాజానికి ఎనలేని దైర్యం కలిగింది. ఆ దైర్యంతోనే మాదిగలంతా తమ పేరు పక్కన కులం పేరు చేర్చుకొని ఆత్మ గౌరవాన్ని చాటుకున్నారని అన్నారు.రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన అందక పోవడం వల్లనే మాదిగలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారు.కనుక జనాభా ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించాలని మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో ముప్పై ఏళ్ళు రాజీలేని పోరాటం సాగిందని అన్నారు.ఆ పోరాట ఫలితంగానే నేడు తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ చట్టం అమలులోకి వచ్చిందని,దాని ద్వారా మాదిగలకు 9% రిజర్వేషన్లు దక్కాయి.ఎన్నో త్యాగాల ద్వారా సాధించుకున్న రిజర్వేషన్ ఫలాలు మాదిగ విద్యార్థులు నిరుద్యోగులు అందిపుచ్చుకొని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి రావాలని పిలుపునిచ్చారు.అలాగే ఎస్సీ వర్గీకరణతో పాటు ఆరోగ్యశ్రీ, వికలాంగులు , వృద్దులు, వితంతువుల, ఒంటరి మహిళల పెన్షన్లు, తెలంగాణ అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు , మహిళల భద్రత కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మొదలగునవి ఎమ్మార్పీఎస్ సాధించి అన్ని వర్గాలకు అండగా నిలిచిందని అన్నారు . కనుక దండోరా జెండా సమస్త అణగారిన వర్గాలకు అండగా ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో జూలై 7న ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా చేసుకోవాలని అన్నారు.ప్రతి గ్రామంలో దండోరా జెండా ఆవిష్కరణలు చేయాలని అన్నారు. ప్రతి గ్రామంలో సభలు జరిపి ఉద్యమానికి తోడుగా ఉన్న అన్ని కులాల పెద్దలను సత్కరించాలని అన్నారు.
ఇట్టి కార్యక్రమంలో… పెద్ద గీత మాదిగ మాదిగ మహిళ సమాఖ్య రాష్ట్ర నాయకురాలు,ఆనంద్ వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు,బుచెంద్రయ్య మాదిగ ఎమ్మార్పియిస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు,జాన్ సోషల్ మీడియా ఇంచార్జి సంగారెడ్డి,వివిధ మండల అధ్యక్షులు జైరాజ్ మాదిగ, టీంకు మాదిగ, మైకీల్ మాదిగ,నిర్మల్ మాదిగ, ప్రభాకర్ మాదిగ,సుకుమార్, కిట్టు, శ్రీనివాస్, ప్రేమ్, సుదర్శన్, దాస్, జీవన్,వీరయ్య మాదిగ,దేవయ్య, చంద్రకాంత్, శాంతకుమార్, మోహన్, చంద్రపాల్, దిలీప్, సంతోష్, సునీల్ కుమార్, ప్రశాంత్, లాజర్, సుందర్, సుశీల్ కుమార్, ప్రవీణ్, దుర్గాదాస్, మాదిగలు పాల్గొన్నారు.
వర్షాలు విరివిగా కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవనం కొనసాగించాలని కోరుతూ.. మండలంలోని అన్నదాతలు వర్ణ దేవుని వేడుకున్నారు. బుధవారం ఏరువాక పౌర్ణమి శుభ సందర్భంగా రైతులు, కౌలు రైతులు గ్రామ దేవతలకు ప్రత్యేకంగా దర్శించుకుని ఆట పాటలతో సందడి చేశారు. మండల కేంద్రమైన న్యాల్ కల్, మండలంలోని మల్గి,గ్రామంలో పండగను ఘనంగా జరుపుకున్నారు. పశు సంపద, వ్యవసాయ పరికరాలు, వ్యవసాయ యంత్రాలకు ప్రత్యేక పూజలు చేశారు. కోడెదూడలు, ఎద్దులను, గోమాతలకు ప్రత్యేకంగా అలంకరించి ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
పంట పొలాల్లో భూమాతకు ప్రత్యేక పూజలు చేశారు. బండ్లు, ట్రాక్టర్లను సుందరంగా ముస్తాబు చేసి గ్రామంలోని ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. మండలంలోని మల్గి గ్రామంలో శ్రీ హనుమాన్ దేవాలయం నుండి గ్రామ శివారులోని ఇస్మాల్ ఖాద్రి దర్గా వరకు ఎడ్లబండ్లతో ప్రదక్షిణలు చేశారు. కార్యక్రమంలో భక్తులు, రైతులు, జడ్గొండ మారుతి, శివానంద శ్రీపతి, రాజు, సిద్ధారెడ్డి, మారుతి, విట్టల్, బసవరాజ్, ప్రతాపరెడ్డి, జైపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, శాంతు, ధనరాజ్, జలంధర్, మహేష్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
జాతీయ విద్యా దినోత్సవాన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా జరపాల్సిన రోజుగా గుర్తించాలి
◆ అకడమిక్ క్యాలెండర్లో వెంటనే చర్చించాలి.
◆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి.
◆ ఏఐఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ డిమాండ్.
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షులు షైక్ రబ్బానీ మాట్లాడుతు నవంబర్ 11న మన దేశ తొలి కేంద్ర విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ గారి జయంతిని పురస్కరించుకొని, భారత ప్రభుత్వం 2008 నుండే జాతీయ విద్యా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. విద్యా రంగాన్ని ఆధునికీకరించడంలో, ఐఐటీల స్థాపనలో, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వంటి ప్రముఖ సంస్థల ఏర్పాటులో ఆయన అపారమైన కృషి చేశారు. ఆయన సేవలను స్మరించుకుంటూ, విద్యకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం.
ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశాలు:
విద్య ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడం
సమాన విద్యావకాశాలపై చర్చ జరగడం
విద్యా రంగ పురోగతిపై చైతన్యం కలిగించడం
ప్రతి సంవత్సరం ఈ రోజున పాఠశాలలు, కళాశాలలల్లో:
వ్యాసరచన పోటీలు
చర్చా వేదికలు, సదస్సులు
విద్య ప్రదర్శనలు
విద్యా అభివృద్ధిపై చర్చలు
వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి. అలాంటి ముఖ్యమైన, విద్యావ్యవస్థకు మూలస్తంభంగా నిలిచే రోజు 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి తెలంగాణ విద్యాశాఖ జారీ చేసిన అకడమిక్ క్యాలెండర్లో ప్రస్తావించకపోవడం ఆశ్చర్యకరం, బాధాకరం కూడా.విద్యార్థుల ఎదుగుదలలో అలాంటి స్ఫూర్తిదాయకమైన దినోత్సవాలను ప్రోత్సహించాలి గానీ విస్మరించకూడదు.అందుకే, జాతీయ విద్యా దినోత్సవాన్ని నవంబర్ 11 తేదీకి తగిన ప్రాధాన్యంతో తిరిగి అకడమిక్ క్యాలెండర్లో చేర్చాలి అనే డిమాండ్ను విద్యాభిమానులందరం గళమెత్తి కోరుతున్నామన్నారు.
75 ఏళ్లుగా దేశాన్ని తప్పుదోవ పట్టించడంతో తృప్తి చెందనట్లుగా, జాతీయవాద పార్టీలు అని పిలవబడే పార్టీలు మరియు వారి అనుయాయులు స్వతంత్ర భారతదేశపు మొదటి విద్యా మంత్రి అబ్దుల్ కలాం ఆజాద్ వంటి వారికి ఈరోజు కూడ జేజేలు పలుకుతున్నారు. నిస్సందేహంగా అతను జన్మత భారతీయుడు కాదు. అతను ఏ పాఠశాలకు వెళ్లలేదు! హిందూ ముస్లిం ఐక్యత’ యొక్క చిహ్నాలలో ఒకరైన, గాంధీతో సమానంగా కీర్తించబడిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్య్రం తర్వాత దేశానికి మొదటి విద్యా మంత్రి అయ్యాడు.భారతదేశంలో విద్యకు పునాదులు వేసిన మహనీయుడు, దృఢమైన జాతీయవాది, గంగా జమునీ తహజీబ్ యొక్క ప్రతీకగా నివాళులర్పించుకున్నాడు. ఇది ఎంతవరకు సమర్థనీయం?…అందు గురించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అకడమిక్ క్యాలెండర్లో వెంటనే చేర్చాలని ఏఐఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ డిమాండ్ చేశారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.