ఈనెల 14 నుండి జరగనున్న పదవ తరగతి వార్షిక పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లోకిరాన్ని రానున్నదని వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హన్మకొండ జిల్లాలో 64 పరీక్షా కేంద్రాలు ,వరంగల్ జిల్లా 47, జనగామ జిల్లాలో 39 మొత్తం 150 పరీక్ష కేంద్రాల్లో ఈనెల 14 శనివారం నుండి నుండి ఏప్రిల్ 16 నుండి 2026 వరకు ఉదయం 09:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని డీసీపీ తెలిపారు.పదవ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ఈస్ట్ డీసీపీ తెలిపారు. జిల్లా పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద శాంతిభద్రతల రక్షణ లో భాగంగా సెక్షన్ 163, (144 సెక్షన్) అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడరాదు.సభలు, సమావేశాలు, ర్యాలీ లు, ధర్నాలు నిషేధం.పరీక్ష కేంద్రాల నుండి 500 మీటర్ల పరిధిలోని అన్ని జిరాక్స్ కేంద్రాలు 14 తేది నుండి ఏప్రిల్ 16 వరకు ప్రతిరోజూ ఉదయం 06:00 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు మూసివేయాలని డీసీపీ ఆదేశించారు. ఈ పరీక్షల సమయంలో ఈ ఉత్తర్వులను అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతాయని డీసీపీ అంకిత్ కుమార్ హెచ్చరించారు.
చూస్తున్న కెమెరా.. తగ్గుతున్న నేరాలు! పోలీసుల చేతిలో బలమైన ఆయుధం..
ఒకప్పుడు నేరం చేసి ఎవరు చూడలేదని నేరస్తులు ధైర్యంగా తప్పించుకునే రోజులు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది. ప్రతి వీధిలో ప్రతి కూడలిలో నిశ్శబ్దంగా గమనిస్తున్న సీసీ కెమెరా కంటికి నేరం దాచుకోవడం అసాధ్యంగా మారుతుంది. రామాయంపేట పోలీస్ సర్కిల్ పరిధిలో ఏర్పాటైన వందలాది కెమెరాలు నేరాలపై గట్టిగా వేస్తూ నేరస్తుల గుండెల్లో భయం నింపుతున్నాయి. ఈ కెమెరాల ఆధారంగా ఇప్పటికే పలు కేసులు వేగంగా ఛేదించడంతో ప్రజల్లో భద్రత భావం పెరుగుతుండగా గ్రామాల్లో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పోలీసులు సూచిస్తున్నారు.
రామాయంపేట మార్చి 13 నేటి ధాత్రి (మెదక్)
ఒకప్పుడు గ్రామంలో నేరం జరిగితే… “ఎవరు చేశారు?” అనే ప్రశ్నకు సమాధానం దొరకడానికి రోజులు, నెలలు పట్టేది. బాధిత కుటుంబాలు న్యాయం కోసం తలుపులు తట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. నిశ్శబ్దంగా చూస్తున్న ఒక చిన్న కెమెరా… నేరాన్ని కూడా, నేరస్తుడినీ పట్టుకునే సాక్ష్యంగా నిలుస్తోంది. రామాయంపేట పోలీస్ సర్కిల్ పరిధిలో సీసీ కెమెరాలు ప్రజల భద్రతకు అండగా నిలుస్తున్నాయి. సర్కిల్ పరిధిలో ప్రస్తుతం దాదాపు 900 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని సీఐ వెంకటరాజా గౌడ్ తెలిపారు. ఈ కెమెరాల ఆధారంగా ఇప్పటికే సుమారు 65 కేసులను వేగంగా ఛేదించడం సాధ్యమైందని ఆయన వెల్లడించారు. గతంలో జరిగిన కొన్ని హత్యలు, దొంగతనాలు, యాక్సిడెంట్లకు సంబంధించిన కీలక ఆధారాలు కూడా సీసీ కెమెరాల ద్వారానే బయటపడ్డాయని పోలీసులు చెబుతున్నారు. ఎవరూ చూడలేదనుకున్న చోట కూడా ఒక కెమెరా మాత్రం నిశ్శబ్దంగా అన్నీ రికార్డ్ చేస్తోంది.
సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాల్లో నేరాలు తగ్గుతాయని పోలీసులు స్పష్టంగా చెబుతున్నారు. ఎందుకంటే చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారు కూడా కెమెరా కంటిని చూసి వెనక్కి తగ్గే పరిస్థితి వస్తోంది. యాక్సిడెంట్ చేసి పారిపోవాలని భావించే వారు కూడా ఇప్పుడు కెమెరాల కారణంగా తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. గ్రామాల్లో ముఖ్యమైన కూడళ్లు, మార్కెట్ ప్రాంతాలు, దేవాలయాల పరిసరాలు వంటి చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ప్రజలకు మరింత భద్రత కలుగుతుందని పోలీసులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాల ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని సీఐ వెంకటరాజా గౌడ్ తెలిపారు.
సమాజం సురక్షితంగా ఉండాలంటే పోలీసులు మాత్రమే కాదు… ప్రజల సహకారం కూడా అవసరం. ప్రతి గ్రామంలో కెమెరాలు ఏర్పాటు అయితే… ప్రతి వీధి ఒక నిశ్శబ్ద సాక్షిగా మారుతుంది. అప్పుడు నేరం చేయాలనుకునే వారి గుండెల్లోనే భయం మొదలవుతుంది. సమాజ భద్రత కోసం… కెమెరా కన్ను ఎప్పుడూ మేల్కొని ఉంటుంది.
విద్యార్దులను సంస్కారవంతమైన వారిగా తీర్చిదిద్దుతూ చదువుతో పాటు సంస్కృతి సంప్రదాయాలను అలవరుస్తున్నామని వనవాసీ కల్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్ది నిలయం గౌరవ సలహాదారులు బివిఎస్ఎల్ నర్సింహారావు అన్నారు గుమ్మడి మదుసూదన్ రావు జ్ఞాపకార్థం ఆయన సతీమణి శ్రీదేవి విద్యార్ది నిలయంకు పరుపులు స్టీల్ డ్రమ్ లను అందచేసారు ఈ సందర్భంగా నిలయ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ అద్యక్షతన జరిగిన సమావేశంలో నర్సింహారావు ప్రసంగించారు నిరుపేద ఆదివాసీ విద్యార్దులను ఇక్కడ చేర్పించి వారికి వసతితో పాటు విద్యను అందచేసి భవిష్యత్ కు బంగారుబాట వేస్తున్నామని వెల్లడించారు వనవాసీ సంస్ద దాతల సహకారంతో నడుస్తుందని దాతల సహకారం మరువలేనిదని పేర్కొన్నారు ఇందుకు నిలయ కమిటీ సభ్యులు చేస్తున్న కృషి అబినందనీయమని పేర్కొన్నారు వనవాసీ ప్రాంత మహిళా సహప్రముఖ్ పెద్దాడ ఆశాలత మాట్లాడుతూ గిరిజన వికాసం కొరకు దేశ వ్యాపితంగా సంస్ద విద్యార్ది నిలయాలతో పాటు గ్రామాలలో విద్యా కేంద్రాలను నిర్వహిస్తోందని వెల్లడించారు శ్రీదేవి మాట్లాడుతూ వనవాసీ సంస్దకు తనవంతు సహకారం అందచేస్తానని, విద్యార్దుల చదువులకు సహకరించడం సంతోషకరమని అన్నారు వనవాసీ జిల్లా సంఘటనా కార్యదర్శి కోరం సూర్యనారాయణ నిలయ కమిటీ అద్యక్షుడు తాటి పాపారావు ఉపాద్యక్షులు గోగికార్ రాంలక్ష్మణ్, సహ కోశాదికారి వేములపల్లి ప్రవీణ్ బాబు, సభ్యులు శివరాజు కిషోర్, నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్నకుమారి, సుధీర్ పాల్గొన్నారు.
జోరుగా సాగుతున్న న్యాల్కల్ ఎన్హెచ్-50 విస్తరణ పనులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్ మండల పరిధిలోని డప్పూర్ గ్రామ శివారులో జాతీయ రహదారి-50 విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. నిజాంపేట్ నుంచి నారాయణఖేడ్ మీదుగా కర్ణాటకలోని బీదర్ వరకు వెళ్లే ఈ మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం సుమారు ₹512 కోట్ల వ్యయంతో 46 కిలోమీటర్ల మేర రెండు లేన్లుగా అభివృద్ధి చేస్తోంది. ఈ పనులు పూర్తయితే తెలంగాణ-కర్ణాటక మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. అధికారులు వాహనదారులను జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు.
గ్యాస్ కరువుతో కొన్ని చోట్ల పలు వ్యాపార సంస్థలు, హోటల్లు నిలిపివేత
వెయ్యిల్లో బ్లాక్ దందాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు
ఏజెన్సీలకు సరఫరా గ్యాస్ కంపెనీలు ఆలస్యం
సిరిసిల్ల టౌన్ : (నేటి ధాత్రి)
సిరిసిల్ల పట్టణంతో పాటు పరిసర గ్రామాలలో వంట గ్యాస్ కొరత తీవ్రంగా నెలకొంది. పట్టణ కేంద్రంలోని పలు గ్యాస్ ఏజెన్సీలు సరఫరాను సక్రమంగా అందించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గ్యాస్ సిలిండర్లు గోదాముల్లో ఉన్నప్పటికీ సామాన్య ప్రజలకు అందకుండా సరఫరా నిలిపివేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు వంట గ్యాస్ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత నెలలో సిలిండర్ 925 /-రూపాయలు ఉండేది నేడు సుమారు 985/- గా ఉంటూ 60 రూపాయలు అదనపు గా ఈ నెలలో పెరిగిందని ఆరోపిస్తున్నారు. సమయంలో కొందరు ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్ సిలిండర్లను ఇతర వ్యాపార సంస్థలకు అధిక ధరలకు విక్రయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా మార్కెట్లో గ్యాస్ సిలిండర్లు బ్లాక్లో వెయ్యి రూపాయలకు పైగా విక్రయించబడుతున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ పరిస్థితిపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే బ్లాక్ మార్కెట్ దందాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పలు రకాల ఏజెన్సీ అడగగా.. పై నుండి వచ్చే గ్యాస్ సరఫరా నాలుగు రోజులకు ఒకసారి లోడింగ్ వస్తుందని అంతే కాకుండా, ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా ఒకేసారి వంట గ్యాస్ బుకింగ్ చేసుకుంటూ ఎక్కువగా నిలువ ఉంచుకోవడం ద్వారా నిజంగా వంట గ్యాస్ లేని అటువంటి వారికి ఇబ్బంది కొరత ఏర్పడుతుందని తెలిపారు.
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఉపాధ్యాయుల పిఆర్సి పెండింగ్ డీలను చెల్లించేలా అసెంబ్లీలో లేవనెత్తాలని సంఘం నాయకులు ఎమ్మెల్యేను కోరారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి తెలిపారు.
సబ్ స్టేషన్ లో రికార్డులు పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వల్ సబ్ స్టేషన్ ను సందర్శించి రికార్డులను పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్న ఎమ్మెల్యేలు మాణిక్ రావు, చింత ప్రభాకర్ ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు 24గంటల పాటు విద్యుత్ ఇస్తున్నట్లు అసెంబ్లీ లో పేర్కొన్నారు, రైతులకు కేవలం 12గంటల విద్యుత్ సరఫరా జరుగుతోందని స్పష్టం చేశారు. ఆ విద్యుత్ సరఫరా లో సైతం పలుమార్లు ట్రిప్ అవుతోందని, లైన్ బ్రేకింగ్, ఎల్ సి ల పేరిట అంతరాయం ఏర్పడుతోందని పేర్కొన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా లేక రైతుల పంటలు ఎండిపోతున్నాయని, విద్యుత్ సబ్ స్టేషన్ లాగ్ బుక్ లో సాయంత్రం 4గంటలకు త్రి ఫేస్ కరెంటు తీసేస్తే తెల్లారి 3గంటలకు ఇస్తున్నారని అయినా అధికారులు, ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొనడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ల మొత్తాన్ని తమ హయాంలో ఉన్న 4,900రూపాయలు ఉన్న డీడీ మొత్తాన్ని 9700రూపాయలకు పెంచారని, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం లో వేలాది కొత్త విద్యుత్ కనెక్షన్ లు పెండింగ్ లో ఉన్నాయని స్టోర్ లలో మెటీరియల్ లేదని, కాలిన ట్రాన్స్ఫార్మర్ విషయం లో రైతులపై భారం మోపుతున్నారని, లోడ్ ఎక్కువ ఉన్న చోట్ల అదనపు డి టీ ఆర్ లు లేవని తెలిపారు. బ్యాంకు లను, ఆర్థిక సంస్థలను మోసం చేయడానికి కొత్త డిస్కమ్ ను ఏర్పాటు చేస్తున్నారాని, ఉన్న రెండు డిస్కమ్ లను 56వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి,సష్టాలపాలు చేసి కొత్త డిస్కమ్ ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. సమ్మె చేస్తున్న 19647 మంది ఆర్టిజాన్ లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టిజన్ ల సమ్మెకు మద్దత్తు పలుకుతున్నామని, మృతి చెందిన ఆర్టిజన్ ల పిల్లల విద్యార్హతలకు తగ్గట్టు గా ఉద్యోగాలు ఇవ్వాలన్నారు.
చియా విత్తనాల సాగులో విజయం సాధించిన జహీరాబాద్ రైతు
◆-: రమేష్, కొత్త పంటలతో ఆదర్శంగా నిలుస్తున్నారు…
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ : పట్టణానికి చెందిన ప్రగతిశీల రైతు, బిజెపి నాయకుడు రమేష్ రెడ్డి బసంతపూర్ వ్యవసాయంలో కొత్త పంటలను ప్రవేశపెట్టడం ద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవల, అతను తన పొలంలో చియా విత్తనం (సబ్జా) సాగు చేయడంలో విజయం సాధించాడు. తక్కువ ఖర్చుతో పండించగల ఈ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, దీనివల్ల రైతులు మంచి ఆదాయం పొందే అవకాశం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో డ్రాగన్ ఫ్రూట్ సాగును ప్రోత్సహించడంలో రెడ్డి ఇప్పటికే గుర్తింపు పొందారు, అక్కడ చాలా మంది రైతులు అతని పద్ధతులను చూసి డ్రాగన్ ఫ్రూట్ సాగును ప్రారంభించి మంచి లాభాలను పొందారు. ఇప్పుడు, అతను మరొక కొత్త ప్రయోగంగా చియా విత్తనాలను విజయవంతంగా పండిస్తున్నాడు. చియా గింజలు ప్రస్తుతం ఆరోగ్యకరమైన ఆహారాలలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్నాయి. చియా విత్తనాలలో ఫైబర్, ప్రోటీన్ మరియు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండటం వల్ల, వాటిని ఆరోగ్య ఆహారాలు మరియు పానీయాలలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఫలితంగా, ఈ విత్తనాలకు మార్కెట్లో రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ఈ సందర్భంలో, రైతులు సాంప్రదాయ పంటలతో పాటు మార్కెట్ డిమాండ్ ఉన్న కొత్త పంటలను పండించాలని రమేష్ రెడ్డి సూచిస్తున్నారు. తక్కువ నీటి వినియోగం అవసరమయ్యే చియా సాగు రైతులకు లాభదాయకంగా మారే అవకాశం ఉందని ఆయన గుర్తించారు. రమేష్ రెడ్డి చేస్తున్న ఈ ప్రయోగాత్మక వ్యవసాయం స్థానిక రైతులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. చియా పంట సాగు పద్ధతుల గురించి తెలుసుకోవడానికి చాలా మంది రైతులు ఇప్పటికే అతని పొలాన్ని సందర్శిస్తున్నారు.
సమాజంలో రోడ్డు భద్రతను పెంచే ప్రయత్నంలో భాగంగా, ప్రమాదాలను నివారించడానికి కెవి స్కూల్ జంక్షన్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల కృష్ణపూర్ రోడ్ ప్రాంతాలలో కొత్త స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. ఈ కొలత వాహనాల వేగాన్ని నియంత్రిస్తుంది మరియు పాదచారులు మరియు విద్యార్థుల భద్రతను మెరుగుపరుస్తుంది. కొత్త స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు. కెవి స్కూల్ జంక్షన్, కృష్ణపూర్ రోడ్. రోడ్డు ప్రమాదాలను నివారించడం మరియు భద్రతను పెంచడం. స్థానిక నివాసితులు మరియు వాహనదారుల భద్రతను పెంచడానికి ఈ నవీకరణ ఒక ముఖ్యమైన ఝరాసంగం. పోలీస్ స్టేషన్ ఎఫ్ఐ క్రాంతికుమార్ పటేల్ అన్నారు
◆-: రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి
◆-: రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ :పట్టణంలోని 12 వార్డు(గడి)కి చెందిన రవి ఆహ్వానం మేరకు శుక్రవారం నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి పాల్గొన్నారు.వారికి ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారుడు రవి ఘనంగా సన్మానించారు.అనంతరం వారు మాట్లాడుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుంచి అనేక సంక్షేమ పథకాలతో పాటు పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చాలని లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కల నెరవేరుతుందని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శిరీష సురేందర్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి,సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి,12వార్డు ఇంచార్జి ఇనాయత్,కౌన్సిలర్ అరుణ్ కుమార్,14వార్డు ఇంచార్జి రాజ్ కుమార్,నరేష్ బబ్లూ,నర్సింహా యాదవ్,మోహీన్,పవన్ మరియు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు ఇచ్చిన మాటతో ఓడిన ప్రజల మధ్యనే ఉండి సేవ చేస్తాను
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మున్సిపల్ 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వార్డు ఇంచార్జ్ పి. అరవింద్ జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 19 వ వార్డులో పారిశుద్ధ్య లోపంతోని మురికి కాలువలు నిండుకుండ లాగా మారి అందులో విపరీతమైన దోమలు దుర్వాసనలు వెదజల్లుతూ ప్రజా ఆరోగ్యాలకు ఇబ్బంది కలుగుతుంటే అ అవార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అరవింద్ దృష్టికి ప్రజలు తీసుకెళ్లినారు ఇందుకు స్పందించిన అరవింద్ పురపాలక సంఘం అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాడు పరిస్థితి వివరించడంతో వెంటనే స్పందించిన జహీరాబాద్ పరిపాలన సంఘం మున్సిపల్ కమిషనర్ జైతురాం నాయక్ సిబ్బందితో చెప్పి వార్డులో ఉన్న మురికి కాలువలు చెత్తకుప్పలు తొలగించి పిచ్చి త్వరలో మురికి కాలువలలో దోమల మందులను పిచికారి చేస్తామని అదేవిధంగా వీధి కుక్కలు పందులు లేకుండా చూస్తామని వాడి ఇంచార్జ్ అరవింద్ గారికి హామీ ఇచ్చారు ఇందుకు సంతోషించిన 19వ వార్డు ప్రజలు అరవింద్ గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసినారు ప్రజలతో మాట్లాడుతూ అరవింద్ నేనెప్పుడూ ఓడిన గెలిచిన ప్రజల మధ్యనే ఉంటాను మన వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్న నా దృష్టికి తేవాలని నాతో అయినంత వరకు సమస్యలను పరిష్కరిస్తారని నాతో కానీ యెడల ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కచ్చితంగా ప్రజా సమస్యలు తీరేలా చూస్తానని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి ప్రజా ప్రభుత్వమని తెలిపినారు,
మాజీ మంత్రి హరీష్ రావు ను ఖురాన్ తెలుగు అనువాద ప్రతిని అందజేసిన నాజిముద్దీన్ ఘోరీ,
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ ప్రాంతానికి చెందిన జమాతే ఇస్లామీ జిల్లా నాజిమ్, ముహమ్మద్ నాజిముద్దీన్ ఘోరీ,జహీరాబాద్లోని ‘ఘోరీ ప్యాలెస్’లో బి. ఆర్. ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి హరీష్ రావుకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్కు ఖురాన్ తెలుగు అనువాద ప్రతిని అందజేశారు. ఖురాన్ ప్రతిని స్వీకరిస్తూ హరీష్ రావు సంతోషం వ్యక్తం చేశారు; దేశంలో ఇటువంటి ఇఫ్తార్ విందులు ఎంతో అవసరమని పేర్కొంటూ, ప్రపంచంలో శాంతి భద్రతలు నెలకొనేలా ముస్లిం ఉమ్మత్ (ముస్లిం సమాజం) ప్రార్థించాలని ఆకాంక్షించారు.
మైనార్టీల సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం
◆-: కాంగ్రెస్ ప్రభుత్వం తన రెండున్నరేళ్ల పాలనలో మైనార్టీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని హరీశ్ రావు విమర్శించారు.
◆-: వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వమే (బి.ఆర్.ఎస్) మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
◆-: జహీరాబాద్లోని ఒక స్థానిక గౌరీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పార్టీ ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
◆-: తమ ప్రభుత్వ హయాంలో మైనార్టీల కోసం చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ, ప్రస్తుత పాలనపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
కాంగ్రెస్ ప్రభుత్వం తన రెండున్నరేళ్ల పాలనలో మైనారిటీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గురువారం స్థానిక గౌరీ కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన పార్టీ ఇఫ్తార్ విందుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అన్ని కార్యక్రమాలను ఈ ప్రభుత్వం రద్దు చేసిందని, మైనారిటీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన మైనారిటీ గురుకులాలు నేడు మంచి ఫలితాలను ఇస్తున్నప్పటికీ, ఉపాధ్యాయుల కొరత, భవన అద్దె
చెల్లించకపోవడం, ప్రాథమిక సౌకర్యాల కొరత కారణంగా విద్యార్థులు టీసీలు తీసుకొని అనేక మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టళ్లను వదిలి వెళ్తున్నారని, ఇది కాంగ్రెస్ పార్టీ పాలనకు నిదర్శనమని ఆయన అన్నారు. జహీరాబాద్ పట్టణంలో మైనారిటీల కోసం స్మశాన వాటిక, మినీ హజ్ హౌస్, షాదీ ఖానా పనులను తమ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి ప్రారంభించినప్పటికీ, ఈ ప్రభుత్వం ఆ పనులను అకస్మాత్తుగా నిలిపివేసి, నిధులను ఇతర పథకాలకు మళ్లించడం ద్వారా మైనారిటీలను విస్మరిస్తుందని మరోసారి నిరూపించిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్యరావు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శివకుమార్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై.నరోత్తం, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, నామా రవికిరణ్, ఇంటి గౌరి, జియాగౌరి, గోరేమియా సికందర్, యాకూబ్, నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
`”నేటిధాత్రి” లో వచ్చిన కధనం తో దైర్యంగా ముందుకొస్తున్నారు
`వారు ఉమా గౌరీ మూలంగా నరకం అనుభవిస్తున్నామని చెబుతున్నారు?
హైదరాబాద్, నేటిధాత్రి:
ఇది కథ కాదు. సమాజం తలదించుకునే సంఘటన. ఒక మహిళలకు అత్యవసర వైద్యం అందుతున్న వేళ కొంత మంది వచ్చి ఆసుపత్రి మీద దాడి చేస్తే ఎలా వుంటుంది? అదికారిగా వున్న ఓ మహిళ వైద్య పరంగా ఎంత భరోసా నిండేలా వుండాలి. కాని అలాంటి వైద్యాధికారే అత్యవసరం వైద్యం జరుగుతున్న వేళ వైద్యం ఆపేయమని చెప్పి ఆసుపత్రి సీజ్చేస్తే ఎలా వుంటుంది? సరిగ్గా ఆపరేషన్ జరుగుతున్న క్షణంలోనే ఆ వైద్యాదికారి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. వేరే ఆసుపత్రికి పంపించి ఆపరరేషన్ చేయించండి? మేమైతే ఆసుపత్రి మూసేసి వెళ్లిపోతామంటే ఎలా వుంటుంది. ఆ సమయంలో వైద్యం కోసం వచ్చిన మహిళ పరిస్దితి ఎలా వుంటుంది? ఒక్క సారి ఊహించుకోండి. గుండె జల్లుమంటోందా? గుండె జలదరిస్తోందా? గుండె కోతకు గురైనట్లు అనిపిస్తుందా? అలా ఆపరేషన్ అడ్డుకున్న వారి మీద కోపం వస్తోందా? సరిగ్గా ఇలాంటి ఘటనే సినిమాలో జరిగితే అందరూ కంట పెట్టుకుంటారు. కాని నిజంగా ఇలాంటి ఘటన జరుగుతుంటే జనం చోద్యం చూశారు. నేరెడ్ మెట్లో సరిగ్గా మహిళా దినోత్సవాలు దేశమంతా జరుగుపుకుంటున్న రోజు జరిగింది. నేరెడ్ మెట్లో స్రవంతి అనే ఆసుపత్రి వుంది. ఆ ఆసుపత్రికి ఓ మహిళ రక్త స్రావంతో వచ్చింది. పైగా గర్భిణీ. ఆమెకు వెంటనే వైద్యం చేయాలి. లేకుంటే ఆమె ప్రాణాలకే ప్రమాదం. వెంటనే ఆ ఆసుపత్రి వైద్యురాలు స్రవంతి గాదిరాజు ఆపరేషన్కు అవసరమైన అన్ని ముఖ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. వైద్యం చేయాల్సిన మహిళను కూడా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. ఇక ఆపరేషన్ చేసే సమయం ఆసన్నమైంది. వైద్యురాలు స్రవంతి గాదిరాజు కూడా ఆ ఆపరేషన్ ధియేటర్లోకి వెళ్లింది. ఇంతలో ఆసుపత్రిలోకి కొంత మంది వచ్చారు. ఆపరేషన్ ధియేటర్ వరకు వచ్చారు. వైద్యురాలు స్రవంతిని బైటకు రమ్మని పిలుస్తున్నారు. ఆ వైద్యురాలు స్రవంతికి ఏమీ అర్దం కాలేదు. ఆపరేషన్ చేయాల్సిన సమయంలో బైట ఏం జరుగుతుందో అర్దం కాక వెంటనే వైద్యురాలు స్రవంతి బైటకు వచ్చారు. అంతే ఆసుపత్రిని సీజ్ చేస్తున్నామంటూ ఓ మాట వినపడింది. ఆ మాట చెప్పింది ఎవరో కాదు..ఆ జిల్లా డిఎమఅండ్హెచఓ ఉమా గౌరీ. మేడమ్ అర్జంట్గా పేషెంట్కు వైద్యం అందించాలి. లేకుంటే ప్రాణాలకే ప్రమాదం. ఆపరేషన్ కోసం అన్ని సిద్దం చేసుకున్నాం. ఆ మహిళలకు బ్లీడింగ్ అవుతోంది. ఏ మాత్రం ఆలస్యం చేసినా ప్రాణాల మీదకు వస్తుందని ఆ వైద్యురాలు స్రవంతి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా డిఎంఅండ్హెచఓ ఆ మాటలు వినేందుకు సిద్దంగా లేరు. అసలు వైద్యురాలు స్రవంతి మాటలు పట్టించుకోలేదు. వెంటనే ఆసుపత్రిని ఖాళీ చేయండి. ఆసుపత్రిలో వున్నవారిని వెంటనే బైటకు పంపేయండి అంటూ ఉమాగౌరీ అనుచరులకు ఆదేశాలు జారీ చేస్తోంది. మేడం ఒక్క అరగంట సమయం ఇవ్వండి. ఆపరేషన్ పూర్తి చేసిన తర్వాత మీరు ఎలా చెబితే అలా వింటాం అని వైద్యురాలు స్రవంతి వేడుకున్నారు. అయినా డిఎంఅండ్హెచఓ ఉమాగౌరీ ససేమిరా అన్నారు. ఉన్న ఫలంగా ఆసుపత్రిని సీజ్ చేయాల్సిందే అని ఆర్డర్ వేస్తున్నారు. పాపం మహిళ ప్రాణం మేడం అంటూ వైద్యురాలు స్రవంతి ప్రాదేయ పడింది. కాని ఫలితం లేకపోయింది. నేను మహిళను కాదా? నాకు వైద్యం తెలియదా? అంటూ డిఎంఅండ్ హెచఓ ఉమాగౌరీ హూంకరించారు. నేను చెప్పింది చేయండి? లేకుంటే తీవ్ర పరిణామాలు వుంటాయని ఉమాగౌరీ ఆ ఆసుపత్రి వైద్యురాలు స్రవంతిని బెదిరించారు. ఇంతలో వైద్యం అందాల్సిన మహిళ భర్త ఉమాగౌరీని వేడుకున్నారు. ఆమె కాళ్ల మీద పడ్డాడు. అయినా ఉమాగౌరీ కనికరం చూపలేదు. కనీసం మానవత్వంతో కూడా ఆలోచించలేదు. ఎట్టిపరిస్దితుల్లో ఇప్ప్పుడు ఇక్కడ వైద్యం చేయడానికి వీలు లేదు. వెంటనే ఆసుపత్రిని సీజ్ చేయాల్సిందే అని పట్టుబట్టారు. ఆపరేషన్ ధియేటర్లో సీరియన్ కండీషన్తో వున్న మహిళ పరిస్దితి ఏమిటి? మేడం అని ఆ వైద్యురాలు ప్రశ్నించింది. వెంటనే గాందీ ఆసుప్రతికి తరలించండి. అక్కడికి నేను ఫోన్ చేసి చెబుతాను. అక్కడ ఆపరేషన్ చేస్తారు. క్విక్ అంటూ ఉమాగౌరీ హడావుడి చేశారు. గాంధీ ఆసుపత్రికి తరలించే లోపు ఏదైనా జరగరానిది జరిగిదే బాద్యత ఎవరిది? మేడం అని వైద్యురాలు అంటే అదంతా నాకు అనవసరం అంటూ తన అనుచరులకు ఉమాగౌరీ ఉసిగొల్పింది. చివరికి చేసేదేమీ లేక వైద్యురాలు ఆ చికిత్స అందించాల్సిన మహిళను ఆ సమీపంలో వున్న మరో ఆసుపత్రికి హుటాహుటిన తరలించి వైద్యం అందించారు. ఆసుపత్రిని నమ్ముకొని వచ్చిన ఆ మహిళను కాపాడారు. నిజం చెప్పాలంటే అదే ఆసుపత్రిలో ఉమాగౌరీ చేసిన హడావుడి చేసిన సమయంలోనే ఆపరేషన్ పూర్తయ్యేది. కాని కనికరం లేకుండా మహిళ ప్రాణంకూడా లెక్క చేయకుండా ఉమాగౌరీ చేసిన నిర్వాకం వల్ల నిండు ప్రాణం పోయేది. అయినా ఆమెలో కనీసం పశ్చాత్తాపం లేదు. తాను అనుకున్నట్లే చేశారు. ఆసుపత్రిని సీజ్ చేసి వెళ్లిపోయారు. అసలు డిఎంఅండ్హెచఓ విధులేమిటి? ఏ ప్రభుత్వ ఆసుపత్రి అయినా, ప్రైవేటు ఆసుపత్రి అయినా అనధికారికంగా నడుస్తుందా? చూసుకోవాలి. అలాంటి ఆసుపత్రుల్లో నిజమైన డాÅ£్టర్లు పనిచేస్తున్నారా? లేక నకిలీలున్నారా? ఆసుపత్రుల్లో సరైన వైద్య సదుపాయలు వున్నాయా? అనేది చూడాలి. ఆ ఆసుపత్రికి ఫైర్ సేఫ్టీ వుందా చూసుకోవాలి. ఆ ఆసుపత్రుల్లో నకిలీ మందులు అమ్ముతున్నారా? చూడాలి. వైద్యం కోసం వచ్చిన వారికి ఎలాంటి మందులు ఇస్తున్నారో చూడాలి. నిర్ణీత గడువు పూర్తయిన మందులు అమ్ముతున్నారో చెక్ చేయాలి. ఆసుపత్రి యజమాన్యాలు వైద్యం కోసం వచ్చిన వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారో చూడాలి. వారికి ఇష్టాను సారం బిల్లులు వేసి వేధిస్తున్నారో చూసుకోవాలి. లేదా ఆసుపత్రుల్లో ఏదైనా అనైతిక కార్యక్రమాలు జరుగుతున్నాయా? చెక్ చేయాలి. ఇదీ ఉమాగౌరీ చేయాల్సిన డ్యూటీ. కాని ఆ పని వదిలేసి స్రవంతి ఆసుపత్రికి, ఆ బిల్డింగ్ లీజుకు ఇచ్చిన వ్యక్తికి మధ్య ఏదో చిన్న వివాదం నడుస్తోంది. ఈశా అసుపత్రికి అనబంధంగా నడుస్తున్న స్రవంతి ఆసుపత్రి వైద్య సేవలు అందిస్తోంది. ఈశా ఆసుపత్రికి సంబంధించిన గడువు ముగిసింది అనే నెపంతో స్రవంతి ఆసుపత్రిని ఉన్న ఫలంగా మూసేందుకు ఉమా గౌరీ వచ్చారు. అసలు ఈశా ఆసుపత్రికి యూనిట్గా సాగుతున్న స్రవంతి ఆసుపత్రికి ఉమా గౌరీ కార్యాలయం నుంచి ఎలాంటి నోటీస్ రాలేదు. కనీసం ముందస్తు హెచ్చరిక కూడా లేదు. ముందే చెప్పి ఆసుపత్రి ఖాళీ చేయాలంటే స్రవంతి ఆసుపత్రి నిర్వాహకులు ఖాళీచేసేవారు. కాని ఇలా దౌర్జన్యంగా ఆసుపత్రిని మూసి వేయించాల్సిన అవసరం లేదు. ఉమా గౌరీ తన కార్యాలయంలో కూర్చొని ఆర్డర్ వేస్తే చాలు. ముందస్తు నోటీసు ఎలాంటిది లేకుండా వచ్చి, ఉన్న ఫలంగా ఆసుపత్రిని సీజ్చేశారు. నిజానికి వైద్యం పేరుతో ఏదైనా ఆసుపత్రిలో రోగులకు అన్యాయం జరిగితే ఉన్న ఫలంగా ఆసుపత్రిని మూసేయడాన్ని ఎవరూ తప్ప్పు పట్టరు. కాని ఎలాంటి వివాదాలు లేని ఆసుపత్రిని ఉన్న ఫలంగా ఏదో కొంపలు మునిగిపోయినట్లు వచ్చి ఆసుపత్రిని సీజ్ చేయాల్సిన అవరం లేదు. అందులోనూ మహిళా దినోత్సవ వేడుÅ£లు డిఎంఅండ్హెచఓ ఆధ్వర్యంలో సాగాల్సిన రోజున, ఆ కార్యక్రమాలు పక్కన పెట్టి మరీ ఆసుపత్రికి వచ్చిన సీజ్ చేయాల్సిన అవసరం అసలే లేదు. ఒక మహిళా ఉన్నతాధికారిగా వుండి మహిళలకు అత్యవసర వైద్యం అందాల్సిన సమయంలో క్షణాల మీద ఆసుపత్రిని సీజ్ చేయడం దుర్మార్గం కాదా? ఇలా ఆసుపత్రులను ఇబ్బంది పెట్టడం ఉమాగౌరీకి కొత్తకాదని చాల మంది ఆసుపత్రి వర్గాలు తెలియజేస్తున్నాయి. నేటిధాత్రిలో ఓ కథనం వచ్చింది. దాన్ని చూసిన అనేక ప్రైవేటు ఆసుపత్రులు నేటిధాత్రికి ఫోన్ చేస్తున్నారు. వారికి జరిగిన అన్యాయాలను వివరిస్తున్నారు. ఉమా గౌరీ మూలంగా పడుతున్న ఇబ్బందులను చెబుతున్నారు. ఆసుపత్రుల నిర్వాహకులు నరకం చూస్తున్నామని అంటున్నారు. ఎలాంటి తప్ప్పులు లేకున్నా లంచాల కోసం ఆమె పీడిస్తోందని తెలియజేస్తున్నారు. తమను వేదిస్తోందని అంటున్నారు. అడిగినంత ఇవ్వకపోతే ఏకంగా ఆసుపత్రులు సీజ్ చేస్తున్నారని అంటున్నారు. ఇలా తెలంగాణలో చాలా మంది డిఎంఅండ్హెచఓ వ్యవహరిస్తున్నట్లు తెలంగాణ వ్యాప్తంగా ఆసుపత్రి యాజమాన్యాలు నేటిధాత్రి దష్టికి తీసుకొస్తున్నారు. అలాంటి వారి ఆడగాలు ఇక నేటిధాత్రిలో వరస కథనాలు.!
వినియోగదారులు ఆన్ లైన్ లో మాత్రమే సిలిండర్ బుక్ చేసుకోవాలి
జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రావు
మంచిర్యాల,నేటి ధాత్రి:
గ్యాస్ వినియోగదారులు ఆన్ లైన్ లో మాత్రమే సిలిండర్లను బుక్ చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రావు తెలిపారు.గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా అదనపు కలెక్టర్ ఛాంబర్ లో ఎల్ పి జి డీలర్లతో అత్యవసర సమావేశం నిర్వహించి గ్యాస్ కంపెనీల సేల్స్ అధికారులతో ఫోన్ ద్వారా సమావేశమయ్యారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో గృహ అవసరాల కోసం వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీలు,గోదాముల వద్దకు వెళ్లకుండా ఆన్ లైన్ లో మాత్రమే సిలిండర్లను బుక్ చేసుకోవాలని తెలిపారు.గ్యాస్ బుకింగ్ సమయం సింగిల్ సిలిండర్ వారికి 25 రోజులు,డబుల్ సిలిండర్ వారికి 30 రోజుల వ్యవధి ఉంటుందని తెలిపారు.గ్యాస్ డెలివరీ చేసే సమయంలో వినియోగదారులు డెలివరీ బాయ్ కు ఓ టి పి చెప్పి సహకరించాలని, హోటల్,రెస్టారెంట్లలో వాణిజ్య సిలిండర్ మాత్రమే ఉపయోగించాలని,నిబంధనలకు విరుద్ధంగా డొమెస్టిక్ సిలిండర్లు ఉపయోగించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.గ్యాస్ సిలిండర్ల విషయంలో ఎవరైనా కృత్రిమ కొరతను సృష్టించి,బ్లాక్ మార్కెట్ లో సిలిండర్లను విక్రయించాలని చూస్తే నిత్యవసరల సరుకుల చట్టం 1955 క్రింద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఎల్ పి జి వినియోగదారులు కె వై సి తప్పనిసరిగా చేసుకోవాలని, గ్యాస్ ఏజెన్సీ ల వద్ద,ఆన్ లైన్, గ్యాస్ కంపెనీ అధికారిక వెబ్సైట్, యాప్ లో,గ్యాస్ సిలిండర్ పంపిణీ సమయంలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల వద్ద పూర్తి చేసుకోవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పండగలు మాత సామరస్యాలకు అతితంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మాజీ సర్పంచ్ ఎద్దు నగేష్ యాదవ్ అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా గురువారం తుంకుంట లోని అక్సా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మహబూబ్ జానీ తో కలసి మున్సిపల్ సిబ్బందికి, పేద ప్రజలకు రంజాన్ రేషన్ కిట్లను, బట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పవిత్ర మాసమైనా రంజాన్ పండగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోటివేషనల్ స్పీకర్ అబ్దుల్ రెహమాన్, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, కృష్ణారెడ్డి, ఈశ్వర్ గౌడ్, రాజు యాదవ్, మధుసూదన్ రెడ్డి, దావూదీయ మస్జిద్ అధ్యక్షుడు బాబా, కమిటీ సభ్యులు మహమ్మద్ ముదస్సిర్ కైరా ఫౌండేషన్ చైర్మన్ వచ్చారు. ఈ కార్యక్రమంలో 150 మంది పేదలకు, మున్సిపల్ సిబ్బందికి రేషన్ కిట్లను, చీరలను పంపిణీ చేశారు.
కరెంట్ ఎప్పుడు వస్తుందో.. పోతుందో తెలియని పరిస్థితి
జహీరాబాద్ నేటి ధాత్రి:
మాజీ మంత్రి హరీష్ రావు గురువారం కోహిర్ సబ్ స్టేషన్ లో రికార్డులను పరిశీలించి, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పంటలకు కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 24 గంటల పాటు పంటలకు విద్యుత్ అందేదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్యరావు కూడా పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పార్టీ భూస్థాపితం అయిపోయిందని వనపర్తి ఎమ్మెల్యే మేగారెడ్డి అన్నా రు భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ ని చేసేంతవరకు ఉశ్రమంచకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేయాలని ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలకు సూచించారు కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం కోసం గ్రామస్థాయి నుంచి పార్టీని పట్టిష్టపరిచేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టిందని గ్రామ కమిటీలు మండల కమిటీలు అనుబంధ సంఘాల కమిటీలను ఏర్పాటు చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్క కార్యకర్త కు సమచిత స్థానం లభిస్తోందని ఎమ్మెల్యే చెప్పారు _ మున్సిపల్ చైర్మన్లుగా వైస్ చైర్మన్గా, కౌన్సిలర్లుగా, వార్డు సభ్యులుగా, సర్పంచులుగా, ఉపసర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జడ్పిటిసిలుగా ,జడ్పీ చైర్పర్సన్లుగా, సింగిల్ విండో అధ్యక్షులు గా _మార్కెట్ యార్డ్ అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా, డైరెక్టర్లుగా , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా, ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనారిటీ అనుబంధ సంఘాల అధ్యక్షులుగా ,మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ,వ్యవసాయ అనుబంధ సంఘాల్లో బాధ్యులుగా, కాంగ్రెస్ పార్టీ పరమైన కమిటీలలో గ్రామ అధ్యక్షులుగా, మండల అధ్యక్షులుగా, బూత్ అధ్యక్షులుగా, కమిటీలోని ఇతరత్రా బాధ్యత లాంటి అనేక విభాగాల్లో పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుందని ఎవరు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే చెప్పారు కాంగ్రెస్ పార్టీ నేడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఇల్లు లేని నిరుపేదలకు 5 లక్షల రూపాయల విలువలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ o వనపర్తి పట్టణంలో 50 కోట్ల రూపాయలతో 33 వార్డుల్లో సీసీ రహదారుల నిర్మాణం 70 కోట్ల రూపాయలతో కరెంట్ సమస్యల పరిష్కారం*_ 70 కోట్ల రూపాయలతో అమృత్ స్కీం ద్వారా తాగునీటికి సంబంధించిన ఈ విధంగా కనులను చేపట్యాం*_ 50 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణం చేపట్టాం*200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం250 ఒక్క రూపాయలతో 500 బెడ్ల హాస్పిటల్ నిర్మాణం*81 కోట్ల రూపాయలతో కోర్టు బిల్డింగ్ నిర్మాణం 50 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి విద్యాభ్యాసం చేసిన పాఠశాలను అధునాతనంగా నిర్మించుకోవడం*ఐటీ టవర్, బైపాస్ రోడ్డు, కేంద్రీయ విద్యాలయం, పట్టణానికి రింగ్ రోడ్డు నిర్మాణం, పంచాయతీ రాజ్ రోడ్ల నిర్మాణం, జిల్లా పరిషత్ రోడ్ల నిర్మాణం, చర్చిలు, ఆలయాలు లాంటి అనేక వాటి అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు మహిళల అభ్యున్నతి కోసం ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ఆర్టీసీ బస్సుల కొనుగోలు, వడ్డీ లేని రుణాలు, మహిళా క్యాంటీన్లు, విద్యార్థులకు బట్టల తయారీ,డీజిల్ బంకులు, సోలార్ ప్లాంట్ లో ఏర్పాటు రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీకేవలం వనపర్తి నియోజకవర్గంకు మాత్రమే 32వేల రేషన్ కార్డులు ఇచ్చామని ఎమ్మెల్యే తెలిపారు రైతు భరోసా, రైతు బీమా సన్న వడ్లకు బోనస్, సబ్సిడీపై రైతులకు వ్యవసాయ పనిముట్ల పంపిణీ లాంటి ఎన్నో పథకాలు చేపట్టింది ఎమ్మెల్యే సూచించా రు
గుండంపల్లి గ్రామంలో పశువులకు ఉచిత గాలికుంటు నివారణ టీకాలు మల్లాపూర్ మార్చి 12 నేటి దాత్రి
ప్రాథమిక పశు వైద్యశాల ముత్యంపేటకు చెందిన డాక్టర్ అశోక్ ఆధ్వర్యంలో గుండంపల్లి గ్రామంలో పశువులకు ఉచిత గాలికుంటు నివారణ టీకాలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గో జాతి పశువులు 10 మరియు గేదె జాతి పశువులు 121 కలిపి మొత్తం 131 పశువులకు టీకాలు వేయబడినవి. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్ డప్పుల పద్మా నరసయ్య పశు వైద్య సిబ్బంది డాక్టర్ జి. అశోక్ జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ ఇక్బాల్ అలాగే పశు వైద్య సిబ్బంది మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు. ఈ టీకా కార్యక్రమం ద్వారా గ్రామంలోని పశువులను గాలికుంటు వ్యాధి నుంచి రక్షించడానికి చర్యలు తీసుకున్నారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బాయ్స్ హై స్కూల్లో కార్యక్రమం మెట్ పల్లి మార్చి 12 నేటి దాత్రి
మెట్ పల్లి పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగం గా ఏడవ రోజు కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని ఒకటో వార్డు బాయ్స్ హైస్కూల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ కుమార్ కౌన్సిలర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేత ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం త్వరలో జరగబోయే పదవ తరగతి బోర్డు పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు పలు సలహాలు, సూచనలు అందించారు. అలాగే విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, హాల్ టికెట్లను మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ కుమార్, కౌన్సిలర్లు పంపిణీ చేశారు. కార్యక్రమం సందర్భంగా పాఠశాలలో ఉన్న మరుగుదొడ్లు సరిగా లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పాఠశాల సిబ్బంది తెలియజేశారు. దీనిపై స్పందించిన మున్సిపల్ చైర్మన్ వెంటనే సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా పాఠశాలలో ఉన్న భోజనశాలను కూడా మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు పరిశీలించారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.