బాధిత కుటుంబానికి అండగా ఉంటామని శాసనసభ్యులు మాణిక్ రావు …

బాధిత కుటుంబానికి అండగా ఉంటామని శాసనసభ్యులు మాణిక్ రావు …

జహీరాబాద్ నీటి ధాత్రి:

 

జహీరాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని రాచన్నపేట్ లో నివాసముండే అప్పం రజిత బతుకు తెరువు కోసం తన ఇరువురు పిల్లలతో హైదరాబాదులోని బోరబండా ప్రాంతంలో ఉంటున్నారు కుమారుడు నందకిషోర్(14 సంవత్సరాలు) గత వారం రోజుల క్రితం గాలిపటం ఎగరవేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లకు గాలిపటం చిక్కుకోవడంతో విద్యుత్ షాక్ వచ్చి ఎక్కువ మొత్తంలో శరీరం కాలిపోయి ఆసుపత్రిలో నాలుగు రోజులు చికిత్స పొంది రెండు రోజుల క్రితం మృతి చెందడం జరిగింది శాసనసభ్యులు మాణిక్ రావు రాచన్నపేట్ లోని వారి ఇంటికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును కుటుంబ సభ్యులతో అడిగి తెలుసుకున్నారుకుటుంబ సభ్యులతో మాట్లాడుతూ అధైర్యపడొడ్డు అండగా ఉంటాం అని భరోసా కల్పించారు తల్లి జీవన ఆధారం కొరకు తమ వంతు సాయం చేస్తాం అని అన్నారు
ఎమ్మెల్యే పాటుగా మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం, సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, ఆర్ సుభాష్ ,స్థానిక నాయకులు నందు గౌడ్, తులసి మక్కని తదితరులు ఉన్నారు,

అడ్డా లేక ఆగమగుతున్న ఆటో డ్రైవర్లు.

అడ్డా లేక ఆగమగుతున్న ఆటో డ్రైవర్లు.???
ఐలోని మల్లికార్జున స్వామి ఆలయంలో ఆటో స్టాండ్ ఖాళీ చేయించిన పోలీసులు
అసలే ఉచిత బస్సుతో డీలాపడ్డ ఆటో డ్రైవర్ల బతుకులు
మండలంలో మల్లికార్జున స్వామి జాతరే వారికి దిక్కు
జాతర లోపలికి లోకల్ ఆటోలను సైతం అనుమతించని పోలీసులు
తమ బతుకుదెరువుపై దెబ్బ కొట్టొద్దని వేడుకున్నా కనికరించని పోలీసులు
భక్తుల సౌకర్యం, భద్రతతో పాటు, స్థానిక పేద కార్మికుల జీవనాధారం ముఖ్యమే.
జాతర నిర్వహణ పేరుతో పేదల బతుకులపై బండలు వేస్తారా??
ఇన్నేళ్లు సజావుగా సాగినా ఇప్పుడే ఎందుకు ఈ కిరికిరి???

నేటి ధాత్రి అయినవోలు :-

 

ఐలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం చుట్టూ ఈసారి జాతర వాతావరణం కంటే ఆటో డ్రైవర్ల ఆవేదనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి సజావుగా సాగిన ఆటో వ్యవస్థను ఒక్కసారిగా తుడిచిపెట్టినట్లుగా పోలీసులు తీసుకున్న నిర్ణయాలు స్థానిక ఆటో డ్రైవర్ల బతుకుదెరువును ప్రశ్నార్థకంగా మార్చాయి.ఆలయం పరిసరాల్లో ఉన్న ఆటో స్టాండ్‌ను ఖాళీ చేయిస్తూ, లోకల్ ఆటోలను జాతర ప్రాంగణంలోకి అనుమతించబోమంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేయడంతో డ్రైవర్లు అడ్డా లేకుండా అల్లాడిపోతున్నారు. అసలే ఉచిత బస్సుల విధానంతో ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయిన వేళ, ఏడాదిలో ఒక్కసారైనా మల్లికార్జున స్వామి జాతరే తమకు దిక్కు అనుకున్న ఆటో డ్రైవర్లకు ఇది తీరని దెబ్బగా మారింది.జాతర సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం నిజమే. కానీ అదే పేరుతో స్థానిక ఆటోలను పూర్తిగా పక్కన పెట్టడం ఎంతవరకు న్యాయం అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నేళ్లుగా ఎలాంటి అవాంతరాలు లేకుండా, ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా ఆటోలు నడిచినప్పుడు, ఇప్పుడే ఎందుకు ఈ కిరికిరి అన్న అనుమానాలువ్యక్తమవుతున్నాయి
“మా బతుకుదెరువుపై దెబ్బ కొట్టొద్దు… కనీసం జాతర రోజుల్లో అయినా మాకు ఉపాధి దొరికేలా చూడండి” అంటూ ఆటో డ్రైవర్లు వేడుకుంటున్నా, పోలీసులు మాత్రం కనికరించని వైఖరి ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల భద్రత పేరుతో తీసుకునే నిర్ణయాలు ప్రజల ఉపాధిని హరించేలా ఉంటే, అది పాలన వైఫల్యంగానే పరిగణించాల్సి ఉంటుంది.
జాతర నిర్వహణకు క్రమశిక్షణ అవసరం. ట్రాఫిక్ నియంత్రణ తప్పనిసరి. కానీ దానికి పరిష్కారం స్థానికుల జీవనాధారాలను మూసివేయడం కాదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా, ఆటో స్టాండ్‌ను ఖాళీ చేయించి, లోకల్ ఆటోలను నిషేధించడం పోలీసు యంత్రాంగం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంగా మారిందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.భక్తుల సౌకర్యం, భద్రతతో పాటు, స్థానిక పేద కార్మికుల జీవనాధారాన్ని కూడా సమానంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానిది. అసలే ఉపాధి లేక చీటికి చినిగిపోయిన ఆటో డ్రైవర్ల బతుకులపై ఈ భారం పడకుండా స్థానిక ఎమ్మెల్యే నాగరాజ్ చొరవ తీసుకోవాలి.లేదంటే “జాతర” పేరు చెప్పుకుని “ పేద ప్రజల బతుకులపై బండలు వేసిన” చరిత్రగా ఈ నిర్ణయం మిగిలిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

సంక్రాంతి పండుగకు ఊరు వెళ్తున్నారా .. జాగ్రత్తలు పాటించండి….

సంక్రాంతి పండుగకు ఊరు వెళ్తున్నారా .. జాగ్రత్తలు పాటించండి.

బాలానగర్ ఎస్సై లెనిన్.

బాలానగర్ /నేటి ధాత్రి

 

 

రానున్న సంక్రాంతి పండగ పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని ప్రజలు ఊరెళ్ళితే తమ ఇంటిని సురక్షితంగా ఉంచుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని బాలానగర్ ఎస్సై లెనిన్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఇంటికి తాళం వేసే ముందు తలుపులు, కిటికీలు బలంగా మూసివేయాలన్నారు. ఇంట్లోనే నగదును, బంగారం, వెండి నమ్మకమైన వ్యక్తుల వద్ద భద్రపరచాలన్నారు. రాత్రి వేళలో ఇంటిముందు లైట్లు వెలిగించాలని, “పండగకి ఊరికి వెళ్తున్నాం” అని సోషల్ మీడియాలో పెట్టకూడదన్నారు. ఇంటిముందు చెట్ల పొదలు ఉంచరాదన్నారు. ఇంటికి కాపలా వాచ్ మెన్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. తమ ఇంటి తాళాలను పూల కుండీలలో, మ్యాట్ కింద భద్రపరచరాదన్నారు. పొరుగింటి వారికి తమ ఇంటిపై నిఘా పెట్టాలని సూచనలు ఇవ్వాలన్నారు. అద్దె ఉన్న యజమానులు ఖాళీగా ఉన్న ఇండ్లపై నిగా పెట్టాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

పార్థివదేహానికి నివాళాలు అర్పించిన ఎమ్మెల్యే….

పార్థివదేహానికి నివాళాలు అర్పించిన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని పాండురంగా వీధి కి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు కోట్రీకె చంద్రశేఖర్ గారి తల్లి పద్మావతి మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు వారి నివాసానికి చేరుకొని పార్థివదేహానికి నివాళాలు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఎమ్మెల్యే గారితో పాటుగా మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం,సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,నాయకులు ఆర్ సుభాష్, జాహెద్,నాగరాజ్ ,మహిళ నాయకురాలు పద్మజ తదితరులు ఉన్నారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పొత్తి పాశురం దీపోత్సవం….

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పొత్తి పాశురం దీపోత్సవం

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గురువారం నాడు పొత్తి పాశురం శ్రీ స్వామివారికి దీపోత్సవం మంగళ హారతులు ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆలయ చైర్మన్ ధర్మకర్త అయ్యలూరి రఘునాథం చార్యులు పురోహితులు శ్రీ ఉత్సవ్ ఒక ప్రకటనలో తెలిపారు పూలమాల గోదాదేవి అమ్మవారి సేవలో 33 వ వార్డు మాజీ కౌన్సిలర్ ఉoగుళం తిరుమల్ అలేఖ్య దంపతులు మారం విజయ్ దంపతులు శ్రీను దంపతులు పాల్గొన్నారు పొత్తి పాశురం స్వామి వారి దగ్గర స్వామివారి అలంకరణతో ముగ్గును శ్రీమతి అంగడి లావణ్య వేశారని 33 వ వార్డు మాజీ కౌన్సిలర్ తిరుమల్ తెలిపారు ఈ పూజా కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీమతి అలేఖ్య తిరుమల్ అంగడి నరేందర్ రాజేశ్వరి నర్మదా సరస్వతి లగిశెట్టి సాయి ప్రసాద్ కట్ట సుబ్బయ్య కృష్ణమోహన్ శ్రీదర్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

జాతీయ స్థాయికి క్రీడా పోటీలకు ఎంపిక- పిడి గుండెల్లి రాజయ్య…

జాతీయ స్థాయికి క్రీడా పోటీలకు ఎంపిక– పిడి గుండెల్లి రాజయ్య
మొగులపల్లి నేటి దాత్రి

 

ఇటీవల అనగా 30 డిసెంబర్ 2025 నుండి 1 జనవరి 2026 వరకు మహబూబాబాద్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 44వ రాష్ట్రస్థాయి సీనియర్
షూటింగ్ బాల్ సెలక్షన్” కం” టోర్నమెంట్ క్రీడా పోటీలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా తరఫున జడ్పీహెచ్ఎస్ మొగుళ్ళపల్లి పాఠశాల నుండి నలుగురు క్రీడాకారులు పాల్గొనగా మునిగాల అర్జిత్ కుమార్ (10 వ) జాతీయ స్థాయికి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల పిడి గుండెల్లి రాజయ్య తెలిపారు. ఈ క్రీడా పోటీలు 9 జనవరి 2026 నుండి11 జనవరి 2026 వరకు మహారాష్ట్రలోని సోలాపూర్ లో జరుగుతాయని, తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున అర్జిత్ కుమార్ ఆడతారని తెలిపారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు జిల్లా విద్య పర్యవేక్షణ అధికారి విజయ పాల్ రెడ్డి మరియు ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి భాగ్యశ్రీ, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు అర్జిత్ కుమార్ ను అభినందించారు.
ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చేసి అభినందించారు
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయురాలు , శ్రీమతి భాగ్యశ్రీ , ఉపాధ్యాయులు
టి.వెంకన్న, వై. సురేందర్,
జి. అనిల్ కుమార్,ఏ.వి.ఎల్ కళ్యాణి, బి.కుమారస్వామి,
కె. ప్రవీణ్, ఎం. రాజు, డి.పద్మ,పి. లలిత, జి.విజయ భాస్కర్,శ్రీ కల,
ఆర్. చందర్, శ్రీనివాస్,అటెండర్ ఎండి మజార్,వేణు,పాల్గొన్నారు

యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంచాలనే సంకల్పంతో సీఎం కప్….

యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంచాలనే సంకల్పంతో సీఎం కప్

– భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలో క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంచాలనే సంకల్పంతో సీఎం కప్ 2025 – 26 ఏర్పాటు చేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే జీఎస్సార్ సీఎం కప్ క్రీడాజ్యోతిని వెలిగించి ర్యాలీని ప్రారంభించి, విద్యార్థులతో కలిసి కొద్దిదూరం ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. గ్రామాల్లో ప్రతి క్రీడాకారుడిని రాష్ట్రస్థాయి వేదిక వరకు తీసుకెళ్లడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎంకు ద్వారా క్రీడలను జీవితంగా మార్చుకునే అవకాశాన్ని యువతకు అందిస్తామన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రతిభ ఉన్న క్రీడాకారుల భవిష్యత్తు వృధా కాకూడదని, యువత క్రీడల్లో ముందుకు రావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించిన అధికారులు…

రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించిన అధికారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కొహిర్ మండలం దిగ్వాల్ లోని జిల్లా పరిషత్ తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల- న్యాలకల్ (TGSWRS) లో రోడ్డు భద్రతా మాసంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోహిర్ ఎస్ఐ నరేష్, డెక్కన్ టోల్ ప్లాజా సేఫ్టీ మేనేజర్ నాగరాజు విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల కారణాలు, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను వివరించారు. పాఠశాల ఉపాధ్యాయులు, డెక్కన్ టోల్ ప్లాజా సిబ్బంది పాల్గొన్నారు.

మాదన్నపేట రోడ్డుకు మహార్దశ..

మాదన్నపేట రోడ్డుకు మహార్దశ

60 ఫీట్ల రోడ్డు సింగిల్ డివైడర్ తో వెడెల్పు పనులు ప్రారంభం

రోడ్డు వెడల్పులో పాల్గొన్న టౌన్ ప్లానింగ్, ఆర్ అండ్ బి అధికారులు

రోడ్డు వెడల్పు నిర్మాణం పనులు ఆపేందుకు కోర్టు మెట్లు ఎక్కనున్న దుకాణాల యజమాన్యం?

అందరికీ ఒకే విధమైన న్యాయం జరగాలి..ప్రజల డిమాండ్..

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో
ఏండ్ల తరబడి సమస్యల వలయంలో ఉన్న మాదన్నపేట రోడ్డు వెడల్పుకు మహార్దశ వచ్చింది.రోడ్డు వెడల్పు కోసం సంబంధిత మున్సిపల్, రోడ్ల భవనాల శాఖ అధికారులు మార్కింగ్ వేసిన రోజే… ఆ రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని నిలుపుదల చేసేందుకు కొందరు వ్యాపారులు కోర్టుమెట్లు ఎక్కడ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం?.
వరంగల్ జిల్లాలో అత్యంత ముఖ్యమైన మున్సిపాలిటీ నర్సంపేట కావడం ఇక్కడ అన్ని విధాల వ్యాపారాలు

జోరుగా సాగుతున్నాయి.ఈ క్రమంలో నర్సంపేట మున్సిపాలిటీ అప్ గ్రేడ్ చేస్తూ ఇటీవల నర్సంపేట చుట్టూ రూరల్ 8 గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసి జిల్లాలోని అతిపెద్ద మున్సిపాలిటీగా అవతరించింది. నర్సంపేట పట్టణంలోనీ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మాదన్నపేట రోడ్డు గతంలో పాత బస్టాండ్ గా
పిలువబడుతున్నది.

ఈ రోడ్డు ప్రధాన రహదారి కావడం ఇరుకుగా ఉండడంతో గత కెసిఆర్ ప్రభుత్వ హాయంలో ఆనాటి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆ రోడ్డుకు ఇరువైపులో ఉన్న వ్యాపారస్తులతో సమీక్ష చేసి రోడ్డు వెడల్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.కానీ కొన్ని అనివార్య కారణాల వలన అయితే ఇటీవల

నాగూర్లపల్లె,మాదన్నపేట గ్రామాలు నర్సంపేట మున్సిపాలిటీలో కలవడంతో రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు పోలీస్ స్టేషన్ ఎదురుగా నుండి మాదన్నపేట వరకు 60 ఫీట్ల రోడ్డు సింగిల్ డివైడర్ తో నిర్మాణం చేసేందుకు సంబంధిత అధికారులు ప్రతిపాదనలు పూర్తి చేశారు.అలాగే ఇటీవల స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట నుండి మాదన్నపేట మీదుగా నల్లబెల్లి మండలం వరకు 10 మీటర్ల తారు రోడ్లు వేసేందుకు గాను ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

ఐతే రోడ్డు వెడల్పు లేక పోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతుండేవి.ఈ రోడ్డు వ్యాపార దుకాణాలు ఎక్కువగా ఉండడం మూలంగా బారీ వాహనాలు,ఇతర వాహనాలు నిలవడం వలన అంతరాయం వాటిల్లేది.అలాగే చిన్నపాటి వర్షం పడ్డ ఆ రోడ్డు మొత్తం జలమయం,బురదమయం ఐతుండేది.ఈ నేపథ్యంలో రోడ్డు వెడల్పు

చేసేందుకు గాను సోమవారం మున్సిపల్ శాఖ,రోడ్ల భవనాల శాఖ అధికారులు మొత్తం 60 ఫీట్లకు మార్కింగ్ చేశారు.గతంలో రోడ్డుకు మిడిల్ పాయింట్ గా రెండు వైపుల 30 రోడ్డును సరిచేస్తూ బౌండరీలకు మార్కింగ్ చేశారు.ఈ క్రమంలో బ్రాహ్మకుమారి ఆశ్రమం సమీపం నుండి పోలీస్ స్టేషన్ వరకు రోడ్డు కొన్ని వ్యాపార సముదాలను
తొలిగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.అదే రోడ్డు వాటర్ ప్లాంటు నుండి పోలీస్ స్టేషన్ వరకు 50 ఫీట్ల నుండి 40 ఫీట్ల రోడ్డు మాత్రమే తేలుతుండడంతో ఆ ప్రాంత వ్యాపారస్తుల గుండెల్లో గుబులు రేపుతోంది. 60 ఫీట్ల కుదిరించేందుకుగాను కొందరు వ్యాపారస్తులు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వద్దకు వెళ్లగా ప్రజా ప్రజా ప్రయోజనాల కోసం నిర్మించే రహదారీ కుదించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం.వ్యాపారుల ఎత్తుగడలను తలొగ్గిన అధికారులు వాటర్ ప్లాంట్ నుండి పోలీస్ స్టేషన్ వరకు 50 ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.కాగా రోడ్డు వెడల్పు కోసం పెద్ద చిన్న అని తేడా లేకుండా పోలీస్ స్టేషన్ నుండి నాగూర్లపల్లి వరకు 60 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేయాలనిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఎలాగైనా రోడ్డు వెడల్పును ఆపేందుకు కొందరు వ్యాపారులు కోర్టు నుండి స్టే తెచ్చుకునేందుకు కోర్టు మెట్లు ఎక్కేందుకు సమావేశమైనట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. రోడ్డుకు మార్కింగ్ చేసే సమయంలో ఇప్పుడే నిర్మాణంలో ఉన్న ఒక భవనం నిర్మాణం ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా చేపడుతున్నట్టు గుర్తించడంతో యజమాని మున్సిపాలిటీ అధికారులతో ప్రయత్నం చేయగా ఇండ్ల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో కమిషనర్ ను సంప్రదిస్తే ఇండ్ల ల్యాండ్ డాక్యుమెంటు ప్రకారంగా రోడ్డు బౌండరీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

అందరికీ ఒకే విధమైన న్యాయం జరగాలి..

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్ నుండి నాగూర్లపల్లి వరకు 60 ఫీట్ల వెడల్పు రోడ్డు సింగిల్ డివైడర్ తో నిర్మాణం చేస్తున్న రోడ్డు వివిధ రకాల పలుకుబడులతో రోడ్డును కుదించే ప్రయత్నాలు చేయకుండా అందరికీ ఒకే విధమైన న్యాయం జరిగేలా రోడ్డు నిర్మాణం చేపట్టాలని మాదన్నపేట రోడ్డు పరిధిలోగల ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు ఎలాంటి ప్రలోభాలకు లోనవకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని పట్టణ ప్రజల డిమాండ్ చేస్తున్నారు.

ప్రారంభమైన రోడ్డు వెడల్పు పనులు..

పోలీస్ స్టేషన్ నుండి నాగూర్లపల్లి వరకు 60 ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణ పనులను సంబంధిత అధికారులు బుధవారం ప్రారంభం చేశారు. అయితే రోడ్డు వెడల్పు పనులను ప్రారంభ పనుల నుండి కాకుండా స్మశాన వాటిక సమీప నుండి పనులను ప్రారంభించడంపై అధికారులపై ప్రజలు తీవ్ర నిరాశ ఎదురైతున్నది. ఇప్పటికైనా అందరికీ సమాన న్యాయం జరగాలంటే పూర్తిస్థాయిలో 60 ఫీట్ల వెడల్పు రోడ్డును నిర్మాణం చేపట్టాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగంలో యువత….

ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగంలో యువత….

పాలకుల నిర్లక్ష్యంతో రామకృష్ణాపూర్ వెలవెల…

రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పగల నాయకులు ఉన్నా సరే ఉపాధి కరువు…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పగల నాయకులు ఈ ప్రాంతంలో అనేకమంది ఉన్నా సరే ఉపాధి కరువైంది.ఈ ప్రాంతంలో ఒక్క ఇండస్ట్రీ కూడా ఏర్పాటు చేయకపోవడం తో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.బొగ్గు బాయిలు మూతపడటంతో సరైన ఉపాధి సౌకర్యాలు లేక రామకృష్ణాపూర్ పట్టణంలోని యువత నిరుద్యోగులుగా మారిపోయారు.

మహిళలు, యువతులు , యువకులు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వివిధ దుకాణాలలో ఉపాధి నిమిత్తం వెళుతున్నారు.కనీసం కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు సైతం లేని క్యాతన్ పల్లి మున్సిపాలిటీకి రాబోయే ఎన్నికలు పెద్ద సవాలు గానే నిలిచాయి. శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో యువతలో కొంత నిరుత్సాహమే ఉందని విశ్లేషకులు అంటున్నారు.

గతంలో పరిపాలించిన రాష్ట్ర స్థాయి నాయకుడైన బాల్క సుమన్ కూడా క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పై చిన్న చూపు చూశారనే నెపంతో ఇక్కడి ప్రజలు మార్పు కోరుకున్నారు. మార్పు కోరుకున్నా సరే ప్రస్తుతం చెన్నూర్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కి కూడా క్యాతన్ పల్లి మున్సిపాలిటీ అంటేనే చిన్న చూపా..? అనే సందేహాలు సైతం ప్రజల్లో లేకపోలేదు. జిల్లా చుట్టూ అభివృద్ధి జరుగుతున్న సరే ఈ మున్సిపాలిటీలో

మాత్రం అభివృద్ధి ఆమడ దూరంలో ఉందనే భావన ప్రజల్లో వినబడుతోంది. గతం నుండి ప్రస్తుతం వరకు నియోజకవర్గాన్ని పరిపాలించే నేతలు స్థానికేతరులే కావడం, ఇక్కడి ప్రజల బాగోగులు తెలవకపోవడం అందుకు కారణమనే సందేహం లేకపోలేదు. మున్సిపాలిటీలోని 22 వార్డులలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు సరిగా లేకపోవడంతో అనేక సమస్యలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలో జీవించేందుకు ఉపాధి లేక ప్రజలంతా వలస వెళుతున్నారు. ఇప్పటికైనా స్థానిక కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చొరవ తీసుకోవాలని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు.ఈ ఏరియా అభివృద్ధి జరగాలన్నా సరే, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా సరే ఏదైనా ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయించేలా మంత్రి చొరవ తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. రానున్న రోజుల్లో ఆర్కేపీ ఉపరితల గని రెండో దఫా పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలకు ఎంత మందికి ఉపాధి దొరుకుతుందనే సందేహము లేకపోలేదు.ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశం కలగాలంటే ఇండస్ట్రీలు ఏర్పాటు చేయించేలా స్థానిక మంత్రి చొరవ తీసుకోవాలని ప్రాంత ప్రజల నుండి డిమాండ్ వినిపిస్తుంది.

4 లేబర్ కోడ్స్, విబి రామ్ జి చట్టం రద్దు చేయాలి…

4 లేబర్ కోడ్స్, విబి రామ్ జి చట్టం రద్దు చేయాలి

సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బందు సాయిలు.

భూపాలపల్లి నేటిధాత్రి

 

4 లేబర్ కోడ్స్, విబి రామ్ జి చట్టం రద్దు చేయాలని జిల్లా కేంద్రంలో జాతను ప్రారంభించిన సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బందు సాయిలు.
సిఐటియు, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మూడు వర్గ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శ్రామిక భవన్ కారల్ మార్క్స్ కాలనీలో జిల్లా జాతను సిఐటియు జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు బందు సాయిలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా బంధు సాయిలు మాట్లాడుతూ ఈ నెల 11 వరకు జిల్లాలోని 10 మండలాలు 343 గ్రామాలు 302 కిలోమీటర్ల వరకు ఈ జాత తిరుగుతుంది. ప్రధానంగా మోడీ ప్రభుత్వం ఇటీవల కాలంలో పార్లమెంటులో తెచ్చిన చట్టాలను రద్దు చేయాలని కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, సకల జనులను చైతన్యం చేయడం కోసం ఈ యాత్ర జరుగుతుంది. ఈ యాత్రను ఆదరించి జయప్రదం చేయాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మోడీ సర్కారు 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోట్లుగా చేసి కార్మిక వర్గానికి వ్యతిరేకంగా యజమానులకు అనుకూలంగా ఈ చట్టం తెచ్చి అమలుపరచటం అన్యాయం. దీని ఫలితంగా హైలాండ్ ఫైర్ సిస్టం, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, కార్మికుల కనీస వేతనాలు పడిపోవడం, 12 గంటల పని విధానం అమలు చేయటం, లేబర్ అధికారులకు అధికారాలు లేకుండా చేయటం, యజమానులకు పూర్తిస్థాయి అధికారాలు ఇవ్వటం, కార్మిక వర్గానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఈ నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలి.
2005లో వామపక్షాల ఆధ్వర్యంలో ఏర్పడ్డ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మోడీ మార్చి బీబీ రాంజీ చట్టం తెచ్చారు. దీనితో వ్యవసాయ కూలీలకు నష్టం. గతంలో 90% నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కూలీలకు ఇస్తే, రాష్ట్రాలు పది శాతం నిధులు చెల్లించేది, కానీ మారిన చట్టం ప్రకారం 60 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్రాలు 40 శాతం నిధులు భరించాలని చట్టంలో ఉంది. ఇప్పటికే జీఎస్టీ, శేషు ల పేరుతో కేంద్ర ప్రభుత్వం నిధులను వసూలు చేసుకుని పనులన్నీ దగ్గర పెట్టుకొని రాష్ట్రాలకు ఇవ్వకుండా బలహీన పరుస్తుంది. 40 శాతం నిధులు ఉపాధి హామీకి పెట్టాలంటే రాష్ట్రాలు పెట్టలేని పరిస్థితి దీనితో ఉపాధి హామీ పథకం నిర్విర్యమై నీరు గారి పోతుంది. యధావిధిగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం.
ఈనెల 19 తారీఖున జిల్లా కేంద్రంలో మూడు వర్గ సంఘాల ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తాం.
ఈ జీబు జాతకు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం దేవేందర్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి చింతల రజనీకాంత్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఆత్మకూరు శ్రీకాంత్, నాయకత్వం వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో బి క్రాంతి, ఎం రాజేందర్, సిహెచ్ రవికుమార్, మహేందర్, కే రవికుమార్, జాడి కిష్టయ్య, పగిడి, గట్టు శంకర్, గడ్డం ప్రభాకరు తదితరులు పాల్గొన్నారు.

మూడు కిలోల ఎండు గంజాయి స్వాధీనం,…

మూడు కిలోల ఎండు గంజాయి స్వాధీనం

ఇద్దరు వ్యక్తుల అరెస్ట్..ఆటో సీజ్.. రెండు మొబైల్ స్వాధీనం

దుగ్గొండి ఎస్ఐ రావుల రణధీర్ రెడ్డి

దుగ్గొండి,నేటిధాత్రి:

నర్సంపేట డివిజన్ లో మరోసారి గంజాయి కలకరం రేపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వరంగల్ కు ఆటోలో సరఫరా చేస్తున్న ఇద్దరు యువకులను దుగ్గొండి పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామంలో జరిగింది.దుగ్గొండి ఎస్ఐ రావుల రణధీర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం భద్రాచలానికి చెందిన మర్రి సాయితేజ,జి. కృష్ణారెడ్డిలు టీజీ 25 టీ 4560 నంబర్ గల ఆటోలో భద్రాచలం నుండి వరంగల్ కు గంజాయి సరఫరా చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం దుగ్గొండి మండలంలోని గిర్నిబావి వరంగల్ -నర్సంపేట ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఆటోను వెనక్కి తిప్పుకొని పారిపోయే ప్రయత్నం చేస్తున్న క్రమంలో అనుమానంతో ఆటోను తనిఖీ చేయగా మూడు కిలోల ఎండు గంజాయి లభ్యమైందని తెలిపారు.
ఎండు గంజాయిని సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి ఆ దొరికిన గంజాయితో పాటు ఆటోను, 2 మొబైల్స్ సీజ్ చేసినట్లు చెప్పారు. ఎండు గంజాయి సరఫరా పట్ల పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రణధీర్ రెడ్డి తెలిపారు.

పేట టీయస్ అధ్యక్షుడిగా గుర్రం సత్తిరెడ్డి..

పేట టీయస్ అధ్యక్షుడిగా గుర్రం సత్తిరెడ్డి

 ప్రతినిధి, నేటిధాత్రి :

అధ్యక్షుడిగా గుర్రం సత్తిరెడ్డి

 

ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా తుంకుంట జడ్పిహెచ్ఎస్ ఫిజికల్ డైరెక్టర్ గుర్రం సత్తిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. జడ్పిహెచ్ఎస్ మల్కాజ్ గిరి (బాలుర) పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాఘవరెడ్డి, ఎన్నికల పరిశీలకులుగా నల్లగొండ జిల్లా అధ్యక్షులు చంద్రయ్య, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రవి వ్యవహారిచారు. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా గుర్రం సత్తిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జడ్పీహెచ్ఎస్ ఆర్ పి కాలనీ ఫిజికల్ డైరెక్టర్ యాదయ్య, కోశాధికారిగా జడ్పిహెచ్ఎస్ కౌకూర్ ఫిజికల్ డైరెక్టర్ పారిజాత ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గుర్రం సత్తిరెడ్డి మాట్లాడుతూ వ్యాయామ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై నిరంతరం కృషి చేస్తానని, సంఘం అభివృద్ధికై పాటుపడుతూ ఎల్లవేళలా సభ్యులకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మాజీ అధ్యక్షుడు వినోద్ కుమార్, గెజిటెడ్ హెడ్మాస్టర్ ప్రభాకర్, జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

యాసంగి పంటలకు నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్…

యాసంగి పంటలకు నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి రూరల్ మండలం పంబాపూర్ గ్రామంలోని భీమ్ ఘనపూర్ చెరువు నీటిని యాసంగి పంటల సాగు కొరకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చెరువులో పూలు చల్లి, గేట్ వాల్వ్ తిప్పి నీటిని దిగువ గ్రామాలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రైతులకు సాగునీరు అందించడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. చిట్టచివరి ఎకరా వరకు సాగు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సాగునీటి విడుదలతో దిగువ గ్రామాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.

వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీ ప్రారంభం, విశ్వకర్మ గోడపత్రిక ఆవిష్కరణ

వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీ ప్రారంభం, విశ్వకర్మ గోడపత్రిక ఆవిష్కరణ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలో వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీని దొడ్డేంద్రయ్య గురుస్వామి ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విశ్వకర్మ గోడపత్రికను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విశ్వకర్మ అధ్యక్షులు చంద్రప్ప, జెంట్ సెక్రటరీ రాజేశ్వర్ ఛారీ, స్థానిక విశ్వకర్మ నేతలు, మాజీ సర్పంచ్ సవిత రంగారెడ్డి, రఘునాథ్ చారి పాల్గొన్నారు. దొడ్డేంద్రయ్య గురుస్వామి మాట్లాడుతూ, టాటా, బిర్లా వంటి ప్రముఖ వ్యాపారాల పేర్లతో పాటు విశ్వకర్మ పేర్లు కూడా గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.

కాంగ్రెస్ పాలనలో దళితులపై దాడులు…

కాంగ్రెస్ పాలనలో దళితులపై దాడులు

◆-: బీఆర్ఎస్ నేత బండి మోహన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరా బాద్, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధి కారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని బిఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు బండి మోహన్ అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో పలు గ్రామాలలో ఎస్సీలు తమకు ఓటు వేయలేదని అగ్రవర్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేయడం, దూషిం చడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. అగ్రవర్ణాలు దాడి చేస్తే బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని, పోలీ సులు బాధితులపైనే కేసులు చేస్తామంటూ బెదిరించడం హేయమైన చర్యగా చెప్పారు. గ్రామస్తుడి ఇల్లు కూల్చేసిన సర్పంచ్ ను పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన ఆధారాలు బాధితులు చూపించినప్పటికీ పోలీసులు పట్టించు కోకపోవడం దారుణం అన్నారు. జహీరాబాద్ పరిధిలోని సజ్జాపూర్, కప్పాడ్ గ్రామాలలో జరిగిన ఘటనలు పునరావృతమైతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.

అక్రమ నిర్మాణం అపవల్సిందే…..!

అక్రమ నిర్మాణం అపవల్సిందే…..!

◆:- నోటీసు జారిచేసిన రెవిన్యూ సిబ్బంది

◆:- ఇదివరకే నోటీసు జారిచేసిన గ్రామ పంచాయతీ అధికారులు

◆:- అయిన పట్టించుకోని వైనం

◆:- చివరకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ను తప్పుదోవ పట్టించిన ఇల్లు నిర్మానితులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని కోహిర్ మండలం సజ్జపూర్ గ్రామంలోని ప్రభుత్వ భూమికి సంబందించిన 21సర్వనంబర్ లో బ్యాగరి రాములు ఇల్లు అక్రమ నిర్మాణం చేపట్టడంతో గత 15రోజుల క్రితం పంచాయతీ అధికారులు నోటీసులు జారిచేసి అక్రమ కట్టడాన్ని జేసీబీతో కూల్చివేయడం జరిగింది.అనంతరం కోహిర్ మండల రెవిన్యూ అధికారులు స్థానిక తహసీల్దార్ సంఘటన స్థలానికి చేరుకొని 21సర్వే నంబర్ భూమి ప్రభుత్వ పరిధిలోనిది అని ఈ సర్వే నంబర్ లో ప్రభుత్వం పల్లె ప్రకృతి వనంకు కేటాయించిందని మండల సంబంధిత అధికారులు తెలియజేశారు.

ఈ విషమై తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య విచారణ చేపట్టి సజ్జపూర్ గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి వెళ్లిన అనంతరం మల్లి మంగళవారం సజ్జపూర్ గ్రామనికి వచ్చి బాధిత కుటుంబానికి 25వేయిల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి పల్లె ప్రకృతి వనంలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణానికి భూమి పూజ చేసి వెళ్లి పోవడం జరిగింది. ఇదిలా ఉండగా బుధవారం ప్రభుత్వ భూమి అయిన పల్లె ప్రకృతి వనంలో మల్లి అక్రమ నిర్మాణం చేపట్టడంతో స్థానిక రెవిన్యూ అధికారులు నోటీసులు జారిచేసి నిర్మాణాన్ని ఆపేయవలసిందిగా నిర్మస్తున్న వారిని ఆదేశించారు.

 

ఇది ప్రభుత్వ భూమి అని అన్ని రికార్డుల్లో తెలిసిన తర్వాత కూడ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సైతం తప్పుదోవ పట్టించడం ఏంటని ప్రభుత్వ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడవల్సింది పోయి అగ్రమనకు గురవుతున్న చోద్యం చూస్తూ ఇష్టనుసారంగా వ్యవహరించడం సరైంది కాదని రెవిన్యూ అధికారులు అంటున్నారు. గ్రామంలోని 21సర్వే నంబర్ ప్రభుత్వ భూమిలో ఎవరైన సరే అగ్రమంగా ఇండ్ల నిర్మాణం షెడ్ ల నిర్మాణం చేపడితే ప్రభుత్వ పరంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు.

వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరిస్తున్న సర్పంచ్ ఉప సర్పంచ్…

వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరిస్తున్న సర్పంచ్ ఉప సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం గ్రామ చర్చ్ ముందు సిసి రోడ్డు పక్కన చెత్తకుండీలో ఉన్న చెత్తను గమనించి గ్రామ నూతన సర్పంచ్ వినోద బాలరాజ్ ఉప సర్పంచ్ గడ్డం మమత అనిల్ పటేల్ వెంటనే స్పందించి అక్కడి నుంచి చెత్తను తీసేయాలని అక్కడ ఉన్న ప్రజలను ఏ ఇబ్బంది లేకుండా చూడాలని గ్రామపంచాయతీ కార్మికులకు చెప్పి చెత్తను తీసివేయించడం జరిగింది. గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వెంటనే స్పందించి గ్రామ పరిశుభ్ర గురించి ఆలోచించి వెంటనే సంధిస్తున్నారు.

చర్చి ముందు చెత్తను ఉంచకుండా చెత్తకుండీ నిర్మించే ఆలోచనలో ఉన్నారని తెలిపారు గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్న నూతన సర్పంచ్, ఉప సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లగానే గ్రామ పంచాయితీ కార్యదర్శి వీరన్న పటేల్ గారి తో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తు.గ్రామపంచాయతీ పరిశుద్ధ కార్మికులలో ప్రతి ఉదయం చెత్త సేకరణ, వివిధ వార్డులతో పాటు ప్రధాన రోడ్డును పరిశుభ్రత చేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి వీరన్న పటేల్ తెలిపారు. ఈ పనుల ద్వారా గ్రామం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు,

ఆ సినిమా మీద ఆశలు వదులుకో వెంకీ.. కష్టం

ఆ సినిమా మీద ఆశలు వదులుకో వెంకీ.. కష్టం

 

 

 

తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పుడు భాషా పరిమితులు ఉండేవి. కానీ ఇప్పుడు కాలం మారింది. కథ బాగుంటే చాలు.. అది ఏ భాషా చిత్రమైనా సరే మన వాళ్లు బ్రహ్మరథం పడుతున్నారు.

తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పుడు భాషా పరిమితులు ఉండేవి. కానీ ఇప్పుడు కాలం మారింది. కథ బాగుంటే చాలు.. అది ఏ భాషా చిత్రమైనా సరే మన వాళ్లు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా మలయాళ సినిమాలకు మన టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రేజ్ రావడానికి అసలైన పునాది వేసింది మాత్రం దృశ్యం (Drishyam) సినిమానే. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohan Lal), దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఇండియన్ సినిమా దగ్గర ఒక సంచలనం. ఒక్క మలయాళంలోనే కాకుండా తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో కూడా రీమేక్ అయ్యి భారీ వసూళ్లను సాధించింది.విక్టరీ వెంకటేష్ కెరీర్ కాస్త ఒడిదుడుకుల్లో ఉన్న సమయంలో దృశ్యం ఆయనకు కొత్త ఊపిరి పోసింది. రాంబాబు పాత్రలో వెంకీ ఒదిగిపోయిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ దృశ్యం 2 కూడా ఓటీటీలో విడుదలైనప్పటికీ.. రికార్డు స్థాయి వ్యూస్‌తో సూపర్ హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు అసలు చిక్కు దృశ్యం 3 తో మొదలైంది. ప్రస్తుతం జీతూ జోసెఫ్ దృశ్యం 3 పనుల్లో ఎంతో బిజీగా ఉన్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇదే ఇప్పుడు మన వెంకీ మామకు, తెలుగు మేకర్స్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే.. ప్రస్తుతం ఓటీటీ హవా నడుస్తోంది. ఏ సినిమా అయినా నెల రోజుల్లోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేస్తోంది. మలయాళ వెర్షన్ థియేటర్లలోకి వచ్చిన వెంటనే ఆ కథ ఏంటి, ఆ సస్పెన్స్ ఏంటి అనేది అందరికీ తెలిసిపోతుంది.పోనీ తెలుగులో వెంటనే రీమేక్ చేద్దామా అంటే.. వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం సినిమాతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. ఆ చిత్రం షూటింగ్ పూర్తయ్యే వరకు వెంకీ మరో సినిమా సెట్స్‌ పైకి వెళ్లే అవకాశం ఏమాత్రం లేదు. మరోవైపు హిందీలో అజయ్ దేవగన్ కూడా దృశ్యం 3 కోసం సిద్ధమవుతున్నారు. అక్కడ వారు మలయాళ కథతో సంబంధం లేకుండా కొత్త కాన్సెప్ట్‌తో వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ఇక ఏప్రిల్‌లో మలయాళ వెర్షన్ వచ్చేస్తే.. ఆ కోర్ పాయింట్ లీక్ అయిపోతుంది. సోషల్ మీడియా ట్రెండ్‌ నడుస్తున్న ఈ రోజుల్లో సీక్రెట్‌ను దాచడం అసాధ్యం. ఆ సస్పెన్స్ రివీల్ అయ్యాక, మళ్ళీ అదే కథతో తెలుగులో రీమేక్ చేస్తే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనివల్ల తెలుగులో దృశ్యం 3 రీమేక్ అయ్యే అవకాశాలు తగ్గిపోతున్నాయని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మేకర్స్ ముందు ఇప్పుడు రెండు దారులు ఉన్నాయి. ఒకటి.. మలయాళ వెర్షన్‌ను తెలుగులోకి నేరుగా డబ్ చేసి రిలీజ్ చేయడం. రెండు.. కథలో భారీ మార్పులు చేసి వెంకటేష్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మలచడం. ఏది ఏమైనా, రాంబాబు తెలివితేటలు ఈసారి తెలుగులో ప్రేక్షకులను మెప్పిస్తాయా.. లేదా వెంకీ మామ ఈ సీక్వెల్‌పై ఆశలు వదులుకోవాల్సిందేనా? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

పాలన పదేళ్లు.. ప్రగతి నూరేళ్లు!

రాసుకుంటూ పోతే అభివృద్ధి జాడలు వందలు.

`పదేళ్లు నెంబర్‌ వన్‌ గా గుర్తింపులు.

`అభివృద్ధి, సంక్షమం సమపాళ్ళు!

telangana leader kcr

`సమగ్రభివృద్ధిలో తెలంగాణా పరుగులు

`పేదరిక నిర్మూలనలో అనేక మైలురాళ్లు.

`సాగురంగంలో ఒక్క తెలంగాణాలోనే విప్లవాత్మక ఫలితాలు.

`వ్యవసాయ రంగంలో అన్ని రాష్టాలను ఆదిగమించి దిగుబడులు.

telangana leader kcr

`అన్ని రంగాలలో జాతీయ స్థాయి లో సింహ భాగం అవార్డులు.

`పల్లె ప్రగతిలో గణనీయమైన మార్పులు.

`పచ్చని వనాలు, పసిడి సిరులు, పాడి పంటలు.

`స్వచ్ఛమైన పల్లె వాతావరణం లో ప్రజల ఆరోగ్యాలు.

`రైతుకు పెట్టుబడి సాయాలు.. సకాలంలో ఎరువులు.

`ఊరిలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు.

`ఎండిన ఊరి చెరువుల్లో పుష్కళంగా నీటి సవ్వడులు.

`ఊరే కల్పతరువుగా కుల వృతులకు ఆదాయ వనరులు.

`ఎవరిని కదిలించినా చెప్పే మాట ఒక్కటే కేసీఆర్‌ తెలంగాణా దేవుడు.

హైదరాబాద్‌, నేటిధాత్రి:

శకునం చెప్పే బల్లి కూడా కుడితిలోపడిపోతుంది. ఒక్క అబద్దం వెయ్యి అబద్దాలను మోసుకొస్తుంది. అబద్దాలు ఆడని పరిస్దితిని సృస్టిస్తుంది. అబద్దాలు ఆడకుండా వుండలేని స్దితిలోకి నెట్టేస్తుంది. నిజం చెప్పడానికి నోరు రాకుండా చేస్తుంది. కళ్లుండి చూడకుండా చేస్తుంది. ఇది అబద్దం పవర్‌…ఆ పవర్‌ రాజకీయం. అరాజకీయం చేయాలనుకున్నప్పుడు అబద్దాలే ఆడతారు. సర్వం అబద్దాల మయం చేసుకుంటారు. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. మాజీ ఎమ్మెల్సీ దేవన పల్లి కవిత పదేళ్లలో బిఆర్‌ఎస్‌ పార్టీ ఏం పీకి కట్టలు కట్టిందని పార్టీ పేరు మార్చుకున్నారు? దేశ రాజకీయాలకు ఎందుకు వెళ్లాలనుకున్నారు? అనే ప్రశ్న సందించారు. తెలంగాణ ప్రజల కళ్లతో చూస్తే పదేళ్ల ప్రగతి కనిపిస్తుంది. ప్రత్యర్దుల కళ్లతో చూస్తే ఏడారి మాత్రమే దర్శనమిస్తుంది. కళ్ల ముందు రత్నాలు కూడా గులక రాళ్లే అనిపిస్తుంది. కేసిఆర్‌ పదేళ్లలో చేసిన అభివృద్ది ప్రజల ముందే వుంది. అది ప్రత్యర్దులకు కనిపించదు. విమర్శలకు మాత్రమే పనికొస్తుంది. కవితకన్నా కాంగ్రెస్‌ నయం. పదేళ్లలో అవినీతి జరిగిందని చెబుతోంది. అంటే పనులు జరిగినట్లు పరోక్షంగా కాంగ్రెస్‌ ఒప్పుకున్నది. అందుకే కాళేశ్వరం గురించి పదే పదే ప్రస్తావిస్తుంది. కాని కవిత అసలు ఏం జరగలేదంటోంది. కాళేశ్వరం కూడా ఆమె కంటకి కనిపించడం లేదు. పదేళ్లలో తెలంగానలో వచ్చిన మార్పులు ఏమీ కనిపించడం లేదు. బాణం ఇప్పటి వరకు అన్న మీద, హరీష్‌ మీద గురిపెట్టింది. ఇప్పుడు ఏకంగా కేసిఆర్‌ మీదకే తిప్పింది. తప్పంతా తండ్రిదే అనే అర్దమొచ్చేలా మాట్లాడుతోంది. కేసిఆర్‌ పదేళ్లలో ఏం చేయలేరంటే ప్రజలు కూడా నమ్మరని తెలిసినా పగపట్టినట్లు చెబుతోంది. కాని ఆమె కోసం కాకపోయినా ఈ తరం యువత కోసమైన కొన్ని తెలియాలి. అంటే తెలంగాణకు ముందు రోజులు ఎలా వుండేవో ఒక్కసారి కళ్లు ముందు కనిపించాలి. సరిగ్గా పన్నెండు సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రాంతం ఒక ఎడారి గా మార్చబడిన ప్రాంతం. ఎడారిలోనైనా ఖర్జురాలు పండే ప్రదేశాలు వుంటాయి. కాని తెలంగాణ కరువు రక్కసి బారిన పడి విలవిలాడిరది. పాలకులు సృష్టించిన విద్వంసంలో చిక్కిశల్యమైంది. కొన్ని శతాబ్దాలుగా అన్ని రంగాలలో గణనీయమైన గతిని సంతరించుకున్న తెలంగాణ ఉమ్మడి పాలకుల చేతిలో పడి విలవిలలాడిరది. ఒకప్పుడు తెలంగాణలోని ప్రతి పల్లె ఒక గంగాళం. ఊరుకు కనీసం రెండు చెరువులు. ఊరు చుట్టూ పొరుగు గ్రామాల చెరువులు. ఇలా తెలంగాణ అంతా నీటితో కళకళలాడిన కాలం వుంది. నిజాం పాలనలో కూడా కరువు లేదు. కష్టం లేదు. ప్రజలు అన్నమో రామచంద్రా అనలేదు. అందుకే నిజాం కాలంలో కూడా భూముల పంచాయితీ వుందే తప్ప నీళ్ల గోస లేదు. పాడి పంటలు పుష్కలంగా వున్నాయి. అందుకే రైతులనుంచి ఆ రోజుల్లో రాజులు 6శాతం శిస్తు వసూలు చేసుకున్నారు. అయినా రైతులు ఆకలి బాదలు ఎదుర్కొలేదు. పరిపూర్ణమైన పంటలు పండిరచుకున్నారు. తెలంగాణలో సగర్వంగా రైతులు జీవించారు. కాకతీయుల కాలం తవ్విన చెరువులు బావులు ఇంకా మన కళ్లముందే వున్నాయి. రహదారుల వెంట కూడా మంచి నీటి బావులు తవ్వి ప్రజల దాహార్తిని ఆ రోజుల్లో రాజులు తీర్చారు. అందుకే డిల్లీ నుంచి కూడా రాజులు తెలంగాణ మీద దండయాత్రలకు వచ్చారు. అంతెందుకు దక్షిణాదిలో తెలంగాణ దాటితే ఏ డిల్లీ రాజు ముందుకు వెళ్లలేదు. అంత సంపద తెలంగాణలోనే దొరికింది. నీళ్ల కొదువలేదు. తమిళనాడు, కర్నాటక ప్రాంతాలలో కావేరీ జలాల వివాదంతో పంటలు లేక యుద్దాలు చేసుకున్న రాజులున్నారు. చోర, చేళ, పాండ్య రాజుల కూడా రైతులకు నీళ్లివ్వలేకపోయారు. ఇప్పటికీ జలాల వివాదాలలో ఆ రెండు రాష్ట్రాలు మునిగితేలుతూనే వున్నాయి. కాకతీయ కాలంతో పాటు అంతకు ముందే తెలంగాణలో వున్న చెరువులను చూసి తమిళనాడు రాజులు కూడా చెరువులు తొవ్వించుకున్నారు. రాయల కాలంలో రత్నాల మాట వినడమే తప్ప చూడలేదు. కాని నైజాం కాలంలో గోల్కొండ రాజ్యంలో వజ్రవైడూర్యాలు విదేశీయులు వచ్చి కొనుగోలును చూసిన వారున్నారు. అందుకు సాక్ష్యాలు కూడా వున్నాయి. ఆ రోజుల్లోనే పది వేల కోట్ల రూపాలయ జాకబ్‌ డైమండ్‌ పేపర్‌ వెయిట్‌గా పెట్టుకున్న నిజాం రాజున్నాడు. రాజులు సంపన్నులైతే సహజంగా ప్రజలు కూడా ధనవంతులన్నట్లే లెక్క. ఆంధ్ర ప్రాంతం కూడా కరువుతో అల్లాడిన ప్రాంతామే. ఎప్పుడైతే రాజమండ్రి, విజయవాడలలో కాటన్‌పుణ్యమా? అని బ్యారేజీలు నిర్మాణం జరిగాయి. అప్పటి నుంచి పంటలు మొదలయ్యాయి. కాని తెలంగాణలో ఏ ప్రాజెక్టులు లేకపోయినా, చెరువులే కల్పతరువులై సిరుల పంటలు పండిరచాయి. అలాంటి తెలంగాణ మళ్లీ కేసిఆర్‌ పాలనలో ప్రజలు చూశారు. సుమారు 60 ఏళ్ల కాలంలో ఆనవాలు కోల్పోయిన చెరువులన్నీ తెలంగాణలో కేసిఆర్‌ పాలనతో ప్రత్యక్ష్యమయ్యాయి. అదీ కేసిఆర్‌ అంటే. నిజానికి ఏ తెలంగాణ వ్యక్తి ఊహించలేదు. ఏ తెలంగాణ వాది చెరువులకు పూర్వ వైభవం వస్తుందని అనుకోలేదు. ఒక వేళ చెరువులు బాగు చేయాలనుకున్నా సాద్యం కాదనుకున్నారు. కాని సాద్యం కాదనుకున్న వాటిని సుసాద్యం చేయడమే కేసిఆర్‌ పట్టుదల. రాదననుకున్న తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ వచ్చేది లేదు, సచ్చేది లేదన్న వారి కళ్లముందే తెలంగాణ తెచ్చి చూపించిండు. నిజాం కాలంలోనే కరంటు చూసిన తెలంగాణను ఉమ్మడి రాష్ట్రంలో చీకటి చేసిన్రు. చెరువులను చెడగొట్టి, తెలంగాణ సాగును సర్వనాశనం చేశారు. చెరువులు ఆగం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం నిర్లక్ష్యం చేశారు. ఉమ్మడి రాష్ట్రం రాకముందే నిజాం నిర్మాణం చేయాలనుకున్న ప్రాజెక్టులను ఆపేశారు. ఆఖరుకు నిజాం సాగర్‌కు సరైన మరమ్మత్తులు చేయలేదు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం, సీట్ల కోసం ప్రాజెక్టుల పేరు శంకుస్దాపనలు చేయడం…జనాలను మభ్య పెట్టారు. నీళ్లు, నిధులన్నీ ఏపికి తీసుకెళ్లారు. చెరువులు నింపలేదు. ప్రాజెక్టులు కట్టలేదు. ఆఖరుకు రైతులు బోర్లు వేసుకోకుండా వాల్టా చట్టం తెచ్చారు. కరంటు ఇవ్వకుండా సాగు సాగకుండా చేశారు. మంచి నీళ్లకు దిక్కులేకుండా చేశారు. ఇన్ని సకల దరిద్రాలను నెత్తిన రుద్దిన ఆంద్రా పాలకుల నుంచి తెలంగాణను విముక్తి చేసింది కేసిఆర్‌ కాదా? పదేళ్లలో ఇవన్నీ పునరుద్దరించింది కేసిఆర్‌ కాదా! తెలంగాణలో చెరువులన్నీ బాగు చేసింది కేసిఆర్‌ కాదా! తెలంగాణ వచ్చిన మూడు నెలల్లోనే ఇరవై నాలుగు గంటల కరంటు తెచ్చింది కేసిఆర్‌ కాదా! ఉమ్మడి రాష్ట్రంలో కరంటు కష్టాలు తప్ప వెలుగులు లేవు. సాగుకు నీళ్లు లేవు. కాని తెలంగాణ వచ్చిన ఆరు నెలల్లోనే చెరువులోకి నీళ్లు రాలేదు. మూడు నెలల్లోనే ఇరవై నాలుగు గంటల కరంటు రాలేదా? ఐదేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరగలేదా! ప్రపంచంలోనే అతి పెద్ద బహులార్ధక ఎత్తిపోతల పథకంగా చరిత్ర సృషించలేదా! కాళేశ్వరం నీళ్లన్నీ తెలంగాణ మొత్తం పారలేదా! ఇలా పదేళ్లలోనే ఇంతటి ప్రగతిని చూపించిన నాయకుడు దేశంలోనే ఎవరైనా వున్నారా! చరిత్ర తిరగేసినా కనిపిస్తారా! నాగార్జున సాగర్‌ , శ్రీశైలం లాంటి ప్రాజెక్టుల మూడున్నర దశాబ్దాల పాటు కట్టారు. జూరాల లాంటి 9 టిఎంసిల రిజర్వాయర్‌ ముప్పై ఏళ్లు కట్టారు. కాని 50 టింఎసిల మల్లన్న సాగర్‌ మూడేళ్లలలో పూర్తి చేశారు. దానితోపాటు పదలు సంఖ్యలో ఏక కాలంలో పది టిఎంసిలకు పైగా నిలువ సామర్ధ్యం వున్న రిజర్వాయర్లు నిర్మాణం చేశారు. ఇవన్నీ పనులు కాదా! కవిత కంటికి కనిపించకుండాపోయాయా? ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ పోరాటం , కష్టాలు ఒడువని ముచ్చట కాలోజీ ఎలా చెప్పాడో కేసిఆర్‌ పాలనలో జరగిన ప్రగతిని చెప్పుకుంటూ పోతే కూడా ఒడువని ముచ్చటే…తరతరాలకు తరగని చరిత్రే.. భవిష్యత్తు తరాలకు వెలుగులు పంచిన పాలనే..కేసిఆర్‌ పదేళ్ల పాలన స్వర్ణయుగమే! రామరాజ్యంలో కూడా అరమరికలువుంటాయి. ఏ ప్రభుత్వంలోనైనా కొన్ని పూర్తి కాని పనులుంటాయి. కాని వాటిని ముందేసుకొని, అందుతున్న ఫలాలను గుర్తించని వారికి ఎంత చెప్పినా వినిపించవు. చూపించినా కనిపించవు.

error: Content is protected !!
Exit mobile version