సీతారాములవారి కల్యాణ మహోత్సవం.

నస్పూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాములవారి కల్యాణ మహోత్సవం
ముఖ్య అతిథులుగా లోపాల్గొన్న మంచిర్యాల డిసీపి భాస్కర్ మంచిర్యాల రూరల్ సి ఐ అశోక్ కుమార్

నస్పూర్ నేటిదాత్రి

 

నస్పూర్ గ్రామంలోని అతి పురాతనమైన శ్రీ సీతారామాలయంలో సీతారాముల వారి కళ్యాణం అత్యంత వైగోపేతంగా కన్నుల పండుగా జరిగినది ఈ సందర్భంగా గ్రామ నాయకులు ప్రజలు ఆలయ కమిటీ ఆలయ అర్చకుల సమక్షంలో సీతారాములవారి కల్యాణం జరిపించడం జరిగినది సకలజనులు శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖసంతోషాలతో వర్ధిల్లాలని వేదపండితులు దేవరాజు రంజిత్ శర్మ మంత్రోచ్ఛారణతో ప్రజలను ఆ శ్రీరామచంద్రుడు ఆశీర్వదించే విధంగా మంత్ర వేదాలతో గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని రాములవారి కళ్యాణాన్ని జరిపించారు

DCP Bhaskar

అదేవిధంగా శ్రీరామచంద్ర మూర్తి వారి యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ తల్లిదండ్రుల పట్ల రాములవారు ఎంతటి విధేయత కలిగి ఉండేవారో వివరించారూ భక్తులందరూ శ్రీరాముని తల్లిదండ్రులను గౌరవించాలని ఆకాంక్షించారు కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా మంచిర్యాల డిసిపి భాస్కర్ మంచిర్యాల రూరల్ సిఐ అశోక్ కుమార్ మరియు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు సీతారాముల కళ్యాణానంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుపబడినది ఇట్టి కార్యక్రమాన్ని రా చకొండ కృష్ణారావు అండ్ బ్రదర్స్ నిర్వహించినారు ఆలయ కమిటీ సభ్యులు రాచకొండ గోపాలరావు రాచకొండ వెంకటేశ్వరరావు (బుజ్జన్న) మార్కెట్ కమిటీ డైరెక్టర్ దొనపల్లి లింగయ్య ఇరికిల్ల పురుషోత్తం గడ్డం సత్యా గౌడ్ కోయిల వెంకటేష్ గరిసె రామస్వామి భీమయ్య సందీప్ బండం గోపాల్ కుందరపు రమేష్ కొయ్యలరమేష్ సిరిపురం శ్రీనివాస్ కిష్టయ్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు పాల్గొన్నారు

కేతకీ సంగమేశ్వర దేవస్థానం చైర్మన్ గా అప్నగారి.

కేతకీ సంగమేశ్వర దేవస్థానం చైర్మన్ గా అప్నగారి.శేఖర్ పాటిల్

◆ కేతకీ సంగమేశ్వర దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా నూతన చైర్మన్ & పాలక మండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం గ్రా౹౹ & మం౹౹ శ్రీ కేతకీ సంగమేశ్వర దేవస్థానం ఆలయంలో సోమవారం రోజున శ్రీ.సంగమేశ్వర స్వామి వారికి తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారికీ పాలభి శేకం నిర్వహించారు.ముందుగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.అనంతరం శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలక మండలి చైర్మన్.అప్నగారి.

Temple

 

శేఖర్ పాటిల్ మరియు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా చైర్మన్ మరియు కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి .ఈకార్యక్రమంలో ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హన్మంత్ రావు పాటిల్,జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.నర్సింహారెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్ గారు,సత్వార్ సోసైటి చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి,అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పి.నాగిరెడ్డి,జిల్లా యూత్ మాజీ అధ్యక్షుడు ఉదయ్ శంకర్ పాటిల్,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి,బి.మల్లికార్జున్ మరియు ఝరాసంఘం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,ఆలయం ఈవో&అర్చకులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ధనాసిరి గ్రామంలో దారుణ హత్య.

ధనాసిరి గ్రామంలో దారుణ హత్య.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

సంగారెడ్డి: మొగుడంపల్లి మండలంలోని ధనాసిరి గ్రామంలో ఓవ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. గ్రామానికి చెందిన సత్తార్మియా కుమారుడు అబ్బాస్ (25) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. తన మిత్రులతో డైరీఫామ్ వద్ద దావత్ చేసుకుంటుండగా మరో ఇద్దరు వ్యక్తులు అక్కడికి చేరుకొని మారణాయుధాలతో ఆకస్మికంగా దాడిచేసి హత్య చేశారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కాంగ్రెస్ గ్రామ యూత్ కమిటీ ఎన్నిక.

కాంగ్రెస్ గ్రామ యూత్ కమిటీ ఎన్నిక.

చిట్యాల, నేటిధాత్రి

 

చిట్యాలమండలంలోని తిరుమలాపురం గ్రామంలో శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ* గారి ఆదేశాల మేరకు *చిట్యాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లకొండ కుమార్అధ్యక్షతన తిరుమలాపురం యూత్ గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది.తిరుమలాపురం గ్రామ యూత్ అధ్యక్షులుగాకంచర్ల రాంబాబుఉపాధ్యక్షులుగాగద్దల రాజు, చెన్న శ్రీకాంత్
వర్కింగ్ ప్రెసిడెంట్* : కంచు తిరుపతి
ప్రధాన కార్యదర్శిగాఆరెల్లి సురేష్, జెన్నే సాగర్
ప్రచార కార్యదర్శిగా ఆరెల్లి రామ్ చరణ్ (బన్నీ)
సహాయ కార్యదర్శిగాగోపగాని మనోహర్, గజ్జి తిరుపతి
కోశాధికారిగానగరపు సాయి
సోషల్ మీడియాగాగోపగాని మహేష్
కార్యవర్గ సభ్యులుగా
జంగంపెల్లి పవన్
కాలవేనీ నవీన్
గజ్జి నరేష్
జెన్నె సంజీవ్
దాసారపు సురేష్ తోట వెంకన్న
నల్ల రాకేష్
కాలవేణి దినేష్
గోపగాని రజనీకాంత్
నార్లపురం రాజీరు
కంచు దినేష్
జెన్నె ప్రశాంత్
. జెన్నె అశోక,ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గజ్జి రవి, గోపగాని శివకృష్ణ, ఎలగొండ చిరంజీవి, గోల్కొండ నాగరాజు, గోపగాని వెంకటేశ్వర్లు, ఆరెల్లి సదానందం, కంచర్ల కిట్టు, ఎలగొండ శ్రీకాంత్* తదితరులు పాల్గొన్నారు.

ఆలయపున నిర్మాణానికి రంగాచార్యులు.!

ఆలయపున నిర్మాణానికి రంగాచార్యులు లక్ష 16 వేల విరాళం.

చిట్యాల, నేటిధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయానికి లక్షణాచార్యులు (మూకయ్య) గారి చిన్న కుమారుడు రంగాచార్యులు శివాలయానికి విరాళంగా 116000/- రూపాయలు అక్షరాల (ఒక లక్ష పదహారు వేల రూపాయలు) ఇవ్వడం జరిగింది… ఈ కార్యక్రమం లో శివాలయ కమిటీ సభ్యులు ఆలయ కమిటీ అధ్యక్షులు కసిరెడ్డి రత్నాకర్ రెడ్డి,ఉపాధ్యక్షులు మోతుకూరి నరేష్,బిళ్ళ సత్యనారాయణ రెడ్డి, మందల రాఘవరెడ్డి,కాల్వ సమ్మిరెడ్డి,బొమ్మ శంకర్, కొక్కుల సారంగం, మోతుకూరి రాజు,చెక్క నర్సయ్య,సర్వ శరత్, తీగల నాగరాజు,అనగాని రాజయ్య,తిప్పణవేణి రవి, ప్రధాన అర్చకులు రఘునందన్ తదితరులు పాల్గొన్నారు.

ఢిల్లీ గర్జనతో కేంద్ర ప్రభుత్వంలో వణుకు.

ఢిల్లీ గర్జనతో కేంద్ర ప్రభుత్వంలో వణుకు

-వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ లో చేసిన బీసీల పోరు గర్జనతో కేంద్ర ప్రభుత్వంలో వణుకు పుట్టిందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ అన్నారు. ఢిల్లీలో చేసిన బీసీ గర్జనను చూసైనా కేంద్రం తన వైఖరి మార్చుకోవాలన్నారు. సోమవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. గర్జన చూసి కేంద్ర ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తుందని భావిస్తే..బీసీ డిమాండ్లను పరిష్కరించకపోగా..ఎదురు దాడికి దిగడం బాధాకరమన్నారు. ఢిల్లీ ఉద్యమ స్ఫూర్తితో బీసీ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఉధృతం చేసి బిజెపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు. ఢిల్లీలో నిర్వహించిన బీసీల ఆందోళనతో దేశం మొత్తం బీసీల గొంతుకను వినిపించి, అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చామన్నారు. ఇక బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఏప్రిల్ చివరి వారంలో హైద్రాబాదులో 29 రాష్ట్రాల బీసీ ప్రతినిధులతో బీసీల రాజకీయ ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మే నెల రెండవ వారంలో పరేడ్ గ్రౌండ్ లో 10 లక్షల మందితో బీసీల యుద్ధభేరి బహిరంగ సభను నిర్వహించి సత్తా చాటుతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఢిల్లీలో జరిగిన బీసీల పోరు గర్జనకు 16 రాజకీయ పార్టీలు, 18 రాష్ట్రాల నుంచి 32 మంది పార్లమెంట్ సభ్యులు, 29 రాష్ట్రాల నుండి ఓబీసీ నాయకులు పాల్గొన్నారన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో బీసీల పోరుగర్జనలో పాల్గొనడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. బీసీల పోరుగర్జన సభకు వచ్చి మద్దతు తెలిపిన సీఎంతో పాటు మంత్రులు, వివిధ పార్టీల నేతలకు బీసీ సమాజం తరఫున మహేందర్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.

మచ్చ సోమయ్య చలి వేంద్రం ఏర్పాటు.

మచ్చ సోమయ్య చలి వేంద్రం ఏర్పాటు

మరిపెడ నేటిధాత్రి.

 

 

మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు ఎదురుగా మచ్చ సోమయ్య పేరు మీద వారి కుమారులు ప్రముఖ వ్యాపార వేత్త మచ్చ వెంకట్రామనర్సయ్య, తెలంగాణ రాష్ట్ర హాకా మాజీ చైర్మన్ మచ్చ శ్రీనివాస్, చలి వేంద్రo,మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేశారు,ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చలివేంద్రం,మజ్జిగ పంపిణీ,కార్యక్రమాన్ని మరిపెడ మండల వాసి డిఎస్పి కొండం పార్థసారధి గౌడ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని ప్రయాణికులు, పాదచరులు, రైతులు, ఆటో కార్మికులు, సబండ వర్గాల అవసరాల నిమిత్తం ఏర్పాటు చేయడం సంతోషదాయకమని అన్నారు. ప్రయాణికులు దప్పిక తీర్చుకో వడానికి,చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు తల్లాడ వెంకట రామారావు,మచ్చ బాస్కర్,పువ్వాడ హరిప్రసాద్, తల్లాడ సురేష్,బుద్ధ శ్రీనివాస్, కందిబండ ప్రసాద్, ఉప్పల వెంకన్న, ఉప్పల వెంకటేశ్వర్లు, తల్లాడ లోహిత్,ఆర్య వైశ్య సంఘం నాయకులుపాల్గొన్నారు.

ముత్యాల తలంబ్రాలను సమర్పించిన.!

ముత్యాల తలంబ్రాలను సమర్పించిన మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ఆర్సీ జీవెలర్స్ అధినేత కలకొండ రమేష్ చంద్ర. 

వనపర్తి నేటిదాత్రి :

 

వనపర్తి లో సీతారాముల కళ్యాణం సందర్భంగా వనపర్తి పట్టణం లోని అన్ని దేవాలయాలకు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ఆర్యవైశ్య సంగం మాజీ రాష్ట్ర రాజకీయ కార్యదర్శి మాజీఎంపీ రావు ల చంద్రశేఖర్ రెడ్డి శిష్యులు కలకొండ రమేష్ చంద్ర ముత్యాల తలంబ్రాలు సమర్పించారు . రామాలయం వెంకటేశ్వర దేవాలయం బాలాంజనేయ కన్యకపర్మేశ్వరి దేవాలయం నాగవరం మర్రికుంట పీర్లగుట్ట రాంనగర్ కాలనీ రాజానగరం జగత్పల్లి అచ్యుతాపురం దేవాలయాల్లో ముత్యాల తలంబ్రాలు అందచేశారు ఈ కార్యక్రమం లో
ఉంగ్లం తిరుమల్ ఆవుల రమేష్ మారం బాలీశ్వరయ్య విశ్వనాథం కలకొండ అనంతమ్మ జగదీష్తదితరులు పోల్గొన్నారు

బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి.

చేనేత కార్మికులకు మద్దతుగా బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి )

 

ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ని స్థానిక అంబేద్కర్ చౌక్ లో సిఐటియు వారి ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు కూలి పెంచే విషయంలో నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది అట్టి నిరాహార దీక్షలో పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ పక్షాన మద్దతు ఇస్తూ జిందాం చక్రపాణి మాట్లాడుతూ చేనేత కార్మికుల కోసం సిరిసిల్ల చేనేత చీరలకు ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చినటువంటి దానికి కూలి పెంచాలని, వైపని కార్మికులకు, వర్పిన్ కార్మికులకు మర మొగ్గల పవర్ లుమ్ కార్మికులకు కూలి పెంచాలని , తెలంగాణ రాష్ట్రంలోని చేనేత చీరలకు అత్యధికoగా ధర కల్పించాలని కోరుతూ ఈరోజు చేనేత కార్మికులకు మద్దతు పలకడం జరిగింది. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోదండ రమణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు ముషం రమేష్, మాజీ వార్డ్ కౌన్సిలర్ దార్ల సందీప్ కీర్తన, తదితర నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఝరాసంగం సంగమేశ్వరుడికి వారోత్సవ పూజలు.

ఝరాసంగం సంగమేశ్వరుడికి వారోత్సవ పూజలు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రములోని శ్రీ కేతకీ ఉమా సంగమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం విశేష పూజలను నిర్వహించారు. వారోత్సవ పూజల సందర్భంగా లింగ రూపంలో కొలువైన శివ మహాదేవునికి అభిషేకాలు, అలంకరణ గావించి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు. స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వేకువజామునుండే భక్తులు బారులు తీరారు.

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో.!

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సీతారాముల కళ్యాణం
వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు . కళ్యాణోత్సవంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజ్ శెట్టి దంపతులు వాసవి క్లబ్ వనపర్తి పట్టణ అధ్యక్షులు చిగుళ్ల పల్లి శ్రీనివాలు వనిత క్లబ్ అధ్యక్షురాలు సువర్ణ కె బుచ్చయ్య దంపతులు కూర్చున్నారు ఆలయ పూజారి చంద్రశేఖర్ శర్మ కళ్యాణోత్సవం ప్రత్యేక పూజలు చేయించారు అనంతరం పట్టణ ఆర్యవైశ్యులకు అన్నదానం ఏర్పాటు చేశారు వనపర్తి ఆర్యవైశ్య సంగం మాజీ అధ్యక్షులు ఆకుతోట దేవరాజ్ లగిశేట్టి అశోక్ లగిశెట్టి రమేష్ లింగం హరినాథ్ పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బచ్చురాం కాంగ్రెస్ పార్టీ నేత చుక్కయ్య శెట్టి న్యాయవాది బాస్కర్ వజ్రాల సాయిబాబా వై వెంకటేష్ కొండ విశ్వనాథం పూరిరిసురేష్ యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ అమరవాది నరేందర్ ప్రధాన కార్యదర్శి కల్వ బూపేష్.కుమార్ శెట్టి కొండ ప్రశాంత్ ఆర్యవైశ్యులు బచ్చురాం ఎలిశెట్టి వెంకటేష్ వజ్రాల సాయిబాబా మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి కలకొండ భాగ్యలక్ష్మి ప్రధాన కార్యదర్శి శ్రీమతి అనoత ఉమావతి కొండూరు మంజుల ప్రవీణ్ పిన్నo వసంత సహాయనిధి వైస్ చైర్మన్ శ్రీమతి కొండూరు మంజుల పురుషోత్తం పట్టణ ఆర్యవైశ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈసందర్భంగా వాసవి క్లబ్ తరుపున సీతారాముల కళ్యాణం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించామని వాసవి క్లబ్ అధ్యక్షులు ఉపాధ్యాయులు శ్రీనివాసులు ఒకప్రకటనలో తెలిపారు

కన్నుల పండుగగా రాముల వారి కళ్యాణం.

కన్నుల పండుగగా రాముల వారి కళ్యాణం.  

మరిపెడ నేటిధాత్రి.

 

మరిపెడ మండలం రాంపురం గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం లో కన్నుల పండుగగా రాముల వారి కళ్యాణం ఆదివారం జరిగింది. లోక కళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల బంధం అజరామరమైనది.లోక కళ్యాణం కారకం సీతారాముల కళ్యాణం. జన్మ పరంగా వచ్చే మలిన ఖర్మలు ఈ సందర్బంగా తొలిగిపోయే అవకాశం ఉంటుందనే భక్తుల్లో నమ్మకం, ఈ కళ్యాణ మహోత్సవం లో రామ సహాయం నరసింహారెడ్డి, మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో, మరియు గ్రామ ప్రజల అందరి సహకారంతో సీతారాముల కళ్యాణ మహోత్సవం తో పాటు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, వేద పండితులు శ్రీనివాస్ గీత దంపతులు రాముల వారి కల్యాణం నిర్వహించారు, భక్తి మార్గంలో నడిచే సీతా రాముల ఆశీర్వాదాంతో ప్రతి ఇంటిలో రాముడి ఆశీర్వాదాంతో శాంతి,సౌభాగ్యం కలగాలని,సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రామ సహాయం విష్ణువర్ధన్ రెడ్డి,జైపాల్ రెడ్డి, రాంపల్లి వెంకన్న,కేసముద్రం మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ రాంపల్లి వీరాంజి గౌడ్,లాయర్ రఘురామ్ రెడ్డి,పెండ్లి లింగరెడ్డి,వంగ పెద్ద వెంకన్న, ఈరాగాని శ్రీను,రాముల వారి కమిటీ సభ్యులు ఏల్ది చిన్న మల్లయ్య,అన్నం సత్యనారాయణ, ఊరుకొండ వెంకన్న,సత్య శ్రీనివాస్, ఈరాగాని రమేష్,ఎల్ది సాయి,వంశీ, సుధగాని డాక్టర్ నవీన్, ప్రవీణ్, దోమల విష్ణు గౌడ్,మహిళలు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈనెల 14 వరకు దరఖాస్తు చేసుకోండి.

ఈనెల 14 వరకు దరఖాస్తు చేసుకోండి.

నిజాంపేట, నేటి ధాత్రి

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాస పథకంలో భాగంగా మండల వ్యాప్తంగా యువత దరఖాస్తు చేసుకోవాలని నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలో మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ వికాస పథకానికి ఈ నెల 14 వరకు గడువును పొడిగించిందని అర్హత గల ప్రతి ఒక్కరూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పట్టణ అధ్యక్షుడు నజీరుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి పంజా మహేందర్, ఎం ఎస్ ఎస్ మండల అధ్యక్షులువెంకట్ గౌడ్, జాల శ్రీకాంత్ లు ఉన్నారు.

నిరుపేదలకు పెన్నిది సీఎం రేవంత్.

— నిరుపేదలకు పెన్నిది సీఎం రేవంత్

నిజాంపేట: నేటి ధాత్రి

 

నిరుపేదల పెన్నిధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సేవలు ఉన్నాయని నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో నిజాంపేట గ్రామానికి చెందిన పాక ప్రియాంక కు చెందిన చెక్కును 60వేల రూపాయలు పాక స్వామికి సోమవారం మండల కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుపేదల పెన్నిధిగా సేవలు చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట పట్టణ అధ్యక్షులు నజీరుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి పంజా మహేందర్, కాంగ్రెస్ నాయకులు వెంకట్ గౌడ్, జ్వాల శ్రీకాంత్, శ్రీకాంత్ గౌడ్ లు ఉన్నారు.

గ్రూప్ 1 ర్యాంకర్ జిన్నా తేజస్వినిరెడ్డికి ఘన సన్మానం. 

గ్రూప్ 1 ర్యాంకర్ జిన్నా తేజస్వినిరెడ్డికి ఘన సన్మానం. 

గట్లకానిపర్తి గ్రామ అభివృద్ధి కమిటీ

శాయంపేట నేటిధాత్రి:

 

తెలంగాణ రాష్ట్రంలో TGPSC ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్, మల్టీ జోన్1 లో మొదటిర్యాంక్ సాధించిన శాయంపేట మండ లం మాంధారిపేట గ్రామానికి చెందిన జిన్నా విజయపాల్ రెడ్డి కూతురు కుమారి తేజస్వి ని రెడ్డి అభినందిస్తూ గ్రామ అభివృద్ధి కమిటీ గట్లకానిపర్తి మరియు సీనియర్ జర్నలిస్ట్ & చీఫ్ ఎడిటర్ వరంగల్ వాయిస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మా నించడం జరిగింది. గ్రామ అభివృద్ధి కమిటీ తరుపున మెమంటో బహుకరించి, శాలువాతో సత్కరించడం జరిగింది. ఇదే సమయంలో కుమారి తేజస్వినిరెడ్డి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహిం చాలని కోరుకుంటూ భవిష్య త్తులో గట్లకానిపర్తి గ్రామంలో నిర్మించబోయే గ్రంధాలయ ప్రారంభోత్సవానికి రావాలని కోరగా అందుకు తను తప్ప కుండా హాజరవుతానని చెప్ప డంతోపాటు, గట్లకానిపర్తి గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు తెలుసుకొని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మద్దతు తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ & వరంగల్ వాయిస్ ఎడిటర్ గడ్డం కేశవ మూర్తి మరియు గట్లకాని పర్తి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న.!

శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి…

▪శ్రీ.సీతా రామచంద్రుల స్వామి దీవెనలతో నియోజకవర్గ ప్రజలంతా చల్లగా ఉండాలి…
– యన్.గిరిధర్ రెడ్డి

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

శ్రీరామ నవమి వేడుకలను పురస్కరించుకొని ఆదివారం రోజున జహీరాబాద్ పట్టణంలో ఘనంగా శోభయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ…దేశ స్థాయిలో శ్రీరామ నవమి వేడుకలను ఆనందాల మధ్య సంతోషలు నింపుకొని భక్తిశ్రద్ధలతో సీతారాముల కల్యాణ మహోత్సవాలను ప్రజలు ఘనంగా నిర్వహించుకోవడం ఎంతో గొప్పతనం అని ప్రజలు నిండుగా అభివృద్ధి చెందాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

N. Giridhar Reddy

 

సితా రామచంద్రస్వామి వారి దీవెనలతో జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి అని కోరుకున్నాను అన్నారు.ఈకార్యక్రమంలో జహీరాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్,మాజీ వైస్ యం.పి.పి.వి.రాములు,జహీరాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పి.నాగిరెడ్డి, సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి,ఖాసీంపూర్ మాజీ యం.పి.టి.సి రాజు,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి,సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి,అక్తర్ గోరి,బి.మల్లికార్జున్, ప్రజలు,భక్తులు,వివిధ సంఘాల నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం.

కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం రామకృష్ణాపూర్ పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం, విజయగణపతి దేవాలయంలో ప్రధాన పూజారులు వైభవంగా నిర్వహించారు. కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం జరిగింది. రాములోరి కళ్యాణాన్ని పట్టణంలోని భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి తిలకించారు. రాములోరి కళ్యాణ మహోత్సవంలో మందమర్రి ఏరియా జిఎం దేవేందర్ దంపతులు పాల్గొని దేవతా మూర్తుల తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు భక్తులకు మజ్జిగ, మంచినీటి సౌకర్యాలను కల్పించారు. ఈ మహోత్సవంలో ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జికి పునాది వేసిందే వివేక్ వెంకటస్వామి.

రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జికి పునాది వేసిందే వివేక్ వెంకటస్వామి…

పనులు పూర్తి కాగానే ప్రారంభించేది వివేక్ వెంకటస్వామి నే…..

మున్సిపల్ కాంగ్రెస్ శ్రేణులు…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతనపల్లి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణంకు నిధులు మంజూరు చేసింది, పనులు పూర్తి చేసింది కాంగ్రెస్ హయంలోనే అని, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నేతృత్వంలోనే నని రామకృష్ణాపూర్ కాంగ్రెస్ శ్రేణులు అన్నారు. గత పన్నెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న బ్రిడ్జి పనులు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో చివరిదశకు వచ్చిన నేపథ్యంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్లై ఓవర్ బ్రిడ్జి వద్ద సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ గడ్డం వంశి కృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

Bridge.

 

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 12 ఏళ్ల క్రితం ఎంపీగా ఉన్న వివేక్ వెంకటస్వామి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినప్పటికి అప్పటి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్లాల ఓదెలు, బాల్క సుమన్ బ్రిడ్జి నిర్మాణానికి శంఖుస్థాపనలు చేసి పనులను నత్త నడకన కొనసాగించి ఈ ప్రాంత ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రస్తుత ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని, పనుల్లో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవరోధాలు లేకుండా చేసి గెలిచిన సంవత్సరన్నర కాలంలోనే ఇచ్చిన మాట ప్రకారం బ్రిడ్జి పనులు పూర్తి చేశారని ఆనందం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చొరవతోనే పనులు పూర్తి అయ్యాయాయని చెప్పుకుంటున్న బిఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజరమేష్ కి సిగ్గు లేదా అని మండిపడ్డారు. త్వరలోనే బ్రిడ్జి ప్రారంభం చేసి ప్రాంత ప్రజల చిరకాల కోరికను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తీర్చుతారని నాయకులుb పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి ఓడ్నాల శ్రీనివాస్, నాయకులు అబ్దుల్ అజీజ్, గాండ్ల సమ్మయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం కళ, యాకూబ్ అలీ, కళ్యాణ్, శివకిరణ్, రాజేష్, సుధాకర్, బాణేష్, లాడెన్, మహిళా నాయకురాలు పాల్గొన్నారు.

పోక్లైన్ డబ్బాలో నిండా పైసలు.

పోక్లైన్ డబ్బాలో నిండా పైసలు.

కాంట్రాక్టర్ గుమస్తాలుగా మారిన టీఎస్ఎండిసి సిబ్బంది.

బొమ్మ పూర్ క్వారీలో లారీకి ఆరు వందలులు వసూల్.

వేబిల్ వద్ద 200, లోడింగ్ కు 300,

కాంట వెయ్యకుండానే ప్రతి లారీకి 600 చొప్పున తీసుకొని “వేబిల్ “ఇచ్చిన లారీలు.

కొన్ని రోజులుగా కాంటా బిల్ లేదు.

లారీ కాటా పై వచ్చి సెల్యూట్ కొట్టి వెళ్ళితే సరిపోతుంది, వే బిల్,రెడీ.

అడిగే పరిస్థితి లేదు, కాంట్రాక్టర్ వ్యక్తులు దాడికి సిద్ధంగా ఉంటారు.

ఉన్నత అధికారుల ఆదేశం, ఈ క్వారీ కాంట్రాక్టర్ డోంట్ కేర్ అనేలా కనబడుతుంది.

నా లారీ లోడ్ అయిపోయింది ఇప్పటికీ 600 ఇచ్చాను ఓ డ్రైవర్.

మహాదేవపూర్, నేటిధాత్రి:

ప్రభుత్వ ఆదేశాలు ఇసుక పాలసీ ఈ రెండు క్వారీల్లో మాత్రం అమలు పరచడం అసాధ్యంగా మారింది. ఇసుక లోడింగ్ వద్ద ఉన్న.” పోక్లైన్’ డబ్బాల నిండా పైసలు జమ చేసుకోవడం, వేబిల్ తోపాటు సీరియల్ వద్ద మరో రెండు రెండు వందల రూపాయలను వసూలు చేస్తున్నారు, అంతేకాకుండా గత కొన్ని రోజులుగా కేవలం ఇసుక లారీల్లో నింపి, కాంట చేయకుండానే బేబీల్లో లారీ యొక్క సైజులు పట్టి వే బిల్ ,లో ఇన్ని టన్నుల ఇసుక అని వేయడం జరుగుతుంది. కాటా చేయకుండా లారీల రవాణా వ్యవహారం అదనపు బకెట్ ఇసుక లారీల్లో నింపడం జరుగుతుందని స్పష్టం కావడం జరుగుతుంది. ఇంత జరుగుతున్నప్పటికీ ఈ రెండు క్వారీల్లో టీఎస్ ఎండిసీ శాఖ చర్యలకు బదులు, క్వారీ కాంట్రాక్టర్ గుమస్తాలుగా మారి అక్రమ వసూళ్లకు పాల్పడడం జరుగుతుంది.

తాడ్పాల్ వేసుకుంటున్న 600 తీసుకున్నారు వేబిల్ వద్ద 300 ఇచ్చాను డ్రైవర్.

 

లోడింగ్ పుక్లైన్ డబ్బాలో నిండా పైసలు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండలం బొమ్మ పూర్ గ్రామం పేరుతో గ్రామ శివారులో ఏర్పాటు చేసిన, బొమ్మ పూర్ ఒకటవ నంబర్, అలాగే ఎలికేశ్వరం రెండవ నంబర్, పేర్లతో గత సంవత్సరం నవంబర్ నెలలో ప్రారంభమైన ఈ రెండు ఇసుక క్వారీలు అక్రమ ఇసుక రవాణాకు పెద్ద మొత్తంలో తెరలేపడం జరిగింది, ప్రభుత్వం ఉన్నత అధికారులు ఈ రెండు ఇసుక క్వారీల పై ప్రత్యేక నిఘా పెట్టి ఉన్నత అధికారులు పర్యవేక్షించడం కూడా జరిగింది. అధికారంలో రాష్ట్ర ప్రభుత్వం ఇసుక రవ అక్రమ రవాణా పై అడ్డుకట్ట వేస్తూ కొత్త పాలసీని అమల్లోకి తీసుకురావడం జరిగింది. కానీ ఈ రెండు ఇసుక క్వారీల యజమాన్యం మాత్రం అధికారుల ఆదేశాలు ఇసుక పాలసీ ను తుంగలో తొక్కి, టీఎస్ ఎండిసీ అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకొని, అక్రమ వసూళ్ల నేటికీ కొనసాగిస్తుంది.

కాంట్రాక్టర్ గుమస్తాలుగా మారిన టీఎస్ఎండిసి సిబ్బంది.

మహాదేవపూర్ మండల పరిధిలోని పెద్ద మొత్తంలో ఇసుక రవాణా చేస్తున్న బొమ్మ పూర్, ఇలికేశ్వరం పేర్లతో నిర్వహించబడుతున్న ఈ రెండు క్వారీలు, టి ఎస్ ఎం డి సి సిబ్బంది అధికారులను తమ గుమస్తాగా మార్చుకొని, ఇసుక లోడింగ్ వద్ద ప్రతి లారీకి 300 రూపాయల వసూళ్లు చేయడం జరుగుతుంది. మరోవైపు లోడింగ్ కొరకు సీరియల్ వద్ద మరో 200 నుండి 300 వరకు, అలాగే వేబిల్ ఇచ్చే క్రమంలో మరో 200 రూపాలను లారీల నుండి తీసుకోవడం జరుగుతుందని డ్రైవర్లు నిర్భయంగా చెప్పడం జరుగుతుంది, లోడింగ్ పాయింట్ వద్ద లోడ్ చేసి అటువంటి ఫోక్లైన్ లో ప్రత్యేక డబ్బాలు ఏర్పాటు చేసి, లోడింగ్ కు వచ్చే, ప్రతి లారీ వద్ద 300 రూపాయలను తీసుకోవడం జరుగుతుంది, కొందరు డ్రైవర్లు 200 ఇచ్చిన లోడింగ్ చేసే ప్రసక్తి లేదని 300 ఇస్తేనే లోడింగ్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది.

కొన్ని రోజులుగా కాంటా బిల్ లేదు.

ఈ రెండు ఇసుక క్వారీల యజమాన్యం కొత్త రకమైన అక్రమానికి తెరలేపింది, గత కొన్ని రోజులుగా లోడింగ్ చేసుకొని వచ్చిన లారీ కాటా పైకి వెళ్లి, “సెల్యూట్ కొట్టి” వెళ్లిపోవాల్సిందే లారీలో ఎంత ఇసుక ఉంది, ఏమైనా ఎక్కువ ఇసుక వచ్చిందా లేదా తక్కువ వచ్చిందా అని కాంట చూసే ప్రసక్తి లేదు, లారీ సైజును బట్టి లారీలో వచ్చిన టన్నులను బేబీల్ లో వేయడం జరుగుతుంది, కాంట రిసిప్ట్ లాంటివి ఏమీ ఇవ్వడం లేదు, అడుగుతే కరెంటు లేదు, బ్యాటరీ ఇంవేటర్ చెడిపోయింది అని సమాధానం చెప్పడం, గట్టిగా ప్రశ్నించే పరిస్థితి అక్కడ లేదు, ఎందుకంటే కాంట్రాక్టర్ కు సంబంధించిన కొందరు ప్రశ్నించే వారిపై, లేదా ఫోటో వీడియో లాంటి వాటిని చిత్రీకరిస్తామని ప్రయత్నించిన ఆ డ్రైవర్లకు ఇతరులపై దాడికి సిద్ధంగా కొందరిని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ప్రశ్నించే పరిస్థితి లేదని స్పష్టంగా కనబడుతుంది.

ఉన్నత అధికారుల ఆదేశం, ఈ క్వారీ కాంట్రాక్టర్ “డోంట్ కేర్” అనేలా కనబడుతుంది.

ఉన్నత అధికారుల పర్యవేక్షణ అనంతరం కూడా బొమ్మ పూర్ ఎలికేశ్వరం ఇసుక క్వారీల అక్రమాలు, ఆగడం లేదంటే దీని వెనుక కారణం ఎవరు, టీఎస్ఎండిసి సిబ్బంది అధికారులు, ప్రభుత్వ ఆదేశాలను అమలుపరిచాల్సింది పోయి, కాంట్రాక్టర్ గుమస్తాలుగా మారి, వారితో కలిసి వసూళ్లు చేయడం జరుగుతుంది అంటే, దీని వెనుక అధికార యంత్రాంగం హస్తము కూడా ఉందని స్పష్టమవుతుంది. తక్షణమే మేనేజింగ్ డైరెక్టర్ టీఎస్ఎండిసి, జిల్లా కలెక్టర్ భూపాలపల్లి ఈ రెండు ఇసుక క్వారీలను సందర్శించి, అక్కడ జరుగుతున్న అక్రమాల పై డ్రైవర్ల తో వివరాలు సేకరించి, కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ సమ్మర్‌ హాట్‌ గురూ!!

ఏప్రిల్‌ నెలలో దేశవ్యాప్తంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు

గతంతో పోలిస్తే పెరగనున్న వేడి గాడ్పుల సంఖ్య

వృద్ధులు, పిల్లలు, మహిళలు జాగ్రత్తలు తీసుకోక తప్పదు

రాజధాని ఢల్లీిలో కాలుష్య నివారణ చర్యలు

పంజాబ్‌, హర్యానా, యు.పి.ల్లో ప్రత్యామ్నాయ పంటలవైపు రైతులకు ప్రోత్సాహం

సాధ్యమైనంత ఎక్కువ గడ్డిని పశుగ్రాసంగా మలచేందుకు చర్యలు

ప్రత్యామ్నాయ పంటలకు మద్దతు ధర ప్రకటిస్తేనే రైతులను ఒప్పించడానికి వీలు

వరిధాన్యాన్ని సేకరిస్తున్న ఎఫ్‌.సి.ఐ.

రైతులకు లాభం కలిగించే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఈ ఏడాది వేసవి ప్రారంభమైంది. ఏప్రిల్‌ 1 వచ్చిందటే వేసవి సీజన్‌ వచ్చేసినట్టే. ఇది జూన్‌ 30వరకు కొనసాగుతుంది. ఈసారి దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత అధికంగా వుండబోతున్నదని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. మండే ఎండలు మనుషుల జీవనశైలిపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి. ఎంతోమంది రోజువారీ పనులపై ఆధారపడి జీవనాన్ని గడిపేవారిపై వేసవి ఎండలప్రభావం అధికంగా వుంటుంది. ఏప్రిల్‌ నెలలో ఉష్ణోగ్రతలు బాగా పెరగడానికి ప్రధాన కారణంమార్చి నెలలో నెలలో వాతావరణం బాగా పొడిగా మారడం. వాతావరణంలో తేమ కొరవడడంతో గాలి తేలిగ్గా వేడెక్కుతుంది. ఫలితంగా ఈసారి దేశంలోని చాలా ప్రాంతాల్లో రాత్రి ఉష్ణో గ్రతలు సాధారణ స్థితికంటే ఎక్కువ నమోదయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ రకమైన ఉష్ణోగ్రత పెరుగుదల కనిపిస్తుంది. ఇదే సమయంలో నైరుతి మరి యు తూర్పు ప్రాంతాలు వేడి గాడ్పుల ప్రభావానికి లోనవుతాయని కూడా వాతావరణశాఖ అం చనా వేసింది. సాధారణంగా ఏప్రిల్‌`జూన్‌ మధ్యకాలంలో నాలుగు నుంచి ఆరు వరకు వేడి గాడ్పులు అనుభవంలోకి వస్తాయి. కానీ ఈఏడాది వీటి సంఖ్య ఆరు నుంచి పది వరకు పెరుగుతాయని స్పష్టం చేస్తోంది. 

వాతావరణశాఖ వేడి గాడ్పులను ఏవిధంగా నిర్ణయిస్తుందనే ప్రశ్న ఉదయించడం సహజమే. ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటి 47డిగ్రీల వరకు చేరతాయో అప్పుడు వేడి గాడ్పులు వీస్తున్నాయని నిర్ణయిస్తుంది. అయితే ఈ వేడిగాడ్పుల అంచనా అన్ని ప్రాంతాల్లో ఒకే రకమైన ఉష్ణోగ్రతల ఆధారంగా నిర్ణయించరు. ఉదాహరణకు మైదాన ప్రాంతాల్లో 40డిగ్రీలకు చేరుకున్నప్పుడు, కొండ ప్రాంతాల్లో 30డిగ్రీలకు చేరినప్పుడు, తీరప్రాంతాల్లో 37డిగ్రీలు నమోదయినప్పుడు, సాధారణ ఉష్ణోగ్రతల కంటే 4.5డిగ్రీల నుంచి 6.4డిగ్రీల సెల్షియస్‌ అదనంగా నమోదయినప్పుడు వేడిగాడ్పులు వీస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరుతుంది. 

ఏప్రిల్‌ాజూన్‌ మధ్యకాలంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత కంటే ఎ క్కువ నమోదయ్యే అవకాశాలుండగా, పశ్చిమాద్వీపకల్ప ప్రాంతం, తూర్పుామధ్య మరియు తూర్పు ప్రాంతాల్లో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇక దేశంలోని అధిక ప్రాంతాల్లోమాత్రం సాధారణ గరిష్టం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. అయితేదేశ వాయువ్య భాగానికి చెందిన సుదూర ప్రాంతాల్లో సాధారణ గరిష్ట ఉష్ణోత్రలు నమోదవుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది.

ఇక దక్షిణ ద్వీకల్ప భారత్‌లోని సూదూర ప్రాంతాల్లో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. దేశ ఈశాన్య, వాయువ్య భాగాలకు చెందిన కొన్ని సుదూర ప్రాంతాల్లో సాధారణ గరి ష్టం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఇదిలావుండగా సుదీర్ఘ వేడి గాడ్పుల వల్ల వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొనక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావారికీ ఈ పెరిగే ఉష్ణోగ్రతలు ఇబ్బందులు కలుగజేస్తాయి. ఈ నేపథ్యంలో ప్రజాఆర్యోగం దృష్ట్యా జాతీయ విపత్తు నివారణసంస్థ ఇందుకు అనుగుణమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు పరచాల్సి వుంది. ఈ ఏప్రిల్‌ నెలకు సంబంధించి వాతావరణశాఖ అందించిన మరో శుభవార్త ఏమిటంటే సాధారణ వర్షపాతం నమోదు కావడం. దేశంలోని పలు ప్రాంతాల్లో, సాధారణ వర్షపాతంలో 88`112% వరకు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. దేశ వాయువ్య ప్రాంతాలు, ద్వీపకల్ప భారత్‌, ఈశాన్య రాష్ట్రాలు, మధ్య, పశ్చిమ ప్రాంతాలకు చెందిన కొన్ని ప్రదేశాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. ఇక దేశం మిగిలిన ప్రాంతాల్లో ఈ నెలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదుకానుంది. ఈ శాఖ ఇచ్చిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఈనెలలో ఏప్రిల్‌ నెలలో 32.6% లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలుండగా, వాయువ్య ప్రాంతాల్లో 41.3%, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో 38.6%,మ ధ్యభారత్‌లో 39.3% లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి. ఇదే దక్షిణ ద్వీపకల్ప భారత్‌లో మాత్రం 33.6% అధిక వర్షపాతం నమోదు కానున్నదని అంచనా వేసింది. 

పంజాబ్‌, హర్యానాల్లో పంట మార్పిడి ప్రణాళికలు

ఢల్లీి, ఉత్తర భారత్‌లోని చాలా ప్రాంతాల్లో వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న కోసిన త ర్వాత పంట వ్యర్థాలను తగులబెట్టే ప్రక్రియ రాబోయే కాలంలో తగ్గిపోయే అవకాశాలు స్పష్టంగాకనిపిస్తున్నాయి. పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లోని పాలు ప్రాంతాల్లో వరిపండిరచే రైతులు పంట కోతల తర్వాత పెద్ద ఎత్తున పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల వాతావరణం కాలుష్య మయమైపోయి, ఇది క్రమంగా ఢల్లీి తదితర ప్రాంతాలకు గాలితోపాటు విస్తరించడంతో వాయు కాలుష్యం పెద్దఎత్తున చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు మోటారు వాహనాలకాలుష్యం కూడా జతకావడంతో ఢల్లీి వాసుల జీవితాలు దుర్భరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం వెతకాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. ఇందుకోసం జరిగిన యత్నాల కారణంగా ఈ రాష్ట్రాల్లో రాబోయే సీజన్‌లో ఐదులక్షల ఎకరాల్లో వరిపంటకు ప్రత్యా మ్నాయంగా పత్తి, మొక్కజన్న వంటి పంటలను సాగుచేసేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నా రు. ఇందుకోసం ఈ మూడు రాష్ట్రాలు రూపొందించిన ప్రణాళికను కమిషన్‌ ఫర్‌ ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ (సీఏక్యూఎం) సుప్రీంకోర్టుకు గతవారం ఒక నివేదికను సమర్పించింది. 

పంజాబ్‌లో ఏటా మే నెలలో వరి సీజన్‌ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో సీఏక్యూఎం సభ్యులు మూడు రాష్ట్రాల అధికార్లతో చర్చలు జరిపి వరి విస్తీర్ణాన్ని తగ్గించేందుకు వారు రూపొందించిన ప్రణాళికను కోర్టు ముందుంచారు. 2024 సీజన్‌లో పంజాబ్‌ రాష్ట్రంలో మొత్తం 3.15మిలియన్‌ హెక్టార్లలో వరి సాగు జరగ్గా 19.52 మిలియన్‌ టన్నుల వరిగడ్డి ఉత్పత్తి అయింది. అదేవిధం గా హర్యానాలో 1.5మిలియన్‌ హెక్టార్లలో వరి సాగు చేపట్టగా 8.10 మిలియన్‌ టన్నుల వరిగడ్డి ఉత్పత్తి అయింది. ఇక ఎన్‌సీఆర్‌ పరిధిలోకి వచ్చే ఉత్తరప్రదేశ్‌ ప్రాంతాల్లో గత ఏడాది 1,85000 హెక్టార్లలో వరి సాగు చేయగా, 0.74మిలియన్‌ టన్నుల వరిగడ్డి ఉత్పత్తి అయింది. ఇది లావుండగా ఈ మూడు రాష్ట్రాలు వరిగడ్డిని తగులబెట్టకుండా, వాటిని సమీపంలోని పరిశ్ర మలకు తరలించి పశువులకు ఆహారంగా తయారుచేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని కూడా ఈ రాష్ట్రాలు హామీ ఇచ్చినటు ఈ నివేదికలో పేర్కొన్నారు. 

ఢల్లీాిఎన్‌సీఆర్‌ (నేషనల్‌ కేపిటల్‌ రీజియన్‌) ప్రాంతంలో పెరుగుతున్న కాలుష్య నివారణకు తగిన చర్యలు తీసుకోవాలంటూ పర్యావరణ కార్యకర్త, అడ్వకేట్‌ మెహతా సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు, రాజధాని నగరంలో కాలుష్యానికి ప్రధాన కారకాలను గుర్తించింది. వాహనాలు, విచ్చలవిడిగా పటాసులను పేల్చడం, వరిగడ్డి కాల్చడం వల్ల వస్తున్న ధూళి ప్రధాన కారణాలుగా కోర్టు గుర్తించింది. వీటన్నింటి కారణంగా నగ రంలో కాలుష్యం స్థాయిలు విపరీతంగా పెరిగిపోయి వాయుకాలుష్యం అత్యధిక స్థాయిలకు చేరు తోంది. ముఖ్యంగా శీతాకాలంలో పంటకోతలు జరుగుతాయి. సరిగ్గా అప్పుడే వరిగడ్డిన తగులబెట్టడం వల్ల నగరవాసులకు నాలుగు వారాలపాటు కాలుష్య నరకం తప్పడంలేదు. 

పంజాబ్‌లో ప్రస్తుతం 18 ధాన్యాలనుంచి ఎథనాల్‌ను ఉత్పత్తి చేసే డిస్టిలరీలు పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 4,90,000 హెక్టార్లలో వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజన్న, చెరకు, పత్తి పంటసాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఏక్యూఎం తెలిపింది. హర్యానా ప్రభుత్వం కూడా 81,000 హెక్టార్లలో పంటమార్పిడికి చర్యలు తీసుకుంటోంది. ఇక ఉత్తప్రదేశ్‌ ప్రభుత్వం 11వేల హెక్టార్లలో మొక్కజన్న సాగుకు చర్యలు తీసుకుంటోంది. 

దేశ రాజధాని నగరంలో కాలుష్య నివారణకు అవసరమైన ప్రణాళికను రూపొందించాల్సిందిగా గత ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు సీఏక్యూఎంను ఆదేశించింది. ఇందుకోసం సంబంధిత అధికార్లతో చర్చలు జరపి ఒక నివేదికను తనుకు సమర్పించాలని కోరింది. పంటమార్పిడిని ప్రోత్సహించేందుకు తాను సిద్ధంగానే వున్నానని పంజాబ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇందుకు రైతులను ఒప్పించాలి. ఎందుకంటే మొక్కజన్న పంట సాగు చేస్తే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించక తప్పదు. అప్పుడు మాత్రమే వారిని ఒప్పించే అవకాశాలుంటాయి. అదే వరిపంటకైతే ఈబాధలే దు. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఈ వరి ధాన్య సేకరణ చేపడుతుందని, పంజాబ్‌ ప్రభు త్వం పేర్కొంది. గతవారం సీఏక్యూఎం సమర్పించిన ఈ నివేదికను, ఇంకా కోర్టు పరిశీలించాల్సి వుంది. 1985 నుంచి సుప్రీంకోర్టు ఢల్లీి కాలుష్యంపై దృష్టి సారించినప్పటికీ, 2017లో అడ్వకేట్‌ మెహతా పిల్‌ దా ఖలు చేసిన తర్వాత, పంట వ్యర్థాలను విచ్చలవిడిగా తగులబెట్టడాన్ని నిరోధించే చర్యలు చేపట్టా ల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం గమనార్హం.

error: Content is protected !!
Exit mobile version