ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య,

ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య,

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మొగుడంపల్లి మండలం ధనసిరి గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వాసురామ్ అనే యువకుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ధనాసిరి గ్రామంలో దారుణ హత్య.

ధనాసిరి గ్రామంలో దారుణ హత్య.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

సంగారెడ్డి: మొగుడంపల్లి మండలంలోని ధనాసిరి గ్రామంలో ఓవ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. గ్రామానికి చెందిన సత్తార్మియా కుమారుడు అబ్బాస్ (25) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. తన మిత్రులతో డైరీఫామ్ వద్ద దావత్ చేసుకుంటుండగా మరో ఇద్దరు వ్యక్తులు అక్కడికి చేరుకొని మారణాయుధాలతో ఆకస్మికంగా దాడిచేసి హత్య చేశారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version