మచ్చ సోమయ్య చలి వేంద్రం ఏర్పాటు
మరిపెడ నేటిధాత్రి.
మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు ఎదురుగా మచ్చ సోమయ్య పేరు మీద వారి కుమారులు ప్రముఖ వ్యాపార వేత్త మచ్చ వెంకట్రామనర్సయ్య, తెలంగాణ రాష్ట్ర హాకా మాజీ చైర్మన్ మచ్చ శ్రీనివాస్, చలి వేంద్రo,మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేశారు,ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చలివేంద్రం,మజ్జిగ పంపిణీ,కార్యక్రమాన్ని మరిపెడ మండల వాసి డిఎస్పి కొండం పార్థసారధి గౌడ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని ప్రయాణికులు, పాదచరులు, రైతులు, ఆటో కార్మికులు, సబండ వర్గాల అవసరాల నిమిత్తం ఏర్పాటు చేయడం సంతోషదాయకమని అన్నారు. ప్రయాణికులు దప్పిక తీర్చుకో వడానికి,చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు తల్లాడ వెంకట రామారావు,మచ్చ బాస్కర్,పువ్వాడ హరిప్రసాద్, తల్లాడ సురేష్,బుద్ధ శ్రీనివాస్, కందిబండ ప్రసాద్, ఉప్పల వెంకన్న, ఉప్పల వెంకటేశ్వర్లు, తల్లాడ లోహిత్,ఆర్య వైశ్య సంఘం నాయకులుపాల్గొన్నారు.