కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం రామకృష్ణాపూర్ పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం, విజయగణపతి దేవాలయంలో ప్రధాన పూజారులు వైభవంగా నిర్వహించారు. కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం జరిగింది. రాములోరి కళ్యాణాన్ని పట్టణంలోని భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి తిలకించారు. రాములోరి కళ్యాణ మహోత్సవంలో మందమర్రి ఏరియా జిఎం దేవేందర్ దంపతులు పాల్గొని దేవతా మూర్తుల తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు భక్తులకు మజ్జిగ, మంచినీటి సౌకర్యాలను కల్పించారు. ఈ మహోత్సవంలో ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.