సీఎం రేవంత్ చిత్ర పటానికి పాలాభిషేకం.

జహీరాబాద్: సీఎం రేవంత్ చిత్ర పటానికి పాలాభిషేకం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

వానాకాలం రైతు భరోసా రైతుల ఖాతాల్లో తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు జమ చేసి రికార్డు సృష్టించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మక్సుధ్ హైమద్ ఆన్నారు. మంగళవారం మొగుడంపల్లిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులకు వానాకాలం పంటల పెట్టుబడి సాయంగా ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా భారీగా నిధులు విడుదల చేయడం అభినందనీయమన్నారు.

నిరుపేదలకు పెన్నిది సీఎం రేవంత్.

— నిరుపేదలకు పెన్నిది సీఎం రేవంత్

నిజాంపేట: నేటి ధాత్రి

 

నిరుపేదల పెన్నిధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సేవలు ఉన్నాయని నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో నిజాంపేట గ్రామానికి చెందిన పాక ప్రియాంక కు చెందిన చెక్కును 60వేల రూపాయలు పాక స్వామికి సోమవారం మండల కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుపేదల పెన్నిధిగా సేవలు చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట పట్టణ అధ్యక్షులు నజీరుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి పంజా మహేందర్, కాంగ్రెస్ నాయకులు వెంకట్ గౌడ్, జ్వాల శ్రీకాంత్, శ్రీకాంత్ గౌడ్ లు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version