భూసమస్యల సత్వర పరిష్కారం కొరకై భూభారతి సదస్సులు.

భూ సమస్యల సత్వర పరిష్కారం కొరకై భూభారతి సదస్సులు.

#తహసిల్దార్ ముప్పు కృష్ణ.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

భూ సమస్యల సత్వర పరిష్కారం కోసమే గ్రామాలలో భూభారతి రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహసిల్దార్ ముప్పు కృష్ణ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని అర్షణ పల్లి, రాంపూర్ గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయగా రైతుల నుండి పలు సమస్యలపై 162 దరఖాస్తులను తహసిల్దార్ ముప్పు కృష్ణ నేరుగా స్వీకరించడమైనది అనంతరం ఆయన మాట్లాడుతూ. రైతుల నుండి వచ్చిన ప్రతి దరఖాస్తును రిజిస్టర్ లో నమోదు చేసుకొని దరఖాస్తుల ఆధారంగా రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ జరిపి భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు. ఈనెల 3 నుండి 20 వరకు మండలంలోని అన్ని గ్రామాలలో రెవిన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని ప్రజలు సదస్సులో పాల్గొని తమ భూ సమస్యలపై దరఖాస్తులు ఇవ్వాలని కోరారు. అలాగే సాదా బైనామా, వారసత్వం, డిజిటల్ సంతకం పెండింగ్, దేవుని పట్టా, మిస్సింగ్ సర్వే నెంబర్, విస్తీర్ణ సవరణ మొదలైన సమస్యలపై పరిష్కారం దిశగా భూభారతి పనిచేస్తుందని దానికి అనుగుణంగా రైతులు రెవెన్యూ సిబ్బందికి సహకరించి తగు సమయంలో వారి భూ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ మెంబర్ జ్యోతి, రెవిన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version