ప్రణాళికబద్ధంగా ప్రిపేర్ కావాలి.

ప్రణాళికబద్ధంగా ప్రిపేర్ కావాలి
– పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ అల్లం రమేష్

సిరిసిల్ల (నేటి ధాత్రి):

రాజన్న సిరిసిల్లా బీసీ స్టడీ సర్కిల్ ఉద్యోగ నైపుణ్య శిక్షణ కేంద్రానికి సిరిసిల్ల పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ అల్లం రమేష్ విచ్చేసి ఆర్ఆర్ బి, బ్యాంకింగ్, యస్ యస్ సి కోచింగ్ విద్యార్థిని విద్యార్థులకు మోటివేషన్ క్లాస్ చెప్పడం జరిగింది. తను చదువుకున్న స్థితి గతులు,ఇప్పుడు వస్తున్న పేపర్ మోడల్ గూర్చి, ఆర్థమెటిక్ అప్లికేషన్ మెథడ్,కరెంట్ అఫ్ఫైర్స్ గూరించి పూర్తిగా విశ్లేషణముగా చెప్పడం జరిగింది. ఇట్టి ఈ కార్యక్రమంలో బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి, కోర్స్ కోఆర్డినేటర్ హరీష్, ఫాకల్టీ నాగరాజు సార్,సిబ్బంది సురేష్, దివ్య, ప్రసాద్,మురళి, వనిత పాల్గొన్నారు.

రేపు శని అమావాస్య వేడుకలు.

రేపు శని అమావాస్య వేడుకలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

ఝరాసంగం మండల పరిధిలోని ఏడాకులపల్లి సప్తపురి శనిఘాట్ దేవాలయంలో శని అమావాస్య వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

ఉదయం 5గంటల నుంచి స్వామివారికి తైలాభిషేకం, శని మహాయజ్ఞం, మహా మంగళహారతి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

ఒప్పందాన్ని స్టార్ మీటర్ సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలి.

రాష్ట్ర ప్రభుత్వం సే కి ఒప్పందాన్ని స్టార్ మీటర్ సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలి

సిపిఎం నాయకులు డిమాండ్

పలమనేరు (నేటి ధాత్రి) మార్చి 28:

 

పలమనేరు మండలంలో విద్యుత్ కార్యాల నందు కరెంట్ ఆఫీసు నందు శుక్రవారం 28వ తేదీన ఉదయం 11 గంటలకి ధర్నా నిర్వహించినాము ఈ ధర్నా లో పట్టణ కార్యదర్శి గిరిధర్ గుప్తా మాట్లాడుతూ
28 మార్చి 2025
రాష్ట్ర ప్రభుత్వము స కి ఒప్పందాన్ని స్మార్ట్ మీటర్లు సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలని ప్రజలపై మోపుతున్న భారాలను వెంటనే రద్దు చేయాలని ప్రతిపక్షంగా ఉన్న టిడిపి జనసేన కూటమి మ్యానుఫెస్టివల్లో విద్యుత్ చార్జీలను నీ య నియంత్రస్తామని విద్యుత్ బిల్లులను తగ్గిస్తామని హామీ ఇచ్చినారు వైసిపి ప్రభుత్వ పాలనలో ఐదేళ్లలో రకరకాల పేరుతో వేసిన 32 కోట్ల . 166 కోట్ల బారాలతో బాధపడుతున్న రాష్ట్ర ప్రజలను ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారు ఐదు ఏళ్ళు కరెంటు చార్జీలు పెరగబోవుని భావించారు

ఆదా నీ– సే కి సోలార్ విద్యుత్ పై వైసీ ప్రభుత్వము తప్పు దోవ పట్టిస్తుందని ఉండగా ప్రతిపక్షం ప్రతిపక్షం ఉండగా నేటి ఆర్థిక శాఖ మంత్రులు పయ్యాల కేశవ్ గారు వివరించారు ఒక యూనిట్ కి విద్యుత్తు 1. 99 పైసలు వైసిపి ప్రభుత్వం 2 రూపాయల 49 పైసలకు ఒప్పందం చేసింది ఆనాటి యువతరం పాదయాత్ర సందర్భంగా 2023 జూలై రెండో తేదీన( 144వ రోజు సందర్భంగా) నెల్లూరు స్టార్ మీటర్లని పగలగొట్టాలని నారా లోకేష్ పిలుపునిచ్చార పుండు పై కారం చెల్లినట్టుగా
వ్యవసాయం పంపు సెట్ స్టార్ మీటర్లని దానిని పగలగొట్టాలని వారే ఉపన్యాసాలు ఇచ్చారు,
పలమనేరు కమిటీ ఈశ్వర మాట్లాడుతూ స్టార్ మీటర్లతో కొత్త భారం అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకి పి పెయిడ్ మీటర్లను బిగించి విద్యుత్తు పంపిణీ సంస్థను సిద్ధమయ్యాయి రాష్ట్రంలో
1 90 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులను ప్రస్తుతం ప్రభుత్వం పరిశ్రమలు వారి ప్రీపెయిడ్ మీటర్లు బిగిస్తున్నారు 200 యూనిట్లు దాటి గృహ వినియోగదారులు కూడా అమర్చి ఒక మీటర్ కి పదివేల 25 రూపాయలు చొప్పున అదనపుగా 56 లక్షల మీటర్లు అంగీకరించి ఆ దానికి అప్పగించినారు
పాల్గొన్నవారు రాజా శ్రీరామయ్య లక్ష్మయ్య రత్తమ్మ కైరునిషా సరోజమ్మ బాబు బాలకృష్ణ మొదటి వారు పాల్గొన్నారు..

విశ్వావసు నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ..

విశ్వావసు నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ..

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ బ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డులో సంస్థ కార్యాలయంలో విశ్వావసు నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ సమాజ బ్రాహ్మణ సమాజ సేవా సంస్థ ZHB శాఖ అధ్యక్షులు రాజ్కుమార్ దేశ్ పాండే హాజరై పంచాంగ పత్రికను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. రాసుల, గ్రహాల సంచారాన్ని పంచాంగం తెలియజేస్తుందని పేర్కొన్నారు

మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం..!

మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం..!

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలో ఈనెల 21న కురిసిన అకాల వర్షానికి చెట్లు విరిగి రోడ్లపై, మురికి కాలువలలో విరిగిపడ్డాయి. వారం రోజులు కావస్తున్నా మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఇదే విషయంపై మున్సిపల్ అధికారిని సంప్రదించగా తీయిస్తామని తెలిపారు. కానీ ఇంతవరకు మురికి కాలువలో నుంచి చెట్లను, చెత్తను ఇంకా తీయలేదు. మున్సిపల్ అధికారులు స్పందించి చెట్లను, మురికిని తీయించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

వాక్ బిల్లును వ్యతిరేకిస్తున్న ముస్లింలు.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వాక్ బిల్లును వ్యతిరేకిస్తున్న ముస్లింలు

జహీరాబాద్ .నేటి ధాత్రి:

కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఆస్తులకు సంబంధించిన బిల్లు రద్దు చేయాలని కోరుతూ ముస్లిం కమ్యూనిటీ వారు శుక్రవారం నమాజ్ తరువాత నల్లబ్యాడ్జీలు కట్టు కొని నిరసన తెలిపారు. వక్ఫ్ (సవరణ) బిల్లు,ను వ్యతిరేకించడానికి శుక్రవారం జహీరాబాద్ నియోజకవర్గ ఆయా మండలాలలో వివిధ ముస్లిం సంస్థలు ఏకమయ్యాయి.

Central Government.

పార్లమెంటులో ప్రవేశపెట్టబడిన ఈ బిల్లు, వక్ఫ్ బోర్డు పనులను క్రమబద్ధీకరించడం మరియు వక్ఫ్ ఆస్తుల నిర్వహణను మెరుగుపరచడం లక్ష్యంగా 1995 వక్ఫ్ చట్టాన్ని సవరించడానికి ప్రయత్నిస్తుందాని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, ప్రతిపాదిత సవరణ తమ విశ్వాసంపై ప్రత్యక్ష దాడి అని వారు పేర్కొన్నారు మరియు దానిని ఆమోదించవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. “రాబోయే రోజుల్లో మేము మరింత శక్తితో ముందుకు వచ్చి ప్రభుత్వానికి ఈ బిల్లును అనుమతించబోమని సందేశం వ్యక్తం చేశారు
ఇది ముస్లింల ఆస్తి ఎందుకంటే ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ను ముస్లింల పెద్దలు తన వాటాలో ఉన్న భూమి దానమిచ్చిన ఆస్తి ఇది అన్నారు ఇది ప్రభుత్వ ఆస్తులు కాదన్నారు. బిల్లును ఆమోదిస్తే ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆధ్వర్యంలో దేశమంతా ధర్నాలు నిరాసనాలు జరుగుతాయన్నారు.

రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఎమ్మార్వోకి వినతిపత్రం.

రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఎమ్మార్వోకి వినతిపత్రం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..

 

.తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన రెడ్డిసంఘం సభ్యులు తంగళ్ళపల్లి ఎమ్మార్వో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం గోపాలరావు పల్లె రెడ్డి సంఘం ఆధ్వర్యంలో మహంకాళి అమ్మవారి గుడి నిర్మించుట కొరకు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో కుల సభ్యులం అందరము నిర్ణయించడం జరిగిందని దీని ప్రకారం గోపాలపల్లి గ్రామంలో బే ద్రెంపల్లి వెళ్లే దారిలో స్థానిక ఐకెపి సెంటర్ దగ్గర గుట్ట బోరు ఉన్నందున ఇట్టి భూమి సర్వే నెంబర్.647. లో ఉన్నస్థలాన్ని స్థానిక మహంకాళి అమ్మవారి గుడికి స్థలంఇవ్వడానికి ప్రొసీడింగ్ ఇవ్వాలని ఇవ్వాలని స్థానిక రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఎమ్మార్వోకి కలిసి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షులు ఏసి రెడ్డి నరసింహారెడ్డి ఉపాధ్యక్షులు కరుణాకర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి కాసర్ల నర్సింహారెడ్డి సభ్యులు తంకర తిరుపతి రెడ్డి ఆలూరి బాల్రెడ్డి రాజిరెడ్డి బింద్రపు రాజిరెడ్డి ఎగుమంటి సాయి రెడ్డి కాసర్ల లిజీ ప్ రెడ్డి రెడ్డి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు

తహసీల్దార్ కార్యాలయం వద్ద చలివేంద్రం.

తహసీల్దార్ కార్యాలయం వద్ద చలివేంద్రం

నిజాంపేట: నేటి ధాత్రి

మండల కేంద్రంలో గల తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ఇంచార్జ్ తహసీల్దార్ రమ్య శ్రీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… గ్రామానికి చెందిన పాక మైసయ్య జ్ఞాపకార్థంగా వారి కుమారుడు నాగరాజు చలివేంద్రం ఏర్పాటు చెయ్యడం సంతోషంగా ఉందన్నారు. అలాగే జిల్లా కలెక్టర్, ఆర్డీఓ రమాదేవి ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. ఈ కార్యక్రమం లో రెవిన్యూ సీనియర్ అసిస్టెంట్ రమేష్, ఆర్ ఐ ప్రీతి, కంప్యూటర్ శ్రీకాంత్ గౌడ్, కళ్యాణ్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

చందుర్తి సర్కిల్ కార్యాలయం చందుర్తి రుద్రంగి పోలీస్ స్టేషన్లు.

చందుర్తి సర్కిల్ కార్యాలయం,చందుర్తి, రుద్రంగి పోలీస్ స్టేషన్లు సందర్శించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ఐపీఎస్.
ప్రజలకు అందుబాటులోకి ఉంటూ సమర్థవంతమైన సేవలు అందించాలి..

సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో విజిబుల్ పోలీసింగ్ పై దృష్టిసారించాలి..

చందుర్తి, నేటిధాత్రి:

 

శుక్రవారం రోజున చందుర్తి సర్కిల్ కార్యాలయం, చందుర్తి , రుద్రంగి పోలీస్ స్టేషన్లతో పాటుగా రుద్రంగి మానాల చెక్ పోస్ట్ ,లింగంపేట గ్రామశివారులో ఉన్న పోలీస్ అమరవీరుల స్తూపం సందర్శించిన అనంతరం పోలీస్ స్టేషన్ల పరిసరాలు, సిబ్బంది పని తీరు,సర్కిల్ పరిధిలో నమోదు అవుతున్న కేసుల వివరాలు, పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకుని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

Rudrangi PS

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ సంవర్దవంతమైన సేవలు అందజేస్తు సత్వర న్యాయం జరిగేలా కృషి చేయాలన్నారు.విజిబుల్ పోలీసింగ్లో భాగంగా అధికారులు,విలేజ్ పోలీస్ అధికారులు తరచు గ్రామాలు పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతు ప్రజలకు సైబర్ నేరాలు,ట్రాఫిక్ నియమాలు,అక్రమ బెట్టింగ్ ,గేమింగ్ యాప్స్ కలుగు అనర్ధాలపైమరియు తదితర అంశాల మీద అవగాహన కల్పించాలని, గ్రామ స్థాయిలో ఇన్ఫర్మేషన్ వ్యవస్థ పటిష్టం చేసుకోని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు.

Rudrangi PS

స్టేషన్ల పరిధిలో ప్రమాదాల నివారణకు ప్రతీ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, వాహనల తనిఖీలు నిర్వహించాలని అన్నారు. పాత నేరస్థుల కదలికలపై నిఘా పెడుతూ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఎస్పీ వెంట సి.ఐ వెంకటేశ్వర్లు, ఎస్.ఐ లు అశోక్, అంజయ్య, పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.

వైన్స్ ను తనిఖీ చేసిన ఎక్స్సైజ్ అధికారులు.

— వైన్స్ ను తనిఖీ చేసిన ఎక్స్సైజ్ అధికారులు

నిజాంపేట: నేటి ధాత్రి

 

మండలంలోని రెండు వైన్స్ లను రామాయంపేట ఎక్స్సైజ్ సీఐ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం తనిఖీ చేశారు. మద్యం షాపులో రికార్డులను పరిశీలించి మాట్లాడారు .. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మద్యం అమ్మకాలు జరపాలని నిర్వాహకులకు సూచించడం జరిగిందన్నారు. వైన్స్ లో స్టాక్ నిల్వ ఉండేలా చూసుకోవాలని సూచించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో ఎక్స్సైజ్ ఎస్ఐ సిద్దార్థ, సిబ్బంది ఉన్నారు.

ఎమ్మెల్యే దొంతికి మంత్రి పదవి కేటాయించాలి.

ఎమ్మెల్యే దొంతికి మంత్రి పదవి కేటాయించాలి

రాజకీయ నిబద్ధత,నిజాయితీకి నిదర్శనం దొంతి

మంత్రి పదవికి ఎమ్మెల్యే దొంతి అర్హుడు

పార్టీకి చేసిన త్యాగాన్ని హైకమాండ్ గుర్తించాలి

టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్

నర్సంపేట,నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో మరో ఆరు మంత్రి పదవులను భర్తీ చేయాలని చూస్తున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ నాయకుడు రాజకీయ నిబద్ధతకు నిజాయితీకి నిదర్శనమైన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డికి మంత్రిపదవి కేటాయించాలని టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ ప్రభుత్వాన్ని కోరారు.

శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామానంద్ మాట్లాడుతూ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నోవ్యాయ ప్రయాసాలు ఒడిదుడుకులను అనుభవిస్తూ నర్సంపేట గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేసిన నాయకుడు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అని అన్నారు.

నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామ సర్పంచిగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి సొసైటీ చైర్మన్ గా డిసిసిబి చైర్మన్ గా ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సుదీర్ఘకాలం పనిచేసి పిసిసి సభ్యులుగా ఏఐసీసీ సభ్యులుగా పదవులు చేపట్టి నిబంధత క్రమశిక్షణ కమిట్మెంట్ కు మారుపేరుగా నిలిచి కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసం జీవితాన్ని దారపోసి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి రాష్ట్ర నాయకుడిగా గుర్తింపు పొంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తూ వారు చేపట్టిన పాదయాత్రలో చురుకైన పాత్ర పోషించారని పేర్కొన్నారు.

2004 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీల పొత్తులో భాగంగా నర్సంపేట టికెట్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంభంపాటి లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయిస్తే కలత చెందకుండా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను ఏకతాటిపై నడిపించి లక్ష్మారెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించాడని అన్నారు.

2009లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి కొద్దిపాటి తేడాతో ఓటమి చెందినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తూ వచ్చారని 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం దొంతి మాధవరెడ్డికి టికెట్ కేటాయించకుండా మోసంచేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నియోజకవర్గ ప్రజల బలమైన కోరికతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఏకైక స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్రవ్యాప్తంగా దొంతి మాధవరెడ్డి ప్రభంజనం సృష్టించారని వివరించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు నీతిమాలిన రాజకీయాలు చేస్తూ పదవుల కోసం జంపుజిలానిలుగా మారి టిఆర్ఎస్ పార్టీలో కిరాయిప్పులకు పాల్పడుతుంటే అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వతంత్ర ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని టిఆర్ఎస్ పార్టీకి ఆహ్వానించినప్పటికీ అలాగే మంత్రి పదవి ఇస్తామని కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఆఫర్లు చేసిన ఆశపడకుండా కాంగ్రెస్ పార్టీని వీడకుండా మాతృపార్టీపై ప్రేమతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీలో చేరి తన రాజకీయ నిబద్ధతను చాటుకోవడం జరిగిందని గుర్తుకు చేశారు.

2014 నుండి 2018 వరకు ఎమ్మెల్యేగా నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తూ అప్పటి అధికార పార్టీ ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసిన నిఖర్సగా ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడిన గొప్ప నాయకుడు దొంతి మాధవరెడ్డి అని అభివర్ణించారు.

2018 ఎన్నికల ముందు టీపీసీసీ అధ్యక్షులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్రను ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముందుండి నిర్వహిస్తూ నడపారన్న విషయాన్ని గుర్తు చేశారు.

2018 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పార్టీ కోసం నిలబడే వ్యక్తిగా గుర్తింపు పొందిన నాయకుడని దాదాపు నర్సంపేట నియోజకవర్గం ఏర్పడి 45 ఏళ్ల చరిత్రలో చేతి గుర్తుపై గెలిచిన దాఖలాలు లేకపోగా మొదటిసారి నర్సంపేట గడ్డపై కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై గెలిచి చరిత్ర తిరిగరాశాడన్నారు.

కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ అధిష్టానం పార్టీలు ఫిరాయింపులు చేసిన వారికి కొత్తగా వివిధ పార్టీల నుండి పదవుల కోసం పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులను ఇవ్వడం వరంగల్ ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని గుర్తించి మంత్రిపదవి ఇవ్వకుండా వరంగల్ ఉమ్మడి జిల్లా అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను నిరాశకు గురి చేయడం సరికాదని వాపోయారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వంలో భర్తీ చేయనున్న మంత్రి పదవుల్లో రాజకీయ నిబద్ధతకు నిదర్శనంగా ఉన్న ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారికి మంత్రి పదవిని కట్టబెట్టి నర్సంపేట ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లకు టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఓబీసీ అధ్యక్షులు ఓర్సు తిరుపతి, నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు భూసాని సుదర్శన్, బీరం భరత్ రెడ్డి, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి చిప్ప నాగ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి జన్ను మురళీ, నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ములుకల మనీష్, పున్నం రాజు, భూక్య గణేష్, కొత్తగట్టు ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు

మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ క్షమాపణ.

మంత్రి సీతక్క ( ఆదివాసీ ) కు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ క్షమాపణ చెప్పాలి

ఆదివాసీలు అంటే అంత చులకనా

*రాష్ట్ర మొదటి అధికార భాష
తెలుగు తెలుగు తెలియనిమీరు తెలంగాణ శాషనసభలోఉండడం సబబా?
సాగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.

జమ్మికుంట :నేటిధాత్రి

 

మంత్రి గారికి హిందీ, ఇంగ్లీష్ రాదు .. సరే ..
మరి
మీకు తెలుగు ఎందుకు రాదు ?
రాష్ట్ర మాతృబాష తెలుగు
రాష్ట్ర మొదటి అధికార భాష తెలుగు.
అలాంటి తెలుగు తెలియని
తెలంగాణ శాషన సభలో
మీరు ఉండటం సబబా .
హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిగారు కదా !
రాష్ట్రం లో మెజారిటీ ప్రజలు మాట్లాడే మొదటి అధికార బాషా తెలుగు నేర్చుకోవాలనే సామజిక బాధ్యత మీకు ఉండాలి కాని లేదు.

అసెంబ్లీ లో అందరు సభ్యులు మంత్రులు తెలుగులోనే మాటాడుతున్నప్పుడు ఏం అర్ధం అవుతుంది మీకు ?

ఏదోకటి అసెంబ్లీ లో ఇంగ్లీష్ లో స్పీచ్ ఇచ్చేసి వెళ్ళిపోతే సరిపోతుందా ?

రాష్ట్రం లో సమస్యలు నీకు ఎలా అర్ధం అవుతాయి మీకు ?

ఇతరులకు
హిందీ , ఇంగ్లీష్ రాకపోతే
వారిపై అంత చిన్న చూపా ?

ఆదివాసీలు ( ఎస్టీ ) లు అంటే
అంత చిన్న చూపా ?

మీ అహంకారాన్ని తగ్గించుకొని ,

ఆదివాసీ బిడ్డ అయిన
గౌరవ మంత్రివర్యులు
సీతక్క గారికి మీరు
క్షమాపణ చెప్పాలి.

అప్పుడే మీరు ఉన్న
శాసన సభ కు ,
శాసన సభ్యులు గా ఉన్న మీకు
గౌరవం ..

కొసమెరుపు…

మంత్రి సీతక్క ను అవమానించిన అక్బరుద్దీన్ ఓవైసీ మాటలను ఖండించక పోవడం , శాసన సభలో ఎవరూ కూడా సీతక్కకు క్షమాపణ చెప్పాలి అని నిలదీయక పోవడం  ఆశ్చర్యం.

కేంద్ర మంత్రి కుమారస్వామితో ఎంపీ వద్దిరాజు భేటీ.

ఎంపీ వద్దిరాజు కేంద్ర మంత్రి కుమారస్వామితో భేటీ

“నేటిధాత్రి” న్యూఢిల్లీ.

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డి.కుమారస్వామితో శుక్రవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు.ఎంపీ రవిచంద్ర పార్లమెంటులోని మంత్రి ఛాంబర్ లో ఆయన్ను కలిసి ఆదిలాబాద్ వద్ద ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ప్లాంటును పునరుద్ధరించాల్సిందిగా కోరుతూ వినతిపత్రం అందజేశారు.

Kumaraswamy

వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేయడంలో భాగంగా నెలకొల్పిన ఈ పరిశ్రమ కొన్నేళ్లుగా మూతపడడంతో కార్మికులు,వారి కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారని ఎంపీ రవిచంద్ర మంత్రి కుమారస్వామికి వివరించారు.ఈ విషయమై మాజీ మంత్రి జోగు రామన్న నాయకత్వాన కార్మిక నాయకులతో కూడిన ఒక ప్రతినిధి బృందం వచ్చే నెల 2వతేదీన ఢిల్లీ వస్తున్నదని,వారు కలిసేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాల్సిందిగా ఎంపీ వద్దిరాజు కోరగా, మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించారు.

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చేయూత.

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చేయూత

 

పాలకుర్తి నేటిధాత్రి

 

ఎస్సీ కాలనీకి చెందిన గాయాల మధు (మానసిక వికలాంగుడు) అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ట్రస్ట్ తరుపున పూర్తి సహకారంగా ఉంటామని ధైర్యం చెప్పి 25 కేజీల బియ్యం, నిత్యావసరాలు, కూరగాయలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ యతిపతి శ్రీకాంత్, జనరల్ సెక్రటరీ జీడి హరీష్, కోశాధికారి ఒర్రె కుమారస్వామి, ట్రస్ట్ సభ్యులు పెండ్లి భాస్కర్, తాళ్లపెళ్లి రత్నాకర్, ఈ కార్యక్రమంలో గాదేపాక భాస్కర్, మృతుడి కుటుంబసభ్యులు, తదితరులు పాల్గొన్నారు

మున్సిఫ్ కోర్ట్ బార్ అసోసియేషన్ ఎన్నికలు.

చేర్యాల లో మున్సిఫ్ కోర్ట్ బార్ అసోసియేషన్ ఎన్నికలు

అధ్యక్షుడిగా ఆరెల్లి వీర మల్లయ్య ఎన్నిక

చేర్యాల నేటిదాత్రి

 

చేర్యాల మున్సప్ కోర్ట్ పరిధిలో జరిగిన ఎన్నికలలో ఎన్నికల అధికారిగా భూమిగారి మనోహర్ వ్యవహరించారు చేర్యాల మున్సఫ్ కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఆరెల్లి వీర మల్లయ్య ఎన్నికయ్యారు ప్రధాన కార్యదర్శిగా తాటికొండ ప్రణీత్ ఎన్నుకోబడ్డారు.

Tatikonda Praneeth

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేర్యాల మున్సఫ్ కోర్టులో రెగ్యులర్ జడ్జి నియమాకానికి కృషి చేస్తానని మరియు పూర్తిస్థాయి కోర్టు సిబ్బంది నియమకానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పొన్నం సురేష్ కృష్ణ గుస్కా వెంకటేష్ పి యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు

ఎండ తీవ్రతకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎండ తీవ్రతకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి *

మొగుళ్లపల్లి కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు క్యాతరాజు రమేష్

నేటిధాత్రి మొగుళ్ళపల్లి :

 

మొగుళ్లపల్లి మండల ప్రజలకు మరియు, ,పరిసర ప్రాంతాల ప్రజలకు వేసవి ఎండల తీవ్రతలకు ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల ప్రజలు వడ దెబ్బకు గురయ్యే అవకాశం వుంది వడదెబ్బ సోకకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు క్యాతరాజు రమేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఉపాధి హామీ పనులతో పాటు వ్యవసాయ పనుల నిమిత్తం కుళి పనులకు వెళుతున్న కూలీలు వడ దెబ్బ సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి క్లుప్తంగా వివరించామని చెప్పారు. వడ దెబ్బ నివారణకై ప్రజలు,కూలీలు అందరూ రోజుకి 10 గ్లాసుల కన్నా ఎక్కువ నీరు త్రాగాలన్నారు.బయటికి వెళ్లినప్పుడు గొడుగు,టోపీ, తలపాగ,తెల్లని కాటన్ దుస్తులు ధరించాలని సూచించామన్నారు. ఉదయం,సాయంత్రం ఎండ లేని సమయంలో పనులు చేసుకోవాలని,ఎండ వేడిమికి డి హైడ్రెషన్ కాకుండా ఉండడానికి ఓఆర్ఎస్ ద్రావణాన్ని త్రాగాలని సూచించారు.

లైసెన్సులను రెన్యువల్స్ చేయించిన.!

దాడ్వాయి హమాలి కార్మికుల లైసెన్సులను రెన్యువల్స్ చేయించిన
* జమ్మికుంట వ్యవసాయమార్కెట్ చై _ర్ పర్సన్

* జమ్మికుంట:నేటిధాత్రి

* ఈరోజు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం ఆధ్వర్యంలో మార్కెట్లో పనిచేయుచున్న హమాలీ, దాడ్వయి, కార్మికులకు రెన్యువల్స్ లైసెన్సును జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి మల్లేశం ద్వితీయ శ్రేణి కార్యదర్శి శ్రీ ఎం రాజు ఆ ఆడ్తి దారుల మరియు హమాలీ సంఘం సభ్యులు దాడ్వయి సంఘం సభ్యులు మరియు అడ్తిదారుల మరియు హమాలీ సంఘం దాడ్వయి సంఘం అధ్యక్షులు ఎర్రవెల్లి రాజేశ్వరరావు మరియు_ సిబ్బంది పాల్గొన్నారు.

కవి గాయకుడు రామంచ భరత్ కు ఢిల్లీలో ఘన సన్మానం.

కవి గాయకుడు రామంచ భరత్ కు ఢిల్లీలో ఘన సన్మానం

జమ్మికుంట :నేటిధాత్రి

ప్రముఖ ధూమ్ ధామ్ కళాకారుడు కవి గాయకుడు రామంచ బ్రతుకు ఢిల్లీలో ఘన సన్మానం జరిగింది ఇండియన్ కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోను ముద్రించాలని డిమాండ్ చేస్తూ జేరిపోతుల పరుశురామ్ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్మంతర్ వద్ద బుధవారం రోజున సుమారు వందమంది తెలంగాణ కళాకారులతో ధూంధాం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మద్దతుగా పలువురు తెలుగు రాష్ట్ర ఎంపీలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని స్థాపించిన మేధావి అంబేద్కర్ అని తెలిపారు అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితులను సరిదిద్దు దేశంలో నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టిన బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని కరెన్సీ నోట్ల మీద తప్పకుండా ముద్రించాలని అన్నారు అనంతరం ధూంధాం లో పాల్గొన్న కళాకారులకు ఘనంగా సన్మానం చేసి ఈ కార్యక్రమంలో ఎంపీలు ఈటల రాజేందర్, ఆర్ కృష్ణయ్య ,బీద మస్తాన్ రావు , వాకులాభరణం కృష్ణమోహన్రావు, అప్పలనాయుడు, ప్రసిద్ధ ధూమ్ ధాం కళాకారులు ఏపూరి సోమన్న, వల్లాల వాణి చెరుకు మల్లికా ,రేలారె గంగా ముక్కెర సంపత్ , గంట గల్లా సంజీవ్ మా పల్లె శంకర్ ,గ్యారయాకయ్య ,రేలారే గంగా దిబ్బట పుష్పలత, మేకల శ్రావణి ,స్వప్న తదితర వందమంది కళాకారులు పాల్గొన్నారు

కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వం.

* కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వం…………..

భూపాలపల్లి జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకుడు* –

అజయ్ రెడ్డి యార నేటి ధాత్రి మొగుళ్ళపల్లి

తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం(కాంగ్రెస్ ప్రభుత్వం) రైతుకు న్యాయం జరగాలి అని 2 లక్షల రూపాయలు ఏక కాలంలో రుణ మాఫీ చేసి రైతు భరోసాను పది వేల నుండి పన్నెండు వేల రూపాయలకు పెంచి చిన్న సన్న కారు రైతులకు ఎంతో మేలు జరిగేలా చేస్తుంది.

అంతే కాకుండా నిరు పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి ఐదు లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుంది మరియు విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తుంది.

రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు గృహ అవసరాలకు ఇవ్వడం జరుగుతుంది మరియు మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షల రూపాయలకు పెంచి కార్పోరేట్ హాస్పటల్ లో పేద ప్రజలు చికిత్స పొందేలా చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చదువుకున్న విద్యార్థులకు 50 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టి నియామక పత్రాలు అందజేశారు. అంతే కాకుండా నిరుద్యోగులకు 4 లక్షల వరకు 60 శాతం సబ్సిడీతో రుణాలు అందించాలని దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన చేపట్టి బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలకు మరెన్నో ప్రయోజనాలు అందించాలని, నిత్యం ప్రజల ప్రయోజనాల కోసం మరియు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడతాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఇందుకు గాను భూపాలపల్లి జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకుడు యార అజయ్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు.

ఎమ్మెల్యే దొంతికి మంత్రి పదవి కేటాయించాలి.

ఎమ్మెల్యే దొంతికి మంత్రి పదవి కేటాయించాలి

రాజకీయ నిబద్ధత,నిజాయితీకి నిదర్శనం దొంతి

మంత్రి పదవికి ఎమ్మెల్యే దొంతి అర్హుడు

పార్టీకి చేసిన త్యాగాన్ని హైకమాండ్ గుర్తించాలి

టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్

నర్సంపేట,నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో మరో ఆరు మంత్రి పదవులను భర్తీ చేయాలని చూస్తున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ నాయకుడు రాజకీయ నిబద్ధతకు నిజాయితీకి నిదర్శనమైన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డికి మంత్రిపదవి కేటాయించాలని టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ ప్రభుత్వాన్ని కోరారు.

శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామానంద్ మాట్లాడుతూ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నో
వ్యాయ ప్రయాసాలు ఒడిదుడుకులను అనుభవిస్తూ నర్సంపేట గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేసిన నాయకుడు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అని అన్నారు.

నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామ సర్పంచిగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి సొసైటీ చైర్మన్ గా డిసిసిబి చైర్మన్ గా ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సుదీర్ఘకాలం పనిచేసి పిసిసి సభ్యులుగా ఏఐసీసీ సభ్యులుగా పదవులు చేపట్టి నిబంధత క్రమశిక్షణ కమిట్మెంట్ కు మారుపేరుగా నిలిచి కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసం జీవితాన్ని దారపోసి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి రాష్ట్ర నాయకుడిగా గుర్తింపు పొంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తూ వారు చేపట్టిన పాదయాత్రలో చురుకైన పాత్ర పోషించారని పేర్కొన్నారు.

2004 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీల పొత్తులో భాగంగా నర్సంపేట టికెట్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంభంపాటి లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయిస్తే కలత చెందకుండా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను ఏకతాటిపై నడిపించి లక్ష్మారెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించాడని అన్నారు.

2009లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి కొద్దిపాటి తేడాతో ఓటమి చెందినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తూ వచ్చారని 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం దొంతి మాధవరెడ్డికి టికెట్ కేటాయించకుండా మోసంచేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నియోజకవర్గ ప్రజల బలమైన కోరికతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఏకైక స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్రవ్యాప్తంగా దొంతి మాధవరెడ్డి ప్రభంజనం సృష్టించారని వివరించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు నీతిమాలిన రాజకీయాలు చేస్తూ పదవుల కోసం జంపుజిలానిలుగా మారి టిఆర్ఎస్ పార్టీలో కిరాయిప్పులకు పాల్పడుతుంటే అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వతంత్ర ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని టిఆర్ఎస్ పార్టీకి ఆహ్వానించినప్పటికీ అలాగే మంత్రి పదవి ఇస్తామని కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఆఫర్లు చేసిన ఆశపడకుండా కాంగ్రెస్ పార్టీని వీడకుండా మాతృపార్టీపై ప్రేమతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీలో చేరి తన రాజకీయ నిబద్ధతను చాటుకోవడం జరిగిందని గుర్తుకు చేశారు.

2014 నుండి 2018 వరకు ఎమ్మెల్యేగా నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తూ అప్పటి అధికార పార్టీ ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసిన నిఖర్సగా ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడిన గొప్ప నాయకుడు దొంతి మాధవరెడ్డి అని అభివర్ణించారు.

2018 ఎన్నికల ముందు టీపీసీసీ అధ్యక్షులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్రను ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముందుండి నిర్వహిస్తూ నడపారన్న విషయాన్ని గుర్తు చేశారు.

2018 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పార్టీ కోసం నిలబడే వ్యక్తిగా గుర్తింపు పొందిన నాయకుడని దాదాపు నర్సంపేట నియోజకవర్గం ఏర్పడి 45 ఏళ్ల చరిత్రలో చేతి గుర్తుపై గెలిచిన దాఖలాలు లేకపోగా మొదటిసారి నర్సంపేట గడ్డపై కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై గెలిచి చరిత్ర తిరిగరాశాడన్నారు.

కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ అధిష్టానం పార్టీలు ఫిరాయింపులు చేసిన వారికి కొత్తగా వివిధ పార్టీల నుండి పదవుల కోసం పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులను ఇవ్వడం వరంగల్ ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని గుర్తించి మంత్రిపదవి ఇవ్వకుండా వరంగల్ ఉమ్మడి జిల్లా అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను నిరాశకు గురి చేయడం సరికాదని వాపోయారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వంలో భర్తీ చేయనున్న మంత్రి పదవుల్లో రాజకీయ నిబద్ధతకు నిదర్శనంగా ఉన్న ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారికి మంత్రి పదవిని కట్టబెట్టి నర్సంపేట ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లకు టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ విజ్ఞప్తి చేశారు.

 

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version