— వైన్స్ ను తనిఖీ చేసిన ఎక్స్సైజ్ అధికారులు
నిజాంపేట: నేటి ధాత్రి
మండలంలోని రెండు వైన్స్ లను రామాయంపేట ఎక్స్సైజ్ సీఐ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం తనిఖీ చేశారు. మద్యం షాపులో రికార్డులను పరిశీలించి మాట్లాడారు .. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మద్యం అమ్మకాలు జరపాలని నిర్వాహకులకు సూచించడం జరిగిందన్నారు. వైన్స్ లో స్టాక్ నిల్వ ఉండేలా చూసుకోవాలని సూచించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో ఎక్స్సైజ్ ఎస్ఐ సిద్దార్థ, సిబ్బంది ఉన్నారు.