జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై పెట్టిన కేసు ఎత్తివేయాలి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల నిరసన
భూపాలపల్లి నేటిధాత్రి
జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై అక్రమంగా పెట్టిన కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం స్థానిక కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా కాకతీయ ప్రెస్ క్లబ్ నుండి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు సామంతుల శ్యామ్, తడుక సుధాకర్ లు మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లా రాజోలు మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామ రైతులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘటనతో ఏటువంటి సంబంధంలేని జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై అక్రమంగా కేసులు పెట్టారన్నారు.
ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటాన్ని జనంసాక్షి పత్రికలో కథనాలు ప్రచురిస్తే ఫ్యాక్టరీ యాజమాన్యం తప్పుడు ఫిర్యాదు ఇచ్చి, అక్రమంగా ఎడిటర్ పై కేసులు పెట్టారన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కటం ఏమిటని మీడియా సభ్యులు మండిపడ్డారు. తక్షణమే జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై పెట్టిన కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్య క్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పోతరాజు రవిభాస్కర్, చెరుకు సుధాకర్, సర్వేశ్వర్, తిక్క ప్రవీణ్, క్యాతం మహేందర్, విజయ్, మారపెల్లి చంద్రమౌళి, వెంకన్న, అంబాల సంపత్, రాజు, వెంకన్న, మోహన్, సమ్మయ్య, రమేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన భూభారతి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామాయంపేట తహసిల్దార్ రజనీకుమారి అన్నారు. బుధవారం రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో భూభారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల నుండి వచ్చే దరఖాస్తులను స్వీకరించారు.
We should take advantage of the land.Tehsildar Rajnikumari.
ఏళ్ల తరబడి ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ఇది చక్కని అవకాశం అని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా రైతులు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యలను దరఖాస్తు రూపంలో అందజేశారు.
ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లంక దాసరి అశోక్
పరకాల నేటిధాత్రి తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థ ప్రజలపై విద్యార్దుల బస్ పాస్ 20శాతం పెంపు వల్ల పేద ప్రజలపై పెనుభారం పడుతుందని పెంచిన చార్జీ లను వెంటనే ఉపసంహరించు కోవాలని ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లంక దాసరి అశోక్ ప్రభుత్వాని డిమాండు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ పెంచిన బస్ పాస్ చ్చార్జీలు ప్రజల పై ఒక్కరికీ నెలకు 200 నుండి 300రూపాల వరకు బారం మోపిందని ఆర్టీసీ బస్ లో పెద వాళ్లు మధ్యతరగతి ప్రజలు మాత్రమే ప్రయాణిస్తారని వారికి రాయితీలు ఇవ్వవలిసింది పోయివారిపై బారం పెంచేలాచార్జీలు పెంచారని పాలక ప్రభుత్వం కార్పొరేట్లకు రాయితిలిస్తు ప్రజల పై చార్జీల భారం మోపుతునరని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఉచితంగా ఆర్టీసీ లోకోట్లాది మందికి బస్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పుకుంటు ఆర్టీసీ పై ఆధారపడి జీవన ప్రయాణం కొనసాగించే వారిపై ఆర్థికబారం పడేలా ఉందని వెంటనే ఈ చార్జీల పెంపు పై టీ జి ఆర్టీసిసంస్థ ఆలోచనచేసి పెంచిన చార్జీలను తగ్గించాలని ఈవిద్య సంవత్సర ప్రారంభం నుండీ ఆర్టీసీలో విద్యార్థులకు ఉచిత బస్పాస్
కేబుల్ ఆపరేటర్లు పోల్ టాక్స్ ను వెంటనే రద్దు చేయాలి
ఇండిపెండెంట్ రాష్ట్ర ఎం ఎస్ ఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేషాల రమేష్ బాబు
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పనిచేసిన ఎంఎస్ఓలు కేబుల్ ఆపరేటర్ల పరిస్థితి నేడు తెలంగాణ రాష్ట్రo వచ్చాక దీనస్థితికి చేరుతుందని ఇండిపెండెంట్ ఎమ్మెస్ ఓ ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేషాల రమేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేబుల్ ఆపరేటర్ల సమస్యల పై బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ లో కేబుల్ ఆపరేటర్లతో కలిసి ఇండిపెండెంట్ ఎమ్మెస్ ఓ ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించకున్న స్వయంకృషితో కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ప్రజలకు వినోదాన్ని అందించడంలో గాని అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలకు సంబంధించిన సమాచారం అందించడంలో కేబుల్ ఆపరేటర్లు ముందు వరుసలో ఉంటారన్నారు. ప్రస్తుత సమయంలో డిజిటల్ ప్లాట్ ఫామ్ లతో పోటీ పడడం కష్టం కష్టమవుతున్న తరుణంలో మూలిగే నక్క పై తాటిపండు పడ్డట్టు ఇప్పటికే నష్టాలలో నడుపుతున్న కేబుల్ టీవీ లపై ప్రభుత్వం టీఎస్ ఎన్పీడీసీఎల్ ద్వారా పోల్ టాక్స్ పేరుతో వాడుతున్న కరెంటు పోల్ లను లెక్కించి పోల్ టాక్స్ కట్టాలంటూ కేబుల్ టీవీ ఆపరేటర్ల పై అదనపు ఆర్థిక భారాన్ని మోపడం హేయమైనా చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే పోల్ టాక్స్ విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగిందన్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటూ ఇటీవల భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును కలిసి వినతి పత్రం అందజేశారు.. అలాగే భూపాలపల్లి విద్యుత్ శాఖ ఎస్ ఈ మల్చూర్ నాయక్ కలిసి ఆపరేటర్ల సమస్యలను వివరించి వినతి పత్రం అందించారు.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేబుల్ టీవీ ఆపరేటర్లను కుటీర పరిశ్రమలు గా గుర్తించి వివిధ శాఖల ద్వారా రుణ సదుపాయం కల్పించి కేబుల్ టీవీ లను ప్రోత్సహించాలని కోరారు. అలాగే కేబుల్ ఆపరేటర్ల పోల్ టాక్స్ ను తక్షణమే రద్దు చేసి ఆపరేటర్ల జీవన మనుగడకు తోడ్పడాలని కోరారు.. ఈ కార్యక్రమంలో ఆపరేటర్లు బోట్ల రాజు ,ఓదెల సురేష్,నల్లవేని రాజు, నన్నపు సతీష్, ఒజ్జ ఐలయ్య. గట్టయ్య, దేవేందర్ లు పాల్గొన్నారు
వాగులు, వంకలు, ఏరులు అన్నీ వానాకాలంలో కలిసి ‘పోయి ప్రవహించి పంటలకు ప్రాణంగా నిలుస్తాయి కాబట్టి ఏరువాక అని పేరు వచ్చిందని కొంత మంది అభిప్రాయం. ఏరు అంటే ఎద్దులకు కట్టి దున్నటానికి సిద్ధంగా ఉన్న నాగలి అని అర్ధం. వాక అంటే దున్నటం. నాగలితో భూమిని దున్నుతున్నప్పుడు ఏర్పడిన చాలును “సీత” అంటారు. నాగరికత ఎంతగా ముందుకు సాగినా.. నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవ సాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. దీనినే పూల పౌర్ణమి అని కూడా అంటారు. ఇంతకీ ఈ ఏరువాక పౌర్ణమి విశిష్టత ఏమిటి… దాన్ని ఈరోజు ఎందుకు చేసుకుంటారంటే.. వైశాఖ మాసం ముగిసి జ్యేష్టం మొదలైన తరువాత వర్షాలు కురవ డం మొదలవుతాయి.
Whether you choose to walk or run, you are a child.Whether you choose to walk or run, you are a child.
ఒక వారం అటూ ఇటూ అయినా కుడా జ్యేష్ఠ పౌర్ణమి నాటికి తొలకరి పడక మానదు. భూమి మెత్తబడకా మానదు. అంటే నాగలితో సాగే వ్యవసాయపు పనులకు అది శుభారంభం అన్నమాట. అందుకనే ఈ రోజున ఏరువాక అంటే దుక్కిని ప్రారంభిం చడం అనే పనిని ప్రారంభిస్తారు. అయితే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకూ ఎందుకు ఆగడం, ఖాళీగా ఉంటే కాస్త ముందర నుంచే ఈ దుక్కిని దున్నేయ వచ్చు కదా అన్న అనుమానం రావచ్చు. ఎవరికి తోచినట్లు వారి తీరికని బట్టి వ్యవసాయాన్ని సాగిస్తే ఫలి తాలు తారుమారైపో తాయి. సమష్టి కృషిగా సాగేందుకు పరాగ సంపర్కం ద్వారా మొక్క ఫలదీకరణం చేందేం దుకు, రుతువుకి అనుగుణంగా వ్యవసాయాన్ని సాగిం చేందుకు.. ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయక క్యాలెండర్ ను ఏర్పాటు చేశారు మన పెద్దలు. అందులో భాగమే ఈ ఏరువాక పౌర్ణమి కొంత మంది అత్యుత్సాహంతో ముందే ప్రారంభించకుండా, కొందరు బద్దకించ కుండా ఈ రోజున ఈ పనిని చేపట్టక తప్పదు.
తొలకరి పలకరింపుతో ఆనందంలో రైతులు.
ఏరువాక పౌర్ణమికి ముందే జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో తొలకరి జల్లులు. పలుకరించడంతో మట్టి వాసనతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మే చివరి వారం నుంచి జిల్లాలో పలు మండల్లాలో వర్షాలు కురిసినప్పటికి రైతులు దుక్కులు దున్నుకోవడానికి అవసరమైన పెరిగి వర్షపాతం నమోదు కాకపోవ మంతో అశాశం వైపు నిరాశగా ఎదురు చూశాదు కానీ గత మూడు నాలుగు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురవడంతో రైతుల ఆశలకు రెక్కలు వచ్చాయి.
రైతుల పండుగ ఎరువక.
ఈ రోజు వ్యవసాయ పనిముట్లు అన్నింటినీ కడిగి శుభ్రం చేసుకుంటారు. రైతులు. వాటికి పసుపు కుంకుమలు అద్ది పూజించుకుంటారు. ఇక ఎద్దులు సంగతి అయితే చెప్పనక్కర్లేదు. వాటిని శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు రంగులు పూసి కాళ్లకు గజ్జలు కట్టి పసుపు కుంకుమతో అలంకరిస్తారు పొంగలిని ప్రసాదంగా చేసి ఎద్దులకు తినిపిస్తారు. ఇక ఈ రోజున జరిగే తొలి దుక్కులో కొందరు తామ కూడా కాడికి ఒక పక్కన ఉండి ఎద్దులతో సమానంగా నడుస్తారు. వ్యవసాయ జీవనంలో తమకు అండగా నిలిచి కష్టసుఖాలను పాలుపంచుకునే ఆ మూగ జీవాల పట్ల ఇలా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు. ఒక ఏరువాక సాగుతుండగా అలుపు తెలియకుండా పాటలు పాడుకునే సంప్రదాయమూ ఉంది. అందుకే ఏరువాక పాటలు నాగలి పాటలకి మన జానపద సాహిత్యంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది.
పెరిగిన పత్తి సాగు విస్తీర్ణం
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం సాగు విస్తరణ పెరిగినట్లు జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. గత సంవత్సరం వర్షాకాలం ఖరీఫ్ సీజన్లో 7.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, ఈ వర్షాకాలం సీజన్లో 8,04,512 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతా యని అంచనా వేశారు. దీంట్లో 3లక్షల 87,539 వేల ఎకరాల్లో పత్తిపంట సాగవుతుందని, 1,65,173 లక్షల ఎకరాల్లో వరిపంట, 4 వేల ఐదు వందల ఎకరాల్లో. మొక్క జొన్న, 79,163 వేల ఎకరాల్లో సోయాబిన్, 84, 821 వేల ఎకరాల్లో కంది, 7,987 వేల ఎకరా ల్లో మిను ములు, 14,826 వేల ఎకరాల్లో పెసర్లు, 20వేల ఐదు వందల ఎకరాల్లో చెరుకు, 18వేల ఐదువందల ఎకరాల్లో కూరగాయల పంటలసాగవుతాయని అంచనా వేశారు.
జహీరాబాద్ మండల విద్యాధికారిగా బస్వరాజును నియమిస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఎంఈఓగా పనిచేసిన బస్వరాజు పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో మండలంలోని సత్వార్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ హెచ్ఎంగా పని చేస్తున్న బస్వరాజును ఎంఈఓగా నియమించినట్లు పేర్కొన్నారు.
జహీరాబాద్: బుచినెల్లి గ్రామానికి చెందిన 18 యేళ్ల సత్వార్ నస్రీన్ గత కొన్ని సంవత్స రాలుగా మానసీక స్థితి సరిగా లేక అసాదారణంగా ప్రవర్తిస్తుంది. ఆమె 6 జూన్ 2025 ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లో ఎవరు లేని వేళ ఎక్కడికో వెళ్లి తిరిగి రాలేదని ఆమె తల్లి సత్వార్ షబానా తెలి పారు. ఈ సంఘటనపై చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. నస్రీన్అండి సత్వార్ ఖదీర్ కుటుంబం పేర్కొన్న వివరాల ప్రకారం గత మూడు నెలల క్రితం కూడా ఆమె ఇలాగే ఇంటినుంచి వెళ్లిపోయినప్పుడు చిరాగ్పల్లి పోలీసులు మి స్సింగ్ కేసు నమోదు చేసి ఆమెను క్షేమంగా తిరిగి తీసుకొచ్చారు. ఈసారి కూడా నస్రీన్ తల్లి షబానా ఫిర్యాదు మేరకు చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చే యబడింది. సబ్ ఇన్స్పెక్టర్ చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్ తెలిపిన వివరాల ప్రకారం న స్రీన్ కోసం దర్యాప్తు . మేము అన్ని వైపుల నుంచి ఆమె అచూకీ కోసం విచారణ చేస్తున్నామని, గతంలో ఆమెను కనుగొన్న అనుభవం ఆధారంగా ఈసారి కూడా త్వరలోనే ఆమెను కొనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్సై తెలిపారు.
సంగరెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మెదపల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ పౌర్ణమి సందర్భంగా గానుగాపూర్ దత్తాత్రేయుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఈరోజు ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ తొలీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి .అధికార కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ నోటీస్ పంపడాన్ని నిరసిస్తూ.అట్టి కమీషన్ ఎదుట ఈరోజు హాజరు కావాల్సిందిగా కోరడం వల్ల కెసిఆర్ గారికి హా దేవ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకొని మనోధైర్యం ప్రసాదించాలని కోరుకున్న నన్నారు రైతులకోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొని ప్రపంచం లోనే ఎంతో పెద్ద ప్రాజెక్ట్ కట్టి తెలంగాణ ను కోటి ఎకరాల మాగాణం చేసిన ఆయనకు నోటీసులా అని ఈసందర్భంగా బావోదెవ్గానికి గురై .తొలి ముఖ్య ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి హ దత్తాత్రేయుని ఆశీర్వాదం ఉండాలని కోరారు .ఎలాంటి మచ్చ లేకుండా ఎదుర్కొని బయట పడతారన్నారు.ఇట్టి పూజ కార్య క్రమంలో .యువకులు శ్రీనివాస్ సంగమేశ్వర్ తమ్మలి దశరథ్ పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి…
ఆసుపత్రి చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి…
వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా కావలసిన అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలి…
పారిశుద్ధ్య నిర్వహణ పనులను సక్రమంగా చేపట్టాలి…
డ్రైనేజీలు ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి…
మంచినీటి ట్యాంకులను శుభ్రపరిచి క్లోరినేషన్ ప్రక్రియ నిర్వహించాలి…
మీరు నిల్వ ఉండే చోట ఆయిల్ బాల్స్ వేయాలి…
దోమలు రాకుండా ఫాగింగ్ చేయించాలి…
వైద్య సిబ్బంది ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి…
పారిశుద్ధ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి…
బిపి, హెచ్ఐవి,షుగర్ రోగుల పట్ల వైద్యులు ప్రత్యేక శ్రద్ధ వహించి మెరుగైన వైద్య సేవనందించాలి…
స్కానింగ్ మిషన్లు,ఫ్యాన్లు, జనరేటర్లు అందుబాటులో ఉంచాలి…
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలి…
Lurking seasonal diseases
నేటి ధాత్రి -మహబూబాబాద్, గార్ల:- వర్షాకాలం ప్రారంభంలో మండల వ్యాప్తంగా 20 గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం లోపించి రోడ్లపైనే మురికి నీరు నిలబడడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. గ్రామస్థాయి అధికారులు, వైద్య సిబ్బంది ముందు నుండే జాగ్రత్త పడి జ్వరాలను నియంత్రించి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా డెంగ్యూ, చికున్ గున్య, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉంది. వర్షాకాలం కారణంగా వీధులు, రహదారులు, ఇళ్ల నడుమ మురుగునీరు నిలిచి దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రతి ఏటా వానాకాలంలో వ్యాధుల ముప్పు పెరిగి పేదల జీవితాలు దుర్భరమవుతున్నాయి. మలేరియా, డెంగ్యూ,చికున్ గున్య,మెదడువాపు, ఫైలేరియా,అతిసారం, టైఫాయిడ్ తదితర సీజనల్ వ్యాధులు గ్రామీణ ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల వ్యాధులకు నాణ్యమైన వైద్యం అందించాలి. ఆసుపత్రుల్లో వైద్యులు సిబ్బంది సమయపాలన పాటించాలి. ఆసుపత్రి చుట్టుప్రక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి.గడ్డి, పిచ్చి మొక్కలు తొలగించుకోవాలి. పల్లె ప్రాంతాల నుంచి ఆసుపత్రులకు వచ్చే రోగులకు, వృద్ధులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారితో స్నేహపూర్వకంగా మెలిగి వైద్యం అందించాలి. వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా కావలసిన అత్యవసర మందులు, వైద్యం అందుబాటులో ఉంచాలి. అత్యవసర మందులు ఆసుపత్రుల్లో సమయానికి లేకపోతే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వైద్య ఆరోగ్యశాఖ, గ్రామపంచాయతీ, మున్సిపల్, విద్యాశాఖ, సంక్షేమ శాఖ, సంక్షేమ హాస్టళ్ల అధికారులు సమన్వయం చేసుకుంటూ సీజనల్ వ్యాధులను అరికట్టాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులను సక్రమంగా చేపట్టి ప్రజలు డెంగ్యూ,మలేరియా,చీకున్ గున్య లాంటి వ్యాధుల బారిన పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. డ్రైనేజీలు మురుగు నీటితో, చెత్తాచెదారం తో నిండిపోయి ఉన్నాయి. తక్షణమే డ్రైనేజీలు ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. వర్షాకాలంలో మంచినీటి బావులలో చెత్తాచెదారం, దుమ్ము ధూళితో నీళ్లు కలుషితం అయ్యే ప్రమాదం ఉన్నందున ఎప్పటికప్పుడు మంచినీటి ట్యాంకులను శుభ్రపరిచి క్లోరినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలి. నీరు నిల్వ ఉండే చోట ఆయిల్ బాల్స్ వేయించి దోమలు రాకుండా ఫాగింగ్ చేయించాలి. వారానికి రెండు రోజులు డ్రైడే పాటించేలా అధికారులు కిందిస్తాయి అధికారులను ఆదేశించాలి. వర్షాకాలంలో వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలి. మలేరియా, చీకున్ గున్య, డెంగ్యూ వంటివి పూర్తి నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత లోపించడం, దోమలు, ఈగలు వ్యాప్తి చెందడం కారణంగా వ్యాధులు ప్రభలే ఆస్కారం ఉంటుంది. గ్రామాల్లో పారిశుద్ధ్యం పట్ల ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీలు ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేసి రోగులకు మెరుగైన వైద్యం అందించాలి. అన్ని రకాల మందులతోపాటు నీడిల్స్ కొరత రానివ్వకుండా చర్యలు చేపట్టాలి. బిపి, హెచ్ఐవి, షుగర్ రోగుల పట్ల వైద్యులు ప్రత్యేక శ్రద్ధ వహించి మెరుగైన సేవలందించాలి. ప్రభుత్వ వైద్య సిబ్బంది స్థానికంగా ఉండి వైద్య సేవలు అందించడంలో విఫలం చెందటంతో ప్రజలు ప్రైవేటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. స్తోమత లేకపోయినా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలో నిర్లక్ష్యం మూలంగా, సకాలంలో వైద్యం అందించకపోవడంతో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో, వసతి గృహాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలి.మలేరియా, చీకున్ గున్య, ఫైలేరియా, డెంగ్యూ, జ్వరాలు మరియు కలుషిత నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు అతిసారా, కలరా, రక్త విరోచనాలు, టైఫాయిడ్, వ్యాధులు రాకుండా గ్రామాల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలి. పాము తేలు కాటు మందులను అందుబాటులో ఉంచాలి. పాము తేలు కాటుకు గురైన ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో మంత్రాలు, నాటు వైద్యులను సంప్రదించి ఆలస్యం చేయడం మూలంగా మరణాలు సంభవిస్తున్నాయి. గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత పాటించి రోగాల బారి నుండి ప్రజలను కాపాడే విధంగా వైద్య సిబ్బంది చొరవ చూపాలి. సీజనల్ వ్యాధులపై వైద్య ఆరోగ్యశాఖ ముందస్తు చర్యలు చేపట్టాలి. అన్ని సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఓఆర్ఎస్ పొట్లాలు అందుబాటులో ఉంచాలి. గ్రామపంచాయతీలు, పురపాలికల్లో నీటి క్లోరినేషన్, బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి పనులపై నిరంతర పర్యవేక్షణ చేయాలి. ఆశా కార్యకర్తలు గ్రామాల్లో ప్రజల వద్దకు ప్రతి ఇంటింటికి వెళ్లి జాగ్రత్తలు తెలియజేయాలి. ఇళ్లలోని కుండీలు, కూలర్లు వంటి వాటిలో ఉన్న నీటిని పారబోసేలా చైతన్యం చేయాలి. గ్రామాలు కాలనీల్లో ని ఖాళీ స్థలాల్లో నీటి నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలి. కానీ ప్రస్తుతం ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపం మూలంగా, వైద్యులు సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరించడంతో గ్రామాల్లో ఇవేమీ అమలు కావడం లేదు. సీజనల్ వ్యాధులు ముంచుకొస్తున్న వేళ ముందస్తు చర్యలు చేపట్టి గ్రామాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించి, పారిశుద్ధ్యం పై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రభుత్వ వైద్యులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని ప్రజలు, ప్రజా సంఘాలు, అఖిలపక్ష పార్టీలు కోరుతున్నారు.
జాతీయ విద్యా దినోత్సవాన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా జరపాల్సిన రోజుగా గుర్తించాలి!
◆ అకడమిక్ క్యాలెండర్లో వెంటనే చర్చించాలి.
◆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి.
◆ ఏఐఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ డిమాండ్.
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షులు షైక్ రబ్బానీ మాట్లాడుతు నవంబర్ 11న మన దేశ తొలి కేంద్ర విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ గారి జయంతిని పురస్కరించుకొని, భారత ప్రభుత్వం 2008 నుండే జాతీయ విద్యా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. విద్యా రంగాన్ని ఆధునికీకరించడంలో, ఐఐటీల స్థాపనలో, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వంటి ప్రముఖ సంస్థల ఏర్పాటులో ఆయన అపారమైన కృషి చేశారు. ఆయన సేవలను స్మరించుకుంటూ, విద్యకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం.
ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశాలు:
విద్య ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడం
సమాన విద్యావకాశాలపై చర్చ జరగడం
విద్యా రంగ పురోగతిపై చైతన్యం కలిగించడం
ప్రతి సంవత్సరం ఈ రోజున పాఠశాలలు, కళాశాలలల్లో:
వ్యాసరచన పోటీలు
చర్చా వేదికలు, సదస్సులు
విద్య ప్రదర్శనలు
విద్యా అభివృద్ధిపై చర్చలు
వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి. అలాంటి ముఖ్యమైన, విద్యావ్యవస్థకు మూలస్తంభంగా నిలిచే రోజు 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి తెలంగాణ విద్యాశాఖ జారీ చేసిన అకడమిక్ క్యాలెండర్లో ప్రస్తావించకపోవడం ఆశ్చర్యకరం, బాధాకరం కూడా.విద్యార్థుల ఎదుగుదలలో అలాంటి స్ఫూర్తిదాయకమైన దినోత్సవాలను ప్రోత్సహించాలి గానీ విస్మరించకూడదు.అందుకే, జాతీయ విద్యా దినోత్సవాన్ని నవంబర్ 11 తేదీకి తగిన ప్రాధాన్యంతో తిరిగి అకడమిక్ క్యాలెండర్లో చేర్చాలి అనే డిమాండ్ను విద్యాభిమానులందరం గళమెత్తి కోరుతున్నామన్నారు.75 ఏళ్లుగా దేశాన్ని తప్పుదోవ పట్టించడంతో తృప్తి చెందనట్లుగా, జాతీయవాద పార్టీలు అని పిలవబడే పార్టీలు మరియు వారి అనుయాయులు స్వతంత్ర భారతదేశపు మొదటి విద్యా మంత్రి అబ్దుల్ కలాం ఆజాద్ వంటి వారికి ఈరోజు కూడ జేజేలు పలుకుతున్నారు. నిస్సందేహంగా “అతను జన్మతః భారతీయుడు కాదు. అతను ఏ పాఠశాలకు వెళ్లలేదు! ‘హిందూ ముస్లిం ఐక్యత’ యొక్క చిహ్నాలలో ఒకరైన, గాంధీతో సమానంగా కీర్తించబడిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్య్రం తర్వాత దేశానికి మొదటి విద్యా మంత్రి అయ్యాడు.భారతదేశంలో విద్యకు పునాదులు వేసిన మహనీయుడు, దృఢమైన జాతీయవాది, గంగా జమునీ తహజీబ్ యొక్క ప్రతీకగా నివాళులర్పించుకున్నాడు. ఇది ఎంతవరకు సమర్థనీయం?…అందు గురించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అకడమిక్ క్యాలెండర్లో వెంటనే చేర్చాలని ఏఐఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ డిమాండ్ చేశారు.
గీతాంజలి కేంబ్రిడ్జి పబ్లిక్ స్కూల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో నూతన విద్యా శిఖరం.
భద్రాద్రి కొత్తగూడెం/హైదారాబాద్,నేటిధాత్రి:*
నేటి ఆధునిక యుగంలో విద్యార్థులకు విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు సూచించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మంగళవారం గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో గీతాంజలి పబ్లిక్ స్కూల్ అత్యాధునిక హంగులతో, కేం బ్రిడ్జి సిలబస్ తో కూడిన పాఠశాలను ఏర్పాటు చేయగ సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు.
Provide quality education to students
అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో ఇంటర్నేషనల్ (ఐజిసిఎస్ఈ), కేం బ్రిడ్జ్ సెలబస్ తో ప్రారంభించడం భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతం ప్రజలు చేసుకున్న పుణ్యమని అన్నారు.ఇంత మంచి ఇంటర్నేషనల్ హంగులతో కూడినటువంటి పాఠశాలను ప్రారంభించిన గీతాంజలి స్కూల్ ఆఫ్ చైర్మన్, డైరెక్టర్స్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.గీతాంజలి పబ్లిక్ స్కూల్ ప్రారంభంతో భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో నాణ్యతతో కూడిన విద్యా సౌకర్యాలు ఈ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన అవసరం లేకుండా నాణ్యతతో కూడిన విద్య తమకందుబాటులో ఉండడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమని పేర్కొన్నారు.సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షబ్బీర్ పాషా మాట్లాడుతూ సకలహంగులతో కూడిన ఇంటర్నేషనల్ స్కూల్ భద్రాద్రి కొత్తగూడెం రావడం ఇదే మొదటిది అని ఏసీ గదులు, ఏసి బస్సులతో, డిజిటల్ బోర్డులతోఇంత మంచి స్కూల్ రావడానికి సహకరించిన సిపిఐ ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు చొరవతో నాణ్యతతో కూడిన విద్య విద్యార్థులకు అందుతుందని ఇంత మంచి ఆలోచన చేసిన గీతాంజలి గ్రూప్ ఆఫ్ చైర్మన్స్ వేములపల్లి సుబ్బారావు , డైరెక్టర్స్, ప్రిన్సిపాల్ కు కృతజ్ఞతలు తెలిపారు. గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ వేములపల్లి సుబ్బారావు మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యా వ్యాపారంగా కొనసాగుతుందని విద్యను వ్యాపారం చేయకుండా విద్యను ఒక సేవ దృక్పథంతో భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్, కేంమ్ బ్రిడ్జి సిలబస్ తో గీతాంజలి పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని పాఠశాలలోని సౌకర్యాలను చూసి ఎంతో సంతోషపడ్డారు. ఈ కార్యక్రమంలో స్దానిక సిపిఐ నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా గొల్లపల్లి సత్య పీరీలు(దర్గా) యాత్రకు *సిరిసిల్ల విద్యానగర్ అడ్డా ఆటో యూనియన్
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని విద్యానగర్ అడ్డ టాటా మ్యాజిక్ ప్యాసింజర్ యూనియన్ సంఘం వారు ఈరోజు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం గొల్లపల్లి దర్గా సత్య పీరీలు యాత్రకు అంగరంగ వైభవంగా యాత్ర చేపట్టడం జరిగినది. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల విద్యానగర్ అడ్డా టాటా యూనియన్ ప్యాసింజర్ అధ్యక్షులు అధ్యక్షులు మహమ్మద్ షఫీవుద్దీన్,ప్రధాన కార్యదర్శి నడిగోట్టు సుమన్, కోశాధికారి పేరుమల సత్తయ్య, కార్యదర్శి. కూతూరి బాలకృష్ణారెడ్డి, తదితర ఆటో యూనియన్ సభ్యులు పాల్గొనడం జరిగినది.
అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సిపిఎం నాయకులు మడికొండ ప్రశాంత్ విమర్శించారు.ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇండ్లు అందిస్తామని చెప్పి కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వడం జరుగుతుందని,చాలామంది పేదలకు ఇండ్లు వస్తాయని ఆశించినప్పటికీ నిరాశ ఎదురయిందని,ఇందిరమ్మ కమిటీలు నియమించినప్పటికీ అందులో కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రాధాన్యమిచ్చి ఇండ్లు కూడా వారికే ఇచ్చారని,గత ప్రభుత్వం కూడా డబుల్ బెడ్ రూమ్ లు బిఆర్ఎస్ కార్యకర్తలకు కేటాయించినట్లుగానే,కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇండ్లు కార్యకర్తలకే ప్రాధాన్యత ఇచ్చి పేదలకు అన్యాయం చేసిందని,పట్టణంలోని రెండో వార్డులో అర్హులైన నిరుపేదలకు ఇండ్లు ఇవ్వకుండానే,కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చుకున్నారని తెలిపారు.కార్యకర్తల కొరకు లబ్ధి చేకూర్చడం కోసమే తీసుకొచ్చిన పథకాలను ప్రజల లబ్ధి కోసమే ఇస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వము ప్రజాప్రతిని స్పందించి అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
`నాలుగు రోజులు జర్నలిస్టులుగా పని చేస్తే మేధావులు కారు.
`సమాజాన్నే కించ పర్చే వ్యాఖ్యలు చేస్తే గొప్ప వారు కారు.
`అమరావతి దేవతల రాజధాని!
`కనిపించే తల్లి కన్నా గొప్ప దైవం విశ్వంలో ఎవరూ వుండరు.
`అమరావతి అంటే ఇది కాదు అనడానికి సిగ్గు పడాలి.
`మన కళ్ల ముందు కనిపించేదే అమరావతి అనుకోవాలి.
`అదే దేవతల రాజధానిగా భావించాలి.
`అమరావతి పరిసర ప్రాంతాలు వేశ్యల రాజధాని అన్న వాడికి శిక్ష పడాలి.
`అమరావతి ప్రాంతాన్ని అవమానించడమే!
`ముఖ్యంగా మహిళల ఆత్మాభిమానం దెబ్బతీయడే!
`రాజధాని ప్రాంతాన్ని ఈ రకంగా చిత్రీకరించడం నేరమే!
`వేశ్య చేసేది కూడా కాయకష్టమే!
`మన సమాజంలో అలాంటి పరిస్థితులపై వ్యవస్థ సిగ్గుపడాలి.
`శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో వేశ్య పన్ను అమలు చేశారు.
`వేశ్య వృత్తి తప్పే..వారు తప్పుడు మహిళలు కాదు.
`పొట్ట కూటి కోసం తప్పని పరిస్థితులలో గడిపే కాలం!
హైదరాబాద్,నేగిధాత్రి:
తమదే జర్నలిజం..తాము చెప్పిందే సుభాషితం అనుకునేవాళ్లు చాల మంది మోపయ్యారు. ముఖ్యంగా ఎలక్రానిక్ మీడియా వచ్చిన తర్వాత వారి పైత్యం మరీ ఎక్కువైంది. నోరుంది కదా? అని ఏది పడితే అది వాగకు..అన్నది తెలుసు. అయినా తాము సత్యాలే చెబుతాం…ప్రజలకు నిజాలే అందిస్తామన్నట్లు కొన్ని దుష్టపర్వాలు ఉచ్చరిస్తుంటారు. ఇలాంటి వాళ్లను సమాజం కూడా వెలివేయాలి. ఇక్కడ అసలు విషయాన్ని ముందు తెలుసుకుందా. ఈ మధ్య ఓ ఆంగ్ల దినపత్రికలో ఆరోగ్యపరమైన అంశాలను వివరించే క్రమంలో ఓ ఆర్టికల్ వచ్చింది. అందులో వ్యభిచారం ఎక్కువగా జరుతున్న రాష్ట్రాల క్రమాన్ని వివరించారు. దానికి లేనిపోనివి ఆపాదించి, సాక్షి టీవిలో అసందర్భ చర్చను చేపట్టారు. నిజానికి అలాంటి విషయాలను చర్చించాల్సిన అవసరం లేదు. సమాజంలో ఎన్నో దారుణాలున్నాయి. సమస్యలున్నాయి. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలున్నాయి. వాటిని వెలుగులోకి తెస్తే,ప్రజలకు మేలు జరుగుతుంది. అంతే కాని వ్యభిచారం గురించి సోది మొదలు పెట్టి ఏకంగా ఆంధ్ర ప్రదేశ్ రాజధానిపై నిందలు మోపడం అన్నది సరైంది కాదు. పైగా మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీయడం అసలే మంచిది కాదు. ప్రపంచంలో వ్యభిచారం అనేది ఎక్కడలేదు? అమెరికా లాంటి దేశాల నుంచి చాలా పేద దేశాల్లో కూడా వుంది. వేశ్యా వృత్తి రాజుల కాలం నుంచి వుంది. అదేమీ తప్పు కాదు. మన దేశంలో చట్ట పరంగా నేరం. దానిని ఏ ప్రభుత్వాలు ప్రోత్సహించడం లేదు. మన సమాజంలో అనాదిగా అవలంభిస్తున్న వృత్తుల్లో వ్యభిచారం కూడా వుండేది. ఇప్పుడు మన సమాజంలో చాలా మార్పు వచ్చింది. ఆ వృత్తిని ఎప్పుడో వదిలేశారు. కాని ఏకంగా ఏపి రాజధాని ప్రాంతాన్ని వేశ్యల రాజధాని అంటూ సీనియర్ జర్నలిస్టు అనే ముసుగులో వున్న కృష్ణం రాజు అనే వ్యక్తి మాట్లాడడం తప్పు. నేరం కూడా. అంతే కాకుండా సాక్షి టివీలో యంకర్గా పనిచేసే సీనియర్ జర్నలిస్టు కృష్ణం రాజును మాటలను అడ్డుకోకపోవడం, తప్పని చెప్పకపోవడంతోపాటు, సమర్ధించినట్లే వ్యవహరించడమే అసలు సమస్యకు కారణమైంది. నిజం చెప్పాలంటే ఏపిలోని అమరావతి ప్రాంతానికి ప్రత్యేకమైన విశిష్టత వుంది. అది బుద్దుడు నడయాడిన ప్రాంతం. ఆ ప్రాంతానికి బుద్దుడు వచ్చి అక్కడ చాలా కాలం పాటు వున్నట్లు కూడా చరిత్ర చెబుతోంది. పైగా బుద్దిజం విలసిల్లిన ప్రాంతం. అంతే కాకుండా ఆ ప్రాంతాన్ని ధాన్య కటకము అనికూడా చరిత్రచెబుతోంది. తెలుగు మొట్టమొదటి రాజులైన శాతవాహనుల తొలి రాజధాని అమరావతి అయితే, రెండో రాజదాని దాన్య కటకము అని చరిత్రలో వుంది. అయితే మరో అమరావతి ప్రస్తుతం మహారాష్ట్రలో వుంది. అది శాతవాహనుల రాజదాని. తర్వాత రెండో రాజధాని అయిన ధాన్యకటకము. అది గుంటూరు జిల్లాలో వుంది. తర్వాత కాలంలో ధాన్యకటకాన్ని అమమరావతి అని పిలుస్తూ వచ్చారు. అంతే కాకుండా అమరావతిలో అమరలింగేశ్వర స్వామి ఆలయం కృష్ణా నది ఒడ్డున వుంది. అందుకే అమరావతి అనే పేరు అలా కూడా వచ్చింది. అంతటి పవిత్రమైన ప్రాంతాన్ని గురించి నోరుంది కదా? కృష్ణంరాజు వెర్రి వాగుడు వాగి ఇరుక్కుపోయాడు. అయితే తాము క్షమాపణ చెప్పాం..అర్దం చేసుకోకలేపోతే మేమేం చేయలేమంటూ మళ్లీ కొమ్మినేని శ్రీనివాస్ రావు మళ్లీ గిల్లాడు. దాంతో ప్రజలకు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 40 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో వుండి తాము రాసిందే వార్త అనే దుర్మార్గపు పైత్యం వారిలో నిండిపోయింది. అందుకే ఇలాంటి మాటలు వదిలేశారని చెప్పకతప్పదు. అమరావతి దేవతల రాజధాని. దానికి దేవేంద్రుడు రాజు. కాని ఇది మన రాష్ట్రంలో అమరావతి. దానికి దీనికి సంబంధం లేదంటూ నోటి దూలను ప్రదర్శించారు. దాంతో ఇరుక్కున్నారు. అయినా వేశ్యా వృత్తిని ప్రోత్సహించిన రాజుల కాలం కూడా వుంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వేశ్య పన్ను కూడా విధించిన సందర్భాలున్నాయి. తెలుగు రాష్ట్రాలలో వేమన శతకాలు. వేమన పద్యాలు తెలియని వారు ఎవరూ వుండదు. వేమన కూడా ఒక వేశ్యను ఆరాదించిన సంగతి తెలిసిందే. ఆమె పేరు మీదనే పద్యాలు కూడా రాశారు. వృత్తి తప్పుకావొచ్చు కాని వారి మనసు తప్పని ఎలా చెప్పగలం. ఒక మహిళ వేశ్యగా మారడానికి ఎవరు కారణం? మన సమజం కాదా? సమాజంలో వున్న హెచ్చు తగ్గులు కాదా? కుల వ్యవస్ధ కాదా? ఎప్పుడో దాసి అనే సినిమా వచ్చింది. రాజుల కాలంలో వేశ్యా నర్తకిలు వుండేవారు. నాడైనా, నేడైనా సమాజంలో వున్నారు. అది తప్పుకాదు. కాలే కడుపుకు తిండి దొరకాలంటే కొన్నిసార్లు తప్పు కాదు. ఏదైనా పని చేసుకొవచ్చు కదా? అని నీతులు చెప్పేవారు కూడా వున్నారు. సగటు మహిళ పది మంది మధ్య పని చేయాలంటే ఆ చుట్టూ వుండే చూపులు చేసే గాయం ఎంత ప్రమాదరకమో తెలియందా? ఇంత విద్యా, విజ్ఞానవంతమైన సమాజంలోనే నిత్యం అనేక అకృత్యాలు జరుగుతున్నాయి. అత్యాచారాలు జరుగున్నాయి. చెప్పలేనటు వంటి దారుణాలు జరుగుతున్నాయి. మగాడి కోరికకు బలౌతున్న ఎంతో మంది అబలల జీవితాలు ఆగమౌతున్నాయి. వేశ్య వృత్తిని స్వీకరించిన వారిని సమాజం దూరం కొడుతుంది. రోడ్డు మీద కనిపిస్తే చీత్కరించుకుంటారు. రాత్రి పూట వాళ్ల దగ్గరకు సుఖానికి వెళ్తాడు. మగాడిలోనే రెండు రకాల వేశ్య దాగివున్నాడు. అలాంటి మగాడికి వేశ్య గురించి మాట్లాడే అర్హత లేదు. అయినా వేశ్య అని ముద్ర వేసి, వారిని కించపర్చే హక్కు ఎవరికీ లేదు. వారిని నీచంగా మాట్లాడే హక్కు లేదు. ఎవరి వృత్తి వారిది. వారి వృత్తిని శంకించే హక్కు ఎవరికీ లేదు. మేధావుల ముసుగులో కృష్ణం రాజు వాగడం, దాన్ని కొమ్మినేని ఆపకపోవడం రెండూ నేరాలే. గత ఐదేళ్ల కాలంలో అమరాతిని ఏ కొంచెం పట్టించుకున్నా, ఇప్పుడు ఎంతో గొప్ప రాజదానిగా అడుగులు పడేవి. అమరావతిని అభివృద్ది చేస్తే సిఎం. చంద్రబాబుకు ఎక్కడ పేరొస్తుందో అని మూడు రాజధానులంటూ నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు లేనిపోని కూతలు కూస్తున్నారు. ఆ ప్రాంత మహిళలపై అభాండాలు వేశారు. ఇది మన్నించలేంత ఘోరం. ఎట్టకేలకు కొమ్మినేని అరెస్టు చేశారు. కృష్ణం రాజును అరెస్టు చేస్తామంటున్నారు. ఏ మీడియా అయినా సరే మహిళలను కించపర్చేలా వ్యాఖ్యలు చేయడానికి ఈ సంఘటనతో భయపడాలి. అంతే..
`ఇంత వరకు హనుమకొండ ‘‘జెసి’’ కి ట్రక్ షీట్లు కూడా అందించని అధికారులు.
`5 లక్షల బస్తాల లెక్కలెప్పుడు తేల్చుతారు! జగన్ బండారం ఎప్పుడు బైట పెడతారు!
`జగన్ అక్రమ సంపాదన ఎప్పుడు వెలికితీస్తారు?
`రైతులకు న్యాయం ఎప్పుడు చేస్తారు?
`ఒక్క ఐకేపి సెంటర్ నుంచి వచ్చిన వడ్లతోనే రూ.20 లక్షల మోసం చేసిన జగన్?
`20 ఐకేపి సెంటర్ల నుంచి వచ్చిన వడ్లలో ఎంత మాయం చేసి వుంటారు?
`ఎన్ని కోట్లు వెనకేసుకొని వుంటాడు?
`అంతా బహిరంగ రహస్యమే అయినా అధికారులంతా గప్ చుప్.
హైదరాబాద్,నేటిధాత్రి:
తవ్వుతున్నా కొద్ది హన్మకొండలోని ఓ అక్రమ మిల్లర్ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హన్మకొండ జిల్లా సివిల్ సప్లై అధికారుల అండదండలతో విచ్చలవిడిగా ఆ అక్రమ మిల్లర్ సాగిస్తున్న అక్రమ దందాలన్నీ వెలుగు చూస్తున్నాయి. ఈ మధ్య కాలంలో జరిగిన మిల్లర్ బాగోతాలపై నేటి దాత్రి వరుస కథనాలు ప్రచురిస్తూనేవుంది. ఆ వార్తలు వాస్తవాలను అంగీకరిస్తూ ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ హన్మకొండ అదికారులకు సూచిస్తూ నోట్ కూడా పంపించారు. ఆ నోట్ హన్మకొండ జిల్లా అధికారులకు చేరి కూడా సుమారు 15 రోజులౌతోంది. అయినా హన్మకొండ జిల్లా యంత్రాంగం కదిలింది లేదు. ఉలుకు లేదు. పలుకులేదు. పైగా అక్రమ మిల్లర్కు జగన్కు వంతపాడుతున్నారు. అండగా వుంటున్నారు. అతనికి తప్పించుకునేందుకు సూచనలు,సలహాలు ఇస్తున్నారు. ఆఖరుకు ఖమ్మం జిల్లా జేసినే బురిడీ కొట్టించాలని చూస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? అంటే జగన్ వద్ద నుంచి లెక్కలేనంతసొమ్ము అదికారులు ఎప్పటికప్పుడు అందుకున్నారు. జగన్తో లాలూచీ పడ్డారు. అందుకే జగన్ ఇటీవల ఓ ఫంక్షన్లో అధికారులపై బూతులు సందించినట్లు కూడా విశ్వసనీయ సమచారం. ఆ ఫంక్షన్లో జగన్ మీద వస్తున్న ఆరోపణలపై చర్చకు వచ్చినప్పుడు ఎవడైతే నాకేంటి? ఎవడొచ్చి నన్ను ఏం చేస్తారు? అంతా నా గుప్పిట్లో వున్నారు. నా చేతిలో వున్నారు. నేను చెప్పింది మాత్రమే వాళ్లు వినాలి. లేకుంటే ఏం జరుగుతుందో వాళ్లకు కూడా తెలుసు. అంటూ అదికారులన్న మర్యాద కూడా లేకుండా బూతులు సందిస్తూ ఆ ఫంక్షన్లో జగన్ హంగామా చేసినట్లు కూడా విశ్వసనీయ సమాచారం. నన్ను..నా మిల్లును టచ్ చేసే దమ్ము ఎవరికి వుంది? నా మిల్లు దగ్గరకు వచ్చిన మాట్లే ధైర్యం వాళ్లకు వుందా? అంటూ సవాలు కూడా చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగి, కింది నుంచి పై స్దాయి దాక అందరూ నా సొమ్ము తిన్నవాళ్లే..నేను వేసే బిస్కట్లకు ఆశపడేవారే..అలాంటి వాళ్లు నా జోలికి వస్తారా? సివిల్ సప్లైకి చెందిన విజిలెన్స్ అయినా, ఎవరైనా సరే నా మిల్లుల కాంపౌండ్లోకి రాలేరు. ఎవడొస్తారో..రాని చూస్తా? అంటూ జగన్ అన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు జగన్కు కేవలం 28వేల బస్తాల వడ్లే వచ్చినట్లు అనుకుంటున్నారు. కాని నిజానికి 2024`25 తొలి సీజన్లోనే సుమారు 5లక్షల వడ్ల బస్తాలు వచ్చినట్లు తెలుస్తోంది. అవన్నీ ఖమ్మం జిల్లాలకు చెందిన వడ్లు కావడం విశేషం. ఎందుకంటే హన్మకొండ, వరంగల్ జిల్లాలకు చెందిన రైతులు ఎవరూ మిల్లర్ జగన్కు వడ్లు ఇవ్వడానికి ఒప్పుకోరు. ఒక వేళ ఇచ్చినా ముందు మురిపెంగా మాట్లాడే జగన్ తర్వాత ఎంత కోతలు కోస్తాడో..రైతులను ఎంత ముంచేస్తాడో అందరకీ తెలుసు. అందుకే జగన్ మిల్లులకు ఏ ఒక్క ఐకేపి సెంటర్ నుంచి కూడా జగన్కు వడ్లు ఇవ్వడానికి రైతులు అసలే ఒప్పుకోరు. అందుకే మిల్లర్ జగన్ ఖమ్మం జిల్లాకు చెందిన ఐకేపి సెంటర్ల నుంచి వడ్లు తెచ్చుకుంటాడు. ఖమ్మం జిల్లాకుచెందిన ఒక్క ఐకేపి సెంటర్ నుంచి వచ్చిన 28వేల బస్తాలలో సుమారు 2వేల బస్తాలు మాయం చేసినట్లు ఆరోపలు ఎదుర్కొంటున్నారు. అది నిజమే అని ఖమ్మం జిల్లాకు చెందిన జాయింట్ కలెక్టర్ నిర్దారణ చేశారు. ఆ బస్తాలు ఏమయ్యాయో? వెంటనే రిపోర్టు కావాలని కోరిన సందర్భం కూడా వుంది. అయినా హన్మకొండ జిల్లా అధికారులు ఇప్పటి వరకు కదల్లేదు. అయితే జగన్ అక్రమ దందాలపై నేటిధాత్రి మరింత దృష్టిపెట్టడంతో ఖమ్మం జిల్లాలోని సుమారు 20 ఐకేపి సెంటర్ల నుంచి ఇప్పటి వరకు 5లక్షల వడ్ల బస్తాలు జగన్ మిల్లులకు చేరినట్లు సమాచారం. 28వేల బస్తాలతోనే సుమారు 2వేల బస్తాలు మాయం చేసిన జగన్, 5లక్షల బస్తాలలో ఎంత మాయి చేసి వుంటాడో అర్ధం చేసుకోవచ్చు. 28వేల బస్తాలలో మాయం చేసిన 2వేల బస్తాల మూలంగా జగన్ 20లక్షల రూపాయలు రైతులను మోసం చేశాడు. అంటే 5లక్షల వడ్ల బస్తాలలో జరిగిన మాయంతో ఎన్ని కోట్లు కొట్టేశాడన్నది ఇప్పుడు లెక్క తేలాల్సి వుంది. ఇలా జగన్ చేస్తున్న మోసాలన్నీ హన్మకొండ జిల్లాకు చెందిన ఇతర మిల్లులకు, రైతులకు పూర్తిగా తెలుసు. అయినా ఎవరూ మాట్లాడానికి ముందుకు వచ్చేవారు కాదు. జగన్ అరచకాలు అలా వుండేవి. గత ప్రభుత్వ హాయాంలో కులం పేరు చెప్పుకొని ప్రాపకం పొందేవాడు. ఇప్పటికి కూడా అదే సాగిస్తునాన్నాడు. ఆనాటి నుంచి జగన్ కనుసన్నల్లో వున్న అధికారులే ఇప్పటికీ వుండడంతో ఆయన ఆటలకు అడ్డు కట్ట పడడం లేదు. జగన్ మోసాలను ఎవరూ బైట పెట్టడం లేదు. పైగా జగన్ను వెనకేసుకొస్తున్నారు. ఇప్పుడు కూడా ఖమ్మం జేసిని బురిడీకొట్టించాలని చాల ప్రయత్నం చేశాడు. కాని కుదరలేదు. ఖమ్మం జేసి చేసిన స్కెచ్ జగన్, హన్మకొండ అదికారులు పసిగట్టకపోవడంతో అసలు బండారం బైట పడిరది. అయితే రెండు వేల బస్తాలకు సంబందిచిన సొమ్ము అందడంతో కాస్త ఆలస్యమైంది. అందుకు సంబంధించినవి గుర్తించడం జరిగింది. త్వరలోనే వాటికి సంబంధించిన సొమ్ము రైతులకు అందజేయడం జరుగుతుందని చెప్పమని జగన్కు హన్మకొండ అదికారులు సూచనలు చేస్తున్నట్లు కూడా సమాచారం. అంటే ఇంత జరుగుతున్నా జగన్ది అక్రమమని అనేందుకు కూడా హన్మకొండ అధికారులు ధైర్యం చేయలేకపోతున్నారు. పైగా ఖమ్మం జేసి రిపోర్టునే తొందరపాటు చర్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో మొత్తం ఖమ్మం జిల్లా నుంచి జగన్కు చెందిన రెండుమిల్లలకు ఎన్ని బస్తాల వడ్లు చేరాయో లెక్కలు తేల్చే పనిలో ఖమ్మం జిల్లా అదికారులు నిమగ్నమైవున్నారు. ఇప్పటి వరకు అందినసమాచారం మేరకు జగన్కు చెందిన మిల్లులకు ఇప్పటికే 5లక్షల బస్తాలు చేరినట్లు ప్రాధమిక సమచారం. ఇంకా లోతుగా తవ్వితే ఎంత చేరిందనేదానిపైకూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం వుంది. జగన్కు ఇప్పుడు అసలైన భయం మొదలైంది. హన్మకొండ అదికారులను గుప్పిట్లోపెట్టుకొని ఆడినట్లే ఖమ్మం జిల్లా అధికారులను కూడా కొనేయాలనిచూశాడు. కాని కుదరలేదు. ఖమ్మం జేసి నిక్కచ్చిగా తన నిజాయితీని నిరూపించుకున్నారు. జరిగిన అక్రమ దందాలన్నీ బైట పెట్టాలనే చూస్తున్నారు. జగన్ వల్ల రైతులు ఎంతో మోసపోయారని గుర్తించారు. ఆ సొమ్ముంతా రైతులకు చేరేలా చూడాలనుకుంటున్నారు. అయితే ఇటు ఖమ్మం జిల్లా అధికారుల నుంచి ఒత్తిడి, కమీషనర్ కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే హన్మకొండ అధికారులు కూడా రంగంలోకి దిగక తప్పదు. జగన్ బండారం బైట పెట్టక తప్పదు. ఎందుకంటే అప్పుడు వారి ఉద్యోగాలకే ఎసరు వస్తుంది. అలాంటి పరిస్ధితి వస్తే జగన్ను దోషిని చేయడం ఖాయం. కాకపోతే హన్మకొండ జిల్లాలో పనిచేస్తున్న ఓ మహిళా అదికారి జగన్కుచెందిన సమాజికవర్గానికి చెందిన వారు కావడం విశేషం. దాంతో జగన్ను కాపాడే బాద్యత ఆమె భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ అదికారికి జగన్ గుణం, వ్యవహారం, అక్రమ దందాలకన్నా, మోసాలకన్నా కులమే ముఖ్యమట? జగన్కు కాపాడి తీరుతుందట? ఈ విషయాన్ని ఆమె కార్యాలయంలో ఇతర ఉద్యోగులతో బాహంటానే చెబుతున్నారట? హన్మకొండ జిల్లాకు చెందిన సివిల్ సప్లయ్ అదికారుల తీరుతో ఖమ్మం జిల్లా అదికారులు విస్తుపోతున్నారు. ఇదేం పద్దతని తప్పుపడుతున్నారు. రైతులకు మేలు చేయాల్సిన అధికారులు మిల్లర్లకు మేలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారట? రోజు రోజుకూ మితిమీరిపోతున్న జగన్ వ్యాఖ్యలు తెలిసిన ఖమ్మం జేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తోంది. జగన్కు చెందిన మిల్లుల్లో ఖమ్మం జిల్లా రైతులకు చెందిన 5లక్షల వడ్ల బాస్తాలున్నాయా? లేవా? వుంటే లెక్కంత? ఎన్ని మాయమయ్యాయి? ఎలా మయ్యామయ్యాయి? అనే వివరాలు కావాలని కూడా కోరినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా యదావిధిగా ఇతర మిల్లులకు చెందిన వడ్ల ఖమ్మం వడ్ల లెక్కలో కలపడమో? లేక ఇతర మిల్లుల గోడౌన్లలో వున్న వడ్లు జగన్వి అని తేల్చితే ఊరుకునే ప్రసక్తి లేదని కూడా తేల్చి చెప్పారట. దాంతో ఇంత దూరం వచ్చేదాకా అదికారులు ఏం చేస్తున్నారు? తానిచ్చిన సొమ్ములు తిని, తనకు అన్యాయం జరిగే పరిస్ధితి వచ్చేదాకా అదికారులు నిద్ర పోతున్నారా? అంటూ జగన్ అదికారుల మీద కూడా చిందులు వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా అదికారులు కదులుతారా? లేక జగన్కే వత్తాసు పలుకుతారా? కోట్లలో రైతులను ముంచేస్తున్న జగన్పై చర్యలు తీసుకుంటారా? వేచి చూడాలి.
గీతాంజలి కేంబ్రిడ్జి పబ్లిక్ స్కూల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో నూతన విద్యా శిఖరం.
భద్రాద్రి కొత్తగూడెం/హైదారాబాద్,నేటిధాత్రి:
నేటి ఆధునిక యుగంలో విద్యార్థులకు విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు సూచించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మంగళవారం గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో గీతాంజలి పబ్లిక్ స్కూల్ అత్యాధునిక హంగులతో, కేం బ్రిడ్జి సిలబస్ తో కూడిన పాఠశాలను ఏర్పాటు చేయగ సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో ఇంటర్నేషనల్ (ఐజిసిఎస్ఈ), కేం బ్రిడ్జ్ సెలబస్ తో ప్రారంభించడం భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతం ప్రజలు చేసుకున్న పుణ్యమని అన్నారు.ఇంత మంచి ఇంటర్నేషనల్ హంగులతో కూడినటువంటి పాఠశాలను ప్రారంభించిన గీతాంజలి స్కూల్ ఆఫ్ చైర్మన్, డైరెక్టర్స్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.గీతాంజలి పబ్లిక్ స్కూల్ ప్రారంభంతో భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో నాణ్యతతో కూడిన విద్యా సౌకర్యాలు ఈ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన అవసరం లేకుండా నాణ్యతతో కూడిన విద్య తమకందుబాటులో ఉండడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమని పేర్కొన్నారు.సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షబ్బీర్ పాషా మాట్లాడుతూ సకలహంగులతో కూడిన ఇంటర్నేషనల్ స్కూల్ భద్రాద్రి కొత్తగూడెం రావడం ఇదే మొదటిది అని ఏసీ గదులు, ఏసి బస్సులతో, డిజిటల్ బోర్డులతోఇంత మంచి స్కూల్ రావడానికి సహకరించిన సిపిఐ ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు చొరవతో నాణ్యతతో కూడిన విద్య విద్యార్థులకు అందుతుందని ఇంత మంచి ఆలోచన చేసిన గీతాంజలి గ్రూప్ ఆఫ్ చైర్మన్స్ వేములపల్లి సుబ్బారావు , డైరెక్టర్స్, ప్రిన్సిపాల్ కు కృతజ్ఞతలు తెలిపారు. గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ వేములపల్లి సుబ్బారావు మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యా వ్యాపారంగా కొనసాగుతుందని విద్యను వ్యాపారం చేయకుండా విద్యను ఒక సేవ దృక్పథంతో భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్, కేంమ్ బ్రిడ్జి సిలబస్ తో గీతాంజలి పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని పాఠశాలలోని సౌకర్యాలను చూసి ఎంతో సంతోషపడ్డారు. ఈ కార్యక్రమంలో స్దానిక సిపిఐ నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
`పేదలందరి ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో గుండె గుడిలో వేడుక.
`ఇప్పటికే మొదలైన ఇండ్ల నిర్మాణం.
`పేదవారి కళ్లలో ఆనందం.
`పదేళ్ల ఎదురుచూపులకు మోక్షం.
`గతంలో పదేళ్ల కాంగ్రెస్ లోనే ఇందిరమ్మ ఇల్లు సొంతం.
`పదేళ్ల బిఆర్ఎస్ కాలమంతా ఆశల మేఘం.
`ఇప్పుడు మళ్ళీ పల్లెల్లో మళ్ళీ ఆనాటి వాతావరణం.
`పేదలందరికీ కాంగ్రెస్ అందిస్తున్న వరం.
`జీవిత కాలం గుర్తుండిపోయేలా ఇందిరమ్మ గూడు నిర్మాణం
హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణ పల్లెల్లో పదేళ్ల తర్వాత ఇందిరమ్మ ఇండ్ల వేడుక మొదలైంది. పల్లె సంబురపడుతోంది. దశబ్ధానికి పైగా ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని ప్రజలు సంతోషపడుతున్నారు. పదేళ్లపాలు రెండు పడకల గదులు ఇల్లు అంటూ ఊరించి, ఊరించి బిఆర్ఎస్ ఉసూరుమనిపించింది. ఎన్నికలెప్పుడొచ్చినా రెండు పడకల ఇల్లు ముచ్చట చెప్పుడు తప్ప తీర్చింది లేదు. పదేళ్లలో ఒక్క ఇల్లు కూడా కేసిఆర్ ఇచ్చింది లేదు. ఎన్నొన్నో చెప్పాడు. ఆఖరుకు కేసిఆర్ చేతులెత్తేశాడు. మాయ మాటలు చెప్పి ఓట్ల మూటలు కొల్లగొట్టుకొని పదేళ్లు పాలించి, పట్టుమని పది ఇండ్లుకూడా ఇవ్వలేదు. కాని కాంగ్రెస్ పార్టీ మాటంటే మాటే. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కాంగ్రెస్సే. సొంత ఇల్లు అనేది అందిరకీ కల. నిన్నటి తరం వరకు పల్లెల్లో అందరికీ ఇండ్లు వుండేవి. కాని తరం మారుతున్న కొద్ది ఆ ఇండ్లు పాతబడిపోవడం. కూలిపోవడం జరుగుతోంది. పైగా పెరుగుతున్న జనాభాతో కుటుంబాలు పెరుగుతూ వచ్చాయి. కుటుంబ సభ్యులు పెరుగుతుండడంతో ఇండ్ల అవసరం పెరుగుతూ వచ్చింది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని పెద్దలు ఎందుకన్నారో గాని, ఆ సామెత ఇప్పటి రోజులకు సరిగ్గా సరిపోతోంది. గత యాభైఏళ్ల క్రితం వరకు ఎంతటి పేదవారైనా సరే ఏదో ఒక గుడిసె వేసుకొని బతికేవారు. కాని ఈ రోజుల్లో గుడిసే వేసుకునేందుకు స్ధలం లేదు. కట్టుకునే స్ధోమత లేదు. దాంతో ప్రభుత్వం ఎప్పుడు ఇల్లు ఇస్తుందా? అని ఎదురుచూసే రోజులు వచ్చాయి. పేదలు మరింతగా ప్రభుత్వం మీద ఆధారపడి ఇల్లు కట్టుకునే స్ధితికి చేరింది. అందుకే తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లు అనే పేరు వినిపిస్తేనే పేదల కళ్లలో ఆనందం నిండుతుంది. ఇక మంజూరైన వారి ఆనందానికి అవదులు వుండవు. కాంగ్రెస్ అంటేనే పేదల రాజ్యం. ఇందిరమ్మ రాజ్యమని దేశమంతా అందుకే ఇప్పటికీ ప్రజలు కొనియాడుతుంటారు. ముఖ్యంగా మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ ప్రధాని కావడం వల్ల పేదలుకు ఎంతో మేలు జరిగింది. పేదలను ఒక స్దాయికి తీసుకురావాలన్న ప్రగతికి బాటలు పడిరది. ఎస్సీ, ఎస్టీల జీవితాల్లో వెలుగులు నింపడం మొదలైంది. అయితే అభివృద్ది అనేది నిరంతర ప్రక్రియ. ఒక్కసారి మొదలైందంటే అది నిరంతర ప్రవాహంగా సాగాల్సిందే. ఒకప్పుడు దేశంలోని భూములున్నీ అగ్రవర్ణాల చేతుల్లో వుండేవి. ప్రభుత్వం ఆదీనంలో వుండేవి. వాటన్నింటిలో నూటికి తొంబైశాతం మేర ఆ రోజుల్లోనే ఎస్సీ, ఎస్టీలు ఇందిరాగాంధీ భూములు పంచారు. ఆ భూములను సాగుయోగ్యం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు భూముల ఇవ్వడమే కాకుండా, వాటిని సాగుయోగ్యం కోసం పక్క బావులు తివ్వించారు. అలాంటి బావులు ఇప్పుడు తవ్వించాలంటే లక్షల రూపాయలు ఖర్చవుతుంది. అయినా ఆరోజుల్లో ఎంతటి ఖర్చుకైనా వెనుకాడకుండా ఎస్సీ, ఎస్టీలకు భూముల ఇవ్వడమే కాకుండా, బావులు తొవ్వించి రైతులను చేశారు. కుల వృత్తులకు పరిమితైన ఆ వర్గాలను రైతులను చేసిన ఘనత ఇందిరాగాంధీకే దక్కుతుంది. అంతే కాకుండా దేశంలోని ప్రతి పల్లెలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం అప్పుడే మొదలైంది. అలా దేశంలో కొన్ని కోట్ల మందికి ఇండ్లు నిర్మాణం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైంది. పల్లె పట్టణాలు అనే తేడాలేకుండా గర్ కుల్ అనే కాలనీలు పెద్దఎత్తున వెలిసిన రోజలవి. తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే దేశంలోని అనేక పట్టణాలల్లో పెద్దఎత్తున ఇండ్ల నిర్మాణం చేసి, ప్రజలకు నీడ కల్పించారు. తెలంగాణ విషయానికి వస్తే ఉమ్మడిరాష్ట్రంలో 2004 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ పదేళ్ల కాలంలో అటు రైతులకు, ఇటు పేదలకు అనేక రకాలమేలు చేశారు. అర్హలైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను అందించారు. ప్రతి ఊరిలోనూ, పట్టణాల్లోనూ ప్రభుత్వ భూములనే సేకరించి, ప్రజల చేతికి రూపాయి ఖర్చు లేకుండా, ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేశారు. ప్రతి పల్లెల్లో కనీసం 50 నుంచి వందకు తక్కువ కాకుండా ఇందిరమ్మ కాలనీలు వచ్చాయి. ప్రతి పట్టణంలో వేలాది ఇండ్లు ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇండ్ల కాలనీలు అనేకం వున్నాయి. అంతే కాకుండా ప్రజలు ఉపాధి హమీ అమలు చేసి, ఆర్ధిక ప్రగతికి తోడ్పాటు కల్పించారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వనటు వంటి పధకం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్న ఆలోచనతో కేసిఆర్ రెండు పడకల గదుల ఇండ్లు అనికొత్త ప్రచారం మొదలుపెట్టారు. ప్రభుత్వం తల్చుకుంటే ఇవ్వడం పెద్ద సమస్య కాదని ఇందిరమ్మ ఇండ్ల ద్వారా రుజువైంది. అందుకే తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ను నమ్మారు. అదే సమయంలో కాంగ్రెస్పార్టీనే గెలిపిస్తే ఇప్పటి వరకు మరో ఇరవై లక్షల ఇండ్లకు పైగా నిర్మాణం జరిగేవేమో? కేసిఆర్ అధికారంలోకి రాగానే ఉమ్మడి రాష్ట్రంలో వున్న గృహ నిర్మాణ శాఖను రద్దు చేసినప్పుడే కేసిఆర్ నైజం బైట పడిరది. డబుల్ బెడ్ రూంల ఇండ్లు అనేవి మిధ్యఅనేది తేలిపోయింది. కాని జనం కేసిఆర్ ఇస్తారన్న నమ్మకాన్ని రెండోసారి కూడా పెట్టుకున్నారు. కాని కేసిఆర్ ఇండ్లు ఇవ్వడానికి సుముఖతచూపలేదు. డబుల్ బెడ్ రూంలు ఇవ్వలేదు. డబుల్ బెడ్ రూంలు ఇస్తామని నమ్మించి, గృహనిర్మాణ శాఖను వదిలించుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పి ఆ శాఖను మూసేయించారు. దాని మనుగడ లేకుండా చేశారు. ఈ వాదన ఉమ్మడి రాష్ట్రంలోనే మొదలైంది. ఆ సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక పెద్ద కార్యక్రమం జరిగినప్పుడు చిన్న పొరపాట్లు జరిగడం సహజం. అయినా ఎలుకల బాధకు ఇల్లు తగలబెట్టుకుంటామా? అని కూడా అన్నారు. అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇవ్వాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని చెప్పి, అప్పటి ప్రతిపక్షాల నోరు మూయించారు. ఉమ్మడి రాష్ట్రంలో అందరికీ ఇండ్లు ఇచ్చారు. కాని బిఆర్ఎస్కు సాద్యం కాలేదు. ఇవ్వాలన్న మనసు కేసిఆర్కు రాలేదు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ అదికారంలోకి వచ్చింది. గతంలో కాంగ్రెస్ హయాంలో కనిపించిన పండుగ మళ్లీ మొదలైంది. పల్లెల్లో పెద్దఎత్తున పండుగ వాతారణం కనిపిస్తోంది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. ఎక్కడిక్కడ ఇందిరమ్మ ఇండ్ల నిర్మానం మొదలైంది. త్వరలోనే ఆ ఇండ్లు పూర్తయ్యే దశకు చేరుకుంటున్నాయి. ప్రస్తుతంవున్న పరిస్ధితుల్లో ఊరుకి పది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినా లక్షల ఇండ్లు అవుతాయి. తెలంగాణలో సుమారు 14వేల గ్రామాలున్నాయి. పట్టణాలు 600లకు పైగా వున్నాయి. పల్లెలు పట్టణాలన్నీ కలిపితే కనీసం రెండు లక్షలకు పైగా ఇండ్లు ఏక కాలంలో పూర్తయ్యే అవకాశం వుంది. ఇంకా మూడేళ్ల కాలం ముందుంది. వచ్చే ఏడాది నుంచి పూర్తి స్దాయిలో ఇందిరమ్మ ఇండ్ల పధకం అమలు జరిగితే మూడేళ్లలో కనీసం 15లక్షలకు పైగా ఇండ్లు నిర్మాణం జరగొచ్చని అంచనా. తొలి దఫాలో ఇందిరమ్మ ఇండ్లు దక్కని వారికి మిగిలిన విడతల్లో తప్పకుండా అందే అవకాశం వుంది. ప్రతి పల్లెలోనూ కనీసం రెండు నుంచి మూడు వందల కొత్త ఇండ్లు నిర్మాణం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే సాద్యమని మరోసారి రుజువైంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిపిసి. అధ్యక్షుడుగా ప్రజలకు హమీ ఇచ్చారు. అదికారంలోకి వచ్చిన తర్వాత రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంతో పట్టుదలతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశమేమిటంటే పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు గత ఏడాదినుంచే మొదలయ్యాయి. ఆ ఖమ్మం నియోజకవర్గంలో ఎప్పుడో ఇందిరమ్మ ఇండ్లు వెలిశాయి. ఇది మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాయకత్వ నిబద్దతకు నిరద్శనమని చెప్పొలి. పైలెట్ ప్రాజెక్టు కింద మొదలైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రతినియోజకవర్గంలో ఊపందుకున్నాయి. నియోజకవర్గానికి సుమారు 4వేల ఇండ్ల నిర్మాణం మొదలైంది. మరో రెండు నెలల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయి, ప్రజలు గృహ ప్రవేశాలు చేసుకునే సమయంకూడా ఆసన్నమౌతోంది. నిజంగా తెలంగాణకు ఇది అసలైన పండుగ చెప్పకతప్పదు.
మార్గదర్శకాల విడుదలకు మంత్రి పొన్నం కు వివిజ్ఞప్తి
“నేటిధాత్రి”, హైదరాబాద్.
ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో గల్ఫ్ కార్మికుల పిల్లలకు ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ఇవ్వాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను స్టేట్ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ఛైర్మన్ మంద భీంరెడ్డి, మెంబర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి లు మంగళవారం హైదరాబాద్ లో కలిసి విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీ.ఓ. నెం. 205 ప్రకారం… ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేయాలని వారు కోరారు. గల్ఫ్ బాధితుల పిల్లలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
జర్నలిస్ట్ అక్రమ అరెస్టును ఖండిస్తున్న టి యు డబ్ల్యూ( ఐ జే యు)
కేసముద్రం/ నేటి దాత్రి
సాక్షి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ రావు అక్రమ అరెస్టు, ఏపీలో సాక్షి కార్యాలయాలపై దాడులను నిరసిస్తూ మంగళ వారం మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ సెంటర్లో టి యు డబ్ల్యూ (ఐ జేయూ), వివిధ పార్టీల, సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐజేయూ రాష్ట్ర నాయకులు బండి సంపత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో సాక్షి కార్యాలయాలపై దాడి చేయడం, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికం అన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.