ఉద్యోగికి పదవీ విరమణ తప్పదు..

https://youtu.be/MeA4Sc-IO2k?si=TOtS
ఉద్యోగికి పదవీ విరమణ తప్పదు

మరిపెడ మండల విద్యాశాఖ అధికారిని శ్రీమతి అనిత దేవి.

మరిపెడ నేటిధాత్రి.

మరిపెడ మండలంలోని రాంపూర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు గువ్వాడి లక్ష్మయ్య అభినందన ఆత్మీయ వీడ్కోలు సభ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రం వెంకన్న అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పిఆర్టీయూ మరిపెడ మండల విద్యాశాఖ అధికారిని అనితా దేవి మాట్లాడుతు లక్ష్మయ్య మంచి సమయపాలన పాటించి నిబద్ధతతో,క్రమ శిక్షణతో పాఠశాల విద్యార్థులకు పాఠాలు బోధించడం జరిగిందని అన్నారు.ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు పదవి విరమణ తప్పదని అన్నారు.వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు. పదవీ విరమణ పొందిన లక్ష్మయ్య ను పాఠశాల పక్షాన ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు జయ, స్టేషన్ ఘన్పూర్ మండలం విద్యాశాఖ అధికారి జి కొమురయ్య, జనగాం జిల్లా సీఎమ్ఓ నాగరాజు,పిఆర్టీయూ మరిపెడ అధ్యక్షులు కేసరి రమేష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు లింగాల మహేష్ గౌడ్,జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గండి కరుణాకర్ పాఠశాల ఉపాధ్యాయులు రాజేశ్వరి, గణేష్,శ్రీధర్,సంపత్,వెంకట్ రెడ్డి,సంతోషి,సిఆర్పి దోమల సత్య శ్రీనివాస్,లక్ష్మయ్య బంధుమిత్రులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్ మండల విద్యాధికారిగా బస్వరాజు నియామకం

జహీరాబాద్ మండల విద్యాధికారిగా బస్వరాజు నియామకం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ మండల విద్యాధికారిగా బస్వరాజును నియమిస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఎంఈఓగా పనిచేసిన బస్వరాజు పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో మండలంలోని సత్వార్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ హెచ్ఎంగా పని చేస్తున్న బస్వరాజును ఎంఈఓగా నియమించినట్లు పేర్కొన్నారు. 

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version