బారాస కౌన్సిలర్ అభ్యర్థిపై కాంగ్రెస్ నాయకుల బెదిరింపు

బారాస కౌన్సిలర్ అభ్యర్థిని విత్ డ్రా చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు బెదిరింపు…

బారాస నాయకులు రాజా రమేష్

రామకృష్ణాపూర్,నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 16 వ వార్డ్ బారాస కౌన్సిలర్ అభ్యర్థి గండమాల కృపానందం (గ్యాస్ నాని) ని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు కిడ్నాప్ చేసి,బలవంతంగా విత్ డ్రా చేసుకోవాలని భయభ్రాంతులకు గురిచేసి మున్సిపాలిటీ కార్యాలయంలోని ఎన్నికల కేంద్రానికి విత్ డ్రా సమయం అయిపోయిన గంట తర్వాత తీసుకుని రావడంతో మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఎన్నికల అధికారులు సమయం దాటి పోయిందని అనుమతించలేదు. ఆ అభ్యర్థి కంట నీరు పెడుతూ గజగజ వనికి పోతుండగా గమనించిన బిఆర్ఎస్ చెన్నూరు నియోజకవర్గ నాయకులు రాజా రమేష్, పార్టీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సిపిఐ జిల్లా అధ్యక్షుడు రామడుగు లక్ష్మణ్, మిట్టపల్లి శ్రీనివాస్, ఇరు పార్టీల నాయకులు అభ్యర్థిని ఏం జరిగిందంటూ తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయమై కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు ను మా పార్టీ బీ ఫామ్ ఇచ్చిన అభ్యర్థిని బెదిరించి ఎన్నికల కేంద్రానికి విత్ డ్రా చేసుకోవాలని తీసుకురావడం ఏంటని నిలదీశారు. అప్పటికే అభ్యర్థిని దబాయిస్తూ నిన్ను మేము బెదిరించామా అంటూ అభ్యర్థిని గద్దించాడు.అభ్యర్థి గ్యాస్ నాని వనికిపోతూ సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉండిపోయారు. బారాస నాయకులు, అధికార పార్టీ నాయకులను అభ్యర్థిని భయభ్రాంతులకు గురి చేసి తీసుకురావడం ఏంటని ప్రశ్నించడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అక్కడే ఉన్న స్థానిక ఎస్సై జె శ్రీధర్ గొడవ జరిగేలా ఉందని గమనించి అందర్ని కార్యాలయం బయటికి పంపించి వేశారు.

అణగారిన వర్గాల అభ్యున్నతి కోసమే పోటీ..

అణగారిన వర్గాల అభ్యున్నతి కోసమే పోటీ:

*ఇంటింటి ప్రచారం చేస్తున్న వంగ శిరీష రవి

నర్సంపేట, నేటిధాత్రి:

 

అణగారిన వర్గాల అభ్యున్నతి కోసమే
నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో 17వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంగ శిరీష రవి తెలిపారు. బిసి రాజ్యాధికార సమితి నుండి 17 వ వార్డు అభ్యర్థిగా పోటీ బరిలో నిలిచిన వంగ శిరీష రవి లు ప్రచారంలో దూసుకు పోతున్నారు.గెలుపే లక్ష్యంగా నామినేషన్ వేసిన మరుసటి రోజు నుండి శిరీష రవిలు ప్రచారం ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.17 వార్డులో అన్ని వర్గాల ప్రజలను సమ తుల్యం చేస్తూ ప్రచారా న్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అగ్రవర్ణాల ఆధిపత్యంలో అణగారి పోతున్న బీసీలను చైతన్య పరచడం కోసం పోటీ చేస్తున్నట్లు తెలిపారు.దాసి సురేష్,పాలూరీ రామకృష్ణయ్య సహకారంతో పోటీలో ఉన్నట్లు తెలిపారు. బీసీల ఐక్యత కోసం పోరాడుతున్న వివిధ రాజకీయ పార్టీ నాయకుల సమన్వయంతో 17వ వార్డు ప్రచారం కొనసాగిస్తున్నట్లు వివరించారు. అన్ని వర్గాల ప్రజలు తమను గెలిపించా లనే సంకల్పంతో ప్రచారాన్ని ముందుకు నడిపిస్తున్నట్లు తెలిపారు.మున్సిపాలిటీలో జరుగుతున్న అనేక అక్రమాలను వెలికితీయ డంతో పాటు, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేయడానికి ముందుకు వస్తున్న వంగ శిరీషను ఆశీర్వదించి కౌన్సిలర్ గా గెలిపించాలని ఇంటింటి ప్రచారంలో మహిళలకు విజ్ఞప్తి చేశారు. మీ సమస్య తన సమస్యగా పరిగణలోనికి తీసుకొని సహకరిస్తానని ప్రజలకు మంగ శిరీష రవీలు హామీ ఇచ్చారు. వార్డు సమస్యల తో పాటు ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిష్కరించడానికి అధికారుల సహకారం తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమ, శ్రీలత, షాహిన్, సాంబశివ, సుల్తానా, జరీనా, షమీం బేగం, నూర్జాన్, అమల, అనిత, రవి, భాష నవీన్, రమేష్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version