సాతారం సర్పంచ్, ఉప సర్పంచ్‌లను సన్మానించిన విద్యాసాగర్ రావు

సాతారం సర్పంచ్ ఉప సర్పంచ్ లను సన్మానించిన బిఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు
మెట్ పల్లి డిసెంబర్ 30 నేటి ధాత్రి

 

 

మెట్‌పల్లి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ని మర్యాదపూర్వకంగా కలిసిన మల్లాపూర్ మండలం సాతరం గ్రామ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కిషన్ గౌడ్ ఉప సర్పంచ్ జగన్
విద్యాసాగర్ రావు నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్‌లను శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు
గ్రామ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కలిసి పనిచేద్దామని తెలిపారు.

 అలా వెళ్లిన ఏకైక నాయకుడు జగన్.. బుద్దా వెంకన్న ఫైర్..

 అలా వెళ్లిన ఏకైక నాయకుడు జగన్.. బుద్దా వెంకన్న ఫైర్

 

జగన్.. రైతుల మీదకు దండయాత్రకు వెళ్లారని బుద్దా వెంకన్న అన్నారు. ఓడించారనే అక్కసుతో హేళనగా చూసేందుకు వెళ్లారంటూ మండిపడ్డారు. తుఫాను సమయంలో అసలు జగన్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.

విజయవాడ, నవంబర్ 5: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై (Former CM YS Jagan) టీడీపీ నేత బుద్దా వెంకన్న(TDP Leader Budda Venkanna) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతుల పరామర్శ పేరుతో వారిపైనే జగన్ దండయాత్రలాగా వెళ్లారంటూ మండిపడ్డారు. రైతులపై ప్రేమ ఉంటే కట్ట మీద పొలాలు ఉన్న ప్రాంతంలో జగన్ పర్యటించాలని డిమాండ్ చేశారు. రైతులు ఓట్లు వేయలేదనే అక్కసుతోనే ప్రధాన మార్గంలో వెళ్లారని ఆరోపించారు. రైతుల‌ కోసం వెళ్లిన జగన్‌కు మందీ మార్బలం ఎందుకు అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చే అర్హత, స్థాయి జగన్‌కు ఉందా అని మండిపడ్డారు.

రైతులపై కక్ష…

‘అసలు వ్యవసాయం గురించి నీకేం తెలుసు. నీ తాతది గ్రానైట్, నీ తండ్రి ఫ్యాక్షన్, వ్యాపారం, నీది దగా వ్యాపారం. అసలు జగన్‌కు స్క్రిప్ట్ ఇచ్చేది ఎవరో. చదివి చెప్పడం కూడా జగన్‌కు చేత కావడం‌లేదు. ఫసల్ బీమా కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చెల్లిస్తున్నాయి. అసలు నువ్వు ముఖ్యమంత్రిగా ఏమీ తెలియకుండా ఐదేళ్లు ఉన్నావా. నీకు ఓట్లు వేయకపోతే రైతుల మీద కక్ష కడతావా’ అంటూ ఫైర్ అయ్యారు.

ఆనందంతోనే వెళ్లారు..

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు రైతుల వద్దకు వెళ్లి పరామర్శ చేశారని చెప్పిన బుద్దా వెంకన్న.. జగన్ రైతుల వద్దకు పరామర్శకు వెళ్లి పూలు వేయించుకుంటారా అంటూ మండిపడ్డారు. ఎవరైనా చనిపోయిన వారి దగ్గరకు వెళ్లి కూడా ఇలాగే పూలు విసిరేయించుకుంటారంటూ విరుచుకుపడ్డారు. జగన్ పర్యటన ఆనందంతో వెళ్లినట్లుగా ఉంది కానీ.. పరామర్శకు వెళ్లినట్లు లేదంటూ వ్యాఖ్యలు చేశారు. వంద కార్లు, బైక్‌లు, జెండాలు, పెయిడ్ ఆర్టిస్ట్‌లతో పరామర్శకు వెళ్లిక ఏకైక‌ నాయుడు జగన్ అంటూ ఎద్దేవా చేశారు.

ఆ మాత్రం తెలీదా…

జగన్.. రైతుల మీదకు దండయాత్రకు వెళ్లారని అన్నారు. ఓడించారనే అక్కసుతో హేళనగా చూసేందుకు వెళ్లారంటూ మండిపడ్డారు. తుఫాను సమయంలో అసలు జగన్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్, లోకేష్ రాత్రింబవళ్లు ప్రజల కోసం పని చేశారని తెలిపారు. ప్రకృతి విపత్తులను ఆపగలమా… ‌నష్టం తగ్గిస్తామా అని ప్రశ్నించారు. ఆ మాత్రం జగన్‌ తెలియదా అని ఫైర్ అయ్యారు. వరదల సమయంలో కోటి ఇస్తా అన్నారని…. ఎవరికి ఇచ్చారంటూ జగన్‌ను నిలదీశారు. దేశంలో అత్యధిక సంపన్నుడినని స్వయంగా జగనే అఫిడవిట్‌లో చెప్పారన్నారు. జగన్‌కు పేదలు అన్నా, రైతులు అన్నా చులకన భావమని అన్నారు. రైతులకు మేలు చేయాలని‌ జగన్‌కు నిజంగా ఉంటే తుఫాను తగ్గిన సమయంలో ‌వెళ్లేవారన్నారు. చంద్రబాబు తుఫాను హెచ్చరికల నుంచే అందరినీ అప్రమత్తం చేశారని.. నేతలను, అధికారులను క్షేత్ర స్థాయిలో పరుగెత్తించారని తెలిపారు. జగన్ విధ్వంసకర పాలన అందించారు కాబట్టే ప్రజలు ఇంట్లో‌కూర్చో పెట్టారని దుయ్యబట్టారు. చంద్రబాబు పడి లేచిన కెరటమని.. అలాంటి ఆయనకు జగన్ వార్నింగ్ ఇస్తారా అంటూ టీడీపీ నేత మండిపడ్డారు.

కేవలం ఫోటోల కోసమే..

11 సీట్లు వచ్చినా జగన్‌కు సిగ్గు శరం లేదంటూ బుద్దా వెంకన్న వ్యాఖ్యలు చేశారు. అందుకే రూ.42 వేల‌కోట్లు దోచుకుని జగన్ జైళ్లకు వెళ్లారన్నారు. ప్రజలు ఎవ్వరూ జగన్ కోసం రోడ్డు మీదకు రాలేదని గుర్తు చేశారు. కానీ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేస్తే ప్రజలు స్వచ్ఛంధంగా రోడ్ల‌పైకి వచ్చారని తెలిపారు. జగన్ తండ్రి ఎన్నో ఎంక్వయిరీలు వేసినా చంద్రబాబును దోషిగా చూపలేక పోయారని అన్నారు. చంద్రబాబు రైతు బిడ్డ.. అందుకే రైతల బాధలు ఆయనకు తెలుసన్నారు. జగన్.. ఫ్యాక్షనిస్టు బిడ్ట అని.. అందుకే విధ్వంసం చేశారని విరుచుకుపడ్డారు. సీఎంగా పొలంలో ‌కూడా దిగని జగన్.. నిన్న మాత్రం ఫొటోల కోసం పొలంలో అడుగు పెట్టారని అన్నారు. బురద లేని చోట మట్టి అంటకుండా పొలంలో పర్యటన బాగా చేశారంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. జగన్ ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మరని అన్నారు. చంద్రబాబును ఊర కుక్కలతో తిట్టిస్తే… ఆయన ఛరిష్మా తగ్గదని స్పష్టం చేశారు. జగన్ దండయాత్రలు మానుకుని ప్రజల కోసం పని చేయాలని హితవుపలికారు. తుఫాను సమయంలో ప్రభుత్వం చర్యలను చూసి ప్రజలంతా హర్షించారని తెలిపారు. జగన్‌కు ఇలాంటి మంచి‌ కనిపించదని… అబద్ధాలు, అసత్యాలతో మోసాలు చేయడమే వైసీపీ అధినేతకు తెలిసిన విద్య అంటూ బుద్దా వెంకన్న వ్యాఖ్యలు చేశారు.

జగన్‌పై కేసు.. వైసీపీ నేతలకు నోటీసులు.

జగన్‌పై కేసు.. వైసీపీ నేతలకు నోటీసులు

 

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మిర్చియార్డు పర్యటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.

 

అలాగే పలువురు వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు.

 

 

 

గుంటూరు, జూన్ 24: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jagan Mohan Reddy) మరో కేసు నమోదు అయ్యింది.

జగన్ మిర్చి యార్డ్ పర్యటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి వైసీపీ కీలక నేతలకు నల్లపాడు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు.

గత ఫిబ్రవరి 19న మిర్చి రైతుల పరామర్శ కోసం యార్డ్‌కు వెళ్లారు జగన్.

కానీ అనుమతి లేకుండా యార్డ్‌లోకి వచ్చి వైసీపీ నేతలు నానా హంగామా సృష్టించారు.

దీంతో జగన్‌తో పాటు పలువురు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫ్యాన్ పార్టీ నేతలకు 41 ఏ నోటీసులు అందజేస్తున్నారు.

మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు, అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి , అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు, కృష్ణా జిల్లాకు చెందిన కీలక నేతలు పేర్నినాని, కొడాలి నాని, తలశిల రఘురాంతో పాటు జగన్‌పై గతంలోనే నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లోనే కేసు నమోదు అయ్యింది.
ఇప్పుడు నాలుగు నెలల తర్వాత అందుబాటులో ఉన్న నేతలకు నోటీసులు జారీ చేశారు.
పిలిచినప్పుడు నల్లపాడు స్టేషన్‌కు విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.

కాగా.. మిర్చి రైతులను పరామర్శించేందుకు గత ఫిబ్రవరి 19న గుంటూరులోని మిర్చియార్డుకు వచ్చారు వైఎస్ జగన్.

 

ఆ సమయంలో గుంటూరు – కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని పెద్ద సంఖ్యలో ర్యాలీలు, పరామర్శకు అనుమతి లేదని పోలీసులు ముందుగానే చెప్పారు. అయినప్పటికీ…

 

జగన్, వైసీపీ నేతలతో కలిసి భారీగా మిర్చియార్డుకు వచ్చి నానా హంగామా సృష్టించారు.

మిర్చి బస్తాలను ధ్వంసం చేశారు.

అంతేకాకుండా కొన్ని మిర్చి బస్తాలను అపహరించారనే ఆరోపణలు వచ్చాయి.

ఈ క్రమంలో నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫిబ్రవరి 19న తొమ్మిది మందిపై కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు..

వారికి నోటీసులు పంపిస్తున్నారు.

ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు రావాలని, తమకు చెప్పకుండా ఊరు వదిలి, దేశం వదిలి పోవొద్దని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

వైసీపీ నేతలకు నోటీసులు ఇస్తున్న పోలీసులు జగన్‌కు నోటీసులు ఇస్తారా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది.

గతంలో నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో రఘురామకృష్ణం రాజుపై కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి జగన్‌పై కేసు నమోదు చేసి ఏడాది దాటింది.

ఇంత వరకు ఆయనకు నోటీసులు ఇవ్వలేదు.

ఇప్పుడు నాలుగు నెలల క్రితం మిర్చి యార్డులో ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించి యార్డులో హంగామా సృష్టించిన కేసులో వైసీపీ నేతలకు నోటీసులు ఇవ్వడం మొదలు పెట్టారు.

మరి జగన్‌కు నోటీసులు ఇవ్వడంపై ఉత్కంఠ నెలకొంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version