రాష్ట్ర ప్రభుత్వం నేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పట్ల నర్సంపేట మండలం రాజేశ్వరరావుపల్లి గ్రామంలో పంచాయితీ కార్యదర్శి ఎండి రజియా స్థానిక కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బొజ్జ కృష్ణంరాజు తో కలిసి ప్రోసిడింగ్ కాపీలను లబ్ధిదారులకు అందజేశారు.బొజ్జ కృష్ణంరాజు మాట్లాడుతూ శాసనసభ్యులు మాధవరెడ్డి ఆదేశాల మేరకు లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రోసడింగ్ పత్రాలను అందజేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ పార్టీ నాయకులు ఐలయ్య,రంజిత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
గత సీజయన్ లో రైతు భరోసా ఇవ్వని రైతులకు వెంటనే రైతు బరోసా డబ్భులు ఇవ్వాలని బిఆర్ఎస్ నర్సంపేట మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ డిమాండ్ చేశారు. మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో అధ్యక్షుడు నామాల సత్యనారాయణ మాట్లాడుతూ గతకాలం సీజన్ లో రైతులకు రైతు భరోసా కేవలం 3 ఎకరాలలోపు ఉన్న కొందరు రైతులకు మాత్రమే రైతు భరోసా వేశారని ఇప్పుడు వానాకాలం సీజన్ మొదలు అవుతుందని అన్నారు.గౌరవ తెలంగాణ తోలి ముఖ్యమంత్రి కేసిఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో రైతు బందును సమయానికి రైతుల ఖాతాలో వేసి రైతులకు అదుకున్నారని పేర్కొన్నారు. నేడు ముఖ్యమంత్రి ఓక సీజన్ రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేశాడని ఆరోపించారు.ఎలాంటి అంక్షలు లేకుండా రైతు భరోసా బాకి ఉన్న రైతులకు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నరసింహరాములు,మోతే జైపాల్ రెడ్డి,మోతే పద్మనాభ రెడ్డి,కోమల్ల గోపాల్ రెడ్డి,బండారి రమేష్,మోటూరి రవి,కోడారి రవి,తాల్లపెల్లి రాం ప్రసాద్,భూక్య వీరన్న,కడారి కుమారస్వామి,పెద్ది శ్రీనివాస్ రెడ్డి,వళ్ళల కర్ణకార్,అల్లి రవి,మర్ద నవీన్,సంగెం శ్రీకాంత్,చిప్పు రాజు తదితరులు ఉన్నారు.
సిపిఐ 18వ పట్టణ మహాసభలను పురస్కరించుకొని సిపిఐ ఎల్బీనగర్ శాఖ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని వాల్ పోస్టులను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు సోత్కు ప్రవీణ్ కుమార్, గురిజాల సుధాకర్ రెడ్డి,మాతంగి రామచందర్, రాయ మల్లు, కత్తెర శాల, పత్తి వేణుగోపాల్ సంపత్ తదితరులు పాల్గొన్నారు
నోట్ బుక్స్ పంపిణీ చేసిన మాజీ ఎంపీపీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
రామడుగు నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారం గ్రామంలో శుక్రవారం రోజున ప్రభుత్వ పాఠశాల ప్రారంభ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి గాజుల శ్రీనివాస్ పదివేలు విలువ గల నోట్ బుక్స్ అందజేశారు. అట్టి నోట్ బుక్స్ పంపిణీ చేసిన రామడుగు మాజీ ఎంపీపీ, రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జవ్వాజి హరీష్ ముఖ్యఅతిథిగా హాజరై నోట్ బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం మాజీ ఎంపీపీ, రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జవ్వాజి హరీష్ మాట్లాడుతూ మాగ్రామ ప్రభుత్వ పాఠశాలకు గత సంవత్సరం నోట్ పుస్తకాలతో పాటు వంట పాత్రలు అందజేశారు. మాపాఠశాలకు ఇంత సేవ చేస్తున్నందుకు మాగ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ గుంట ఓంప్రకాష్, గుత్తూరి శ్రీనివాస్, పొన్నాల అజయ్, రవీందర్, లక్ష్మయ్య, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారురాలు
కేసముద్రం/ నేటి దాత్రి
గూడు లేని తమకు సొంత ఇంటి నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు లక్షలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మురళి నాయక్ చిత్రపటాలకు కేసముద్రం మండలం ఉప్పరపల్లి లో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారురాలు పాల్వాయి మౌనిక పాలాభిషేకం చేశారు. కేసముద్రం మండలం ఉప్పరపల్లిలో పాల్వాయి మౌనిక,మురళి దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేశారు. అనంతరం తమకు ఇల్లు మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మురళి నాయక్ చిత్రపటాలకు ఆ దంపతులు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఉప్పరపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు నూకల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన నిరుపేద కుటుంబాలకు సొంత ఇంటి నిర్మాణం కోసం ఇందిరమ్మ పథకంలో ఇల్లు మంజూరు అయ్యాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ లకు రూ.6లక్షలు, ఇతరులకు రూ.5లక్షల చొప్పున ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఆర్థిక సహాయం అందిస్తారని తెలిపారు. ఉప్పరపల్లి గ్రామంలో 39 ఇల్లు మంజూరు కాగా లబ్దిదారులందరు ఇంటి నిర్మాణాలు ప్రారంభించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు నూకల వెంకటేశ్వర్లు, వివిధ పార్టీల కార్యకర్తలు కోమాకుల రమేష్, తండ సంపత్, ఎట్రోజు సత్యనారాయణచారి, పసుల వెంకన్న, పోలేపాక ఉప్పలయ్య, మంద సాయిబాబా, మంద విక్రమ్, పందుల నాగేంద్రబాబు, పందుల అజిత్ తదితరులు పాల్గొన్నారు.
టిపిసిసి ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు.
నేటి ధాత్రి:
ఇటీవల నూతనంగా టిపిసిసి ఉపాధ్యక్షులుగా నియమితులైన నమిండ్ల శ్రీనివాస్ ను 14 డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ అడుప మహేష్ ఆధ్వర్యంలో వారి నివాసం వద్ద కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. రానున్న రోజుల్లో అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ హనుమకొండ వర్కింగ్ ప్రెసిడెంట్ పులిచేరి రాధాకృష్ణ. ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు పస్తం శంకర్ ఏనుమాముల గ్రామ పార్టీ అధ్యక్షులు సౌరం చిన్ని. సుందరయ్య నగర్ గ్రామ పార్టీ అధ్యక్షులు. త్రికోవెల శీను. బాలాజీ నగర్ గ్రామ అధ్యక్షుడు కడెం కుమార్ ఎస్సార్ నగర్ యూత్ అధ్యక్షుడు పల్లకొండ చందు. సౌరం ప్రభాకర్ సౌరం అభిలాష్. కోగిల సుధాకర్. ఖల్నాయక్ కాశెట్టి కమలాకర్. సౌరం మాణిక్యం ఇందిరమ్మ కమిటీ మెంబర్ ఏకాబ్రాచారి. తిరుపతి.ఎండి సంధాని. ఎండి యూసుఫ్ సంగారబోయిన రాజు. ఎండి ఖాజా రేహాన్ ఖాన్. వివిధ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీగా పాల్గొన్నారు.
అయ్యవారిపల్లి లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే తూడి
వనపర్తి నేటిధాత్రి;
పెబ్బేరు మండలం అయ్యవారి పల్లి గ్రామంలో వనపర్తి ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణనికి భూమిపూజ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం వల్ల పేద ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పకుండా నిలబెట్టుకున్నద ని ఎమ్మెల్యే తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పేదల కు వరమని అన్నారు గత బిఆర్ఎస్ పాలనలో మాట ఇచ్చి పేద ప్రజలను మోసం చేశారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పాలనలో ఇల్లు లేని పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం పేద ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నానని అన్నారు_ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
ప్రశ్నించే తత్వం లేనప్పుడు ప్రతిపక్షం ఎలా అవుతుంది???
మండలంలో మార్క్ చూపని ప్రతిపక్ష పా(ర్టీ)త్ర
ప్రజా సమస్యలపై పోరాటమే లేదు??
సామర్ధ్యం ఉంటే సంఖ్యా బలం ఎందుకు.??
గత ప్రభుత్వంలో ప్రతిపక్షాలకు ఎంతో కొంత ప్రాధాన్యత..
ఎగరటం మరిచిపోయిన పక్షిలా ప్రతిపక్ష పార్టీ???
పెద్ద సారు రెండు పడవల ప్రయాణం పార్టీకి చేటు తెస్తుందా??
నియోజకవర్గ ఇంచార్జి ఇప్పట్లో లేనట్లేనా??
పార్టీ క్యాడర్ పెంచాల్సింది పోయి పదవులకై కొట్లాట??.
నేటి ధాత్రి అయినవోలు :-
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు సక్కగా ప్రజలకు చేరాలన్నా ప్రజల పక్షాన స్థానికంగా ఉన్న ప్రతిపక్షం బాధ్యతగా నిలిచి సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు, అర్హులైన లబ్ధిదారులకు అందేలా చేయడంలో ప్రతిపక్ష పార్టీల పాత్ర ఎంతో కీలకమైంది.
అధికారపక్షం కన్నా ప్రతిపక్షమే ఎక్కువగా ప్రజలతో మమేకమై ఉంటూ ప్రజా పోరాటాలు చేయవలసి ఉంటుంది.
ఐతే అయినవోలు మండలంలో మాత్రం ఎందుకు భిన్నంగా జరుగుతుంది.
మండలంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకోలేకపోతోంది.
నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన ప్రతిపక్ష పార్టీ రెక్కలు ఉన్న ఎగరడం మర్చిపోయిన పక్షిలా అచేతనావస్థలో ఉండడం విడ్డూరంగా అనిపిస్తుంది.
గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి, పదేళ్ల పరిపాలన అనుభవం ఉన్న బిఆర్ఎస్ పార్టీని బాధ్యతాయుతమైన ప్రతిపక్షంలో నిలిపారు.
అంతటి బాధ్యతాయుతమైన స్థానాన్ని మోస్తూ మండలంలో సంక్షేమ పథకాల అమలులో అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులను ప్రజా క్షేత్రంలో ఎప్పటికప్పుడు ఎండగడుతూ, ప్రజల తరఫున నిలబడి కొట్లాడితేనే కదా గత ఎన్నికల్లో కోల్పోయిన విశ్వాసాన్ని మళ్లీ పొందగలిగేది.
మండలంలో సంక్షేమ పథకాల అమలులో అవకతవకలు జరుగుతున్న, అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని మొత్తుకుంటున్న, మండలంలోని ఏ ఒక్క గ్రామంలో కూడా ప్రతిపక్ష నాయకుడు అర్హుల తరుపున మాట్లాడింది లేదు.
టిఆర్ఎస్ పార్టీ అంటే కేవలం సభలకు సమావేశాలకు మాత్రమే పార్టీ శ్రేణులు రోడ్లమీద కనిపిస్తరు అన్న అపవాదు స్థానికంగా వ్యక్తం అవుతుంది .
ఇది ఇలాగే కొనసాగితే సంక్షేమ పథకాలు ఇస్తామన్న సాకుతో అధికార పార్టీ గీసే పద్మవ్యూహం నుంచి బయటికి వచ్చి బిఆర్ఎస్ పార్టీలో పని చేయాలంటే పార్టీలో ఉన్న నాయకులు సామాన్యులకు ఎంత భరోసా కల్పించాల్సి ఉంటుందో నాయకులు గ్రహించాలి.
అయితే బిఆర్ఎస్ అచేతన వ్యవస్థకు నేతలు చెబుతున్న కారణాలు నియోజకవర్గంలో తమకంటూ ఒక స్థాయి కలిగిన నాయకుడు లేకపోవడము కొంత ప్రతికూల అంశం.
బిఆర్ఎస్ పార్టీకి జిల్లాలో పెద్దదిక్కుగా ఉన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వర్దన్నపేటలో కర్చిప్ వేసి పాలకుర్తిలో తన కార్యకలాపాలను కొనసాగించడంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతుందని బిఆర్ఎస్ నాయకులు చెబుతున్నా, అది స్థానిక నాయకత్వలేమిని సూచిస్తుంది.
సరైన సంఖ్య బలం లేక అధికార కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక వెనకడుగు వేస్తుందా అన్నది మరో కారణం అంటే క్షేత్రస్థాయిలో మండలంలోని సుమారు 17 గ్రామాల్లో బిఆర్ఎస్ శ్రేణులు పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు ఉన్నారు.
మండల స్థాయిలో ఉన్న నాయకులు వారిని సమన్వయపరిచి ఏకతాటి మీదికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయడం లేదు అనే అనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా బిఆర్ఎస్ పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలు పదవుల కోసం వర్గ పోరాటాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రజల పక్షాన నిలిచేందుకు సంఖ్యాబలం ముఖ్యం అనుకుంటే గత పదిహేను అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ తమ పరిపాలన కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీని ఇంతలా ఇరుకున పెట్టింది లేదు.
సంక్షేమ పథకాల అమలులో ప్రశ్నిస్తూ, సంక్షేమ పథకాలలో కొంత వాటాను లబ్ధి పొందడంలో అప్పటి కాంగ్రెస్ నాయకులు సఫలీకృతం అయ్యారు .
అయితే ప్రస్తుతం పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.
ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకొని ప్రజల పక్షాన నిత్యం పోరాటం చేస్తూ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో బిఆర్ఎస్ విఫలమవుతుందని చెప్పాలి.
అసలు పార్టీ నాయకులకు క్యాడర్ను పెంచాలన్న ఆసక్తి కంటే రాబోయే ఎన్నికల్లో పదవుల కోసం పోరాటం చేయడమే ఎక్కువ అవుతుందన్న గుసగుసలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి.
మండలంలో పార్టీని విస్తృతపర్చకుండా కేవలం అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకత స్థానిక ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటు బ్యాంకును తీసుకొస్తుందన్న బిఆర్ఎస్ నాయకుల భ్రమ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజమవుతుందా?
లేదా మరోసారి గత ఎన్నికల మాదిరిగానే ప్రజానాడిని గుర్తించడంలో బొక్క బోర్లా పడతారా అన్నది వేచి చూడాల్సిన అంశం.
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం మిరాస్ పల్లి గ్రామంలో నిర్వహించిన భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగాఎమ్మెల్యే మాట్లాడుతూ..
భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు.
భూ సమస్య ఏదైనా ఉంటే గ్రామంలోకి వచ్చిన అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని..
రెవెన్యూ సదస్సులో మీరు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సమస్యను అధికారులు పరిష్కరిస్తారన్నారు.
MLA G. Madhusudhan Reddy
అనంతరం గ్రామంలో వడ్డెర, యాదవ సంఘాల కమ్యూనిటీ హాల్స్ పెండింగ్ పెండింగ్ పనులకు, కుర్వ సంఘం కమ్యూనిటీ హాల్ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు మరియు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారురాలు తెలుగు బాలమ్మ ఇంటి నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని, తదనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్ పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం నర్సాపూర్ గ్రామంలో శుక్రవారం పేదలకు ఎంపీడీవో సుధాకర్ మరియు హౌసింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇళ్లకు ముగ్గులు వేసి ప్రొసిడింగ్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రెటరీ వెంకటేశం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేష్ మాజీ ఉప్పు సర్పంచ్ గోపాల్, మల్లన్న నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షులు గోదావరి ఆదేశాల మేరకు అసెంబ్లీ కన్వీనర్ నౌబత్ జగనాథ్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ సుధీర్ భండారి బక్కాయ గుప్తా సమక్షంలో జహీరాబాద్ పట్టణ కమిటీని నియమించినట్లు జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు పూల సంతోష్ గారు తెలిపారు ఈ సందర్భంగా పూల సంతోష్ మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేయాలని నియమనిబంధన పాటించాలని రాబోయే స్థానిక జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో మెజార్టీ స్థానాలు గెలిచి మున్సిపల్ పై బీజేపీ జెండా ఎగిరి విధంగా ప్రతి పదాధికారి కార్యకర్త పని చేయాలని క్రమశిక్షణతో పార్టీకి చేయాలని కమిటీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది.
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్
మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన హుజూరాబాద్ యువజన కాంగ్రెస్ నాయకులు
వీణవంక, (కరీంనగర్ జిల్లా):
నేటి ధాత్రి :హైదరాబాద్ లో సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులను మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను నియమిస్తూ నియమక పత్రాలని విడుదల చేసిన భాగంగా అందులో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారిని తెలంగాణా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించడం జరిగింది నిన్న హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో హుజురాబాద్ నియోజకవర్గనికి
చెందిన యువజన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో యువజనకాంగ్రెస్ నియోజకవర్గం ఉపాధ్యక్షులు చిన్నాల శ్రీకాంత్ నియోజకవర్గం కార్యదర్శి ఉమ్మడి సందీప్ జమ్మికుంట పట్టణ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు బిసది వంశి తదితరులు పాల్గొన్నారు.
సంగరెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మెదపల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ పౌర్ణమి సందర్భంగా గానుగాపూర్ దత్తాత్రేయుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఈరోజు ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ తొలీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి .అధికార కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ నోటీస్ పంపడాన్ని నిరసిస్తూ.అట్టి కమీషన్ ఎదుట ఈరోజు హాజరు కావాల్సిందిగా కోరడం వల్ల కెసిఆర్ గారికి హా దేవ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకొని మనోధైర్యం ప్రసాదించాలని కోరుకున్న నన్నారు రైతులకోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొని ప్రపంచం లోనే ఎంతో పెద్ద ప్రాజెక్ట్ కట్టి తెలంగాణ ను కోటి ఎకరాల మాగాణం చేసిన ఆయనకు నోటీసులా అని ఈసందర్భంగా బావోదెవ్గానికి గురై .తొలి ముఖ్య ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి హ దత్తాత్రేయుని ఆశీర్వాదం ఉండాలని కోరారు .ఎలాంటి మచ్చ లేకుండా ఎదుర్కొని బయట పడతారన్నారు.ఇట్టి పూజ కార్య క్రమంలో .యువకులు శ్రీనివాస్ సంగమేశ్వర్ తమ్మలి దశరథ్ పాల్గొన్నారు.
అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సిపిఎం నాయకులు మడికొండ ప్రశాంత్ విమర్శించారు.ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇండ్లు అందిస్తామని చెప్పి కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వడం జరుగుతుందని,చాలామంది పేదలకు ఇండ్లు వస్తాయని ఆశించినప్పటికీ నిరాశ ఎదురయిందని,ఇందిరమ్మ కమిటీలు నియమించినప్పటికీ అందులో కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రాధాన్యమిచ్చి ఇండ్లు కూడా వారికే ఇచ్చారని,గత ప్రభుత్వం కూడా డబుల్ బెడ్ రూమ్ లు బిఆర్ఎస్ కార్యకర్తలకు కేటాయించినట్లుగానే,కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇండ్లు కార్యకర్తలకే ప్రాధాన్యత ఇచ్చి పేదలకు అన్యాయం చేసిందని,పట్టణంలోని రెండో వార్డులో అర్హులైన నిరుపేదలకు ఇండ్లు ఇవ్వకుండానే,కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చుకున్నారని తెలిపారు.కార్యకర్తల కొరకు లబ్ధి చేకూర్చడం కోసమే తీసుకొచ్చిన పథకాలను ప్రజల లబ్ధి కోసమే ఇస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వము ప్రజాప్రతిని స్పందించి అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితాల్లో అనర్హుల పేర్లు ఉంటే తొలగిస్తాం
-ప్రతీ పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం
-కొర్కిశాలలో భూ భారతి అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్
-మొట్లపల్లి, పిడిసిల్ల, రంగాపురం గ్రామాల్లో పల్లె దవాఖానాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
-గుండ్లకర్తి గ్రామంలో జీపీ బిల్డింగ్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
-పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే
-మొగుళ్ళపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన, లబ్దిదారులకు మంజూరీ పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్
మొగులపల్లి నేటి ధాత్రి
ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితాల్లో అనర్హుల పేర్లు ఉంటే తొలగిస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.
మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్ళపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు.
మొగుళ్ళపల్లి మండల కేంద్రంతో పాటు ఇప్పలపల్లి, పోతుగల్, కొర్కిశాల, గణేష్ పల్లి, పెద్దకోమటిపల్లి, పర్లపల్లి, మొట్లపల్లి, గుండ్లకర్తి, మెట్టుపల్లి, నర్సింగాపూర్, వేములపల్లి, బంగ్లాపల్లి, ఎల్లారెడ్డిపల్లి, పిడిసిల్ల, ముల్కలపల్లి, ఇస్సిపేట, పాత ఇస్సిపేట, వాగొడ్డుపల్లి, చింతలపల్లి, రంగాపురం గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయా గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరీ పత్రాలను జిల్లా అదనపు కలెక్టర్, జడ్పీ సీఈవో విజయలక్ష్మీ, జిల్లా హౌసింగ్ పీడీ లోకీలాల్, ఎంపీడీఓ, ఎమ్మార్వోలతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు.
కొర్కిశాలలో భూ భారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. అనంతరం పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.
మొట్లపల్లి, పిడిసిల్ల, రంగాపురం గ్రామాల్లో పల్లె దవాఖానాలను ప్రారంభించారు. గుండ్లకర్తి గ్రామంలో జీపీ బిల్డింగ్ కు శంకుస్థాపన చేశారు.
మొగుళ్ళపల్లిలో అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ..
పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే వారి నుంచి వచ్చే స్పందన బాగుంటుందన్నారు.
గుడిసెలో ఉంటున్న నిరుపేదలకు మొదటి విడతలో ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తుందన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం పారదర్శకంగా అమలు చేయాలని, ఎక్కడ లంచాలకు ఆస్కారం లేకుండా ఇండ్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
రాజకీయపార్టీలకు అతీతంగా పేద, నిరుపేదలకు మొదటి విడతలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.
ప్రభుత్వం పెట్టే ప్రతీ రూపాయి కూడా పేదలకు ఉపయోగపడాలని తాము ప్రయత్నిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పీఏసీఎస్ మొగుళ్ళపల్లి మాజీ చైర్మన్ ఫోలీనేని లింగారావు, పీఏసీస్ మొగుళ్ళపల్లి వైస్ చైర్మన్ కొమురోజు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు తక్కల్లపల్లి రాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మంద సాంబయ్య, కేతిపల్లి తిరుపతిరెడ్డి, రొంటాల సంపత్, చర్లపల్లి శ్రీధర్ గౌడ్, క్యాతరాజు లింగమూర్తి, పొన్నాల విజయేందర్ రెడ్డి, ఎలేటి శివారెడ్డి, పడిదల ప్రకాష్ రావు, మల్సాని రాజేశ్వర్ రావు తదితరులున్నారు.
పాకాల ఎకో టూరిజంగా అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
డీఎఫ్ఓ అనుజ్ అగర్వాల్ తో కలిసి పాకాల సరస్సు,పరిసర ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్
నర్సంపేట,నేటిధాత్రి:
వరంగల్ జిల్లా పాకాలను ఎకో టూరిజంగా మరింత అభివృద్ధి చేయుట కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు.
మంగళవారం కలెక్టర్ డాక్టర్ సత్య శారద జిల్లా అటవీ శాఖ అధికారి అనూజ్ అగర్వాల్ తో కలిసి క్షేత్రస్థాయిలో నర్సంపేట రేంజ్ లోని పాఖాలలో గ్రీన్ హెరిటేజ్ క్రింద అభివృద్ధి చేసిన బయోడైవర్సిటీ పార్కును, బట్టర్, ట్రిక్కింగ్, సైక్లింగ్, పగోడాలను పరిశీలించిన అనంతరం కలెక్టర్ పాకాల సరస్సులో బోటింగ్ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యాటకులకు ఆకర్షించే విధంగా పాకాల సరస్సు పరిసర ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయుటకు పటిష్టమైన ప్రణాళికలు రచించాలని డీఎఫ్ఓకు సూచించారు.
Collector Dr. Satya Sarada.
అందులో భాగంగా బయోడైవర్శిటీ పార్క్ ను మరింత అభివృద్ధి పరచడం, పర్యావరణ పర్యాటక అభివృద్ధి చేయాలని, సఫారీ ట్రాక్ ఏర్పాటు, మూలికల తోట పునరుద్ధరణ, సందర్శకులకు రాత్రి బస సౌకర్యాల అభివృద్ధి, చెరకు ప్యాచ్ అభివృద్ధి, పర్యావరణ పర్యాటక సంబంధిత కార్యకలాపాలకు సంబంధించిన పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ ఓ రవికిరణ్, డిప్యూటీ ఎఫ్ఆర్ఓ,అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రశంసలు కురిపిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు
కేసముద్రం/ నేతి ధాత్రి
కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలోని సంబంధిత హౌసింగ్ ఏఈ అభినయ్ మరియు పంచాయతీ సెక్రటరీ చీకటి రమ్య ఆధ్వర్యంలో. మంగళవారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు హక్కు పత్రాలు అందజేసి ముగ్గులు పోయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొని ఎస్సీ కాలనీలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు సందేపాక సంధ్య భర్త ప్రభాకర్ కు ఇందిరమ్మ ఇండ్ల హక్కు పత్రాన్ని అందజేసి గృహ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలోని నీరు పేద ప్రజలకు కనీసం ఉండటానికి ఇల్లు లేక సొంత ఇంటి కల నెరవేర్చక పోవడం వలన ఎన్నో ఇబ్బందులు పడుతుండగా ఈ రాష్ట్ర ప్రజల స్థితిగతులు చూసిన, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ము ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చిందని వారు కొనియాడారు.
Chief Minister Revanth Reddy.
ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్వాయి వెంకట్ రెడ్డి, ,సిరికొండ మల్లయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు పుట్ట ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, చాగంటి యాదగిరి, జల్లే యాకాంబరం, ఎస్సీ కాలనీ పెద్దమనిషి జల్లే జాన్సన్, కాలేపాక సహదేవ ,సునీల్ గ్రామపంచాయతీ సిబ్బంది, బాదావత్ బాల్య గుండెపాక మాణిక్యం తదితరులు పాల్గొని ఇందిరమ్మ ఇల్లులకు ముగ్గులు పోయడం జరిగింది.
– ప్రతీ పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం.. – ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
మొగులపల్లి నేటి ధాత్రి
ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితాల్లో అనర్హుల పేర్లు ఉంటే తొలగిస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.
మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్ళపల్లి మండలంలోని గ్రామాల్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు.
మొగుళ్ళపల్లి మండల కేంద్రంతో పాటు ఇప్పలపల్లి, పోతుగల్, కొరికిశాల, గణేష్ పల్లి, పెద్దకోమటిపల్లి, పర్లపల్లి, మొట్లపల్లి, గుండ్లకర్తి, మెట్టుపల్లి, నర్సింగాపూర్, వేములపల్లి, బంగ్లాపల్లి, ఎల్లారెడ్డిపల్లి, పిడిసిల్ల, ములకలపల్లి, ఇస్సిపేట, పాత ఇస్సిపేట, వాగొడ్డుపల్లి, చింతలపల్లి, రంగాపురం గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయా గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరీ పత్రాలను జిల్లా అదనపు కలెక్టర్, జడ్పీ సీఈవో విజయలక్ష్మీ, జిల్లా హౌసింగ్ పీడీ లోకీలాల్, ఎంపీడీఓ, ఎమ్మార్వో లతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై మంజూరీ పత్రాలను అందజేశారు.
కొరికిశాలలో భూ భారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.
అనంతరం పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.
మొట్లపల్లి, పిడిసిల్ల, రంగాపురం గ్రామాల్లో పల్లె దవాఖానాలను ప్రారంభించారు.
గుండ్లకర్తి గ్రామంలో జీపీ బిల్డింగ్ కు శంకుస్థాపన చేశారు. మొగుళ్ళపల్లిలో అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు సీసీ రోడ్లు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ…
పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే వారి నుంచి వచ్చే స్పందన బాగుంటుందన్నారు.
గుడిసెలో ఉంటున్న నిరుపేదలకు మొదటి విడతలో ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తుందని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం పారదర్శకంగా అమలు చేయాలని, ఎక్కడ లంచాలకు ఆస్కారం లేకుండా ఇండ్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
రాజకీయపార్టీలకు అతీతంగా పేద, నిరుపేదలకు మొదటి విడతలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.
ప్రభుత్వం పెట్టే ప్రతీ రూపాయి కూడా పేదలకు ఉపయోగపడాలని తాము ప్రయత్నిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు ఉన్నారు.
తంగళ్ళపల్లి మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన ఎనగందుల గోపి కుమారుడు. స్వాతి.క్.గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ అతి చిన్న వయసులోనే మరణించడం జరిగిందని. తన వంతు సహాయంగా అంకిరెడ్డి పల్లె మాజీ ఎంపిటిసి బీజేవైఎం జిల్లా అధ్యక్షులు. రాగుల రాజిరెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం చెప్పివారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాడ సానుభూతి తెలుస్తూ. ఎనగందుల గోపి. భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్త అని అతని కుమారుడు స్వాతి అనారోగ్యం కారణంతో మరణించగా నా వంతు సహాయంగా. 50 కేజీల బియ్యాన్ని 2500 రూపాయలు అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇందుకుగాను చనిపోయిన కుటుంబ సభ్యులు ఈ సహాయం చేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారుఇట్టి కార్యక్రమంలో ఓబులాపూర్ బూత్ అధ్యక్షులు .నందగిరి మధు. సీనియర్ నాయకుడు ఆసాని రామలింగారెడ్డి బీజేవైఎం జిల్లా సెక్రెటరీ చిందం నరేష్. సిరిసిల్ల వంశీ. సంపత్. చిలగాని నరేష్. గోకుల కొండ కృష్ణ. మెహర్ కృష్ణ. అనిల్. ప్రశాంత్. శ్రీకాంత్. నాయకుడు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు
మానకొండూరు ఎమ్మెల్యే కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మండల .
పార్టీ నాయకులు….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బయలుదేరి మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వం పల్లి.
సత్యనారాయణ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు .
పుట్టినరోజు సందర్భంగా తంగళ్ళపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు బుక్స్ అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.
ఇట్టి కార్యక్రమంలో సిరిసిల్ల ఏఎంసీ డైరెక్టర్ ఆరెపల్లి బాలు.
కాంగ్రెస్ పార్టీ మానవ హక్కుల యువజన విభాగం అధ్యక్షులు గుగ్గిల భరత్ గౌడ్.
కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు అందరు కలిసి ఇల్లంతకుంటమండలంలోని కాంగ్రెస్ పార్టీ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వం పల్లి సత్యనారాయణ.
పుట్టినరోజు వేడుకలను మండలంలో పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ కార్యక్రమంలో. జిల్లా మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.