వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరిస్తున్న సర్పంచ్ ఉప సర్పంచ్…

వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరిస్తున్న సర్పంచ్ ఉప సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం గ్రామ చర్చ్ ముందు సిసి రోడ్డు పక్కన చెత్తకుండీలో ఉన్న చెత్తను గమనించి గ్రామ నూతన సర్పంచ్ వినోద బాలరాజ్ ఉప సర్పంచ్ గడ్డం మమత అనిల్ పటేల్ వెంటనే స్పందించి అక్కడి నుంచి చెత్తను తీసేయాలని అక్కడ ఉన్న ప్రజలను ఏ ఇబ్బంది లేకుండా చూడాలని గ్రామపంచాయతీ కార్మికులకు చెప్పి చెత్తను తీసివేయించడం జరిగింది. గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వెంటనే స్పందించి గ్రామ పరిశుభ్ర గురించి ఆలోచించి వెంటనే సంధిస్తున్నారు.

చర్చి ముందు చెత్తను ఉంచకుండా చెత్తకుండీ నిర్మించే ఆలోచనలో ఉన్నారని తెలిపారు గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్న నూతన సర్పంచ్, ఉప సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లగానే గ్రామ పంచాయితీ కార్యదర్శి వీరన్న పటేల్ గారి తో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తు.గ్రామపంచాయతీ పరిశుద్ధ కార్మికులలో ప్రతి ఉదయం చెత్త సేకరణ, వివిధ వార్డులతో పాటు ప్రధాన రోడ్డును పరిశుభ్రత చేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి వీరన్న పటేల్ తెలిపారు. ఈ పనుల ద్వారా గ్రామం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు,

ప్రజా సమస్యల పరిష్కరం కోసం కృషి చేయాలి : ఎంపీ సురేష్ షెట్కార్…

ప్రజా సమస్యల పరిష్కరం కోసం కృషి చేయాలి : ఎంపీ సురేష్ షెట్కార్

◆-: ఎంపీ షెట్కార్ కు సత్కరించిన హాద్నూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మీర్ జహీరుద్దీన్ మూర్తుజ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్. సంగారెడ్డి జిల్లా శాసనసభ పరిది న్యాల్కల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులుగా పోటీచేసి విజయం సాధించిన సర్పంచులు, ఉప సర్పంచులకు ఆదివారం నాడు న్యాల్కల్ మండలంలోని ముంగి చౌరస్తా వద్ద గల ఎస్ఎల్ఆర్ కళ్యాణ మండపంలో నియోజకవర్గ ఇంచార్జ్ చంద్రశేఖర్ మార్గనిర్దేశకత్వంలో మండల కాంగ్రెస్ అద్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సన్మాన సభలో ముఖ్య అతిధులు ఎంపీ సురేష్ షెట్కార్, ఇంచార్జ్ డా చంద్రశేఖర్ లు ముఖ్య అతిదిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ సురేష్ షెట్కార్ కి హాద్నూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మీర్ జాహిరుద్దీన్ మూర్తుజ పూలమాల శాలువకప్పి ఘనంగా సత్కరించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ గా పోటీచేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైన జాహిరుద్దీన్ కు పార్టీ నాయకత్వం భరోసా కల్పించి భవిషత్తులో మరిన్ని అవకాశాలు కల్పిస్తామని అభయం ఇచ్చింది. కార్యక్రమంలో యువ నాయకులు జిషన్ పటేల్, మాజి ఎంపిటిసి మొహమ్మద్ శుకుర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version