పంట పొలాల్లో మృత్యు పాశాలు.

పంట పొలాల్లో మృత్యు పాశాలు…

పట్టించుకోని విద్యుత్ అధికారులు..

డబ్బులు చెల్లిస్తేనే మరమ్మత్తులు చేస్తామంటున్న అధికారులు..

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

 

రైతులు పోలాల్లో సాగు చేసిన పంటలను కోత చేసి ఇంటికి తరిలించా లంటే విద్యుత్ వైర్ల కింది కి వేలాడడం వల్ల పంటను వదిలేయాల్సిన పరి స్థితి ఏర్పడింది. మండల కేంద్రమైన ఝరాసంగంలో ఓ రైతు పోలంలో
విద్యుత్ వైర్లు పోలాల్లో వేలాడడం కారణంగా చేతికి వచ్చిన పంటను కోయకుండా వదిలేయడంతో పాటు వైర్ల కింద దున్నకుండా వదిలేస్తు న్నారు. విద్యుత్ తీగలను సరిచేయాలని సంబంధిత విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. వేలా డుతున్న విద్యుత్ వైర్ల మధ్య లో విద్యుత్ స్తంభం ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారం అయిదానికి అధికారులు డబ్బులు చేల్లిస్తేనే మరమ్మతులు చేసా _మని చెప్పుతున్నారని వారు ఆరోపించారు. ప్రాణాలు పోతే తప్ప పట్టించు కోరా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. గత కొన్ని నెలల క్రితం ఝరాసంగం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మేకల మేత కోసం వెళ్ళి వేలాడుతున్న విద్యుత్ వైర్లు తాకడంతో మృతి చెందారు. ఇంత జరిగినా అధికారులు
పట్టించుకోకపోవడం దారుణంగా ఉందన్నారు.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను.!

వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్.

 

నడికూడ,నేటిధాత్రి:

మండలంలోని వెంకటేశ్వర్ల పల్లి చైతన్య గ్రామైక్య సంఘం,చౌటుపర్తి శ్రీ ఆంజనేయ గ్రామైక్య సంఘం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ ఐకేపీ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రా లకు ధాన్యాన్ని తరలించి,ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.దీనివల్ల 500 రూపాయల బోనస్ కూడా రైతులకు చేకూరుతుందన్నారు.రైతుల ఆర్థిక అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.మద్దతు ధర క్వింటాలుకు ‘ఎ ‘ గ్రేడ్ రకం రూ. 2320.సాధారణ రకానికి ధర 2300‌. ఉందన్నారు.ఈ కార్యక్రమం లో ఏవో జైసింగ్,ఏపిఎం రమాదేవి,కాంగ్రెస్ పార్టీ నడికూడ మండల అధ్యక్షు డు బుర్ర దేవేందర్ గౌడ్, సమన్వయ కమిటీ సభ్యులు పెద్దబోయిన రవీందర్ యాదవ్,ఈర్ల చిన్ని, బొల్లె బిక్షపతి,పిఏసిఎస్ సెంటర్ ఇంచార్జ్ పెండ్యాల మహేందర్ రెడ్డి,సీఈవో చోటా మియా, టాప్ ఆపరేటర్ పెగడ ఓం ప్రకాష్,సిసి కుమారస్వామి, మహిళా సంఘం సభ్యులు హరిత,స్వరూప,నవ్య శ్రీ, లక్ష్మి,మాధవి,ప్రసన్న,హైమ, రమ్య,తిరుమల,రైతులు తదితరులు పాల్గొన్నారు.

పాతికేళ్ల పార్టీ పేరంటానికి రండి..!

పాతికేళ్ల పార్టీ పేరంటానికి రండి..!

ఇల్లెందులో వినూత్నంగా ఆహ్వానాలు

ఆడపడుచులకు బొట్టి పెట్టి పిలుపులు.

ఎంపీ “వద్దిరాజు”, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ తదితరుల హాజరు.

“నేటిధాత్రి”ఇల్లెందు, ఏప్రిల్, 15:

 

 

సన్నాయి మేళం సప్పుడు.. బాజా భజంత్రీల మోతలు.. వెంట నడిచిన మహిళా నేతలు.. కుంకుమ పూలు, కుంకుమ, గంధం, వాయినాలు.. ఇవన్నీ ఏ పెండ్లి కార్యానివో అనుకుంటే.. పప్పులో కాలేసినట్లే..! ఈ హడావిడి ఎక్కడో తెలుసుకోవాలంటే.. ఈ వార్త పూర్తిగా చదవాల్సిందే..!!

 

 

MLA

ఏప్రిల్ 27న వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ కు సన్నాహకంగా ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. మేళ, తాళాల నడుమ పార్టీ ముఖ్య నాయకుల ఇళ్లకు వెళ్లి బొట్టు పెట్టి వరంగల్ సభకు ఆహ్వానించారు. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, తెలంగాణ ఉద్యమకారుడు దిండిగాల రాజేందర్ అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళా నేతలు, కౌన్సిలర్లు వెంట నడిచారు. ఇల్లెందు మున్సిపాలిటీ 7 వార్డులో గల 2 నెంబర్ బస్తీలో ఈ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ క్రియాశీల కార్యకర్తల కుటుంబాల్లో ముఖ్యులైన బజారు సత్యనారాయణ, ఎంఏ రవూఫ్, చాగర్ల సరళ, సామల రవితేజ ఇళ్లకు వెళ్లి బొట్టు పెట్టి, కుటుంబ సభ్యులందరినీ వరంగల్ లో జరిగే రజతోత్సవ సభకు హాజరు కావాలని ఎంపీ వద్దిరాజు కోరారు. ఒక ప్రాంతీయ పార్టీ పాతికేళ్లుగా క్రియాశీలకంగా ప్రజల కోసం అంకితమై పని చేయడం చాలా అరుదు అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ తర్వాత అంతటి ఘనత బీఆర్ఎస్ కే దక్కిందన్నారు. అందుకే.. బీఆర్ఎస్ పాతికేళ్ల సంబురం పండుగలా నిర్వహిస్తున్నామని వద్దిరాజు తెలిపారు. ఈ సభకు తాము ఊహించిన దానికంటే ఎక్కువ మంది కార్యకర్తలు తరలివస్తున్నారని చెప్పారు. ఈ సభ విజయవంతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని రవిచంద్ర కోరారు.

గులాబీ దండు కదం తొక్కాలి..!

గులాబీ దండు కదం తొక్కాలి..!
కాంగ్రెసోళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తాలి..!!ఎంపీ “వద్దిరాజు”

“నేటిధాత్రి”,ఇల్లెందు, ఏప్రిల్, 15:

 

 

వరంగల్ లో జరిగే సభకు ఇల్లెందు నియోజకవర్గం నుంచి గులాబీ దండు వేలాదిగా కదం తొక్కాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. ఈ సభకు హాజరయ్యే పార్టీ శ్రేణులను చూసి కాంగ్రెసోళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తాలని అన్నారు. మాజీ శాసనసభ్యురాలు బాణోత్ హరిప్రియా నాయక్ అధ్యక్షతన మంగళవారం ఇల్లెందు నియోజకవర్గ పార్టీ విస్తృత సమావేశం జరిగింది. ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వరంగల్ లో పది లక్షల మందితో జరిగే సభలో.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం మాట్లాడుతరోనని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఏడాదిన్నరకే ప్రజలు విసిగి, వేసారి పోయారని అన్నారు. ఆచరణలో సాధ్యం కాని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయలేక చేతులెత్తేశారని విమర్శించారు. కేసీఆర్ ను దూరం చేసుకుని తప్పు చేశామని ప్రజలంతా పశ్చాత్తాప పడుతున్నారని అన్నారు.

BRS

 

కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేద్దామని భ్రమ పడుతున్న ముఖ్యమంత్రి.. తాను కూర్చున్న కుర్చీ కూడా కేసీఆర్ పెట్టిన బిక్షే అని గురైరగాలని అన్నారు. కేసీఆర్ పోరాటం చేయకపోతే ఇవాళ రాష్ట్రమే వచ్చేది కాదని ఎంపీ రవిచంద్ర గుర్తు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అద్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ.. వరంగల్ సభ విజయవంతానికి దిశా నిర్ధేశం చేశారు.

BRS

 

బహిరంగ సభకు హాజరయ్యే ముందు పార్టీ కార్యకర్తలంతా తమ తమ గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించుకుని బయలుదేరాలని పిలుపునిచ్చారు.

BRS

 

 

సమావేశంలో గ్రంధాలయ సంస్థ మాజీ అద్యక్షుడు దిండిగాల రాజేందర్, మహబూబాబాద్ జెడ్పీ మాజీ చైర్మన్ ఆంగోత్ బిందు, డిసీసీబీ మాజీ డైరెక్టర్ లక్కినేని సురేందర్, సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు సంజీవ్ నాయక్, వివిధ మండలాల పార్టీ బాధ్యులు శీలం రమేష్, బొమ్మెర ప్రసాద్, తాతా గణేష్, లక్ష్మణ్ నాయక్, పరుచూరి వెంకటేశ్వరరావు, టీబీజీకేఎస్ నాయకులు రంగనాధ్, జాఫర్ హుస్సేన్, జెకే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

హోతి బి అంబేద్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ

హోతి బి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ

జహీరాబాద్ . నేటి ధాత్రి:

 

 

అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆయన రాసిన రాజ్యాంగం పల్లె తెలంగాణ రాష్ట్ర ఏర్పడినందుకు తెలంగాణ ఫాదర్ ఆఫ్ ది గార్డ్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిలిచిపోతారని చరిత్రలో నిలిచిపోయే పేరు రాజ్యాంగ గ్రహీత డాక్టర్ భారతరత్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్ని వర్గాలకు సమానత్వం చేస్తూ ఆయన చూపిన బాటలో నడుస్తూ మనమంతా ఒకటేనని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమంలో జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావు మాజీ కౌన్సిలర్లు మాజీ జెడ్పిటిసిలు మండల అధ్యక్షులు అంబేద్కర్ అభిమానులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జై భీమ్ నినాదంతో ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు

 

Ambedkar

తట్టు నారాయణ, నామ రవి కిరణ్, మహమ్మద్ ఇమ్రాన్ బి ఆర్ఎస్ సీనియర్ లీడర్ జహీరాబాద్, డ్రైవర్ కాలనీ జాకీర్, అహమద్ నగర్, ఆలీ, సీఎం అశోక్ రెడ్డి, బండి మోహన్, మోయోద్దీన్ సాబ్, పాల్గొనడం జరిగింది.

వీరభద్రేశ్వర స్వామి నిదర్శించుకున్న మాణిక్ రావు.

వీరభద్రేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మల్యే మాణిక్ రావు

జహీరాబాద్ . నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండలం మరియంపూర్ గ్రామంలోని వీరభద్రేశ్వర స్వామి వారి జాతర ఉత్సవాల్లో శాసనసభ్యులు కొన్నింటి మానిక్ రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి దర్శిస్తున్నారు.ఆలయ కమిటీ అధ్యక్షుడు ,సభ్యులు ఎమ్మెల్యే మాణిక్ రావు గారినీ,నాయకులను సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Temple

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రవీందర్,మాజి మండల పార్టీ అధ్యక్షులు నర్సింహ రెడ్డి,యువ నాయకులు మిథున్ రాజ్ ,మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవి కుమార్,శ్రీకాంత్ రెడ్డి రాజు పటేల్,లోకేష్ పటేల్,మల్ రెడ్డి,అశోక్ పాటిల్ ,సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి. 

ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి. 

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని యాసంగి పంట ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ , అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి ధాన్యం కొనుగోలు పురోగతి పై సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ,యాసంగి మార్కెటింగ్ సీజన్ లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతిపాదించిన 240 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు 119 ఐకేపి, 21 పాక్స్, 7 మెప్మా, 1 డి .సి.ఎం.ఎస్. మొత్తం 148 కేంద్రాలను ఓపెన్ చేశామని, మరో రెండు రోజుల వ్యవధిలో మిగిలిన 92 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకుని వచ్చే ధాన్యం తేమ శాతం , ఇతర ప్రమాణాలను చెక్ చేసి ఎఫ్.ఏ.క్యు ఉన్న ధాన్యం మద్దతు ధర పై కొనుగోలు చేసీ ఓ.పి.ఎం.ఎస్.లో ఎంట్రీ చేయాలని అన్నారు.

Cooperation Officer.

కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్రక్ షీట్స్ ప్రకారం సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని, ఎక్కడైనా రైస్ మిల్లర్లు ధాన్యం దించుకొని పక్షంలో ఇంటర్మీడియట్ గోదాము లకు తరలించాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలో ఉన్న ఖాళీ గోదాము లను సమీపంలో గల కోనుగోలు కేంద్రాలకు ట్యాగ్ చేయాలని కలెక్టర్ తెలిపారు.ప్రతి మండలం సమీపంలో గల గోదాములను ధాన్యం భద్ర పరిచేందుకు హైర్ పద్దతిలో తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమీక్షా సమావేశంలో డి.ఆర్డి.ఓ శేషాద్రి, డి.ఏ.ఓ అఫ్జలి బేగం, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, పౌర సరఫరాల శాఖ అధికారులు రజిత, వసంత లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

బార్ అధ్యక్షులు వలుసా సుదీర్ ను కలిసిన.

బార్ అధ్యక్షులు వలుసా సుదీర్ ను కలిసిన
వరంగల్ పోపా :-

వరంగల్, నేటిధాత్రి (లీగల్):-

 

 

ఇటీవల వరంగల్ బార్ అసోసియేషన్ ఎన్నికలలో ఘన విజయం సాధించిన సుధీర్ వలుస ను వరంగల్ బార్ అంబేద్కర్ హాల్ లో పోపా కార్యవర్గం మంగళవారం శాలువా, పూల మాల తో ఘనంగా సన్మానంచించారు.
ఈ సందర్బంగా పోపా రాష్ట్ర అధ్యక్షులు, న్యాయవాది శామంతుల శ్రీనివాస్ మాట్లాడుతూ, 20సంవత్సరాల తర్వాత వరంగల్ బార్ అధ్యక్షులు గా పద్మశాలి ఉండటం పద్మశాలి కులానికి గౌరవం దక్కిందని, భవిష్యత్తులో మన సామజిక వర్గానికి వన్నె తేవాలని కోరారు.న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. వరంగల్ పోపా అధ్యక్షులు గుండు కామేశ్వర్ మాట్లాడుతూ,యువ న్యాయవాది సుధీర్ బార్ అధ్యక్షులుగా విజయం సాధించడం గొప్ప విషయమని అన్నారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర ప్రతినిధులు గోషికొండ సుధాకర్, ధర్మపురి రాజగోవింద్, పాము శ్రీనివాస్, మాటేటి అశోకకుమార్, న్యాయవాదులు నల్ల మహాత్మ, అనుమాండ్ల రాజకుమార్, మెరుగు సుభాష్, చెన్నూరి రమేష్, తదితరులు పాల్గొన్నారు

పేకాటరాయుళ్లపై పోలీస్ పంజా పదిమంది అరెస్ట్.

పేకాటరాయుళ్లపై పోలీస్ పంజా,.. పదిమంది అరెస్ట్

నగదు, బైకులు, సెల్ ఫోన్లు స్వాధీనం

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలం వసం తాపూర్ గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు నిర్వహించగా పదిమంది పేకాట రాయులను అరెస్టు చేసినట్లు ఎస్సై జక్కుల పర మేష్ తెలిపారు.

 

Arrested

ఈ మేరకు పోలీస్ సిబ్బంది శిబిరంపై దాడులు చేసి పదిమంది పెట్టుకున్నట్లు తెలిపారు.వారి నుండి 22 వేల రూపాయల నగదు ,7 బైకులు, 10 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం.

ప్రజలారా కథం కథం తొక్కి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం

-మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఛలో వరంగల్ సభను విజయవంతం కొరకు పలు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్య టిస్తున్నారు.ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను జయ ప్రదం చేసే దిశగా ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ 2001 ఏప్రిల్ 27 నాడు కెసిఆర్ ఆ రోజు తన పదవికి రాజీనామా చేసి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను చూసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉంటే లాభం లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతున్నటు వంటి ఒక లక్ష్యం తోటి కేసిఆర్ పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టి 24 సంవత్సరాలు పూర్త యి 25వ సంవత్సరాల్లో అడు గుపెడుతున్న సందర్భంగా పార్టీ రజతోత్సవ సభను నిర్వ హించాలని చెప్పి నిర్ణయం చేసి, అది కూడా మనం నా భూతో నా భవిష్యత్ అనేలా పెద్ద సభను నిర్వహిస్తున్నాం.

BRS party’s

 

భవిష్యత్ లో ఇంత పెద్ద మొత్తంలో ఎవరూ నిర్వహించ లేరు. మరి ప్రజలు కూడా ఆవిర్బవాసభకు రావడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఇంత తక్కువ సమయంలో ఇంత వ్యతిరేకతను చవిచూసినటు వంటి ప్రభుత్వాలు ఉండవు, దానికి కారణమేంటంటే అమ లు కానీ హామీలు ఇచ్చి, హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నటు వంటి తీరు ప్రజలలో అసహనానికి గురిచేస్తుంది.కేసిఆర్ అధికా రంలో ఉన్నప్పుడు ఏ స్కీమ్స్ అయితే అమలు అయినవో వాటినే అమలు చేస్తున్నారు. ఎట్లా ఉన్నది పరిపాలన అంటే మరి అనుభవం లేని పరిపా లన, అసమర్ధ పరిపాలన, చేత గాని వ్యవహారం ఇవన్నీ చేసు కుంటుప్రజల దగ్గరికి వస్తే అర్థం చేసుకున్నారు.ప్రజలు కేసీఆర్ ఉన్నప్పుడు ఏ రకంగా మా యొక్క జీవితాలు అద్భుతంగా ఉన్నాయి.

ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగింది అని నేడు పునరాలోచించుకుంటున్నారు. ఎప్పుడైనా సామెత ఉంటాది పాలు ఇచ్చే గేదెను కాదని దున్నపోతును తెచ్చుకున్నట్టు ఉంది అన్న చందనంగా ప్రజలు చర్చించుకుంటున్నారు.రేపు ఎన్నిక ఏదైనా ఎగిరేది బిఆర్ ఎస్ జెండానే గెలిచేది బిఆర్ ఎస్ అభ్యర్దులే.

ఈ ఏప్రిల్ 27న జరగబోయే మన సభా తెలం గాణ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయి. కాబట్టి మిత్రులారా కథం కథం తొక్కి బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయ వంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.

2వ రోజు వారోస్తావాలు.

2వ రోజు వారోస్తావాలు

బస్టాండ్ లో ప్రజలకు అవగాహన కోసం ఫైర్ డెమో ప్రదర్శన

ప్రజలు,వ్యాపారస్థులు అప్రమత్తంగా ఉండాలి

ఫైర్ అధికారి వక్కల భద్రయ్య

పరకాల నేటిధాత్రి

 

పరకాల బస్టాండ్ లో మంగళవారం ఫైర్ అధికారి వక్కల భద్రయ్య అధ్వర్యంలో 2వరోజు వారోత్సవాలు నిర్వహించారు.పట్టణ కేంద్రంలోని బస్టాండ్ లో ప్రయానికులకు,స్థానికులకు అవగాహన కల్పించేందుకు ఫైర్ డెమో ప్రదర్మించారు.ఈ సందర్బంగా భద్రయ్య మాట్లాడుతూ పట్టణ కేంద్రంలోని వ్యాపారస్తులు అగ్నిప్రమాదం సంభవించినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై కరపత్రాలు పంపణీ చేశారు.బస్టాండ్ ఆవరణలోని పలుచోట్ల వారోత్సవాల పోస్టర్ ఏర్పాటు చేశారు.అగ్నిపమాదం నివారించేందుకు పాటించాల్సిన జాగత్త చర్యలపై అవగాహగా లేక నిర్లక్ష కారణాల వల్లే అగ్నిప్రమాదాలు సంభవిస్తాయన్నారు.అగ్ని ప్రమాదం జరిగితే అపుడు మనదేశ సంపదను కోల్పోయిన వారిగా మిగిలిపోతామున్నారు.ఇప్పటికైనా వ్యాపారాస్తులు అగ్నిమాపక సిబ్బండి సూచనలు పాటిస్తూ,తమ అస్తులను పరిరక్షించుకోవాలన్నారు.వ్యాపారస్థులు ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసుకోవాల్సన అవసరం ఉందని గుర్తుచేశారు.వారి వెంట పరకాల అగ్నిమాపకశాఖ కార్యాలయం సిబ్బంది ఎల్ఎఫ్ కృష్ణకుమార్, డ్రైవర్ సత్తయ్య, అన్నిమాపకులు సత్యం,దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

రజతోత్సవ సభకు వాల్ రైటింగ్ కార్యక్రమం ప్రారంభం.!

చలో వరంగల్ బిఆర్ఎస్ రజతోత్సవ సభకు వాల్ రైటింగ్ కార్యక్రమం ప్రారంభం

జహీరాబాద్ . నేటి ధాత్రి:

 

 

27న వరంగల్‌లో జరగనున్న బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయడంలో భాగంగా వాల్ రైటింగ్ కార్యక్రమాన్ని శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు ప్రారంభించారు. సభకు పూర్వాహ్నం నుంచి ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం చేపట్టబడింది అని.

MLA Manikrao

 

వాల్ రైటింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా జహీరాబాద్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా ,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మొహీ ఉద్దీన్,తులసి దాస్ గుప్తా,యువ నాయకులు మిథున్ రాజ్ ,ప్రభు ,
ఇతర బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్టీ విజయ రథాన్ని ముందుకు నడిపేందుకు ప్రతి కార్యకర్త ఈ రజతోత్సవ సభను విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మల్యే మాణిక్ రావు గారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఎస్సై ని సన్మానించిన బిజెపి నాయకులు.

ఎస్సై ని సన్మానించిన బిజెపి నాయకులు

నిజాంపేట, నేటిధాత్రి

 

 

మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్లో బాధ్యతలు చేపట్టిన ఎస్సై రాజేష్ ను బిజెపి నాయకులు మంగళవారం రోజున మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండలంలో ప్రతి ఒక్కరు శాంతి భద్రతలకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు తీగల శ్రీనివాస్ గౌడ్ , టెలికం బోర్డు మెంబర్ ఆకుల రమేష్, అభిషేక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

పేదల ఆరోగ్యం కోసమే ఉచిత వైద్య శిబిరం.

— పేదల ఆరోగ్యం కోసమే ఉచిత వైద్య శిబిరం,

నిజాంపేట, నేటిధాత్రి

 

 

గ్రామీణ ప్రాంత నిరుపేదల ఆరోగ్యం కోసమే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఐఆర్ సిఎస్ లయన్ డా,, ఏలేటి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం రోజున మండల కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ, వీఎస్టి పరిశ్రమ తూప్రాన్ సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీపీ, షుగర్ పరీక్షలు, కంటి, చెవి ముక్కు, గొంతు, వరిబీజము, బీజకుట్టు గడ్డలు, థైరాయిడ్ గడ్డలు, గర్భసంచికి సంబంధించిన సమస్యలు, అలాగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, చర్మ సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలపై మల్లారెడ్డి హాస్పిటల్ (సూరారం) వైద్యులచే ఉదయం 9:30 నుండి చికిత్సలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

జయంతి ఎందుకు జరుపుకుంటారు వివరించారు.!

తూర్తి గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు. జయంతి ఎందుకు జరుపుకుంటారు అని వివరించారు.

కథలపూర్ మండలంలోని తూర్తి గ్రామంలో. అంబేద్కర్ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని అంబేద్కర్ గురించి అన్నో చెప్పుకొచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 14.1891జన్మిచారు. భారత రాజ్యాంగన్ని రూపొందిచడంలో మరియు సామజిక సమానంత్వం కోసం పోరాడారు అయన కీలక పత్రను గౌరవిస్తూ దేశవ్యాప్తంగాఅంబేద్కర్ జయంతిని ఈరోజు జరుపుకుంటారు.

నేటి ధాత్రి కథలాపూర్

 

 

అంబేద్కర్ ఎక్కడ జన్మిచారు.
అసలు పేరు బీంరావ్ రంజి అంబేద్కర్. జననం.1891ఏప్రిల్ 14.మౌ సెంట్రల్ ప్రావిన్సు బ్రిటిష్ ఇండియా.మరణం.1956 డిసెంబర్ 6. ఢిల్లీ భారతదేశం
అయన రాజకీయ పార్టీ. షెడ్యూల్ కులాల సంఘం
*ఇతర రాజకీయ పదవులు.రిపబ్లిక్ పార్టీ ఇండిపెండెంట్లేబర్ పార్టీ.

భారత రాజ్యాంగంలో అంబేద్కర్ పాత్ర ఏమిటి ?

భారత రాజ్యాంగ రూపశిల్పి.
అంబేద్కర్ చేసిన అత్యంత ముఖ్యమైన సహకారం భారత రాజ్యాంగం ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా అతని పాత్ర పౌరులందరికీ ప్రాథమిక హక్కులు మరియు సమాన అవకాశాల కోసం వాదించారు అంటరానితనాన్ని నిర్మూలించడానికి. ఆర్టికల్ 17. మరియు సామాజిక న్యాయాన్ని నిర్ధారించడానికి నిబంధనలను ప్రవేశపెట్టింది.

*అంబేద్కర్ చరిత్ర ఏమిటి
ప్రముఖ భారతీయ న్యాయవాది ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ నేత. సంఘ సంస్కర్త
ఇతను అంటరానితనం కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడుఅతను స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి రాజ్యాంగ శిల్పి. చెప్పారు.భారతీయ సమాజాన్ని ఎవరైనా చీకటి నుండి వెలుగులోకి నడిపించారంటే అది ఆయనే. అని అన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ నినాదాలతో. పూల మాలలు వేసి స్వీట్ పంపిణి చేసిన అంబేద్కర్ యూవజన సంఘం సభ్యులు. మరియు తూర్తి గ్రామ సభ్యులు. యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ప్రయాణానికి కుదరని ముహూర్తం..!

ప్రయాణానికి కుదరని.

ముహూర్తం..!

• బ్రిడ్జి పనులు పూర్తి.. ప్రారంభం ఎప్పుడో..?

• ముస్తాబైన ఆర్ ఓబీ, తొలగని అడ్డంకులు

• ఏడేండ్లుగా ప్రజలకు తప్పని నిరీక్షణ

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ పట్టణ పరిధిలో రహదారిపై నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రారంభానికి ముహూర్తం కుదరడం లేదు. అన్ని పనులు పూర్తి చేసుకుని ప్రయాణికులకు అందుబాటులోకి తేవడానికి సిద్ధంగా ఉన్నా, నిర్లక్ష్య వైఖరితో అందుబాటులోకి తేవడం లేదు. పనులు పూర్తై నెలలు గడుస్తున్నా, రాకపోకలకు అడ్డంకులు తొలగడం లేదు. సరైన ముహూర్తం కుదరకనా, లేక కాంట్రాక్టర్ కు ఉన్న ఆర్థిక ఇబ్బందులో కానీ, ఏడేండ్లుగా ప్రయాణికుల నిరీక్షణకు మాత్రం తెర పడడం లేదు. ప్రజా ప్రతినిధులు, అధికారుల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రయాణికులు ఇంకా ఊరిస్తూనే ఉంది. అన్ని పనులు పూర్తి చేసుకుని ముస్తాబైనా ప్రారంభానికి మాత్రం నోచుకోవడం లేదు. పనులు పూర్తై నెలలు గడుస్తున్నా రాక పోకలకున్న అడంకులు మాత్రం తొలగడం లేదు. సరైన ముహూర్తం కుదర కానా, లేక కాంట్రాక్టర్ కు ఉన్న ఆర్థిక ఇబ్బందులో కానీ ఏడేండ్లుగా ప్రయాణికుల నిరీక్షణకు మాత్రం తెర పడడం లేదు. దీంతో రాకపోకల సందర్భంగా రైల్వే గేటు వల్ల ఇబ్బందులు ఎదురైన ప్రతిసారి ప్రయాణికులు పరస్పరం ప్రభుత్వ ప్రతినిధులు, అధికార గణాల తీరుపై తమ అసహనం వ్యక్తం చేయడం కనిపిస్తోంది.

ఏడేండ్ల క్రితం శంకుస్థాపన..

రైల్వే గేటు వల్ల ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బం దుల పరిష్కారానికి అప్పటి ప్రభుత్వం రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ)ను మంజూరు చేశారు. 2018 ఆగస్టు 30న రూ.90 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. వెంటనే రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టారు. అప్పటి నుంచి అగుతూ సాగుతూ నేటివరకు పసులు కొనసాగుతూనే ఉన్నాయి. జహీరాబాద్ నుంచి మొగుడంపల్లి క్రాస్ రోడ్డులో గల రైల్వేలెవల్ క్రాసింగ్ వద్ద ప్రయాణికుల రాకపోకల కోసం ఏడేళ్ల క్రితం డబుల్ లైన్ ఆర్వోబీ పనులు చేపట్టారు. నిధుల కొరత తదితర కారణాలతో ఎప్పటికప్పుడు పనులు తరచూ వాయిదా పడుతూ, కొనసాగుతున్నాయి.

ముస్తాబైన ముహూర్తం మెప్పుడో..?

జహీరాబాద్ పట్టణ పరిధిలో రహదారిపై నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. అన్ని విధాలుగా ముస్తాబై నెలలు గడుస్తున్నా ముహూర్తం మాత్రం కుదరడం లేదు. అందుకే రాక పోకలకు ముహూర్తం అడ్డంకులు తొలగడం లేదని బహటంగానే ప్రయాణికులు చర్చించుకుంటున్నారు. స్థానిక లెవల్ క్రాసింగ్ మీదుగా హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి నాందేడ్, పూర్ణ, షిరిడీకి, బెంగళూరు. తిరుపతి, కాకినాడ పట్టణాలకు ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్, రైళ్ల రాకపోకలు సాగిస్తుంటాయి. అంతే కాకుండా గూడ్స్ రైళ్ల కూడా ఎక్కువ సంఖ్యలోనే వచ్చిపోతుంటాయి. నిత్యం ఎంతో రద్దీగా ఉండే ఈ మార్గంలో రైలు వచ్చిన ప్రతీసారి గేట్లు మూసేయడంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. స్థానికులతో పాటు అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే ప్రయాణికులు రైలొచ్చిన ప్రతిసారి అత్యధికంగా అరగంట పాటు గేటు వద్ద ఆగాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు.

స్థానికులకు.. ప్రయోజనమే.

Bridge work completed

 

ఈ రహదారి గుండా రాకపోకలు సాగించే మొగు డంపల్లి, జహీరాబాద్ మండలంలోని పలు గ్రామాల ప్రయాణికులతో పాటు కర్ణాటకలోని చించోళీ, గుల్బర్గా, బసవకల్యాణ్, బీదర్ ప్రయాణికులతో సహా పట్టణ శివారులోని డ్రీమ్ ఇండియా, బందే అలీ, బాబూమోహన్ కాలనీ, మహీంద్రా, ఎంజీ, ముంగి, బూచినెల్లి పారిశ్రామిక వాడలకు రాకపోకలు సాగించే వారికి ఎంతో మేలు జరుగునుంది. బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టిన కాంట్రాక్టర్ కు ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లుల్లో జాప్యంతోనే పనులు సకాలంలో పూర్తి లేదనేది వాస్తవ సత్యం. ఫైనాన్షియల్ అడ్డంకులు తొలిగి బ్రిడ్జి పనులతో పాటు రోడ్ వైడ్నింగ్, డివైడర్,సర్వీస్ రోడ్లు. వాటికి రంగులు వేయడం తదితర పనులన్నీ పూర్తిచేశారు. వెంటనే ప్రారంభానికి అవస రమైన చర్యలు తీసుకోవాలని ఇందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని స్థానిక, ప్రయాణికులు కోరుతున్నారు.

కళ్యాణమస్తు రేపటి నుంచి మ్రోగనున్న పెళ్లి భాజాలు.

శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు రేపటి నుంచి మ్రోగనున్న పెళ్లి భాజాలు…

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

“శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు” అనే శుభాశయాలతో ఈ ఏడాది పెళ్లిళ్ల హంగామా ప్రారంభం కానుంది. జీవన పయనంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ, వధూవరుల కలలు నెరవేరే కాలం వస్తోంది.

Wedding

రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేసవి తిండి తినిపించే వేళ పెళ్లిళ్ల సందడి మొదలుకానుంది. హిందూ సంప్రదాయాల్లో పెళ్లి అనేది కేవలం వ్యక్తిగత వ్యవహారమే కాకుండా, రెండు కుటుంబాలను కలిపే పవిత్ర బంధంగా భావిస్తారు. అందుకే వివాహానికి సంబంధించి మంచి ముహూర్తాల కోసం పెద్దలు, కుటుంబ సభ్యులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.

గ్రహ నక్షత్ర అనుకూలతతో పెళ్లిళ్ల పండుగ: పురోహితులు చెబుతున్న వివరాల ప్రకారం, రేపటి నుంచి జూన్ 8 వరకు వివాహ ముహూర్తాలు శుభంగా ఉండబోతున్నాయి. ఈ సమయంలో అనేక కుటుంబాలు తమ పిల్లల వివాహాలను జరిపేందుకు ముందుకెళ్తున్నారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల స్థితి అనుకూలంగా ఉండటం వల్ల ఈ కాలం అత్యంత శుభఫలితాలను ఇస్తుందనే నమ్మకంతో వివాహాలకు శ్రీకారం చుడుతున్నారు.

ముఖ్యమైన ముహూర్తాలు ఇవే:

ఏప్రిల్: 16, 18, 20, 21, 23, 30

మే: 1, 3, 4, 8, 9, 10, 11, 14, 16, 18, 19, 21, 23, 24, 30

జూన్: 2, 4, 5, 6, 7, 8

ఈ తేదీల్లో వివాహాలకు అనుకూలమైన ముహూర్తాలు లభ్యమవుతున్నాయి. వీటిలో ముఖ్యంగా ఏప్రిల్ 30వ తేదీ ‘అక్షయ తృతీయ’ కావడంతో వేల వివాహాలు జరగనున్నాయి. ఇది హిందూ సంప్రదాయంలో అత్యంత శుభదినంగా భావించబడుతుంది.

ఆషాఢ మాసంలో విరామం… శ్రావణంలో మళ్లీ ప్రారంభం జూన్ 11 నుంచి జూలై 12 వరకు ఆషాఢ మాసం వస్తుందట. ఈ కాలంలో శుభకార్యాలు నిర్వహించరాదని శాస్త్రం చెబుతుంది. అందువల్ల ఈ నెలలలో ముహూర్తాలు లేవు. కానీ జూలై 25 నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసంలో మళ్లీ మంచి ముహూర్తాలు లభ్యం కానున్నాయి.

తెలుగింట పెళ్లి పంట సిద్ధం: పెళ్లికి అనుకూలమైన రోజులు అధికంగా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల పంట పండబోతోంది. మండుటెండల మధ్య కుటుంబాల్లో కొత్త ఉత్సాహం నిండి ఉంది. పెళ్లిళ్ల కోసం హాలులు, పెండ్లి కాన్వాయ్‌లు, తాళిబొట్టు కొట్టు, సంగీతం, సప్తపదుల సమయాలు అన్నీ సిద్ధమవుతున్నాయి. పిండి వంటలు, వేదికలు, అలంకరణలు—ఇవన్నీ ప్రస్తుతం వివాహబంధానికి తెరతీయబోతున్న సన్నాహక దృశ్యాలే!

ప్రమాదమని తెలిసినా పట్టింపేది?

ప్రమాదమని తెలిసినా పట్టింపేది?

– అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం: మండల కేంద్రమైన ఝరాసంగంలోని
తహసీల్దార్, శ్రీ శక్తి (ఐకెపి) కార్యాలయాల మధ్య పెరుగుతున్న చెట్టు గత వారం రోజులు క్రితం విచిన ఈదురు గాలుల కు కూలింది. ఈ చెట్టు శ్రీ శక్తి (ఐకెపి) కార్యాలయం మీద కూలడంతో ఎప్పుడూ ప్రమాదం జరు గుతుందో తేలియాని దుస్థితి ఉంది. ప్రతి రోజు ఐకెపి కార్యాలయంలోకి వివిధ గ్రామాల నుంచి మహిళ సంఘాల సభ్యులు వస్తుంటారు. ప్రమాద వశాత్తు చెట్టు పడుతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. చెట్టు వంగి కూలేందుకు సిద్ధంగా ఉన్న అధికారులు పట్టించుకోకపోవడంపై పలు వురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మహబాద్ రోడ్డుకు వనజీవి రామయ్య పేరు పెట్టాలి.

ఖమ్మం – మహబాద్ రోడ్డుకు వనజీవి రామయ్య పేరు పెట్టాలి: వద్దిరాజు

రామయ్య కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎంపీ “వద్దిరాజు”.

“నేటిధాత్రి”,ఖమ్మం రూరల్, ఏప్రిల్, 15:

 

 

తన జీవితం మొత్తం మొక్కలు నాటాడానికే అంకితం చేసిన పద్మశ్రీ దరిపల్లి రామయ్య ధరిత్రి ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచి ఉంటారని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఇటీవలే మృతి చెందిన వనజీవి రామయ్య కు మంగళవారం రవిచంద్ర నివాళులు అర్పించారు. రెడ్డిపల్లి లోని ఆయన నివాసానికి వెళ్లి చిత్ర పటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన, అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా వద్దిరాజు మాట్లాడుతూ.. రామయ్య పేరు ఎప్పటికీ గుర్తుండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఖమ్మం – మహబూబాబాద్ రోడ్డుకు వనజీవి రామయ్య మార్గ్ పేరుతో నామకరణం చేయాలని ఎంపీ రవిచంద్ర కోరారు.

Vanajeevi Ramaiah

 

ఖమ్మం నుంచి రెడ్డిపల్లి వరకు 8 కిమీ మేర వనజీవి రామయ్య మొక్కలు నాటారని గుర్తు చేశారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఆ చెట్లన్నీ కూల్చేసినందున, మళ్ళీ అదే వరసలో మొక్కలు నాటి.. సంరక్షించి రామయ్య కు నివాళులు అర్పించాలని కోరారు. ఈ విషయం లో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా మంత్రులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. రామయ్య చరిత్ర భావి తరాలకు తెలిసేలా కర్ణాటక తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా పాఠ్య పుస్తకాల్లో ఆయన చరిత్ర ను ప్రవేశ పెట్టాలని ఎంపీ రవిచంద్ర కోరారు. జిల్లాలో కూడా ఆయన స్మారకం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ ఆత్మకే జీవం బిఆర్‌ఎస్‌:పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి

తెలంగాణ ప్రజల గుండె చప్పుడు ‘‘కేసిఆర్‌’’

వరంగల్‌ రజతోత్సవ సభ ఎలా వుంటుందనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ కు వివరించిన ఎమ్మెల్సీ ‘‘పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి’’ వివరాలు…ఆయన మాటల్లోనే..

 

`తెలంగాణను తెర్లు చేస్తున్న కాంగ్రెస్‌ గుండెలు అదిరిపోవాలే..

`రజతోత్సవ సభ తరతరాల తెలంగాణ చరిత్రకు గుర్తుగా నిలుస్తుంది

`తెలంగాణ నలు మూలల నుంచి దండు కదిలితే ఎలా వుంటుందో అలా వుంటుంది

`పుట్టల్లో నుంచి చీమలు వచ్చినట్లు ప్రజలు వరంగల్‌ సభకు వస్తారు

`వరంగల్‌ రజతోత్సవ సభను చూసి కాంగ్రెస్‌ పార్టీ అతలాకుతలం అవుతుంది

`సభలంటే బిఆర్‌ఎస్‌ సభలే అని ప్రపంచమంతా మాట్లాడుకునేలా వుంటుంది

`చరిత్రలో రజతోత్సవ సభ సువర్ణాక్షరాలతో లిఖించేలా జరుగుతుంది

`బిఆర్‌ఎస్‌ అంటే నాయకులే కాదు యోధులు

`త్యాగాల వీరులు..తెలంగాణ తెచ్చిన ధీరులు

`తెలంగాణ కోసం అలుపెరగని పోరాటం చేసిన స్వాప్నికులు

`తెలంగాణ అంటేనే పడని వాళ్లు పాలకులైతే ఇలాగే వుంటుంది

`తెలంగాణ మీద ప్రేమ లేని వాళ్ల చేతిలో పెడితే విధ్వంసమౌతుంది

`60 ఏళ్ల కలను నిజం చేసింది కేసిఆర్‌

`14 ఏళ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చింది కేసిఆర్‌

`పదేళ్లలో తెలంగాణను వందేళ్లు ముందుకు తీసుకెళ్లింది కేసిఆర్‌

`ఒక్క ఏడాదిలోనే మళ్ళీ వందేళ్లు వెనక్కి నెట్టింది కాంగ్రెస్‌

`కాంగ్రెస్‌ అంటేనే కరువు…తెలంగాణకు బరువు

`కాంగ్రెస్‌ అంటేనే కష్టం.. నష్టం

`యాభై ఏళ్లు పాలించి 50 వేల ఎకరాలు పారించలేదు

`పదేళ్లలో కోటి ఎకరాలకు సాగునీరిచ్చింది కేసిఆర్‌

`మాయ మాటలు చెప్పి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది

`అలవికాని హామీలు అమలు చేయలేక ఆపసోపాలు పడుతోంది

`పాలించడమంటే నోటి కొచ్చింది చెప్పడం కాదు

`ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం

`అవి రెండూ కాంగ్రెస్‌ కు చేతకాదు

`భవిష్యత్తులో మరో పాతికేళ్లు ప్రజలు ఇక కాంగ్రెస్‌ ను జనం నమ్మరు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఏనుగు వెళ్తుంటే మొరిగే శనకాలు వుంటాయి. అవి శునకానందం పొందుతుంటాయి. అల్పులు, అజ్ఞానులు అంతటా వుంటారు. తెలంగాణ ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేని వాళ్లు ఏవేవో మాట్లాడుతుంటారు. కాని తెలంగాణ ఆత్మతో పెనవేసుకున్న బిఆర్‌ఎస్‌ను విమర్శిస్తేనే రాజకీయ మనుగడ అనుకునే వారు కూడా చాల మంది వుంటారు. అలాంటి వారికి బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ మరోసారి పాఠమే కాదు, గుణపాఠం కూడా నేర్పుతుంది. సభలంటే అవి తెలంగాణకే పరిమితం. తెలంగాణ ఉద్యమానికే తలనమానికం. బిఆర్‌ఎస్‌ పార్టీకే సొంతం. ఆ చరిత్రను తిరగరాసే శక్తులు లేవు. రావు. మళ్లీ మళ్లీ సింహగర్జన లాంటి సభలు నిర్వహించాలన్నా, ఆ చరిత్రను తిరగరాయాలన్నా అది బిఆర్‌ఎస్‌కే సాధ్యం. కేసిఆర్‌ పేరు చెబితే తప్ప అంత గొప్పసభలు జరగవు. అందుకే ఈసారి బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ నభూతో నభిష్యతి అని ప్రపంచమంతా మాట్లాడుకునేలా జరుగుతుందని ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాస్‌రెడ్డి జోస్యం చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజాసభలకు కూడా అనుమతులు ఇవ్వని చరిత్ర కాంగ్రెస్‌ది. కాంగ్రెస్‌కు ఈ నికృష్ట సంప్రదాయంకొత్తది కాదు. తెలంగాణ ఉద్యమ కాలంలోనే సభ నిర్వహణకు ప్రతిసారి కోర్టును ఆశ్రయించి తెచ్చుకోవాల్సి వచ్చేది. తెలంగాణ వ్యతిరేకులు పాలిస్తున్న ఈ సమయంలో కూడా బిఆర్‌ఎస్‌ సభకు మళ్లీ అనుమతి కోసం పోరాటం చేయాల్సి వచ్చింది. ఇది కాంగ్రెస్‌ నైజం. ఆ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులులేరు. తెలంగాణ కోసం గొంతిత్తిన వాళ్లు లేరు. వున్న వారు పదవుల కోసం ఆరాటం తప్ప, తెలంగాణ కోసం నొరెత్తే శక్తి లేని వాళ్లు వున్నారు. అందుకే కాంగ్రెస్‌ను నమ్మి, తెలంగాణ మళ్లీ ఒకసారి ఆగమైంది. ఒక్క అవకాశమంటూ ప్రజలను వేడుకొని, అడుగడుగునా ఆచరణ సాధ్యం కాని హమీలిచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వాటి అమలు చేయలేక, కనీసం కేసిఆర్‌ వేసిన బాటలో నడవలేక తెలంగాణను తెర్లు చేస్తున్నారు. బంగారు తెలంగాణను ఆగం చేస్తున్నారు. అందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు నునంచే ప్రజలకు ఆ ప్రభుత్వం ఏమిటో తెలిసిపోయింది. వారి పాలన చేతగాదని తేలిపోయింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలు కాంగ్రెస్‌ పాలనలో అమలు కావని అర్ధమైపోయింది. అందుకే ఇంత తొందరగా ప్రజా వ్యతిరేక మూటగట్టుకున్న ప్రభుత్వం ప్రపంచంలోనే కూడా ఎక్కడా వుండదు. అందుకే ప్రజలు ఎప్పుడెప్పుడు మళ్లీ బిఆర్‌ఎస్‌ ప్రభుత్వమొస్తుందా? కేసిఆర్‌ మళ్లీ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా? పచ్చని తెలంగాణను ఎండబెట్టిన కాంగ్రెస్‌ దరిద్రం పోతుందా? అని చూస్తున్నారు. బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభతో ప్రజలకు భరోసా కల్పించడానికి, భవిష్యత్తు బంగారంగా వుంటుందని చెప్పడానికి వరంగల్‌ సభ గొప్పగా జరగనుంది. తెలంగాణ నలు మూలల నుంచి పది నుంచి పదిహేను లక్షల మంది ప్రజల హజరయ్యే అవకాశం వుంది. అందుకే 1200 ఎకరాలలో చరిత్రలో నిలిచిపోయే మరో గొప్ప సభకు శ్రీకారం చుడుతున్నాం..ఈ రజతోత్సవేడుక సాక్షిగా మరో వందేళ్ల చరిత్రకు, ప్రయాణానికి పునరంకితం కావాలనుకుంటున్నామంటున్న ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాస్‌ రెడ్డి తన అభిప్రాయాలను నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో పంచుకున్నారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే…

కేసిఆర్‌ అంటేనే ఒక చరిత్ర. కేసిఆర్‌ అంటేనే యుగకర్త. కేసిఆర్‌ అంటేనే తెలంగాణ జీవనాడి. తెలంగాణ ఉద్యమ వేడి. తెలంగాణ కారణజన్ముడు. తెలంగాణ ప్రజల గోస తీర్చేందుకు కదం తొక్కిన వీరుడు. అందుకే తెలంగాణ తెలంగాణ వచ్చింది. అందుకే తెలంగాణ జాతి పిత కేసిఆర్‌ అని ప్రజలు కొనియాడుతున్నారు. ఆయనను గుండెల్లో పెట్టుకున్నారు. ఒక రాజకీయ పార్టీకి 25 వసంతాల ప్రయాణం సామాన్యమైనవిషయం కాదు. తెలంగాణ పేరు మీద అనేక పార్టీలు ఏర్పాటయ్యాయి. అవకాశ వాద రాజకీయాలు చేయాలనుకున్న వారు మధ్యలోనే తెలంగాణ మంత్రం మర్చిపోయారు. తెలంగాణ కోసం జై తెలంగాణ అనడమే మానేశారు. తెలంగాణ ఉద్యమాన్ని ఒక యజ్ఞంగా కొనసాగించి, కడదాకా కొట్లాడి సాధించిన నాయకుడు కేసిఆర్‌. దేశంలో ఉద్యమ పార్టీలు చాలా తక్కువ. అందులోనూ బిఆర్‌ఎస్‌ లాంటి పార్టీ మరొకొటి లేదు. రాదు! ఇంకా వందేళ్లయినా చెక్కు చెదరని పార్టీ బిఆర్‌ఎస్‌. ఇంకా వెయ్యేళ్లైనా తెలంగాణ సమాజం మర్చిపోని ఏకైక నాయకుడు కేసిఆర్‌. అలాంటి నాయకులు లేరు. భవిష్యత్తు చూడదు. తెలంగాణ తేవడమే కాదు..తెచ్చిన తెలంగాణను పదేళ్లలో బంగారు తెలంగాణ చేసిన పాలకుడు కేసిఆర్‌. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసి, రైతులుకు నీటి కష్టాలు తీర్చిన భగీరధుడు. కాంగ్రెస్‌ పార్టీ యాభై ఏళ్లుగా పునాది రాయితప్ప, తట్టెడు మట్టి తీయని ప్రాజెక్టులు అనేకం వున్నాయి. దశాబ్దాలుగా వాటి పేరు చెప్పి కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటికిప్పుడు పబ్బం గడుకున్నదే తప్ప చుక్క నీరివ్వలేదు. ఎకరం పొలం పారించలేదు. తెలంగాణ ఎడారిగా మారుతున్నా గుడ్లప్పంచి చూశారు. తెలంగాణ ప్రజలు కన్నీరు కారుస్తుంటే, కాంగ్రెస్‌ నాయకులు చూసి నవ్వుకున్నారు. ప్రజల ముందుకు వచ్చి మొసలి కన్నీరు కార్చారు. ఉమ్మడి పాలకులను ఎదిరించే ధైర్యం లేక చేష్టలుడిగి చూశారు. ఉమ్మడి పాలకుల మోచేతినీళ్లు తాగడం అలవాటు చేసుకున్నారు. అందుకే తెలంగాణ గురించి ఏనాడు పట్టించుకోలేదు. కేసిఆర్‌ పేరు తెలంగాణలో నిత్య స్మరణ కావడానికి, ప్రజల గుండెల్లో కేసిఆర్‌ నిలిచిపోవడానికి, తెలంగాణ సాధనతోపాటు, కాళేశ్వరం, యాదాద్రి దేవాలయాలు చాలు. ఇప్పటి కాలంలో ఎవరికీ సాద్యం కాని యాదాద్రి గుడి నిర్మాణం జరిగింది. అలాంటి గుడి నిర్మాణం జరగాలంటే కనీసం 25 సంవత్సరాలు పడుతుంది. కాని ఏడేళ్ల కాలంలో యాదాద్రి గుడి నిర్మాణం జరగడంత ప్రపంచమంతా విస్తుపోయింది. కాళేశ్వరంతో మొదలైన పోలవరం ఎక్కడున్నదో..కాళేశ్వరం పూర్తయి నీళ్లు ఎలా ఇస్తున్నదో ప్రజలు చూస్తూనే వున్నారు. కేసిఆర్‌ నాయకత్వ పటిమను కొనియాడుతూనేవున్నారు. ఇరవైదేళ్ల పాటు ఒక రాజకీయ పార్టీని నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు. అయినా తలా తోకలేని కొంత మంది నాయకులు వేస్తున్న ప్రశ్నలు విచిత్రంగా వున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌ నాయకుల పసలేని వాదన అద్వాహ్నంగావుంది. మాటకు ముందు కాంగ్రెస్‌ పార్టీ చరిత్ర గురించి మాట్లాడే నాయకులు ఆ పార్టీ చరిత్ర ఏమిటో తెలుసుకోవాలి. కాంగ్రెస్‌ పార్టీని బారతీయుడు పెట్టింది కాదు. ఏవో హ్యూమ్‌అనే ఆంగ్లేయుడు పెట్టిన పార్టీ. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు చీలికలు, పీలికలైన పార్టీ కాంగ్రెస్‌ పార్టీ. పార్టీ చీలిన ప్రతీసారి కొత్త గుర్తుతో ప్రజల ముందుకొచ్చిన పార్టీ కాంగ్రెస్‌ పార్టీ. అలా పలుసార్లు అంతరించి, మిగుతూవచ్చిన పార్టీ కాంగ్రెస్‌. ఇప్పుడున్నది అసలైన కాంగ్రెస్‌ కాదు. స్వాతంత్య్ర ఉద్యమానికి ఇప్పుడున్న కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదు. కాని టిఆర్‌ఎస్‌ నుంచి బిఆర్‌ఎస్‌ పేరు పార్టీయే పేరు మార్చుకున్నది. టిఆర్‌ఎస్‌ నాయకుడైనా, బిఆర్‌ఎస్‌ నాయకుడైనా ఒక్కరే..ఆ ఒక్కరు కేసిఆరే…పార్టీ పేరు మాకు మేముగా మార్చుకున్నాం..పార్టీ జెండా మారలేదు. గుర్తు మారలేదు. ఎన్నికల సంఘం ఒప్పుకున్నది. ఎన్నికల సంఘం నియమాళికి లోబడి పేరు మార్పు జరిగింంది. పార్టీ పేరు మార్పును అంగీకరించింది. ఈ మాత్రం అవగాహన లేని కాంగ్రెస్‌ నాయకులు లేనిపోని ప్రచారం చేస్తే ప్రజలు నమ్మరు. వారి మాటలు అసలే నమ్మరు. బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభను చూసి కాంగ్రెస్‌ పార్టీ గుండెలు అదిరిపోతుంది. ఆ పార్టీ అతలా కుతలమౌతుంది. రాజకీయసభలంటే బిఆర్‌ఎస్‌ సభల్లా వుండాలని ప్రపంచమంతా 27 తర్వాత మాట్లాడుకంఉటుంది. చరిత్రలో వరంగల్‌ సభ మరోసారి సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ అంటే కేవలం రాజకీయ సభ కాదు. అది ప్రజల సభ. తెలంగాణ వాదుల సభ. తెలంగాణ ఉద్యమకారుల సభ. త్యాగాల వీరులైన బిఆర్‌ఎస్‌ అభిమానులసభ. తెలంగాణ తెచ్చిన ధీరుల సభ. తెలంగాణ కోసం అలుపెరగని పోరాటం చేసిన స్వాప్నికుల సభ. తెలంగాణ తలరాత మార్చిన బిఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ సభ. తెలంగాణ కోసం జీవితమే త్యాగం చేసిన పోరాట యోధుడు కేసిఆర్‌ సభ.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version