ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రెస్క్యు టీం ఏర్పాటు
పరకాల మున్సిపల్ కమిషనర్ కె.సుష్మ
లోతట్టు ప్రాంతాలను, డంపింగ్ యార్డ్ పరిశీలించిన కమిషనర్
పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో మున్సిపల్ కమిషనర్ కే.సుష్మ పారిశుధ్య పనుల నిర్వహణను ఆకస్మిక తనిఖీ చేశారు.అనంతరం కార్మికుల హాజరు పుస్తకాన్ని పరిశీలించి అలసత్వంతో విధులకు హాజరువ్వని వారికి గైర్యాజరు వేశారు.వర్షాకాలాన్ని ద్రుష్టిలో పెట్టుకొని పారిశుధ్యం పైన మరియు లోతట్టు ప్రాంతాలలో నిలిచిఉన్న నీటిని ఎప్పటికప్పుడు మల్లించాలని జవాన్ లకు సూచించారు.అనంతరం డంపూయార్డ్ ను పరిశీలించి చెత్తను సేకరించే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని,పట్టణంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రిస్క్యు టీంను ఏర్పాటు చేశామన్నారు.ఏదైనా సమస్యలు తలెట్టితే స్థానిక జవాన్ లు మహేష్(9550629997),సతీష్(7386881788),రాజు(9177557767)గల నెంబర్లకు సమాచారం అందించాలని తెలిపారు.