రావణాసుర బొమ్మ దాత….సమ్మిగౌడ్ చిలువేరు…

రావణాసుర బొమ్మ దాత….సమ్మిగౌడ్ చిలువేరు

కేసముద్రం/ నేటి దాత్రి

 

కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో యువత యూత్ క్లబ్ అనుబంధంగా గత 20 సంవత్సరాల నుండి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలలో భాగంగా రావణాసుర వధ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమానికి కేసముద్రం మున్సిపాలిటీలోని సమ్మి గౌడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ తన వంతుగా రావణాసుర బొమ్మకు దాతగా నిలిచారు..ఈ సందర్భంగా సమ్మి గౌడ్ ఫౌండేషన్ అధినేత సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ… గ్రామ ప్రజలంతా కలిసి దసరా ఉత్సవాలను పురస్కరించుకొని చేస్తున్నటువంటి రావణాసుర వద కార్యక్రమంలో నన్ను మీ కుటుంబ సభ్యునిగా భావించి మీతోపాటు భాగస్వామిని చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తపరిచారు. అదేవిధంగా గ్రామ యువత యూత్ మాట్లాడుతూ… అన్నా మా గ్రామం నుండి మా యువత యూత్ అడిగిన వెంటనే స్పందించి దసరా ఉత్సవాలలో భాగంగా రావణ సుర వద కార్యక్రమానికే కాదు మీరు మా గ్రామంలో పేదింటికి ఒక బిడ్డగా ఆడబిడ్డలకు అన్నగా యువతకు సోదరునిగా గ్రామ ప్రజలకు ఒక బిడ్డగా మీరు చేస్తున్నటువంటి సేవలు మరువలేనివని సమ్మి గౌడ్ ఫౌండేషన్ పట్ల వర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో యువత యూత్ క్లబ్ అధ్యక్షులు తండా సంపత్, ఉపాధ్యక్షులు పలస రాకేష్,రావణాసుర ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎటురోజు పరిపూర్ణ చారి, ఉపాధ్యక్షులు తండా శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు కోమాకుల రమేష్, పబ్బతి సారంగం, శాగంటి రాములు, ముదురుకోళ్ల రమేష్, అడప రమేష్, ఎండి షబ్బీర్, ప్రవీణ్, శ్రీకాంత్, గంట రవి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

తోబుట్టువులుగా భావించి… సోదరునిగా కానుకలు…

తోబుట్టువులుగా భావించి… సోదరునిగా కానుకలు

బతుకమ్మ కోలాటాల మహిళలకు చీరల పంపిణీ: చిలువేరు సమ్మయ్య గౌడ్

మండల కేంద్రంలోని 3 గ్రామాలకు 100 మంది మహిళలకు చీరలు పంపిణీ చేసిన సమ్మి గౌడ్

కేసముద్రం/ నేటి దాత్రి

తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగను పురస్కరించుకొని కోలాటాలు వేయనున్న మహిళలకు సమ్మి గౌడ్ ఫౌండేషన్ తరపున ఫౌండేషన్ వ్యవస్థాపకులు,కాంగ్రెస్ మండల నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ చీరలను అందజేశారు..కేసముద్రం మండలంలోని, ఉప్పరపల్లి,అర్పణ పల్లి, అమీనాపురం గ్రామాలకు చెందిన100 మంది కోలాటం మహిళా సోదరీమణులకు ఎసల్ల సత్యనారాయణ, చాగంటి రాము,పబ్బతి సారంగం,మోడెం రాజుహరిణి,ఎర్రంశెట్టి అశోక్ ల ఆధ్వర్యంలో తమకు ఏకరూప చీరలు కావాలని మండల నాయకులు గోపా డివిజన్ అధ్యక్షులు సమ్మి గౌడ్ ఫౌండేషన్ అధినేత చిలువేరు సమ్మయ్య గౌడ్ ను అడుగగా ఆడబిడ్డలందరికీ అన్నలా అండగా ఉంటానని వారికి ఇచ్చిన మాటకు కట్టుబడి సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని చీరలను అందజేశారు.ఈ సందర్భంగా సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ… ఆడబిడ్డలందరూ తనకు అక్క చెల్లెళ్ళు అని, వారిని తన తోబుట్టువులుగా భావించి అడగగానే చీరలను అందజేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని,నా అనేవారికి ఏ విషయంలోనైనా తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని, ఆనందం లోనే కాదు ఆపదలో కూడా అండగా ఉంటానని తెలిపారు.ఈ సందర్భంగా కోలాటం మహిళలు మాట్లాడుతూ, అన్న మీ గొప్ప మనసుకు మీ ఔన్నత్యానికి మేము కృతజ్ఞతగా ఉంటామని, ఒక అన్నగా, ప్రతి కుటుంబానికి కొడుకులా మీరు మండల కేంద్రంలో అందిస్తున్న సేవలు మరువలేనివని, మీ ఆశయాలకు మేము ఎల్లవేళలా అండగా నిలుస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి అశోక్, లక్కాకుల సత్యనారాయణ, ఎసల్ల సత్యనారాయణ,చాగంటి రాము, మోడెం రాజు, పబ్బతి సారంగపాణి, కట్టన్న,విజేందర్ గౌడ్,గంధసిరి వెంకట్,రాజా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version