ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం – “ఢిల్లీ చలో”..

ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం – “ఢిల్లీ చలో”

కంకణ బద్ధులై తరలిరండి.
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ పిలుపు

ప్రాథమిక ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు కల్పించాల్సిందే…

సిపిఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి

ప్రభుత్వ పాఠశాలలనే బలోపేతం చేయాలి

కేసముద్రం/ నేటి ధాత్రి

దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అన్యాయాలు, విధానపరమైన దాడులు, జీవన భద్రతపై ముప్పును నిరసిస్తూ… ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ ఏ ఐ జెఏ సిటిఓ( జాక్టో) ఆధ్వర్యంలో తలపెట్టిన
ఫిబ్రవరి 5, 2026న ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ – “ఢిల్లీ చలో” ధర్నా కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ పిలుపునిచ్చారు.

మంగళవారం కేసముద్రం గ్రామ ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ( టి పి టి ఎఫ్ ) కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ నేతృత్వంలో చలో ఢిల్లీ కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సురేందర్ మాట్లాడుతూ

ప్రస్తుతం
ఉపాధ్యాయులను టెట్ భారంతో వేధించడం, ఎన్ పి ఎస్/ యుపిఎస్ పేరుతో పెన్షన్ భద్రతను లాక్కోవడం,
ఎం ఈ పి–2020 ద్వారా ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయడం,
పాఠశాలల విలీనాలు, మూసివేతలు,
ఉపాధ్యాయులను బోధనేతర పనులతో ఇబ్బంది పెట్టడం,
కాంట్రాక్ట్ ఉద్యోగులపై వివక్ష,
8వ వేతన సంఘం( 8వ సిపిసి) అమలులో తీవ్ర జాప్యం మొదలగు సమస్యలు అన్ని
కలిసి ప్రభుత్వ విద్యా వ్యవస్థను కూల్చివేసే ప్రమాదకర పరిస్థితికి తీసుకెళ్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో( టెట్) నుండి మినహాయింపు,
ఎన్ పి ఎస్/ యు పి ఎస్, రద్దు చేసి ఓ పి ఎస్, పునరుద్ధరణ,
ఎన్ ఈ పి–2020 ఉపసంహరణ,
ప్రాథమిక ఉపాధ్యాయులకు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు,
పాఠశాలల విలీనాలు–మూసివేతలకు తక్షణమే బ్రేక్,
బోధనేతర పనుల నుండి ఉపాధ్యాయులకు విముక్తి,
కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ మరియు కనీస వేతనాల అమలు,
8వ వేతన సంఘాన్ని వెంటనే అమలు చేయాలి
అనే డిమాండ్లపై ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయుల సహనం ఇక చరమాంకానికి చేరుకుందని,
ఇది వ్యక్తిగత సమస్య కాదనీ, ప్రభుత్వ విద్యను, భవిష్యత్ తరాలను కాపాడుకునే పోరాటం అనీ ఆయన ఉద్ఘాటించారు.
ఈ హక్కుల సాధన కోసం
ఫిబ్రవరి 5, 2026 – ఢిల్లీ చలోకు కంకణ బద్దులై తరలి రావాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులను కోరారు.
ఒక్క ఉపాధ్యాయుడు – ఒక్క అడుగు ముందుకేస్తే…
ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందేననీ,
“ఐక్యతే మన బలం…పోరాటమే మన మార్గం”….అని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో కార్యదర్శి వీసం నర్సయ్య, కోడం శ్రీనివాస్, అప్పాల నాగరాజు, తమ్మే శ్రీనివాస్, రణధీర్,శ్రీధర్ ఇనుగుర్తి మండల కార్యదర్షులు గంగుల వేణు, సారంగపాణి, వెల్దండి సతీష్, నర్సింహా చారీ, రాహుల్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి…

టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ సంపూర్ణ మద్దతుగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జాతీయ పెన్షన్ పథకం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని, పాఠశాలల విలీనం, మూసివేతను వ్యతిరేకించడం జరిగిందాన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తూముకుంట ఉపాధ్యాయులు, లాల్ గడి మలక్ పేట్ ఉపాధ్యాయులు తో పాటు వివిధ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ షామీర్పేట్ మండల అధ్యక్షులు పి తిరుమలేష్, ప్రధాన కార్యదర్శి యు కుమార్, జిల్లా పరిషత్ హై స్కూల్ తూముకుంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్ రెడ్డి, లాల్ గాడి మలక్ పేట్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస ప్రభాకర్, పిఈటీఏ టీఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శ్రీ సత్తిరెడ్డి, ఉపాధ్యాయులు అన్నపూర్ణ, నాగ శారద, శ్రీనివాస్ రెడ్డి, వనజ, రజిని, వరలక్ష్మి, పద్మ , శ్రీదేవి, మహేష్ భాగ్యరేఖ పాల్గొన్నారు.

నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన…

నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన

సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి

జాతీయ పెన్షన్ పథకం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి

జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి…

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ డిమాండ్

కేసముద్రం/ నేటి ధాత్రి

 

ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ ఏ ఐ జె ఏ సి టి ఓ, ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ‘ఉపాధ్యాయ హక్కుల పరిరక్షణ’ పోరాటానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ( యు.ఎస్.పి.సి) సంపూర్ణ మద్దతు ప్రకటించింది.ఈ పోరాటంలో భాగంగా నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి ఆధ్వర్యంలో కేసముద్రం మండలంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు కూడా నేడు తమ తమ పాఠశాలల్లో జేబుకు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా విధానాలపై తీవ్రమైన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకుండా చేసిన విద్యా ప్రయోగాలు భవిష్యత్తు తరాలకు తీవ్రమైన అన్యాయం చేస్తాయనీ, ఉపాధ్యాయుల ఆత్మగౌరవం, హక్కులు, రిటైర్మెంట్ భద్రత, విద్యార్థుల భవిష్యత్తు అన్నీ ఒక్కటే నని, వీటిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందనీ అన్నారు.
సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని,
జాతీయ పెన్షన్ పథకం (ఎన్ పి ఎస్) ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని( ఓ పి ఎస్) పునరుద్ధరించాలని,
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాథమికోపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించాలనీ,
జాతీయ విద్యా విధానం (ఎన్ ఈ పి) ను రద్దు చేయాలనీ,
పాఠశాలల విలీనం, మూసివేతలను వెంటనే నిలిపివేయాలనీ ఆయన డిమాండ్ చేశారు. అనంతరం డిటిఎఫ్ అధ్యక్షులు కీర్తి నాగయ్య మాట్లాడుతూ
ఉపాధ్యాయులు పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని,రాష్ట్ర-జిల్లా-మండల శాఖలు ఇచ్చే పిలుపులకు తక్షణమే స్పందిస్తూ, రాబోయే కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా ఉద్యోగ ఉపాధ్యాయులందరికి సూచించారు. తదుపరి డ్యూటీ ఉపాధ్యక్షులు భూక్య శ్రీను మాట్లాడుతూ
ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయ సమస్యలను చర్చకు తీసుకుని నిర్ణయాత్మక చర్యలు తీసుకోకపోతే, పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయడం తప్ప మరో మార్గం లేదనీ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో టి పి టి ఎఫ్ అధ్యక్షులు గుండు సురేందర్ తో పాటు, యుటిఎఫ్ అధ్యక్షులు భూక్య శ్రీనివాస్, డిటిఎఫ్ అధ్యక్షులు కీర్తి నాగయ్య, టి పి టి ఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు, మండల కార్యదర్శి మోహన్ కృష్ణ, వీసం నర్సయ్య, ఊటుకూరి ప్రణయ్ కుమార్, ఉపాధ్యాయులు వెలమాల భాస్కర్, అప్పాల నాగరాజు, ఉప్పరపల్లి పి జి హెచ్ ఎం చంద్రశేఖర్, దురేష్, వినోద్ రాజ్, సంపత్, సురేష్, బిజయ్,తండా సదానందం,యం .యాకాంబ్రం కె. రాములు ,రాము , అలీ ,శ్రీనివాస్, బాలాషౌరెడ్డి బిక్షపతి , లింగయ్య, నాగరాజు, నాగేందర్,హరికృష్ణ, ,కృష్ణ ,గోపి, రవీందర్,సూర్యనారాయణ శివ, పార్వతి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version