Jammu-kashmir chenab నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన ఇప్పుడు విమాన ప్రయాణికుల్లోనూ అత్యంత ఆసక్తిని నింపుతోంది. ఈనెల 6న ప్రధాని నరేంద్రమోదీ ప్రారం భించిన ఈ వంతెనను నింగిలోనుంచే క్లిక్ మనిపించేందుకు ప్రయాణికులు ఆసక్తి కనబరుస్తున్నారు. “ఇటీవల జమ్ము-కశ్మీర్లో ఆకర్షణీయమైన లోయల ఎగువన విహరించే ప్రతి విమానం… ఓ అద్భుతాన్ని వీక్షిస్తోంది. లోహ విహంగం చీనాబ్ లోయకు దగ్గరైనప్పుడు “మీ కింద ప్రపంచం లోనే అతిపెద్దదైన రైల్వే ఆర్చి వంతెన… chenab నది వంతెన’ అనే ప్రకటన వెలువడుతుంది. వెంటనే ప్రయాణికులు కిటికీల దగ్గరకు పరుగెడుతున్నారు. ఈ అద్భుత నిర్మాణాన్ని తమ సెల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోల రూపంలో భద్రపరచుకుంటున్నారు. ఈ వంతెనను వారు గర్వకారణంగా భావిస్తున్నారు’ అని రైల్వే బోర్డు సమాచార, ప్రచార విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పేర్కొన్నారు.
Tag: india
మొదలుపెట్టిన టీమిండియా..
మొదలుపెట్టిన టీమిండియా.. వీడియో చూస్తే ప్యూర్ గూస్బంప్స్!
నేటిధాత్రి:
భారత జట్టు వేట మొదలుపెట్టేసింది. 5 టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్ గడ్డ మీద అడుగుపెట్టిన టీమిండియా కుర్రాళ్లు.. బంతి, బ్యాట్ చేతపట్టి ప్రాక్టీస్ ప్రారంభించారు.
వేట మొదలుపెట్టిన టీమిండియా.. వీడియో చూస్తే ప్యూర్ గూస్బంప్స్!
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్.. ఈ ముగ్గురూ లేని భారత టెస్ట్ జట్టును ఊహించడం కష్టమే. గత కొన్నేళ్లుగా టీమిండియాకు అన్నీ తామై నిలిచారీ త్రిమూర్తులు. మన జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. అయితే తక్కువ వ్యవధిలోనే ముగ్గురూ రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్లో భారత్ ఎలా ఆడుతుందో అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ తరుణంలో ఇంగ్లీష్ గడ్డపై అడుగుపెట్టారు టీమిండియా ప్లేయర్లు. కొత్త కెప్టెన్ శుబ్మన్ గిల్ నేతృత్వంలోని కుర్రాళ్ల బృందం ఉరిమే ఉత్సాహంతో ప్రాక్టీస్ సెషన్ను మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
బెండు తీయడం ఖాయం!
ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియంలో గిల్ అండ్ కో ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంగా తీసిన వీడియోను బీసీసీఐ అభిమానులతో పంచుకుంది. ఇందులో జట్టు ఆటగాళ్లంతా పరుగులు తీస్తూ చెమటోడ్చుతూ కనిపించారు. రన్నింగ్తో పాటు ఫుట్బాల్ సాధన చేస్తూ దర్శనమిచ్చారు. కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఫీల్డింగ్ డ్రిల్స్ చేయడాన్ని వీడియోలో చూడొచ్చు. హెడ్ కోచ్ గౌతం గంభీర్ అటు ఫీల్డింగ్ సెషన్స్తో పాటు ఇటు ఫిట్నెస్ డ్రిల్స్ను కూడా దగ్గరుండి గమనిస్తూ కనిపించాడు.ఇంగ్లండ్ గ్రౌండ్స్కు తగ్గట్లు ఫీల్డింగ్లో చేసుకోవాల్సిన మార్పులపై కోచ్ టి దిలీప్ కుర్రాళ్లతో చర్చిస్తూ కనిపించాడు. అటు పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్తో మాట్లాడుతూ దర్శనమిచ్చాడు. ఇంగ్లండ్ జట్టు బెండు తీసేందుకు లండన్లో ల్యాండ్ అయిన భారత బృందం.. ఇలా జోరుగా ప్రాక్టీస్ చేస్తూ తాము వేటాడేందుకు సిద్ధమని చెప్పకనే చెప్పేశారు.
వికసిత్ భారత లక్ష్యంగా బిజెపి పని చేస్తుంది.
*వికసిత్ భారత లక్ష్యంగా బిజెపి పని చేస్తుంది
బిజెపి మాజీ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు జన్నేమొగిలి
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో బిజెపి మండల నూతన కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు జన్నే మొగిలి హాజర య్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి 11 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వికసిత్ భారత్ లక్ష్యంగా బిజెపి పని చేస్తుంది భారతదేశం 2047 నాటికి ఒక పూర్తిగా వికసిత దేశంగామారా లన్న దృష్టితో ఏర్పడిన అభిప్రా యం భారతదేశం స్వాతంత్ర్యం సాధించి 100 సంవత్సరాలు పూర్తయ్యే సమయానికిదేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన దేశంగా నిలిపే లక్ష్యంతో నరేంద్ర మోడీ పని చేస్తున్నారు
వికసిత్ భారత్ లక్ష్యం
ఆర్థిక అభివృద్ధి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా తీర్చిదిద్దడం,ఉత్పాదకతను పెంచడం, ఉద్యోగావకాశాలను సృష్టించడం, ఐటీ, మానుఫా క్చరింగ్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో అభివృద్ధిసమాజ పరంగా సమగ్రత సామాజిక సమానత్వం, లింగ సమాన త్వం, విద్యావృద్ధిఆరోగ్య సదుపాయాల వృద్ధిపట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడం పరిశుభ్రమైన, పర్యావరణ పరిరక్షణతో కూడిన అభివృద్ధి
గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తుల ప్రోత్సాహంకాలుష్య నియంత్రణ, నీటి వనరుల పరిరక్షణసాంకేతికత ఆధారిత అభివృద్ధిడిజిటల్ ఇండియా అభియాన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ వంటి రంగాల్లో ముందంజ భారత విలువలు మరియు సంస్కృతిని పరిరక్షించుకుంటూ అభివృద్ధి సంస్కృతి,భాషలు, సంప్రదా యాలను గౌరవిస్తూ ఆధుని కతను అంగీకరించడం భారత యువతకు ఒక ప్రేరణాత్మక దిశను చూపుతుంది.దీని ద్వారా ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులు,సంస్కరణలు ఒక దీర్ఘకాలిక దృష్టికోణంతో అమలవుతాయి.ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ స్థానం మరింత శక్తివంతంగా మారుతుంది అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిలింగ్ మెంబర్ కానుగుల నాగరాజు, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పు రాజు, యువ మోర్చా జిల్లా కార్యదర్శి లాడే శివ, మండల ఉపాధ్యక్షుడు కోమటి రాజశేఖర్, మండల ప్రధాన కార్యదర్శులు మామిడి విజయ్, భూతం తిరుపతి, మండల కార్యదర్శులు మేకల సుమన్, వంగరి శివ శంకర్, కొంగరి భారతి, సీనియర్ నాయకులు మోత్కూరు సత్యనారాయణ, బూత్ అధ్యక్షులు కడారి చంద్రమౌళి, వంగల భాస్కర్ రెడ్డి, మును కుంట్ల చంద్రమౌళి,కన్నెబోయిన రమేష్, మూడేడ్ల పైడి, పరుష బోయిన శంకర్, బత్తుల రాజే ష్, కొంగర సుధాకర్, ఎర్ర తిరుపతిరెడ్డి, మూడేడ్ల రాంప్ర సాద్ తదితరులు పాల్గొన్నారు
ఖద్దరు కక్షలకు ఖాకీ బలి !?
`పోలీసులను నాయకులే విలన్లను చేస్తున్నారు.
`రాజకీయ పార్టీల మధ్య నలుగుతున్న పోలీసు?
`కార్యకర్త స్థాయి నుంచి నాయకులు దాకా పోలీసులను బెదిరిస్తున్నారు.
`గతంలో ఇంతటి వేధింపులు వుండేవి కాదు.
`నాయకులు పోలీసుల మీద పెత్తనం చేసే వారు కాదు.
`పోలీసులను బెదిరింపులకు గురి చేసే వారు కాదు.
`నిష్పక్షపాతంగా పోలీసులు విధి నిర్వర్తించే వారు.
`ఇప్పుడు నిరంతర ఒత్తిడితో పని చేస్తున్నారు.
`క్షణ క్షణం ఆందోళనతోనే కొలువు చేస్తున్నారు.
`నాయకుల రాజకీయ కక్షలకు పోలీసులను బలి చేస్తున్నారు.
`మనసు చంపుకొని పని చేయాల్సిన పరిస్థితి సృష్టిస్తున్నారు.
`నాయకుల మెప్పు లేకుండా కొలువులు చేయలేకపోతున్నారు.
`పోలీసులనే అంతు చూస్తామని నాయకులు హెచ్చరిస్తున్నారు.
`కాంగ్రెస్ ఎదురు లేకుండా పాలించిన రోజుల్లో పోలీసు వ్యవస్థ బాగుండేది.
`ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు దేశం వచ్చాక అసలైన సమస్య మొదలైంది.
`కాంగ్రెస్లో అప్పట్లో గ్రూపులు మాత్రమే వుండేవి.
`తెలుగు దేశం అధికారంలోకి వచ్చాక పార్టీ ఆధిపత్యం మొదలైంది.
`పోలీసులు రాజకీయాల మధ్య నలిగిపోవాల్సి వస్తోంది.
`అధికారంలో వున్న పార్టీలకు ఊడిగం చేయాల్సి వస్తోంది.
`తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులు కూడా నరకం చూశారు.
`రెండు తెలుగు రాష్ట్రాలలో నిరంతరం ఒత్తిడిని అనుభవిస్తున్నారు.
`ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ పోలీసుల చేత తప్పులు చేయిస్తోంది.
`ఎదురు చెప్పలేక, నాయకులు చెప్పింది వినలేక నరకయాతన పడుతున్నారు.
`సమాజం దృష్టిలో ఇప్పటికీ గౌరవాన్ని సగౌరవంగా పొందలేకపోతున్నారు.
`సామాన్యులు న్యాయానికి దూరమౌతున్నారు.
`సినిమాలలో ఒకప్పుడు పోలీసులను హీరోలుగా చూపించే వారు.
`పోలీసు స్టోరీలతో సినిమాలు నిర్మాణం చేసే వారు.
`ఇప్పుడు తప్పు చేసే వారే పోలీసుల మీద పెత్తనం చేసే పరిస్థితులు సృష్టిస్తున్నారు.
`ఒకప్పుడు తప్పు చేస్తే శంకరగిరి మాణ్యాలు అనే వారు.
`ఇప్పుడు నిజాయితీగా పని చేస్తే ఇంటికి పంపేస్తున్నారు.
`ఉద్యోగాలు పీకేస్తున్నారు..ఖాకీలో పవర్ లేకుండా చేస్తున్నారు.
`దేశవ్యాప్తంగా పోలీసులు అనుభవిస్తున్న ఇబ్బంది.
హైదరాబాద్,నేటిధాత్రి:
జనం కోసం బతికే ఏకైక వ్యవస్థ పోలీసు. ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్దపడి, త్యాగాల కోసమే పుట్టిన వ్యవస్థ పోలీసు. దేశ సరిహద్దులలో ఎండనక, వాననక, చలిని లెక్క చేయకుండా మనల్ని కావాడే వాళ్లు సైనికులు. మరి మన సమాజంలో చుట్టూ వున్న శక్తులను నుంచి కాపాడేదే పోలీసు వ్యవస్థ. ఆ వ్యవస్థ వుందనే నమ్మకం, ధైర్యంతోనే మనం నిశ్చింతగా బతుకుతున్నాం. పోలీసులే లేకుంటే ఒక్ష క్షణం కూడా గడవదు. సమాజ భద్రత సాగదు. సమాజంలో మంచి వుంటుంది. చెడు వుంటుంది. చెడు మీద మనం విజయం సాధించాలంటే కూడా మనకు పోలీసు అవసరం. పోలీసు వృత్తి అంటే అంత సామాన్యమైనది. తెగింపుతో కూడున్నది. ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డు పెట్టేది. అలాంటి వ్యవస్థ ఇప్పుడు రాజకీయ పార్టీల చేతుల్లో నలిగిపోతోంది. రాజకీయ పెత్తనంతో ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది.
నిజం చెప్పాలంటే పోలీసు వ్యవస్థ నిస్సహాయ స్థితికి చేరుకుంటోంది. నిష్పక్షపాతంగా పని చేయలేకపోతోంది. పోలీసు వ్యవస్థపై రాజకీయ పెత్తనం పెరిగిపోయింది. రాజకీయ నాయకులు, ముఖ్యంగా పాలకుల గుప్పిట్లో పని చేయాల్సి వస్తోంది. గతంలో రాజకీయ వ్యవస్థ పోలీసు యంత్రాంగంలో జోక్యం చేసుకునే వారు కాదు. కానీ ఇప్పుడు ప్రతి పోలీసు స్టేషనులో అధికారులుగా ఎవరుండాలని నాయకులే నిర్థేశిస్తున్నారు. సంబంధిత నియోజకవర్గాలలో పాలక పక్షం ఎమ్మెల్యే చెప్పిన వారికే పోస్టింగులు ఇస్తున్నారు. ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా పోలీసులు ఠానాలకు ట్రాన్స్ఫర్ కాలేకపోతున్నారు. ఎమ్మెల్యేల విల్లింగ్ లెటర్లు లేకుండా పోస్టింగులు అందుకోలేక పోతున్నారు. దాంతో లా అండ్ ఆర్డర్ పోలీసుల చేతిలో కాకుండా నాయకుల చేతుల్లోకి పోతోంది. సహజంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా, అందులో ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారుల ట్రాన్స్ఫర్లు యదాలాపంగా జరిగిపోవాలి. కానీ ట్రాన్స్ఫర్ల సమయంలో ఫలానా పోలీసు అధికారి మాకు వద్దని ఎమ్మెల్యేలు తెగేసి చెబుతున్నారు. పోలీసు వ్యవస్థను అచేతనావస్థలోకి నెట్టేస్తున్నారు. రాజకీయాలు రంగు మారడమే కాదు, రకరకాల విన్యాసాలు కూడా చేస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా చూస్తోంది. అది ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు. అన్ని పార్టీలు అదే వైఖరిని అనుసరిస్తున్నాయి. అనుభవిస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది ఎంత మాత్రం మంచిది కాదు. గతంలో ప్రత్యర్థులు అంటే రాజకీయంగా, సిద్దాంత పరంగా విభేదాలు వుండేవి. కానీ కక్ష పూరిత రాజకీయాలకు తావుండేది కాదు. పాలక పక్షం, ప్రతి పక్షం పరస్పరం రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రయత్నించేవి. నిజం చెప్పాలంటే ఇప్పటి రాజకీయాలు సమాజ ప్రయోజనాల కంటే నాయకుల ప్రయోజనాలు, పార్టీల ప్రయోజనాల కోసమే పాకులాడుతున్నాయని చెప్పడంలో సందేహం. దాంతో రాజకీయ కక్షలు పెరిగిపోతున్నాయి. ఆధిపత్య రాజకీయాలు చెలరేగిపోతున్నాయి. ఒకప్పుడు ఆధిపత్య రాజకీయాలలో నాయకుల అనుచరులు మీద ఎక్కువగా ఆధారపడుతూ వుండేవారు. కాలం మారింది. నాయకులలో మరింత స్వార్థం పెరిగింది. అనుచరులు బాగు పడడం అనేది నాయకులకు ఇష్టం లేకుండా పోయింది. నాయకులను సొంత పనులకు వాడుకొని, వారిని పోషించడం కన్నా, పోలీసు వ్యవస్థను వినియోగించుకోవడం మేలు అనే నిర్ణయానికి వచ్చారు. పోలీసు వ్యవస్థను చెప్పు చేతుల్లో పెట్టుకొని రాజకీయాలు సాగిస్తున్నారు. ఇది నిజంగా పోలీసు వ్యవస్థకు తీరని అన్యాయం జరుగుతున్నట్లే లెక్క. నిష్పాక్షికంగా పని చేయాల్సిన పోలీసు వ్యవస్థపై రాజకీయ పెత్తనం మరీ మితిమీరి పోవడంతో వ్యవస్థ నలిగిపోతోంది. ఏ పోలీసు అధికారి అన్యాయానికి గురైన వారిని ఇబ్బందులకు గురి చేయాలని అనుకోరు. వాళ్లు మనుషులే! వారిలోనూ మానవత్వం వుంటుంది. ఖాకీ దుస్తులు వేసుకున్నంత మాత్రాన వారిది కరుకు గుండె కాదు. పోలీసులంటేనే సమాజ రక్షకులు. ఆ విషయం ప్రతి పోలీసుకు తెలుసు. కానీ రాజకీయ వ్యవస్థ వారి చేతులు కట్టేస్తుంది. పార్టీల స్వలాభానికి వినియోగించుకుంటున్నారు. రాజకీయ పార్టీలు చెప్పినట్లు వినకపోతే పరిస్థితులు ఎలా వుంటాయన్నది కూడా వాళ్లకు తెలుసు. అందుకే విధిలేని పరిస్థితులలో మనసు చంపుకొని పని చేస్తున్న పోలీసులు కొన్ని వేల మంది వున్నారు. పాలకుల ఎవరైనా సరే వారు చెప్పింది వినాలి. అది రూలు. ఆ రూల్ను పోలీసులు అతిక్రమించలేరు. దాంతో రాజకీయాల మూలంగా ఖాకీలు ఎంతో నష్టపోతున్నారు. ఉన్నత విద్య చదువుకొని, పోటీ పరీక్షలు రాసి, ఎన్నో సంక్లిష్టమైన దేహ దారుడ్య, శిక్షణలు పూర్తి చేసుకొని ఉద్యోగాలకు వస్తారు. సమాజాన్ని ఏదో చేయాలని కలలుగంటారు. కానీ కుర్చీలో కూర్చున్న రోజే తన చేతులతో అన్యాయం వైపు మొగ్గు చూపేలా నాయకుల జోక్యం, ఒత్తిడి మొదలౌతుంది. అప్పుడు వారు పడే వేధన, అనుభవించే ఆవేదన వాళ్లకు మాత్రమే తెలుసు. అయినా ఖద్దరు సమస్యలను తమ భుజాన వేసుకోవాల్సిన అవసరం ఖాకీలకు లేదు. అయినా పాలనా పరంగా అనుసరించక తప్పదు. అందుకే ఖద్దరు కక్షలకు పోలీసులు బలి అవుతున్నారు. రాజకీయ పార్టీల ఆధిపత్యం మధ్య పోలీసులు నలిగిపోతున్నారు. ఇది ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశ వ్యాప్తంగా జరుగుతోంది. గతంలో ఇంతటి వేధింపులు పోలీసులకు వుండేవి కాదు. నాయకులు పోలీసుల మీద పెత్తనం చేసే వారు కాదు. నాయకులు పోలీసులతో ఎంతో మర్యాద, గౌరవంగా వుండే వారు. పోలీసులను బెదిరింపులకు గురి చేసే వారు కాదు. ఆ సమయంలో నిష్పక్షపాతంగా పోలీసులు విధి నిర్వర్తించే వారు.ఇప్పుడు నిరంతర ఒత్తిడితో పని చేస్తున్నారు. క్షణ క్షణం ఆందోళనతోనే కొలువు చేస్తున్నారు. నాయకుల రాజకీయ కక్షలకు పోలీసులను బలి చేస్తున్నారు. మనసు చంపుకొని పోలీసులు పని చేయాల్సిన పరిస్థితి సృష్టిస్తున్నారు. నాయకుల మెప్పు లేకుండా కొలువులు చేయలేకపోతున్నారు. కార్యకర్త స్థాయి నుంచి నాయకుల దాకా పోలీసులను బెదిరిస్తున్నారు. గతంలో రౌడీలు, గూండాలు, గజ దొంగలు పోలీసులకు సవాలు విసిరే వారు. ఇప్పుడు వాళ్లు కనుమరుగైపోయారు. ఆ పని ఇప్పుడు రాజకీయ నాయకులు చేస్తున్నారు. పోలీసులనే అంతు చూస్తామని నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇది ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ వచ్చిన తర్వాత మొదలైంది. తెలుగు దేశం అధికారంలోకి వచ్చాక పార్టీల ఆధిపత్యం పోలీసుల మీద మొదలై, వేధింపుల దాక వచ్చింది. ఇది ముమ్మాటికీ నిజం. అంతకు ముందు వర్గ పోరులు మాత్రమే వుండేవి. గ్రూప్ తగాదాలే వుండేవి. ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రంలో రెండు రాజకీయ పార్టీల అధికార మార్పిడీతో పోలీసు వ్యవస్థ సంకటానికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నప్పుడు సహజంగా ఆ పార్టీ నాయకుల చెప్పినట్లు వినాల్సి వచ్చేది. ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు తెలంగాణ రాజకీయాలు సీమాంధ్ర రాజకీయాలను పోలి వుండేవి కాదు. ముఖ్యంగా రాయలసీమ, ఆంద్రా ప్రాంతాలలో పార్టీల ఆధిపత్యం విపరీతంగా వుండేది. రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలలో పోలీసులు నలిగిపోయేవారు. పాలక పక్షం పెంచి పోషించే రౌడీలు, గూండాలు కూడా పోలీసులను బెదిరించే స్తాయికి చేరుకున్నారు. ఆంద్రాలో ముఖ్యంగా విజయవాడ లాంటి ప్రాంతాలలో రౌడీలు రాజ్యమేలుతూ వుండేవారు. సినిమాలు కూడా అదే తరహాలో వుండేవి. ముఖ్యంగా కుల రాజకీయాలు, పార్టీ పరమైన రాజకీయాలు విపరీతంగా వుండేవి. ఇక్కడ ఒక విషయం తప్పకుండా ప్రస్తావించుకోవాలి. వంగవీటి మోహనరంగా హత్య తర్వాత ఆయన కుటుంబమే అ పార్టీ ఈ పార్టీ అని పార్టీలు మారింది. కానీ ఆనాడు పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి వుంటే రంగ హత్యకు గురయ్యే వారు కాదని అదే రాజకీయ పార్టీలు అంటాయి. ఇంతకన్న దుర్మార్గం ఏదైనా వుంటుందా? చివరికి ఇప్పటికీ పోలీసులనే దోషులుగా చూస్తున్నారు. ఎవరు చేశారు? ఎవరు చేయించారు? అనేది ప్రపంచమంతా తెలుసు. ఆ సంఘటన జరిగి నలభై ఏళ్లయినా ఇప్పటికీ పోలీసులను నిందిస్తూనే వుంటారు. ఇక ఇప్పటి విషయానికి వస్తే అధికారంలో వున్న పార్టీలు, ప్రతిపక్షాలను అణచి వేయడానికి పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటుంది. ఇది ముమ్మాటికీ తప్పు. అది ఏ పార్టీ అయినా సరే…పాలకులు చెప్పిందాన్ని పోలీసులు పాటించాల్సి వస్తుంది. తప్పడం లేదు. అలా వింటే అన్నీ చూస్తున్నాం..పోలీసు వ్యవహార శైలిని పరిశీలిస్తున్నాం…పేర్లు నోట్ చేసుకుంటున్నామని పై స్థాయి నాయకులు మాట్లాడుతున్నారు. రెడ్ బుక్, పింక్ బుక్, బ్లాక్ బుక్ ఇలా తెలుగు రెండు రాష్ట్రాలలో ఇదే జరుగుతోంది. అసలు రాజకీయ పార్టీలు సవాళ్లు చేసుకోవడం మానేసి, పోలీసులను టార్గెట్ చేస్తున్నారు. మీ అంతు చూస్తామని బెదురిస్తున్నారు. దాంతో ఇప్పుడున్న పాలకుల మాట వినాలా? ప్రతిపక్షాల బెదిరింపులకు భయపడాలా? అన్న సందిగ్ధత ఎదురౌతోంది. పోలీసులు రాజకీయాల మధ్య నలిగిపోవాల్సి వస్తోంది. అధికారంలో వున్న పార్టీలకు ఊడిగం చేయాల్సి వస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులు కూడా నరకం చూశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో నిరంతరం ఒత్తిడిని అనుభవిస్తున్నారు.
ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ పోలీసుల చేత తప్పులు చేయిస్తోంది. ఎదురు చెప్పలేక, నాయకులు చెప్పింది వినలేక నరకయాతన పడుతున్నారు. సమాజం దృష్టిలో ఇప్పటికీ గౌరవాన్ని సగౌరవంగా పొందలేకపోతున్నారు. అలాంటి రాజకీయాల వల్ల సామాన్యులు న్యాయానికి దూరమౌతున్నారు. పోలీసులను నాయకులే విలన్లను చేస్తున్నారు. సినిమాలలో ఒకప్పుడు పోలీసులను హీరోలుగా చూపించే వారు. పోలీసు స్టోరీలతో సినిమాలు నిర్మాణం చేసే వారు. ఇప్పుడు తప్పు చేసే వారే పోలీసుల మీద పెత్తనం చేసే పరిస్థితులు సృష్టిస్తున్నారు. ఇప్పుడు నిజాయితీగా పని చేస్తే ఇంటికి పంపేస్తున్నారు. ఉద్యోగాలు పీకేస్తున్నారు..ఖాకీలో పవర్ లేకుండా చేస్తున్నారు.
సహారా ఇండియా బాధితుల సంగం సమావేశం.
సహారా ఇండియా బాధితుల సంగం సమావేశం.
మందమర్రి నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మందమర్రి సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో జరిగిన సహారా ఇండియా బాధితుల సంఘం సమావేశమై ఈ క్రింద పేర్కొనబడిన తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించనైనది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సహారా బాధితుల సంఘం సభ్యుడు చిలుక సంజీవ్ మాట్లాడుతూ సహారా డబ్బులు విషయంపై మందమర్రి ఏజెంట్ డి. శ్రీనివాసరావు, మేనేజర్ ఎస్. టి. రావు ను నిలదీయగా గత ఐదు నెలల క్రితం లీగల్ నోటీసులు జారీ చేశారు.. అంటే అడిగితే న్యాయానికి సంకెళ్లు వేస్తారా మీరు? ఇది ఎక్కడి న్యాయం? చట్టానికి కళ్ళు ఉన్నాయని నిరూపిస్తాం. వందమంది దోషులు తప్పించుకున్నా పరవాలేదు గాని ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు భారతీయ శిక్ష స్మృతి ప్రకారం అని పేర్కొన్నారు. ఈ విషయం పై త్వరలో జిల్లా కలెక్టర్, రామగుండం సిపి పోలీస్ కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మరియు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వినతి పత్రం అందజేసి. అనంతరం ధర్నాలు రాస్తారోకలు గ్రామాల నుంచి మండలాల వరకు మండలం నుంచి జిల్లా వరకు జిల్లా నుంచి రాష్ట్రం వరకు పోరాడి మా డబ్బులు మాకు తెచ్చుకునే దిశగా ఎంత దూరమైనా వెళ్తామని పేర్కొన్నారు. అలాగేసింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజ్జల్లి వెంకటయ్య మాట్లాడుతూ
సహారా ఇండియా సంస్థలో కాలపరిమితి పూర్తి అయిన ఖాతాదారులకు వెంటనే సహారా సంస్థ డబ్బులు చెల్లించాలి. అలాగే బెల్లంపల్లి మంచిర్యాల నస్పూర్ కాలనీలో ఉన్నటువంటి సహారా ఇండియా మేనేజర్లకు బాధితుల డిపాజిట్లు వెంటనే చెల్లించే విధంగా కృషి చేయాలని వినతి పత్రాలు ఇవ్వడానికి తీర్మానం చేయనైనది.సంవత్సరాల తరబడి సహారా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ డిపాజిట్లు చెల్లించకపోవడం వలన వృద్ధులు వితంతువులు సీనియర్ సిటిజల్లు సింగరేణి విశ్రాంత ఉద్యోగులు ఇతరులు చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇట్టి విషయంపై కూడా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ కి అదేవిధంగా బెల్లంపల్లి చెన్నూరు మంచిర్యాల శాసనసభ్యులకు కూడా సహారా బాధితుల పక్షాన వినతి పత్రాలు సమర్పించి బాధితులను ఆదుకునే విధంగా కృషి చేయాలని కోరుతూ తీర్మానించడమైనది.ఇట్టి కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా సహారా బాధితుల సంఘం సభ్యుడు చిలుక సంజీవ్, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజ్జెల్లి వెంకటయ్య, డి. రాజమౌళి నస్పూర్, డి. కొమురయ్య గంగారం, వెంబడి రాజేందర్ బెల్లంపల్లి, బొల్లు రాంబాబు మందమర్రి, దండు మల్లయ్య, యాదన్న, రాజమల్లు, సదానందం, నోముల వెంకన్న, సత్యనారాయణ, అజారుద్దీన్, ఓదేలు తదితరులు మహిళా సహారా బాధితులు పాల్గొనడం జరిగింది.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన !
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అఖిల భారత యాదవ మహాసభ సభ్యులు
మల్లాపూర్ మే 15 నేటి ధాత్రి:
మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామానికి చెందిన మాదం నాగరాజు ప్రమాదవశాత్తు ఇటీవల విద్యుత్ షాక్ తగిలి మరణించడం జరిగింది మండలానికి చెందిన అఖిలభారత మహాసభ మండల యాదవ సభ్యులు ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. వారికి ఆర్థికంగా అండగా ఉంటామని అదేవిధంగా ప్రభుత్వపరంగా ఏదైనా అవసర నిమిత్తం అందుబాటులో ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ధనరేకుల సంతోష్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు బండ మల్లేష్, కార్యవర్గ సభ్యులు బండారి వెంకటేష్, మండల అధ్యక్షుడు సంగ గంగారాజం, జిల్లా యూత్ అధ్యక్షులు రేబ్బటి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి మహేష్, మామిడి తిరుపతి, రాజలింగం మాదం రాజేందర్, రాజు గణేష్ , అంజయ్య, హరీష్ తదితరులు పాల్గొన్నారు.
పద్మశాలి శాశ్వత సభ్యత్వా ల నమోదు కార్యక్రమం .!
అఖిలభారత పద్మశాలి సంఘం శాశ్వత సభ్యత్వా ల నమోదు కార్యక్రమం
జై మార్కండేయ జై జై మార్కండేయ
జై పద్మశాలి జై జై పద్మశాలి
శాయంపేట నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని చేనేత సహకార సంఘం గ్రామ ఉపాధ్యక్షుడు తుమ్మ ప్రభాకర్ ఆధ్వర్యంలో చేనేత సహకార సంఘం నందు కార్మికులందరికీ నూతన శాశ్వత సభ్యత్వాలు ఇవ్వడం జరిగింది.
భవిష్య త్తులో పద్మశాలీలందరూ ఏకమై అఖిలభారత పద్మశాలి సంఘం ఎదుగుదలకు తోడ్పాటు చేసి భవిష్యత్తులో పద్మశాలీల అందరికీ సమన్యా యం జరిగే విధంగా కార్యవర్గం అందరం కృషి చేస్తారు. ఈ కార్యక్ర మంలో శాయంపేట మాజీ సర్పంచ్ వలుపదాసు చంద్రమౌళి ,చేనేత సహకార సంఘం డైరెక్టర్ బూరలక్ష్మీ, నారాయణ ,నాయకులు, కందగట్ల గోపి తదితరులు పాల్గొన్నారు.
భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీలు.
భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీలును బహిష్కరించాలని
జహీరాబాద్ నేటి ధాత్రి:
భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు వైద్యనాథ్ ఆధ్వర్యంలో కోహిర్ మండల ఎంఆర్ఓ గారికి మరియు కోహిర్ మండల పిఎస్ ఎస్ఐ గారికి మెమొరండం ఇవ్వడం జరిగింది.భారతదేశంలో అక్రమంగా పాకిస్తానీ జాతీయలను మరియు ఉగ్రవాదులను వెంటనే భారతదేశం నుండి బహిష్కరించాలని భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని మరియు సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెడుతున్న వారిని దేశద్రోహ చట్టం కింద కేసులు నమోదు చేయాలని కోరడం జరిగింది.
ఇందులో మండల అధ్యక్షులు వైద్యనాథ్ మరియు ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కిష్టన్న, సీనియర్ నాయకులు నర్సింలు, సతీష్ రెడ్డి, నాగరాజు, వంశ వర్ధన్ రెడ్డి, వంశీ, మహేందర్ రెడ్డి, శ్రీకాంత్, శివకుమార్, ఈశ్వర్ యాదవ్, శ్రీనివాస్, శ్రీశైలం, దశరథ్ రెడ్డి, తదితరులు పాల్గొనడం జరిగింది.
రెడ్ స్టార్ కుంగ్ పూ ఇండియా అకాడమి .
రెడ్ స్టార్ కుంగ్ పూ ఇండియా అకాడమి ఆశ్వర్యంలో సమ్మర్ శిక్షణ
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
ముత్తాపురం ప్రాథమిక పాఠశాల ఆవరణ లో విధ్యార్థులకు సెల్ఫ్ డిపెన్స్ నిమిత్తం అమ్మాయిలకు, అబ్బాయిలకు కుంగ్ పూ శిక్షణ శిభిరాన్ని గురువారం ప్రారంబించారు. శిక్షణ ఇచ్చువారు మంక్కిడి సుధాకర్, ఇన్ చార్జి, పెనక సిమయ్య గ్రాండ్ మాస్టర్ పౌండర్ బి వెంకట్ బాబు హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో విధ్యార్థుల యొక్క శారీరక దృఢత్యానికి మంచి ఆరోగ్యానికి క్రమ శిక్షణ కొరకు ఈ విద్యను వెనుకబడిన విద్వార్థులకు అందజేయాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు మోకాళ్ళ వీరాస్వామి, మార్తా రామకృష్ణ, మోకాళ్ళ క్రిష్ణ తదితరులు గ్రామస్థులు పాల్గొన్నారు.
ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు.!
ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ఈనెల 19న నిర్వహించే ప్రొటెస్ట్ సభను విజయవంతం చేయాలి.
జహీరాబాద్. నేటి ధాత్రి:
వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఝరాసంగం మండల ఆయా గ్రామలలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు: నేతృత్వంలో మైనారిటీ సంఘాలు శాంతియుత ర్యాలీ, నిరసనలు తెలియజేస్తూ హైదరాబాద్లో జరిగే ఈనెల 19న బహిరంగ ప్రొటెస్ట్ సభను విజయవంతం చేయాలని మండల అధ్యక్షులు సయ్యద్ మజీద్ కోరారు.ఈ సందర్భంగా ఝరాసంగం మండల ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు సయ్యద్ మజీద్ ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ.. మైనారిటీల హక్కులకు ముప్పుగా భావించే వక్ఫ్ బోర్డు బిల్లుకు ప్రతిపాదిత సవరణలకు వ్యతిరేకంగా హైదరాబాద్ దారు సలాం లో జరిగే ఈ నిరసన సభను విజయవంతం చెయ్యాలని తెలిపారు. ఈ సవరణలు ముస్లింలను మాత్రమే కాకుండా ఇతర మైనారిటీ వర్గాలను కూడా ప్రభావితం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
‘భారత రాజ్యాంగాన్ని.. ప్రతి ఒక్కరు పరిరక్షించాలి’
‘భారత రాజ్యాంగాన్ని.. ప్రతి ఒక్కరు పరిరక్షించాలి’
వెల్దండ /నేటి ధాత్రి.
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని చెదురుపల్లి, ఉబ్బలగట్టు తాండ, పోచమ్మ తాండలలో బుధవారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ అభియాన్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గాంధీజీ సత్య, అహింస సిద్ధాంతాలతో భారతదేశానికి స్వాతంత్రం సంపాదించారని, అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని గౌరవించి ప్రతి ఒక్కరు పరిరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోతిలాల్ నాయక్, వెంకటయ్య గౌడ్ పుల్లయ్య, రషీద్, మీసాల అంజయ్య, రామచంద్రయ్య, కె. అంజయ్య, పర్వత్ రెడ్డి, అంజన్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, రమా, వెంకటయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.
‘భారత రాజ్యాంగాన్ని.. ప్రతి ఒక్కరు పరిరక్షించాలి’
‘భారత రాజ్యాంగాన్ని.. ప్రతి ఒక్కరు పరిరక్షించాలి’
వెల్దండ /నేటి ధాత్రి.
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని చెదురుపల్లి, ఉబ్బలగట్టు తాండ, పోచమ్మ తాండలలో బుధవారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ అభియాన్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గాంధీజీ సత్య, అహింస సిద్ధాంతాలతో భారతదేశానికి స్వాతంత్రం సంపాదించారని, అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని గౌరవించి ప్రతి ఒక్కరు పరిరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోతిలాల్ నాయక్, వెంకటయ్య గౌడ్ పుల్లయ్య, రషీద్, మీసాల అంజయ్య, రామచంద్రయ్య, కె. అంజయ్య, పర్వత్ రెడ్డి, అంజన్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, రమా, వెంకటయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.
భారత్ సంస్కృతుల సంగమం…!
భారత్ సంస్కృతుల సంగమం…!
– మహామండలేశ్వర్ సిద్దేశ్వరానందగిరి
– వైభవంగా శ్రీ కాలభైరవ విగ్రహ ప్రతిష్టాపన
– హాజరైన ప్రముఖ పీఠాధిపతులు
– భక్తిశ్రద్ధలతో ముగిసిన ఉత్సవాలు
జహీరాబాద్. నేటి ధాత్రి:
భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు వేర్వేరుగా ఉన్న అన్ని మతాలు, వర్ణాలు, కులాల, వర్గాల సమష్టి కలయిక అని మహామండలేశ్వర్ బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ 1008 డాక్టర్. మహంత్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్ పేర్కొన్నారు. వివిధ భాషలు, మతాలు, సంగీతం, నృత్యం, ఆహారం, నిర్మాణ కళ , ఆచారాలు, వ్యవహారాలు దేశంలో ఒక్కో ప్రాంతానికి ఎంతో భిన్నంగా ఉంటాయన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని ధర్మాపూర్ లో వెలసిన శ్రీ లలిత కోటి పార్దివ లింగ దేవస్థానంలో శ్రీ శ్రీ కాలభైరవ ధ్వజస్తంభం ప్రతిష్టాపన ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పంచవటి కాశీనాథ్ బాబా, బసవలింగ అవధూత గిరి మహారాజ్, వీరేశ్వర శివాచార్య మహా స్వామీజీ, రాచయ్య స్వామి తదితరులు హాజరయ్యారు.
దేవాలయంలో గణపతి పూజ, గోపూజ, రుద్రాభిషేకం అనంతరం వేద బ్రాహ్మణులు నిర్ణయించిన శుభమూర్తము ఉదయం 8:30 నిమిషాలకు శ్రీ కాలభైరవ ధ్వజస్తంభం విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వివిధ ఆశ్రమాల పీఠాధిపతులు మాట్లాడుతూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా భక్తులు నాలుగు రకాలు ఉంటారని వారు ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్థార్థి, జ్ఞానులు ఉంటారన్నారు.
ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడుచుకోవాలని భక్తులకు పిలుపునిచ్చారు. భగవత్ నామస్మరణతోనే మనిషికి ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. తల్లిదండ్రులు, గురువులు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని భక్తులకు పిలుపునిచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థాన వ్యవస్థాపకులు సుధీర్ పాటిల్, దేవాలయ కమిటీ అధ్యక్షులు నేతి జ్ఞానేశ్వర్, ఓం ప్రకాష్ గోయల్, భీమన్న పాటిల్, హరీష్ పాటిల్, దినేష్ పాటిల్ గ్రామస్తులు భక్తులకు తగు ఏర్పాట్లు చేశారు.
భారత రాష్ట్రపతిని కలిసిన పెద్దపల్లి ఎంపీ.!
భారత రాష్ట్రపతిని కలిసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
జైపూర్,నేటి ధాత్రి:
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ,ఇతర సహచర పార్లమెంట్ సభ్యులతో కలిసి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్రపతితో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రజా సంబంధిత అంశాలు మరియు ఇతర కీలక విషయాలపై చర్చ జరిపారు.రాష్ట్రపతిని కలిసిన ప్రత్యేక సందర్భంలో గడ్డం వంశీకృష్ణ రాష్ట్ర అభివృద్ధికి,పెద్దపెల్లి అభివృద్ధికి కేంద్రం యొక్క తోడ్పాటును అందించాలని కోరారు.
భారతీయుల్లో పెరుగుతున్న విదేశీ పర్యటన మోజు
కరోనా పరిస్థితులు దాడిన తర్వాత భారతీయుల ఆలోచనా సరళిలో చాలా మార్పులు వచ్చాయి. ఇందుకు సంకేతమే ప్రపంచాన్ని చుట్టేసి రావాలనుకునేవారి సంఖ్య గణనీయంగా పెరగడం. విదేశీ పర్యటనలకు ఎంత ఖర్చు పెట్టడానికైనా మనవాళ్లు వెనకాడటం లేదట! అంతర్జాతీయ టూరిస్ట్ సంస్థల లెక్కల ప్రకారం విదేశీ పర్యటనకు సగటు భారతీయుడు చేసే ఖర్చు రూ.2లక్షలు! 2023లో 2.82 లక్షల మంది విదేశాలను చుట్టి వచ్చారు. ఇందుకోసం వీరు చేసిన ఖర్చు రూ.2.82లక్షలు! 2034 నాటికి ఈ ఖర్చు రూ.4.78 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా! అంతేకాదు విదేశీ పర్యటనలకు వెళ్లేవారి సంఖ్య 8కోట్లకు చేరగలదని భావిస్తున్నారు. మనవాళ్లు మధ్య ప్రాచ్యం, ఆగ్నేయాసియా దేశాల పట్ల అధిక మోజు కనబరుస్తున్నట్టు ట్రావెల్ సంస్థలు తెలుపు తున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయులను మరింతగా ఆకర్షించేందుకు వివిధ దేశాలు పలు కొత్త రాయితీలు ప్రకటిస్తున్నాయి.
