బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి ఇంటి దగ్గర.

33 వ వార్డు ప్లా నింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి ఇంటి దగ్గర

సీసీ రోడ్డుకు పూజ చేసిన కాంగ్రెస్ నేతలు

వనపర్తి నేటిధాత్రి:

వనపర్తి జిల్లా కేంద్రంలో 33 వ వార్డు ప్లా నింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి ఇంటి దగ్గర సిసి రోడ్డు నిర్మాణానికి కాంగ్రెస్ నేతలు పూజ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్ ఎస్ ఎల్ ఎన్ రమేష్ మాజె కౌన్సిలర్ బ్రహ్మం కాంగ్రెస్ నేతలు కూరగాయల రవీందర్ వార్డు ప్రజలు కిరాణాము వ్యాపారి ఆర్యవైశ్యుడు కాలూరు శ్రీనివాసులు శెట్టి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు 33 వ వార్డు ప్రజలు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేగారెడ్డికి ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డికి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు

పవిత్ర హజ్ యాత్రకు వెళ్తున్న రైల్వే బోర్డు.!

పవిత్ర హజ్ యాత్రకు వెళ్తున్న రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి

జహీరాబాద్ నేటి ధాత్రి:

పవిత్ర హజ్ యాత్రకు వెళ్తున్న బీ ఆర్ఎస్ నాయకులు, రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్ హజ్ యాత్రకు వెళుతున్న శుభసందర్భంగా పూలమాల శాలవాతో సత్కరించి, హజ్ యాత్ర ప్రయాణం సురక్షితంగా సఫలంగా సాగాలని మాజీ మంత్రివర్యులు హరీష్ రావు,డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ సన్మానం చేసి అభినందనలు తెలియజేశారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని పవిత్ర స్థలంలో దేవునితో ప్రార్థించాలని పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు.రాష్ట్ర దేశ ప్రజలందరూ సుఖసంతోషాలు ఆయురారోగ్యాలు ఐష్టెశ్వర్యాలతో జీవించాలని మనసారా ప్రార్ధనలు చేయాలని తెలిపారు.

ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి.

ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి ఇంటి ముందర సీసీ రోడ్డు కొరకు తవ్వారు

సీసీ రోడ్ వేయలేదు

ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు

వనపర్తి నేటిధాత్రి :

 

 

వనపర్తి జిల్లా కేంద్రంలో 33 వార్డ్ లో రాష్ట్రప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి ఇంటి ముందర సి సి రోడ్ వేయడానికి రోడ్డు తవ్వి సీసీ రోడ్డు వేయకుండా వదిలివేశారని అదేవిధంగా న్యాయవాది విజయసాయి ఇంటి ముందర రోడ్డును తవ్వి రోడ్డు వేయకుండా వదిలేశారని 33 వ వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు .వెంటనే జిల్లా కలెక్టర్ వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి స్పందించి చర్యలు తీసుకొని వెంటనే సి సి రోడ్ సీసీ వాహనాదారులు వారి వాహనాదారులు వాహనాలు నడిపే వారు ప్రజలు ఇబ్బందుల కు గురవుతున్నారని వెంటనే సి సి రోడ్డు వేయించాలని 33 వ వార్డు ప్రజలు ఒక ప్రకటనలో తెలిపారు

తిరుమలలో వీ ఐ పీ బ్రేక్ దర్శనం.!

తిరుమలలో వీ ఐ పీ బ్రేక్ దర్శనం టీటీడీ బోర్డుమెంబర్ కు కృతజ్ఞతలు

వనపర్తి నేటిదాత్రి :

 

 

వనపర్తి పట్టణానికి చెందిన జర్నలిస్ట్ పోలిశెట్టి సురేష్ న్యాయవాది దార వెంకటేష్ శ్రీకృష్ణ ప్రింటర్స్ యజమాని ఎం వెంకటరమణ లగిశెట్టి శ్రీకాంత్ బసవరాజ్ రాకేష్ తిరుమలలో శ్రీవారిని గురువారం ఉదయం దర్శనము చేసుకున్నారు వీ ఐ పీ బ్రేక్ దర్శనం కల్పించినందుకు టీ టీ డీ బోర్డు మెంబర్ తెలుగుదేశం నన్నారి నర్సిరెడ్డికి టీ టీ డీ అధికారులకు వారు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు

ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు.!

ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ఈనెల 19న నిర్వహించే ప్రొటెస్ట్ సభను విజయవంతం చేయాలి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

వ‌క్ఫ్ బోర్డు చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుకు వ్యతిరేకంగా ఝరాసంగం మండల ఆయా గ్రామలలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు: నేతృత్వంలో మైనారిటీ సంఘాలు శాంతియుత ర్యాలీ, నిరసనలు తెలియజేస్తూ హైదరాబాద్లో జరిగే ఈనెల 19న బహిరంగ ప్రొటెస్ట్ సభను విజయవంతం చేయాలని మండల అధ్యక్షులు సయ్యద్ మజీద్ కోరారు.ఈ సందర్భంగా ఝరాసంగం మండల ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు సయ్యద్ మజీద్ ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ.. మైనారిటీల హక్కులకు ముప్పుగా భావించే వక్ఫ్ బోర్డు బిల్లుకు ప్రతిపాదిత సవరణలకు వ్యతిరేకంగా హైదరాబాద్ దారు సలాం లో జరిగే ఈ నిరసన సభను విజయవంతం చెయ్యాలని తెలిపారు. ఈ సవరణలు ముస్లింలను మాత్రమే కాకుండా ఇతర మైనారిటీ వర్గాలను కూడా ప్రభావితం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

జాతీయ మిర్చి బోర్డు ఏర్పాటు చేయండి..

జాతీయ మిర్చి బోర్డు ఏర్పాటు చేయండి…

మిర్చి క్వింటాల్ కి రూ” ఇరువై వేలు కనీస మద్దతు ధర ప్రకటించండి…

త్వరలో మిర్చి రైతుల సమస్యలపై గవర్నర్ సీయం మరియు రాష్ట్ర కేంద్ర మంత్రులను కలుస్తా…

*జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి…

మంగపేట:నేటిధాత్రి

దేశవ్యాప్తంగా మిర్చి రైతులను ఆదుకునేందుకు “జాతీయ మిర్చి బోర్డు” ఏర్పాటు చేసి క్వింటాల్ ఎండు మిర్చి రూ” ఇరువై వేలు కనీస మద్దతు ధర నిర్ణయించి నేరుగా రైతుల వద్ద నుండి ప్రభుత్వమే మిర్చి కొనుగోలు చేయాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గడచిన పది రోజులుగా మిర్చి ధర భారీగా పతనం కావడం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో మిర్చి రైతుల సమస్యలు తెలుసుకుని వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు స్పైసెస్ బోర్డు అధికారులతో మాట్లాడానని ప్రస్తుతం మార్చి మాసంలో మిర్చి ధర పెరగవచ్చునని కేంద్ర వాణిజ్య శాఖ అంచనా వేస్తోందన్నారు ఎకరా మిర్చి సాగుకు సుమారు రూ” మూడు లక్షల వరకు పెట్టుబడి వ్యయం అవుతుందని మార్కెట్లో క్వింటాలుకు పధమూడు వేల లోపు మాత్రమే ధర లభించడం వల్ల ఆర్థికంగా అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దేశంలో తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక చత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో మిర్చిని పెద్ద ఎత్తున సాగు చేస్తున్నందున కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటుచేసిన జాతీయ పసుపు బోర్డు తరహాలో వరంగల్ కేంద్రంగా “జాతీయ మిర్చి బోర్డు” మంజూరు చేయాలని మిర్చి బోర్డు ద్వారా మిర్చి సాగు కి అవసరమైన అనేక రకాల రాయితీ పథకాలను అమలు చేయడంతో పాటు క్వింటాల్ ఎండుమిర్చి రూ” ఇరువై వేలు గా నిర్ణయించి రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా నేరుగా ప్రభుత్వమే మిర్చి బోర్డు నుండి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సాంబశివరెడ్డి కోరారు ప్రస్తుత సీజన్ లో మార్కెట్ పరంగా మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి గవర్నర్ మరియు రాష్ట్ర కేంద్ర మంత్రులను కలిసి వారి దృష్టికి తీసుకు వెళ్తానని సాంబశివరెడ్డి తెలిపారు మిర్చి రైతుల సమస్యలు మార్కెట్ ఒడిదుడుకులపై ఇప్పటికే జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మూడు పర్యాయాలు తన నివేదికను భారత ప్రభుత్వం కామర్స్ మరియు ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖకు అందజేసిన విషయాన్ని సాంబశివరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు

టిటిడి బోర్డు మెంబర్ ను ఉద్యోగులు నిందించడం తగదు

*శ్రీవారి భక్తుల సేవలో తరిస్తున్న నాయి బ్రాహ్మణులు..

*టిటిడి బోర్డు మెంబర్ ను ఉద్యోగులు నిందించడం తగదు…

*ఉద్యోగుల సంక్షేమం కోసమే పరితప్పిస్తున్న బోర్డు మెంబర్ నరేష్ కుమార్..

*వంకిపురం పవన్ ను తమ కులం నుండి ఎప్పుడో
వెలివేశాం..

*నాయి బ్రాహ్మణ కుల సంఘ నేతలు…

తిరుపతి(నేటి ధాత్రి)ఫిబ్రవరి 21:

తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం నాయి బ్రాహ్మణులుగా భక్తి భావంతో ఈ రోజు వరకు ఎటువంటి మచ్చ లేకుండా తమ వంతు సేవ చేస్తున్నట్లు జనసేన పార్టీ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు ఆవుల పార్టీ బుజ్జిబాబు పేర్కొన్నారు.
ఈ క్రమంలో బుధవారం తిరుమల ముఖద్వారం వద్ద జరిగిన ఘటనపై టిటిడి ఉద్యోగులు తమ కులానికి చెందిన టిటిడి బోర్డు సభ్యుడు నరేష్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ నిరసనలకు పాల్పడటం బాధాకరంగా ఉన్నదని విచారణ వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన తమ సంఘ నాయకులతో కలిసి మాట్లాడారు. టీటీడీ దేవస్థానంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వగానే ఆయన ఇచ్చిన హామీ మేరకు బీసీ నాయి బ్రాహ్మణ కులానికి చెందిన కుప్పం నివాసి అయిన వైద్యం శాంతారావుకి, అలాగే కర్ణాటక రాష్ట్రానికి చెందినమరో నాయి బ్రాహ్మణులు నరేష్ కుమార్ కి టిటిడి పాలకమండలి సభ్యులు గా ఇచ్చినందుకు వారికి మేము జీవితాంతం రుణపడి ఉంటామని వర్షం వ్యక్తం చేశారు. ఈమధ్య తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంటున్న కొత్త నిర్ణయాల వల్ల ఉద్యోగులు తమదైన శైలిలో భక్తులకు, విఐపి లకు తేడా లేకుండా వారికి నచ్చిన రీతిలో వారు విధులను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. బుధవారం జరిగిన టిటిడి పాలక మండలి సభ్యులు నరేష్ కుమార్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటి నుంచి దానికి పది నిమిషాల ముందు మహా ద్వారం గుండా ఎవరెవరు వెళ్లారు..? అనే ఎక్కడా సిసి టీవీ ఫుటేజ్ బయట పెట్టలేదన్నారు. బోర్డు సభ్యులుగా వారికి మహా ద్వారం గుండా పోయే అవకాశం ఉన్న, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిగా బోర్డు మెంబర్ మహా ద్వారం గుండా వెలుపలికి వచ్చే సమయంలో టిటిడి ఉద్యోగి అవగాహన రాహిత్యంగా వ్యవహరించడం సబబుగా లేదన్నారు. తరతరాలుగా నాయి బ్రాహ్మణులుగా మంచి కట్టు, సాంప్రదాయంతో భగవంతుడు సేవలో తాము కూడా శాశ్వత, కాంట్రాక్ట్ ప్రతిపాదికన ఇతర ఉద్యోగస్తులతోపాటు సమైక్యంగా పనిచేసుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో నిరంతరం ఉంటున్నామని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మా సేవలను గుర్తించి టీటీడీ బోర్డు మెంబర్ గా మా కులానికి సంబంధించిన ఇద్దరిని నియమించి రాష్ట్రవ్యాప్తంగా కళ్యాణకట్టలో పనిచేస్తున్న మా సమస్యలను గుర్తించి వాటిని నిషేధిస్తున్న ఈ తరుణంలో మాపై ఇటువంటి వివక్ష చూపడం బాధ కలిగించిందన్నారు.తాము నిజంగానే టీటీడీ ఉద్యోగి పట్ల దురుసుగా ప్రవర్తించి ఉంటే కర్ణాటక రాష్ట్రానికి చెందిన బోర్డు మెంబర్ నరేష్ కుమార్ భాష బేధం వల్ల జరిగిన తప్పిదానికి, దానికి ముందు జరిగిన సీసీటీవీ ఫుటేజ్ ను రిలీజ్ చేసి ఎంతమంది ఆ రోజు ముఖద్వారం ముందు బయటకు ప్రవేశించారన్న వీడియోను టీటీడీ యాజమాన్యం విడుదల చేయాలని కోరారు.నారీశక్తి అవార్డు గ్రహీత, శ్రీవారి కళ్యాణకట్ట మహిళా క్షురకుల వ్యవస్థాపక అధ్యక్షురాలు కె.రాధాదేవి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకునే నిర్ణయాల పట్ల తాము ఎప్పుడు వ్యతిరేకం కాదని, ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథంలోకి వస్తున్న తమ తరతరాల ప్రవృత్తి దారులను గుర్తిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు పదవులు ముట్ట చెప్పడం ఆనందదాయకంగా ఉందన్నారు. టీటీడీ లో చిరు ఉద్యోగిగా ఉన్న చీర్ల కిరణ్ అనే వ్యక్తి టిటిడి ఉద్యోగుల అసోసియేషన్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటూ గత టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కనుసనల్లో పనిచేస్తుండేవారు అనే ఆరోపణలు ఎక్కువగా ఉండేవన్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో ఈయన టిటిడిలో విధులు నిర్వహించకుండా చిరుద్యోగి అయినప్పటికీ అధికారి స్థాయిలో సిబ్బందిపై హుకుం జారీ చేసేవాడని ఆరోపించారు. ఇప్పుడు కూడా టీటీడీ బోర్డు మెంబర్ పై వచ్చిన ఆరోపణలను ప్రతిపక్ష వైసిపి పార్టీ నేతల కనుసనల్లోనే ఉద్యోగులను రెచ్చగొట్టి నిరసన కార్యక్రమాలు చేపట్టడం దుర్మార్గపు చర్య అని చెప్పారు. అలాగే కళ్యాణ కట్టలో పనిచేస్తున్న వెంకీపురం పవన్ పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ప్రతిపక్ష వైసిపి పార్టీకి చెందిన నేతలతో తిరుగుతూ కళ్యాణకట్ట విధులు నిర్వహించకుండా ఉద్యోగ సంఘ నేతగా చలామణి అవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఇప్పటికే తమ నాయి బ్రాహ్మణ కులం నుంచి వంకిపురం పవన్ ను బహిష్కరించడం జరిగిందన్నారు. ప్రతిపక్ష వైసిపి పార్టీ నేతల కనుషనల్లోనే కొంతమంది టీటీడీ ఉద్యోగులు ఈ నిరసన కార్యక్రమాలు చేశారని కొంతమంది ఉద్యోగులు బహిరంగంగా చర్చించుకుంటూన్నా రని, పేర్కొన్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు చీర్ల కిరణ్,వంకి పురం పవన్ కార్యకలాపాలపై టీటీడీ ఉన్నతాధికారులువిజిలెన్స్ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈ నేపథ్యంలో ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టిటిడి పాలకమండలి సభ్యుడు నరేష్ కుమార్ మాటలను వ్యంగంగా చిత్రీకరిస్తూ టిటిడి ఉద్యోగులు నిరసనలు, ధర్నాలు చేయడం సబబుగా లేదని ఖండించారు. టిటిడి దేవస్థానం వారు సోషల్ మీడియాలో విడుదలైన వీడియోకు ముందు జరిగిన ముఖద్వార ప్రవేశ,బయటకు వచ్చిన వీడియోను కచ్చితంగా విడుదల చేయాలని కరాకండిగా తేల్చి చెప్పారు.ఈ విలేకరుల సమావేశంలో నాయి బ్రాహ్మణ సంఘ నేతలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version