సహారా ఇండియా బాధితుల సంగం సమావేశం.
మందమర్రి నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మందమర్రి సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో జరిగిన సహారా ఇండియా బాధితుల సంఘం సమావేశమై ఈ క్రింద పేర్కొనబడిన తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించనైనది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సహారా బాధితుల సంఘం సభ్యుడు చిలుక సంజీవ్ మాట్లాడుతూ సహారా డబ్బులు విషయంపై మందమర్రి ఏజెంట్ డి. శ్రీనివాసరావు, మేనేజర్ ఎస్. టి. రావు ను నిలదీయగా గత ఐదు నెలల క్రితం లీగల్ నోటీసులు జారీ చేశారు.. అంటే అడిగితే న్యాయానికి సంకెళ్లు వేస్తారా మీరు? ఇది ఎక్కడి న్యాయం? చట్టానికి కళ్ళు ఉన్నాయని నిరూపిస్తాం. వందమంది దోషులు తప్పించుకున్నా పరవాలేదు గాని ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు భారతీయ శిక్ష స్మృతి ప్రకారం అని పేర్కొన్నారు. ఈ విషయం పై త్వరలో జిల్లా కలెక్టర్, రామగుండం సిపి పోలీస్ కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మరియు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వినతి పత్రం అందజేసి. అనంతరం ధర్నాలు రాస్తారోకలు గ్రామాల నుంచి మండలాల వరకు మండలం నుంచి జిల్లా వరకు జిల్లా నుంచి రాష్ట్రం వరకు పోరాడి మా డబ్బులు మాకు తెచ్చుకునే దిశగా ఎంత దూరమైనా వెళ్తామని పేర్కొన్నారు. అలాగేసింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజ్జల్లి వెంకటయ్య మాట్లాడుతూ
సహారా ఇండియా సంస్థలో కాలపరిమితి పూర్తి అయిన ఖాతాదారులకు వెంటనే సహారా సంస్థ డబ్బులు చెల్లించాలి. అలాగే బెల్లంపల్లి మంచిర్యాల నస్పూర్ కాలనీలో ఉన్నటువంటి సహారా ఇండియా మేనేజర్లకు బాధితుల డిపాజిట్లు వెంటనే చెల్లించే విధంగా కృషి చేయాలని వినతి పత్రాలు ఇవ్వడానికి తీర్మానం చేయనైనది.సంవత్సరాల తరబడి సహారా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ డిపాజిట్లు చెల్లించకపోవడం వలన వృద్ధులు వితంతువులు సీనియర్ సిటిజల్లు సింగరేణి విశ్రాంత ఉద్యోగులు ఇతరులు చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇట్టి విషయంపై కూడా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ కి అదేవిధంగా బెల్లంపల్లి చెన్నూరు మంచిర్యాల శాసనసభ్యులకు కూడా సహారా బాధితుల పక్షాన వినతి పత్రాలు సమర్పించి బాధితులను ఆదుకునే విధంగా కృషి చేయాలని కోరుతూ తీర్మానించడమైనది.ఇట్టి కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా సహారా బాధితుల సంఘం సభ్యుడు చిలుక సంజీవ్, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజ్జెల్లి వెంకటయ్య, డి. రాజమౌళి నస్పూర్, డి. కొమురయ్య గంగారం, వెంబడి రాజేందర్ బెల్లంపల్లి, బొల్లు రాంబాబు మందమర్రి, దండు మల్లయ్య, యాదన్న, రాజమల్లు, సదానందం, నోముల వెంకన్న, సత్యనారాయణ, అజారుద్దీన్, ఓదేలు తదితరులు మహిళా సహారా బాధితులు పాల్గొనడం జరిగింది.