మృతురాలు కుటుంబానికి బియ్యం అందజేత.

మృతురాలు ఎల్లవ్వ కుటుంబానికి బియ్యం అందజేత….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి :

 

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామానికి చెందిన. గ్రామపంచాయతీ కార్మికురాలు పోచ ఎల్లవ్వ. మృతిచెందగా. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేక వారి కుటుంబాన్ని చూసి చదివించి వారి కుటుంబానికి. సత్తు శ్రీనివాస్ రెడ్డి 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబానికి చెందిన ఎల్లవ్వ అర్థిక స్థితి బాగోలేక వారి కుటుంబానికి చూసి చలించి వారి కుటుంబానికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చిన దాతలు ఇందులో భాగంగా.తన వంతు సహాయంగా. 50 కేజీల బియ్యాన్ని అందజేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సత్తు శ్రీనివాస్ రెడ్డి. అలాగే మృతి చెందిన. గ్రామపంచాయతీ. కార్మికురాలు . ఎల్లవ్వ కుటుంబ పరిస్థితి బాగా లేనందున. ప్రభుత్వ పరంగా గాని గ్రామపంచాయతీ పరంగా గాని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. ఫిషరీష్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నమనేని ప్రశాంత్. గ్రామ శాఖ అధ్యక్షులు ఆసరి మహిపాల్ రెడ్డి. మండల మహిళా అధ్యక్షురాలు హరిక రెడ్డి. రాజేష్. బాలయ్య. తంగళ్ళపల్లి రవి. పెద్ది పరిసరం గౌడ్. బుర్ర బబ్లు. చెక్కపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు

సురేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ.!

కుర్మ సురేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ వంశీకృష్ణ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

క్యాతనపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ కుర్మ సురేందర్, పార్టీ నాయకులు కుర్మ సుగుణాకర్ ల యొక్క నాన్న కుర్మ రామయ్య ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను సోమవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యాన్ని అందించారు.కుటుంబానికి అండగా ఉంటామని,అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు.పరామర్శ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, పలిగిరి కనకరాజు, పల్లె దినేష్, కనకం వెంకటేశ్వర్లు, వెంకటస్వామి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన.!

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన
తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి
చందుపట్ల కీర్తి రెడ్డి
మొగులపల్లి నేటి ధాత్రి:

మొగులపల్లి మండలం గ్రామం వేములపల్లి లోఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి బుధవారం రోజున పరామర్శించారు. వారి వెంట నాయకులు మాజీ ఎంపీటీసీ గాజుల రజిత మల్లయ్య రాజు గౌడ్ చంద్రసేన ఎర్ర రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన పెగళ్ళపాటి.

నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన పెగళ్ళపాటి

వరంగల్/నర్సంపేట,నేటిధాత్రి:

 

 

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామానికి చెందిన గోవిందు పుష్ప అనే నిరుపేద మహిళ నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించింది. కాగా కడు నిరుపేదలైన మృతురాలి కుటుంబసభ్యులు ఆమె అంత్యక్రియలు, కర్మకాండల నిర్వహణకు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గీసుకొండ గ్రామానికి ఆమె బంధువులు, గీసుకొండ గ్రామ శ్రీమంతుడు, రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ పెగళ్ళపాటి లక్ష్మీనారాయణకు తెలిపి సహాయం కోరారు.కాగా మానవత్వంతో స్పందించిన లక్ష్మీనారాయణ వెంటనే రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని పంపించారు.ఈ నగదును ప్రభుత్వ ఉపాధ్యాయులు కర్ణకంటి రాంమూర్తి, మృతురాలి బంధువులు ఇనుముల ప్రభాకర్, కోట అయిలయ్య, అశోక్, రాజు, బరిగెల యాకూబ్ కలిసి మృతురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈకార్యక్రమంలో పలువురు స్థానికులు పాల్గొన్నారు.

అంకుష్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సర్పంచ్.!

అంకుష్, కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సర్పంచ్ బొల్లె పెల్లి వీరన్న

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పోతుగల్లు గ్రామానికి చెందిన ఎండి అంకుష్ నాలుగు రోజుల క్రితం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో అనారోగ్య కారణాల వలన హాస్పటల్, లో చేరి శుక్రవారం తెల్లవారుజామున మరణించాడు పోతుగల్లు గ్రామంలో అంకుష్ కుటుంబాన్ని కుటుంబ సభ్యులను పరామర్శించి మృతుని ఆత్మ శాంతి చేకూర్చాలని పార్టీహదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన. మాజీ సర్పంచ్ బొల్లపల్లివీరన్న ఈ కార్యక్రమంలో, గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు యువత తదితరులు పాల్గొన్నారు.

*-స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం *

*-స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం *
మొగుళ్ళ పల్లి: నేటి ధాత్రి

 

సొంత రక్తసంబంధీకులే వివిధ కారణాలతో విడిపోయి..గొడవలు పడి..మానవత్వ విలువలను మంటగలుపుతున్న తరుణంలో..తోటి స్నేహితుడి తండ్రి మరణం పట్ల స్పందించి..ఆర్థిక సహాయాన్ని అందించి..తోటి స్నేహితులు మానవత్వాన్ని చాటుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి నవీన్ తండ్రి కుమ్మరి సమ్మయ్య ఇటీవల మృతి చెందాడు. కాగా 2012-2013 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన కుమ్మరి నవీన్ స్నేహితులు జన్నే రాజ్ కుమార్, ఇల్లందుల విజయ్ కుమార్, బొచ్చు ప్రకాష్, నాగన బోయిన రాకేష్ యాదవ్, వైనాల అజయ్, బొచ్చు రాజు, తంగళ్ళపల్లి హరీష్, జన్నే రేష్మ, కట్ల మమత, వనపర్తి రుతీష, చల్ల మమత, పోతరాజు జ్యోతి, పసరగొండ శ్రీలత, గాదే రమ్య, చేపూరి రజిత, వైనాల శిరీషలు విరాళాలుగా వేసుకుని 5000 రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందించారు.

మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం.!

మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన మాజీ కౌన్సిలర్ బండారు కృష్ణ
వనపర్తి నేటిదాత్రి

 

వనపర్తి పట్టణంలో 15వ వార్డులో భాస్కర్ సతీమణి శ్రీమతి శారద ఇటీవల మృతి చెందారు .ఈ విషయం తెలియడంతో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బండారు కృష్ణ మృతురాల కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు బండారు కృష్ణ వెంట మున్నూరు సురేందర్ అభిషేక్ డాక్టర్ దానియల్ వినయ్ కుమార్ మహేష్ భరత్ కుమార్ ఇంతియాజ్ మృతురాలి కుటుంబానికి సంతాపం తెలిపారు

మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.

మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

 

చిట్యాల మండల కేంద్రానికి చెందిన అనుమ రాజు ఇటీవల కాలంలో అనారోగ్యంతో అకాల మరణం చెందారు.  విషయం తెలుసుకున్న 2005-06 పదవ తరగతి  బ్యాచ్ మిత్రులు తమవంతుగా మిత్రుని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించి రూ.40,000 లను సేకరించిన నగదును మృతుని పిల్లల పేరు మీదుగా పోస్ట్ ఆఫీస్ లో జమ చేసి  జమ చేసిన ధ్రువపత్రాలను శుక్రవారం మృతుని దశదినకర్మ రోజు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు స్నేహితులు మాట్లాడుతూ.. ఈ లోకంలో స్నేహానికి మించిన బంధం మరొకటి లేదని అందరితో మమేకమై కలివిడిగా కష్టసుఖాలను పాలుపంచుకునే ఆప్త మిత్రుడు దూరమవ్వడం చాలా బాధాకరమని, భౌతికంగా మా మధ్య లేకపోయినా అతని భావాలు మాపై చూపించిన ఆధారాభిమానాలు ఏనాటికి చెరగని స్మృతులుగా మా మధ్య మెదలాడుతూనే ఉంటాయని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. మిత్రుడు రాజు కుటుంబానికి ఎల్లవేళలా తమవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.
     ఈ కార్యక్రమంలో చింతల మహేందర్, మురహరి భానుచందర్, ఉయ్యాల  రమేష్, కల్వచర్ల రాము, పాసిగంటి మహేందర్, ఏకు అశోక్, రాయిని శ్రీకాంత్, ఎండి సాజిత్, కమ్మగాని బాలకృష్ణ, శ్రీపతి రమేష్, నాగబాబు, తిరుపతి, క్రాంతి, రామచందర్, రవీందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

లక్ష్మీ ప్రసన్న కుటుంబాన్ని ఆదుకోవాలని ధర్నా.!

లక్ష్మీ ప్రసన్న కుటుంబాన్ని ఆదుకోవాలని ధర్నా.

బాధిత కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి.

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి డిమాండ్.

బెల్లంపల్లి నేటిధాత్రి :

మంచిర్యాలలోనీ సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న లక్ష్మీ ప్రసన్న కుటుంబాన్ని ఆదుకోవాలి అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి డిమాండ్ చేశారు. ఈ రోజు ఆ విద్యార్థినీ ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయింది. మృతురాలు లక్ష్మీ ప్రసన్న కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆమె తల్లిదండ్రులతో కలిసి ధర్నా చేశారు. ఆమె మృతిపై విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థిని కుటుంబ సభ్యులకు 50 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వారి కుటుంబ సభ్యులకు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనీ అన్నారు. విద్యార్థిని ఉదయం చనిపోతే సాయంత్రం వరకు ఒక్క అధికారి కూడా రాకపోవడం దురదృష్టం అన్నారు. జిల్లా కేంద్రంలో జరిగినా కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం తరపున వారి కుటుంబ సభ్యులను ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు వేంకటేశ్వర గౌడ్, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, కృష్ణ, నవీన్, నర్సింగ్, శీతల్, సంగీత, స్రవంతి, కమల, దుర్గం ఎల్లయ, వాణి, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబంమును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.!

బాధిత కుటుంబంమును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్

మంథని :- నేటి ధాత్రి

 

 

మంథని మండలం పుట్టపాక గ్రామంలో దుర్కి లక్ష్మయ్య ప్రథమ వర్థంతి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పాల్గొని వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు

భాధిత కుటుంబాన్ని పరామర్శించిన సోదా.

భాధిత కుటుంబాన్ని పరామర్శించిన సోదా

 

పరకాల నేటిధాత్రి

 

పరకాల మున్సిపల్ పరిధిలోని 11వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుల అన్న స్వామి అన్న పసుల సాంబయ్య సోమవారం రోజున అనారోగ్యంతో మరణించడం జరిగింది.వారి పార్థివ దేహానికి పూలమాలవేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ పరామర్శలో సమన్వయ కమిటీ సభ్యులు మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్ పసుల రమేష్,ఏకు రాజు,నాయకులు కొయ్యడ చందర్,రవి తదితరులు పాల్గొన్నారు.

మృతురాలి కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత.

మృతురాలి కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన భోగి పుష్ప ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. కాగా చంద్రయ్యపల్లి మాజీ ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్ రెడ్డి మృతురాలి కుటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ముందుగా కుటుంబ సభ్యులు కుమారులు వంశి,రాకేష్,అత్త లచ్చమ్మ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అలాగే అదే గ్రామానికి చెందిన తూముల సాంబయ్య,తూముల రాజు,చీర్లంచ వీరాచారి,,వరంగంటి కోమల్ రెడ్డి, పోలోజు పద్మ భూశబోయిన తిరుపతి 1500 నగదును అందించారు.ఈ కార్యక్రమంలో ఏడెల్లి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి సమ్మి గౌడ్ ఫౌండేషన్ చైర్మన్.!

బాధిత కుటుంబానికి సమ్మి గౌడ్ ఫౌండేషన్ చైర్మన్ పరామర్శ

వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించి 1 క్వింటా బియ్యం అందచేత

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మున్సిపాలిటీ స్టేషన్ కు చెందిన సామల వీరభద్రం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలిసిన వెంటనే సమ్మిగౌడ్ ఫౌండేషన్ చైర్మన్ గోపా డివిజన్ అధ్యక్షులు కాంగ్రెస్ మండల నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి 1 క్వింటా బియ్యాన్ని అందజేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులు వీరభద్రం తమ్ముడు సూరయ్య,వీరభద్రం భార్య ఉపేంద్ర, కుమార్తెలు జమున,ఉమా,కళ్యాణి, మమత,సమత లను పరామర్శించి,ఓదార్చి వారికి మా నుండి సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని భరోసా కల్పించారు.ఈ సందర్భంగా సమ్మి గౌడ్ ఫౌండేషన్ నుండి ఎవరి ఇంటిలోనైనా సరే విషాదం నెలకొన్న,అట్టి విషయాన్ని తనకు తెలిపిన వెంటనే స్పందించి తను అందజేస్తున్న సహాయ సహకారాలు మృతుల కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తున్నాయని పలువురు గ్రామస్తులు చెప్పుకొచ్చారు..

ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ గౌరవ సలహాదారులు సామల నరసయ్య, మాజీ వార్డు సభ్యురాలు వనపర్తి లలిత, రాజా నాయక్, వెంకటమ్మ, సౌజన్య,సంగీత, సదానందం,మదన్,ధనమ్మ, ప్రవీణ్,మహేష్,మల్లేష్, పుష్ప,ప్రతిభ,నితిన్, కృష్ణ,రాము తదితరులు పాల్గొన్నారు.

ప్రజాసేవకే కాకా కుటుంబం… ప్రజల కొరకే కాకా కుటుంబం.

ప్రజాసేవకే కాకా కుటుంబం… ప్రజల కొరకే కాకా కుటుంబం..

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

రైల్వే బ్రిడ్జికి పునాది వేశాం… ప్రారంభించాం..!

ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

సన్నబియ్యం అక్రమ దందా చేస్తే కేసులు నమోదు చేస్తాం.

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి

క్యాతనపల్లి వద్ద రైల్వేగేటుపై నిర్మించిన ఫ్లైఓవర్‌ బ్రిడ్జికి పునాది వేసింది మేమే ప్రారంభించింది మేమేనని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంగళవారం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజాసేవకే కాకా కుటుంబం అని ప్రజల కొరకే కాక కుటుంబం అని అన్నారు.

 

MP

రామకృష్ణాపూర్ పట్టణ ప్రజల చిరకాల కోరిక రైల్వే బ్రిడ్జి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, గతంలో కాంగ్రెస్ హయాంలో పెద్దపల్లి ఎంపీగా ఉన్న సమయంలో బ్రిడ్జి పునాది వేశామని, తిరిగి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పెద్దపల్లి ఎంపీ, చెన్నూరు ఎమ్మెల్యేలుగా ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో బ్రిడ్జి నిర్మాణ పనులు ఆలస్యం అయ్యాయని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం త్వరితగతిన పూర్తిచేసి బ్రిడ్జి ప్రారంభించామని తెలిపారు.ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, ప్రజాసేవకే కాక కుటుంబం ఉందని అన్నారు. గత ప్రభుత్వం దాచుకోవడం దోచుకోవడం తోనే సరిపోయిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ..

 

MP

రైల్వే గేటు పడిన సమయంలో అనేక ప్రాణాలు పోయాయని, ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో ప్రాంత ప్రజల కష్టాలు తీరుతున్నాయని అన్నారు. పేద ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, సన్న బియ్యపు అక్రమ దందా చేస్తే కేసును నమోదు చేస్తామని హెచ్చరించారు. మున్సిపాలిటీలోని అన్ని ఏరియాలకు త్వరలోనే మంచినీరు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ గద్దె రాజు, మాజీ చైర్ పర్సన్ జంగం కళ,మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టిపిసిసి నాయకులు రఘునాథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, యాకుబ్ ఆలీ, గోపతి భానేష్, పాల రాజు,మహంకాళి శ్రీనివాస్,కుర్మ సురేందర్, సిపిఐ నాయకులు మిట్టపల్లి శ్రీనివాస్, రామడుగు లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, పట్టణ ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం.

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట మున్సిపాలిటీ పట్టణం లోని పదో వార్డులో గల పోచమ్మ కాలనీ కి చెందిన పోలబోయిన ఆగమ్మ ఆకస్మికంగా మృతి చెందడంతో స్థానిక వార్డు మాజి కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆగమ్మ భౌతిక గాయనికి పూలమాలవేసి నివాళులర్పించారు.కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5 వేలు అర్ధిక సహయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో వార్డులోని ముఖ్య నాయకులు ఎదురబోయిన రామస్వామి, మామిడాల బిక్షపతి, వలుస సత్యనారయణ,పస్తం ఎల్లాస్వామి,వలుస అదినారయణ,జక్క రవిందర్,పస్తం కృష్ణ, అరెపెల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

కుటుంబానికి 20వేల కుట్టు మిషన్ సహాయం.

కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ ఆమెరికా ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన ముంజల సుజాత కుటుంబానికి 20వేల రూపాయల ఖరీదు గల కుట్టు మిషన్ సహాయం
——————
KANA ప్రతినిధులకు తెలంగాణ గౌడ సంఘం తరఫున అభినందనలు ధన్యవాదాలు
——————-
వర్దన్నపేట (నేటిదాత్రి):

 

 

వరంగల్ జిల్లా వర్ధన్నపేట నల్లబెల్లి గ్రామానికి ముంజల సుజాత భర్త అనిల్ వయసు 30 సంవత్సరాలు భర్త అనిల్ ప్రమాదవశాత్తు తాటి చెట్టు మీదనుండి కిందపడి హాస్పిటల్ తీసుకువెళ్లగా చనిపోవడం జరిగింది. సుజాత అతి చిన్న వయసులో భర్త ను కోల్పోయి ఇద్దరు పిల్లలతో నిరాశ్రయురాలుగా జీవనం గడుపుతున్నది. పేదరికంలో ఉన్నారని వీరికి సంబంధించిన వివరాలు తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పట్టాపురం ఏకాంతం గౌడ్ మరియు జనగామ జిల్లా అధ్యక్షులు గడ్డం రాజు గౌడ్ గారి ద్వారా విషయం తెలుసుకున్న. కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా టెస్ట్ సభ్యులు వెంటనే వారి కుటుంబానికి రూ.20 వేల ఖరీదు గల కుట్టు మిషన్ మరియు గార్మెంట్స్ ను సాయం చేశారు ఈరోజు గడ్డం రాజు గౌడ్, మరియు పట్టాపురం ఏకాంత గౌడ్ KANA స్థానిక వాలంటీర్లు నాతి గణేష్ వారి సహకారంతో అందజేశారు. ముందుకి వచ్చి సహాయం చేసినందుకు KANA కానా సంస్థని తెలంగాణ గౌడ సంఘం ప్రతినిధులు మరియు నల్లవెల్లి గ్రామ గౌడ సంఘం తరపున కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర నల్లబెల్లి గ్రామం మాజీ సర్పంచ్ ముత్యం సంపత్ గౌడ్ గౌడ సంఘం గిరగాని యాదగిరి గౌడ్ ముత్యం పాపయ్య అంబాల సంపత్ గౌడ్ అంబాల యాకన్నా బొమ్మెర రాజు గౌడ్ బొమ్మెర ఎల్లగౌడ్ ముత్యం అనిల్ సంఘ సభ్యులు పాల్గొన్నారు

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన బాలాజీ సింగ్.

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన బాలాజీ సింగ్

కల్వకుర్తి/నేటి దాత్రి:

 

కల్వకుర్తి పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కరుణాకర్ రెడ్డి తండ్రి బుచ్చి రెడ్డి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఠాకూర్ బాలాజీ సింగ్ గారు వారి నివాసానికి చేరుకొని స్వర్గస్థ బుచ్చి రెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం అందించారు.

మృతుని కుటుంబానికి భీమా డబ్బులు అందజేత.

మృతుని కుటుంబానికి భీమా డబ్బులు అందజేత.

సంఘం అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో గల
చంద్ర పురుషుల సంఘం సభ్యుడు అజ్మీర సారయ్య ఇటీవల కొమురయ్య అనారోగ్యంతో మృతి చెందాడు.కాగా మృతుని కుటుంబ సభ్యులకు సంఘం అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన దుగ్గొండి పురుషుల సమితి అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్ చేతుల మీదుగా బుదవారం పాలకవర్గం సమావేశంలో భీమా డబ్బులను అందజేశారు. సాముహిక నిది పథకం నుండి రూ.70 వేలు,అభయనిధి పథకం నుండి రూ.10 వేలు మొత్తం రూ. 80 వేలు మృతుని భార్య శ్యామలకు అందజేసినట్లు అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు బానోతు రమేష్, పాలకవర్గ సభ్యులు వడ్డేపల్లి మృత్యుంజయుడు, భాషబోయిన రాజు,సలపాల ప్రభాకర్, ఉప్పుల రాజు,మామిడి ఐలయ్య, భాషబోయిన చరణ్ రాజ్,పాక రాజయ్య,బానోతు సాంబయ్య,సయ్యద్ బషీర్, సంఘ ఘణకులు ఏడెల్లి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

బాల్య మిత్రుని కుటుంబానికి ఆర్థిక సాయం.

బాల్య మిత్రుని కుటుంబానికి ఆర్థిక సాయం
(నేటి ధాత్రి)
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం

 

 

 

అడ్డగూడూరు మండలంలోని ధర్మారం గ్రామంలో ఇటీవలే అనారోగ్య సమస్యతో అకాల మరణం పొందిన దౌపాటి మహేష్ కుటుంబానికి అండగా మేమున్నామంటూ ముందుకు వచ్చి స్నేహం అన్న మాటకు సరైన నిర్వచనాన్ని అందించారు. అడ్డగూడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 2009-10, పదవ తరగతి బ్యాచ్ మిత్రులు తమవంతుగా మిత్రుని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించి రూ.30 వేల నగదును సేకరించి అందుబాటులో ఉన్న స్నేహితులు బుధవారం మృతుడి తల్లికి అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు స్నేహితులు మాట్లాడుతూ ఈ లోకంలో స్నేహానికి మించిన బంధం మరొకటిలేదని అందరితో మమేకమై కలివిడిగా కష్టసుఖాలను పాలుపంచుకునే ఆప్త మిత్రుడు దూరమవ్వడం చాలా బాధాకరమని భౌతికంగా మా మధ్య లేకపోయినా అతని భావాలు మాపై చూపించిన ఆధారాభిమానాలు ఏనాటికి చెరగని స్మృతులుగా మా మధ్య మెదలాడుతూనే ఉంటాయని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. మిత్రుడు దౌపాటి మహేష్ కుటుంబానికి ఎల్లవేళలా తమవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి మల్లేష్, పయ్యావుల రమేష్, గూడెపు నరేష్, తాడోజు లక్ష్మణా చారి,కత్తుల నరేష్,చుక్క లోకేష్,తోట నగేష్, బాలెంల శంకర్, కప్పల మహేష్ పలువురు ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీకార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం.

కాంగ్రెస్ పార్టీకార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం.

కల్వకుర్తి/నేటి దాత్రి:

 

 

కల్వకుర్తి నియోజక వర్గంలో కర్కల్ పహాడ్ గ్రామానికి చెంది ఎమ్మెల్యే అనుచరుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సిలివేరు శ్రీను గత నెల అనారోగ్యంతో మృతి చెందాడు. ఇవాళ ఉదయం శ్రీను భార్యను పిల్లను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఇంటికి పిలిపించుకుని మీకు మేము పార్టీ అండగా ఉంటుంది ఎవ్వరు అదర్యపడొద్దని భరోసా ఇచ్చి అపద్ధర్మం కింద కొంత రూ. 2 లక్షల ఆర్థిక సహాయ అందించారు . తన పిల్లల మంచి భవిష్యత్తు పై చదువులకోసం సహాకారం చేస్తా అన్నారు శ్రీను తనకోసం చాలా కష్టపడి పనిచేశాడు గుర్తుకు చేసుకుంటూ ఇలాంటి సంఘటనలు దురదృష్టకరం అని కుటుంబ సభ్యులను భరోసానిచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version