లక్ష్మీ ప్రసన్న కుటుంబాన్ని ఆదుకోవాలని ధర్నా.
బాధిత కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి.
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి డిమాండ్.
బెల్లంపల్లి నేటిధాత్రి :
మంచిర్యాలలోనీ సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న లక్ష్మీ ప్రసన్న కుటుంబాన్ని ఆదుకోవాలి అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి డిమాండ్ చేశారు. ఈ రోజు ఆ విద్యార్థినీ ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయింది. మృతురాలు లక్ష్మీ ప్రసన్న కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆమె తల్లిదండ్రులతో కలిసి ధర్నా చేశారు. ఆమె మృతిపై విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థిని కుటుంబ సభ్యులకు 50 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వారి కుటుంబ సభ్యులకు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనీ అన్నారు. విద్యార్థిని ఉదయం చనిపోతే సాయంత్రం వరకు ఒక్క అధికారి కూడా రాకపోవడం దురదృష్టం అన్నారు. జిల్లా కేంద్రంలో జరిగినా కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం తరపున వారి కుటుంబ సభ్యులను ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు వేంకటేశ్వర గౌడ్, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, కృష్ణ, నవీన్, నర్సింగ్, శీతల్, సంగీత, స్రవంతి, కమల, దుర్గం ఎల్లయ, వాణి, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.