అక్రమ నిర్మాణమే అంటున్న పంచాయితీ అధికారులు.

అనుమతులులేని…అక్రమ నిర్మాణం…!

అక్రమ నిర్మాణమే అంటున్న పంచాయితీ అధికారులు

పట్టింపె లేదా ఏ…? అధికారులకు…

అక్రమ నిర్మాణ యజమానిపై ఇంత ప్రేమ ఎందుకో…!

సంవత్సరాలుగా సాగుతున్న అక్రమ నిర్మాణ సమస్యలు

నోటీసులతో సరి పెట్టుకుంటారా..? కోరాడ జులిపిస్తారా…

చేతులు తడిపినందుకేనా అనే అనుమానాలు?

కేసముద్రం నేటి ధాత్రి:

 

కేసముద్రం పట్టణ కేంద్రం లో అక్రమ నిర్మాణాలు యాదేచ్చకంగా కొనసాగుతున్నాయి.ఇది అధికారుల అలసత్వమా…? లేదా నిర్లక్ష్యమా…? లేక అక్రమ నిర్మాణదారుల బరితెగింపులా…? అనీ కేసముద్రం పట్టణ ప్రజలు ముక్కున వెలుసుకుంట్టున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది.ఒక సామాన్యుడు రెండు గదుల ఇంటి నిర్మాణం చేపట్టాలంటే పర్మిషన్ల పేరుతో గ్రామ పంచాయతీ కార్యాలయం ఆ పేపరు ఈ పేపర్ తీసుకురా అంటూ చెప్పులు అరిగేలా తిప్పించుకునే సందర్భాలు ఎక్కువే అంటున్న ప్రజలు, అధికారులు మాత్రం డబ్బు పలుకుబడి ఉన్న వ్యాపారస్తు లు డబ్బున్న బడా బాబులు అని చెప్పుకునే వారి నిర్మాణ సముదాయలకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మాణాలు చేపట్టి పూర్తి చేస్తున్న కాని అధికారులు చూసి చూడనట్టు నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం వెనుక ఆ అధికారులపై ప్రజలు అనుమానం వ్యక్తపరుస్తున్నారు. అక్రమ నిర్మాణ దారులు నన్ను ఎవరేం చేయలేరు అనే ధీమాతో నిర్మాణాలు పూర్తి పూర్తి చేస్తున్న సంఘటనలు. యాదేచ్చకంగా అధికారుల కళ్ళేదుట బహుళ అంతస్తుల పేక మేడ లాంటి భవనం ఏదే చ్చగా అనుమతులు లేని అక్రమ నిర్మాణాలు నిర్మించినా కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల అనేక అనుమానాలకు తావిస్తుంది..వివరలోకి వెళితే కేసముద్రం పట్టణ కేంద్రం నడిబొడ్డున మార్కెట్ రోడ్ ప్రధాన రహదారి లో భద్రకాళి టెక్స్టైటైల్స్ షాపింగ్ కాంప్లెక్స్ జి ప్లస్ టు..

construction

అనుమతులు పొంది పంచాయతీరాజ్ చట్టం – 2018 నియమ నిబంధనలను అతిక్రమించి జి ప్లస్ టు ఉన్న నిర్మాణాన్ని బహుళ అంతస్తుల అనగా ఐదు పోర్లతో పేక మేడ లాంటి అక్రమ నిర్మాణం చేపట్టి ఎలాంటి ఫైర్ సేఫ్టీ మరియు వెంటిలేషన్ రూల్స్ పాటించకుండా నిర్మాణం చేపట్టారు. నిర్మాణం చేపట్టిన ప్రదేశంలో అంత పెద్ద బహుళ అంతస్తులు నిర్మాణానికి అనువైన ప్రదేశమేనా? అంతటి అంతస్థకు ఆ ప్రదేశంలోని నేల సరి అయినదేనా కాదా అది తేల్చాల్సింది జులాజికల్ మైన్స్ అధికారులు నేల పరీక్ష తదనంతరం అనుమతులు తప్పనిసరిగా పాటించాలి అలాగే ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేకుండా గాలి రావడానికి పోవడానికి ఒక్క కిటికీ కూడా నిర్మించకుండా ఒక్కొక్క ఫ్లోర్ కి ఒకటే గుమ్మం ఒకటే దారితో కూడిన డోర్ నిర్మాణం చేశారని అలాగే నాలుగు అంతస్తులకు గాను లిఫ్ట్ నిర్మించారని ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయి అగ్ని ప్రమాదం సంభవిస్తే ఫైర్ సిబ్బందికి వెళ్లే మార్గమే లేదని షాపులో పనిచేసే అటువంటి వర్కర్స్ కి మరియు షాపింగ్ మాల్ వచ్చినటువంటి వినియోగదారులకు ప్రమాదం పొంచి ఉందని మనుషుల ప్రాణాలతో చెలగాటమేనని పలువురు భావిస్తున్నారు.కానీ ఎలాంటి సేఫ్టీ రూల్స్ పాటించకుండా సేఫ్టీ అనుమతులు అవేమీ లేకుండా ఎలా నిర్మిస్తారని, అనేక ప్రశ్నలకు తావిస్తుందని ప్రజలు భావిస్తున్నారు.అట్టి బహుళ అంతస్తుల పేక మేడ లాంటి భవన నిర్మాణంతో చుట్టుపక్కల ఉన్నటువంటి నిర్మాణాలకు ప్రమాదం జరుగుతుందని అనేది చర్చ జరుగుతుంది.గతంలో ఈ షాపింగ్ కాంప్లెక్స్ అదనపు అంతస్తుల నిర్మిస్తున్న సమయంలో ఒక భవన నిర్మాణ కార్మికుడు పై అంతస్తూ నుండి పడి మృతి చెందిన సంఘటన జరిగిందని, ప్రమాదం జరిగిన ఏ మాత్రం నిర్మాణం ఆపకుండా నిర్మాణాలు పూర్తి చేసిన పరిస్థితి కళ్ళముందే కనబడుతుంటే అధికారులు షాపింగ్ కాంప్లెక్స్ యజమాని తో కుమ్మక్కయ్యారని ఆరోపణలు బాహాటంగానే వినిపిస్తున్నాయి.ఎన్నో సంవత్సరాలుగా ఈ తతంగం జరుగుతున్న కూడా అధికారులు కేవలం నోటీసులతోనే సరిపెడుతున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకుకపోవడం వెనక ఆంతర్యం ఏమిటో…?అనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిందని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. అధికారులు చట్టాలను కేవలం నిరుపేదలపై సామాన్యులపై ప్రయోగిస్తారా.బడా వ్యాపారస్థులకు డబ్బు పలుకుబడి దారులకు కొమ్ము కాస్తున్నారని ప్రజల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలు అనుకున్నట్టుగానే పరిస్థితులు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయని. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి అక్రమ నిర్మాణదారులపై కొరడా జులిపించాలని వెంటనే స్పందించి పంచాయతీ రాజ్ చట్టాలకు లోబడి చర్యలు తీసుకోవాలని,అలాగే ఇంకా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కట్టడి చేయాలని ఇకనైనా మున్సిపల్ అధికారి మరియు పంచాయితీ అధికారులు చట్టాలపై నమ్మకం కలిగిస్తారా లేదా అని ప్రజలు వేచి చూస్తున్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టడంలో రేటు కట్టడి చేయాలి.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టడంలో రేటు కట్టడి చేయాలి

హౌజింగ్ పిడి రవీందర్

పరకాల నేటిధాత్రి:

 

మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హోసింగ్ పీడీ. రవీందర్ హాజరయ్యారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని ఇట్టి ఇండ్లు నిర్మాణంలో ఎక్కువ ఖర్చు కాకుండా కట్టడి చేయాలని
పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.

Labor

ఇంటి నిర్మాణం విషయంలో ప్రభుత్వం నియమ నిబంధనల మేరకే నిర్మించాలని ఇందిరమ్మ కమిటీ సభ్యులు,పంచాయతీ కార్యదర్శులు,హౌసింగ్ డీఈ,యంపీడీఓ జిల్లా కలెక్టర్ వరకు పర్యవేక్షణ చేస్తారని డైరక్టర్ హౌజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చెక్ చేసి ఏలాంటి అవకతవకలు జరిగినా సంబందిత అధికారుల పై చర్యలు తీసుకుంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పరకాల లేబర్ అధికారి జి.వినోద్ కుమార్,హౌజింగ్ ఏఈ ఆకాంక్ష,పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

ఉప్పల్ తీగలగుట్టపల్లి రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు.

ఉప్పల్ తీగలగుట్టపల్లి రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయించండి

ప్రజల ఇబ్బందులు తీర్చండి

కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లిన వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్ నేటిధాత్రి:

గురువారం అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 25.85 కోట్లతో పునరాభివృద్ధి చేసిన కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పాల్గొన్నారు.
రైల్వే స్టేషన్ ను వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కరీంనగర్లో జరిగిన రైల్వేస్టేషన్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రైల్వే శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీరితోపాటు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పాల్గొన్నారు. ఈసందర్భంగా వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ నుంచి తిరుపతికి ప్రతిరోజు రైలు నడపాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి వినతి పత్రం అందజేశారని, ఈవిషయంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ చొరవ తీసుకొని, ఈఅభ్యర్థనకు కార్యరూపం దాల్చేలా కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కోరారని తెలిపారు. జమ్మికుంట రైల్వే స్టేషన్ అభివృద్ధికి, ఉప్పల్ రైల్వే బ్రిడ్జి కంప్లీట్ అయ్యేలా, తీగలగుట్టపల్లి రైల్వే బ్రిడ్జి త్వరితగతిన పూర్తయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని కేంద్రమంత్రి బండి సంజయ్ ని రాజేందర్ రావు కోరారు. రైల్వే బ్రిడ్జిల నిర్మాణ పనులు ఆలస్యం కావడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రి దృష్టికి రాజేందర్ రావు తీసుకొచ్చారు. వీటిపై ప్రత్యేక దృష్టిసారించి బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకొని, ప్రజలు ప్రయాణికులు ఇబ్బందులు తీర్చాలని రాజేందర్ రావ్ కోరారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశంలో నూటమూడు స్టేషన్లలో తెలంగాణ నుండి కరీంనగర్ , వరంగల్, బేగంపేట రైల్వే స్టేషన్ లను పునరాభివృద్ధి చేసి ప్రారంభించుకోవడం రాష్ట్ర ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. కరీంనగర్ ప్రజలు రైల్వే శాఖ సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. గతంలో కరీంనగర్ ఎంపీగా పని చేసిన పొన్నం ప్రభాకర్ కరీంనగర్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేశారని గుర్తు చేశారు. నాడు యూపీఏ ప్రభుత్వ హయంలో కరీంనగర్ రైల్వే స్టేషన్ ను తీర్చిదిద్దడానికి ప్రత్యేక చొరవ చూపారని తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మారుతున్న కాలానికి అనుగుణంగా రైల్వే శాఖ అధికారులు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని వెలిచాల రాజేందర్ రావు కోరారు.

ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు లబ్ధిదారులు 30 రోజుల్లో గా ప్రారంభించాలి.

ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు లబ్ధిదారులు 30 రోజుల్లో గా ప్రారంభించాలి.

జిల్లా కలెక్టర్..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో. మండలంలో. పలు గ్రామాలకు చెందిన. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు రెండో విడత కింద 500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే దసరా దీపావళి పండుగలకు నూతన గృహప్రవేశం జరుపుకోవాలని తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండలంలో ప్రజలకు రెండో విడత ఇండ్ల మంజూరు జారీచేశామని పెట్టుబడి లేని నిరుపేదలకు స్వయం మహిళ సంఘాల ద్వారా లక్ష రూపాయల రుణం మంజూరు చేశామని. ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం. లబ్ధిదారులు విడుదల విధిగా నిర్మించుకోవాలని. ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి. ఏఎంసీ చైర్మన్ స్వరూప తిరుపతిరెడ్డి. వైస్ చైర్మన్. నేరెళ్ల నర్సింగం గౌడ్. తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్. జిల్లా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు స్థల పరిశీలన .

సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు స్థల పరిశీలన

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్,నేటి ధాత్రి:

 

 

జైపూర్ మండలం ఇందారం గ్రామపంచాయతీని సోమవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. అలాగే సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు స్థల పరిశీలన చేపట్టి అధికారులకు తగు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, తహసిల్దార్ వనజా రెడ్డి, విద్యుత్ ఏఈ మనోహర్,ఆర్ఐ తిరుపతి,పంచాయతీ కార్యదర్శి సుమన్ తదితరులు పాల్గొన్నారు.

చెల్పూర్ లో రూ 5 కోట్లతో ఆధునిక హంగులత.!

చెల్పూర్ లో రూ.5 కోట్లతో ఆధునిక హంగులతో బస్టాండ్ నిర్మాణం

జెన్కో అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో సీఎస్ఆర్ నిధులతో రెండెకరాల విస్తీర్ణంలో త్వరలోనే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే.
ప్రయాణికులకు ఏడాది లోపు అందుబాటులోకి రానున్న చెల్పూర్ బస్టాండ్.
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జెన్కో యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయండి.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయండి

రాఘవ పట్నం లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలిన

రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క

ములుగు జిల్లా, నేటిధాత్రి :\

 

 

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క
అన్నారు.
గురువారం గోవిందరావు పేట మండలం రాఘవ పట్నం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇండ్లు నిర్మించుకుంటున్న పొన్నం రవీందర్, ధనసరి లింగయ్య, కృష్ణ వేణి కోరం రామ్ మోహన్ లతో మాట్లాడారు. ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మంజూరైన ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలనీ అన్నారు. రెండవ దఫా లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని, అత్యంత పేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులూ లేక

షాదీఖానా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి.

షాదీఖానా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

ఎంఐఎం మండల అధ్యక్షుడు షేక్ రబ్బాని….

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా : ఝరాసంగం మండల కేంద్రంలోని షాదీఖానా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంఐఎం మండల అధ్యక్షుడు షేక్ రబ్బాని కోరారు. మంగళవారం పెండింగ్‌లో ఉన్న షాదీఖానా భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… షాదీఖానా నూతన భవన నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు జహీరాబాద్ ఎమ్మెల్యే కోట నుండి 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారన్నారు.

 

President

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా షాదీఖానా పనులు పూర్తి చేయకపోవడం దారుణమన్నారు. కక్ష పూరితంగానే గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులను అధికార పార్టీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. షాదీఖానా పనులు పూర్తి కాకపోవడంతో ముస్లింలు పెళ్లిలు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారన్నారు.

షాదీఖానా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి.

షాదీఖానా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా : ఝరాసంగం మండల కేంద్రంలోని షాదీఖానా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంఐఎం మండల అధ్యక్షుడు షేక్ రబ్బాని కోరారు. మంగళవారం ముస్లిం షాది ఖానా పెండింగ్‌లో ఉన్న షాదీఖానా భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

 

Congress

షాదీఖానా నూతన భవన నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హాయంలో జహీరాబాద్ ఎమ్మెల్యే కోట నుండి 20 లక్షలు మంజూరైన నిధులు మంజూరు చేశారన్నారు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా షాదీఖానా పనులు పూర్తి చేయకపోవడం దారుణమన్నారు. కక్ష పూరితంగానే కాంగ్రెస్ లో చేపట్టిన పనులను అధికార పార్టీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. షాదీఖానా పనులు పూర్తి కాకపోవడంతో ముస్లింలు పెళ్లిలు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారన్నారు.

షాదీఖానా భవన నిర్మాణ పనులను.!

షాదీఖానా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా : ఝరాసంగం మండల కేంద్రంలోని షాదీఖానా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంఐఎం మండల అధ్యక్షుడు షేక్ రబ్బాని కోరారు. మంగళవారం ముస్లిం షాది ఖానా పెండింగ్‌లో ఉన్న షాదీఖానా భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… షాదీఖానా నూతన భవన నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో మాజీ చంద్రశేఖర్ రావు హాయంలో జహీరాబాద్ ఎమ్మెల్యే కోట నుండి 20 లక్షలు మంజూరైన నిధులు మంజూరు చేశారన్నారు.

Shadikhana building

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా షాదీఖానా పనులు పూర్తి చేయకపోవడం దారుణమన్నారు. కక్ష పూరితంగానే కాంగ్రెస్ లో చేపట్టిన పనులను అధికార పార్టీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. షాదీఖానా పనులు పూర్తి కాకపోవడంతో ముస్లింలు పెళ్లిలు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారన్నారు.

ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం భూముల రీ సర్వే కంప్లీట్.

ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం భూముల రీ సర్వే కంప్లీట్

జైపూర్,నేటి ధాత్రి:

 

 

రామగుండంలో ఎయిర్ పోర్ట్ నిర్మించాలని స్థల సేకరణ పై రీ సర్వే చేయాలని గత పది రోజుల క్రితం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర పౌర విమానయానా శాఖ మంత్రి కి వినతి పత్రాన్ని అందించడం జరిగింది.

వెంటనే స్పందించిన ఎయిర్ ఫోర్స్ అథారిటీ శుక్రవారం ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం భూములను పరిశీలించారు.

పెద్దపల్లి జిల్లాలో ఎయిర్ పోర్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే యోచనలో ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఉన్నట్లుగా తెలుస్తుంది.

ఎంపీ వంశీకృష్ణ చొరవతో రీ సర్వే జరగడం ద్వారా రెండు దశాబ్దాల కల నెరవేరబోతుందనీ ప్రజలలో ఆశాభావం వ్యక్తం అవుతుంది.

అంతర్గాం మండల కేంద్రంలోని టెక్ట్స్ టైల్స్ భూములను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఉన్నతాధికారులు సందర్శించి ఎయిర్ పోర్ట్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు.

గతంలో సమర్పించిన భూ రికార్డుల ఆధారంగా ఆ స్థలాన్ని రీ సర్వే నిర్వహించారు.

సమీపంలోని రైల్వే ట్రాక్,రాజీవ్ రహదారి కనెక్టివిటీ,ఇరువైపులా పట్టణాలు తదితర అంశాలపై రెవెన్యూ అధికారులతో చర్చించారు.

అక్కడి నుండి బసంత్ నగర్ ఎయిర్ పోర్ట్ భూములు పరిశీలించారు.ఎయిర్ పోర్ట్ నిర్మాణం ఎంతో అవసరం కాగా అంతర్గాం,బసంత్ నగర్ కేంద్రాల్లో దానిని ఎక్కడ నిర్మిస్తారనే ల్యాండ్ మార్క్ వంటి అంశాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఏఏఐ అధికారులు తీసుకు వెళ్తామన్నారు.

అతి త్వరలో ప్రతిపాదిత స్థలాన్ని గుర్తించి ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు దిశగా అడుగులు వేయనున్నట్లు సమాచారం.

రామగుండం ప్రాంతంలో ఎయిర్ పోర్ట్ చేస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లా తో పాటు జగిత్యాల జిల్లా వాసులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి.ముఖ్యంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతం కావడం తో వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.

భూములను పరిశీలించిన వారిలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అథారిటీ ప్రతినిధులతో పాటు రాష్ట్ర ల్యాండ్ రికార్డ్స్ పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య,అంతర్గాం తాసిల్దార్ రవీందర్ పటేల్ ఉన్నారు.

బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన.!

బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జీఎస్సార్;

గణపురం నేటి ధాత్రి;

 

 

 

 

 

 

ఈగణపురం మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి వెళ్ళే మార్గంలో (వెళ్తుర్లపల్లి క్రాస్ నుండి సీతారాంపూర్) బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాల వలన మోరంచ వాగు ప్రవహించి అటు వెళ్ళు గ్రామాలకు రాకపోకలకు ఇబ్బందిగా ఉండేది. చాలా సంవత్సరాల నుండి ఈ సమస్య ఉంది. గత ప్రభుత్వాలకు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు అన్నారు.

construction works

ఈ సమస్యను పరిష్కారం కోసం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ బ్రిడ్జికి సుమారు 15 కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. ఈ నిర్మాణ పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు,అధికారులకు సూచించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితే పలు గ్రామాలకు రాకపోకలకు రవాణా సౌకర్యాలు సులభతరం అవుతుందన్నారు.  కార్యక్రమంలో పంచాయతీ రాజ్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, ఆర్ .డబ్ల్యూ. ఎస్ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు ఆయా గ్రామాల ప్రజలు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

కోట్లతో వాటర్ షెడ్ల నిర్మాణం: మంత్రి.

కోహిర్: 10. 50 కోట్లతో వాటర్ షెడ్ల నిర్మాణం: మంత్రి

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

10. 50 కోట్లతో వాటర్ షేట్ల నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. కోహిర్ మండలం పీచే రాగడి గ్రామంలో వివిధ అభివృద్ధి పనులను శనివారం ప్రారంభించారు. మహిళా సంఘాలకు 1. 56 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. ఉన్నత పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు కేటాయిస్తారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కార్ పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు నిధుల విడుదల.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు నిధుల విడుదల

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.

సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)

 

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో బేస్మెంట్ వరకు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న 24 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు లక్ష రూపాయల నిధులు విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ప్రభుత్వం ప్రతి మండలంలో పైలెట్ ప్రాజెక్టు కింద ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అర్హులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసిందని, మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద మొత్తం 1023 ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేశామని అన్నారు. జిల్లావ్యాప్తంగా పంపిణీ చేసిన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ లలో 300 ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, వీటిలో బేస్మెంట్ వరకు పనులు పూర్తి చేసుకున్న 24 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మొదటి విడత ఆర్థిక సహాయం లక్ష రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేసిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్లు ప్రోసిడింగ్స్ పొందిన లబ్ధిదారులు వెంటనే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించుకోవాలని, ప్రభుత్వం నాలుగు దశలలో ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేస్తుందని, హౌసింగ్ శాఖ అధికారులు నిర్మాణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వేగంగా నిర్మించుకునేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

వంతెన నిర్మాణంలో జాప్యం ఎందుకు.

వంతెన నిర్మాణంలో జాప్యం ఎందుకు.

శంకుస్థాపన చేశారు.. పనులు వదిలేశారు.?

ఇబ్బందుల్లో ప్రయాణికులు,ప్రజలు.

ప్రాణాలు పోతున్న పట్టించుకోని అధికారులు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ప్యాలవరం సమీ పంలో వంతెన నిర్మాణంలో జాప్యం నెలకొంది.ప్రతిఏటా వర్షాకాలంలో వరద ఉద్ధృతి పెరిగినప్పుడు గ్రామానికి వెళ్లలేని పరిస్థితి. వంతెన నిర్మించి ఇక్కట్లు తీర్చాలని గ్రామస్థులు పార్టీలకు అతీతంగా అధికా రులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరిగి నిధులు మంజూరు సాధించు కున్నా… నేటికీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఎంపీ సురేష్ షె ట్కార్, ఎమ్మెల్యే మాణిక్ రావు
నాలుగు నెలల కిందట పనులకు శంకుస్థాపన చేశారు. వంతెన నిర్మా ణానికి పీఆర్ఆర్ శాఖ నుంచి రూ.3 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటి కైనా త్వరితగతిన వంతెన పనులు ప్రారంభించి వర్షాకాలం నాటికల్లా పూర్తిచేస్తే ప్యాలవరం, దేవరంపల్లి, ఈదులపల్లి, దిగ్వాల్ గ్రామాల ప్రజలు ఇబ్బందులు తొలగిపోతాయి.

క్యాతనపల్లి రైల్వే లైన్ మీది బ్రిడ్జి నిర్మాణం పూర్తి.

దశాబ్దాల కళ నెరవేరనున్న వేళ…. క్యాతనపల్లి రైల్వే లైన్ మీది బ్రిడ్జి నిర్మాణం పూర్తి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

రామకృష్ణాపూర్, మంచిర్యాల మధ్య ప్రయాణికులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రైల్వే బ్రిడ్జి కళ నెరవేరనున్నది. క్యాతనపల్లి రైల్వే బ్రిడ్జి నిర్మాణం తుది దశకు చేరుకోవడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో వారం రోజుల్లో బ్రిడ్జి మీదుగా రవాణా జరిగే అవకాశం ఉన్నట్లు ఆర్ అండ్ బి అధికారులు చెబుతున్నారు. దశాబ్దాలుగా రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలు పడుతున్న అవస్థలు గుర్తించి పన్నెండు సంవత్సరాల క్రితం అప్పటి పెద్దపల్లి ఎంపీ గా వివేక్ వెంకటస్వామి బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయగా బ్రిడ్జి పనులు నత్తనడకన కొనసాగాయి. పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పదవీ బాధ్యతలు చేపట్టిన నుండి బ్రిడ్జి నిర్మాణ పనుల గురించి ఆరాతీస్తూ పనులను వేగవంతం అయ్యేలా చొరవ తీసుకున్నారు. సుమారు 35 కోట్ల నిధులతో ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, అప్రోచ్ రోడ్డు పనులు పూర్తవుతున్నాయి. ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరుతుండడంతో ప్రయాణికులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రామకృష్ణాపూర్ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరనుంది..

మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి

Railway

 

రామకృష్ణాపూర్ నుండి మంచిర్యాలకు వెళ్లేందుకు పట్టణ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుండే వారు. ప్రస్తుతం రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు చివరి దశకు చేరాయి. దశాబ్దాల కల నెరవేరుతున్న వేళ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము.

ఎంపీ వంశీ ,ఎమ్మెల్యే వివేక్ కు రుణపడి ఉంటాం…

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు

Railway

 

గత 12 సంవత్సరాల క్రితం వివేక్ వెంకటస్వామి ఎంపీగా ఉన్న సమయంలో రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, గత బిఆర్ఎస్ ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణాన్ని పట్టించుకోకుండా ఉండటంతో ప్రజలు అవస్థలు పడాల్సి వచ్చిందని అన్నారు. ఇప్పుడు ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ల చొరవతో బ్రిడ్జి నిర్మాణం పూర్తయిందని వారికి రుణపడి ఉంటామని అన్నారు.

ప్రయాణికులకు దూర భారం తగ్గనుంది…

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్

 

Railway

స్థానిక ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ల చొరవతో బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యాయని, ప్రయాణికులకు దూర భారం తగ్గనుందని అన్నారు. ఎంపీకి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు.

రైల్వే గేటు కష్టాలు తప్పునున్నాయి…

 

Railway

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్

రామకృష్ణాపూర్ నుండి మంచిర్యాలకు వెళ్లేందుకు రైల్వే గేట్ అడ్డం ఉండడంతో రైల్వే గేటు పడిన సమయాలలో నిత్యం వందలాది వాహనాలు నిలిచిపోయేవి. రైల్వే గేట్ సమీపంలో గేట్ పడిన సమయంలో ప్రాణాలు సైతం పోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తయిన నేపథ్యంలో ప్రజలకు గేట్ కష్టాలు తప్పి రవాణా సులభతరం కానుందని, ఎంపీ వంశీకృష్ణ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి పట్టణ ప్రజల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణా లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణా లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

జైబాపు, జై భీమ్, జైసం విధాన్ పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్

అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు

శాయంపేట నేటిధాత్రి:

MLA lays foundation stone for construction of Indiramma’s houses

శాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయ ణరావు పాల్గొన్నారు. రైస్ మిల్లు నుండి అంబేద్కర్ కూడలి వరకు పాదయాత్రగా చేరుకున్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, అంబేద్కర్ విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పిం చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మనదేశ రాజ్యాంగం అమలు లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పేద, బలహీన వర్గాల ప్రజల ఆకాం క్షలు నెరవేరటంలేదని, ప్రధా నికి పేద ప్రజల కంటే బడా బాబులు ముఖ్యమన్నారు. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని, అంబేడ్కర్,గాంధీ, పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్రగ్రంథమన్నారు. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగా న్ని బీజేపీపార్టీ అనగాదొక్కా లని చూస్తుందని అన్నారు అమిత్ షా అంబెడ్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానించాలని అన్నారు. గ్రామ, మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. గాంధీ అంబెడ్కర్ ఆశయాల ను సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.

అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు

 

సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని ఎమ్మెల్యే జీఎస్సార్ అన్నారు. గట్లకానిపర్తి గ్రామంలో ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు కాంగ్రెస్ నేతలు, అధికారులతో కలిసి భూమిపూజ, శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకు న్న పథకాలలో ఒకటి ఇందిర మ్మ ఇండ్లు అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం ఉన్నవా రికి ఇందిరమ్మ ఇండ్ల ద్వారా రూ.5 లక్షలు ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు, అర్హులైన ప్రతి ఒక్కరూ పథకం ఉపయోగిం చుకోవాలని అన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందన్నారు. గత పదేళ్ల నుండి నిరుపేదలకు గత ప్రభుత్వం ఇళ్లను ఇవ్వకుండా మోసం చేసిందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ కార్యక్రమా లల్లో వివిధ శాఖల అధికా రులు, ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి విరాళం.

గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి విరాళం

మరిపెడ  నేటిధాత్రి.

 

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం గ్రామంలో యాదవ సంఘం కమిటీ ఆధ్వర్వంలో శ్రీగంగమ్మ తల్లి ఆలయ నిర్మాణం చేపట్టారు. ఈ నూతన ఆలయ నిర్మాణానికి మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు ను బుధవారం మరిపెడ మండలం బీచ్ రాజుపల్లి గ్రామంలో యాదవ సంఘం కమిటీ సభ్యులు కలిసి సహాయ సహకారాలు అందించాలని కోరారు. దీంతో వెంటనే స్పందించిన గుడిపూడి నవీన్ రావు గుడి నిర్మాణానికి రూ.30 వేలు ఆర్ధిక సాయం అందించారు. ఈ సందర్భంగా గుడిపూడి నవీన్ రావుని యాదవ సంఘం కమిటీ సభ్యులు ప్రత్యేకంగా అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటీసీ కొమ్ము నరేష్,కొమ్ము చంద్రశేఖర్,కోడి శ్రీకాంత్,వల్లపు లింగయ్య, కొమ్ము లింగయ్య,కొమ్ము ఉప్పలయ్య, కొమ్ము ఐలయ్య,కోడి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

హరిహర క్షేత్రం దేవాలయం నిర్మాణానికి.

హరిహర క్షేత్రం దేవాలయం నిర్మాణానికి:
ఎమ్మెల్యే, కార్పొరేటర్

ఉప్పల్ నేటిదాత్రి మార్చి 17:

హరిహర క్షేత్రం శ్రీ చిలుకశ్వేర అంజనేయు స్వామి శ్రీ గాయత్రి దేవాలయం చిల్కానగర్ శివాలయం పున్నరునిర్మాణం పనుల్లో భాగంగా ముఖ్యమైన కార్యం మొదటి అంతస్తు స్లాబ్ తర్వలో వేయడం జరుగుతుంది. స్లాబ్ నిర్మాణంకోసం అవసరమైన రెడీమిస్స్ కాంక్రీట్ ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఇస్తామని హామీ ఇచ్చారు. స్లాబ్ కోరకు అవసరమైన స్టీల్ ను చిల్కానగర్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ఇస్తామని చెప్పారు. అందులో భాగంగా నిన్న ఎమ్మెల్యే మనిషి వంశీ మరియు బన్నాల ప్రవీణ్ వచ్చి సెంట్రగ్ స్లాబ్ పనులు పరిశీలించారు. ఈకార్యక్రమంలో ఆలయకమిటీ అధ్యక్షులు దాసరి కృష్ణ, కమిటీ సభ్యులు గోనె అంజయ్య, ఆడెపు అంజయ్య, కావాలి నర్సింహ్మ, బొమ్మ రమేష్, సిక్కరి కృష్ణ, గుర్రాల మల్లేష్ ఉన్నారు.

నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇందిరమ్మ.

నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇందిరమ్మ పథకం లో పూర్తిచేసి నిరుపేదలకు ఇవ్వాలి…

అల్లాడి పౌల్ రాజ్ డిమాండ్.**

భద్రాచలం నేటి ధాత్రి

ఏఎంసీ కాలనీ నందు మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడి. పౌల్ రాజ్ పాల్గొని మాట్లాడుతూ…. పట్టణంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇందిరమ్మ పథకం కింద పూర్తి చేసి అర్హులైన నిరుపేదలకు ఇవ్వాలని అన్నారు.
ప్రజా సమస్యల మీద మాల మహానాడు ఎప్పుడు పోరాటం చేస్తుందని, ప్రతి పేద కుటుంబానికి భూమి, విద్య, ఉద్యోగం, కలిగి ఉండాలని అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని ఆయన తెలియజేశారు. గత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీలకి న్యాయం జరుగుతుందని అనుకుంటే అన్యాయం జరిగిందని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని అనుకుంటే ఆశ నిరాశగా మిగిలిందని ఆవేదన వ్యక్తపరిచారు. భద్రాచల పట్టణంలో సొంత ఇల్లు లేక అనేకమంది నిరుపేదలు దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని, భద్రాచల పట్టణంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇందిరమ్మ ఇల్లులుగా కేటాయించి నిరుపేదలకు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. అద్దె ఇళ్లలో ఉంటూ రోజువారి కూలికి వెళ్తూ దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని, కరెంటు చార్జీలు కట్టలేక ఇంటి అద్దెలు కట్టలేక సతమతం అవుతున్నారని అన్నారు. భారతదేశం స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న ప్రజలు మరింత పేదలగానే మిగిలిపోతున్నారని, ప్రభుత్వాలు మారిన,పేదల బతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తపరిచారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ కలలు సహకారం చేయాలనుకుంటే ముందుగా అర్హులైన పేదలకు సొంతింటి కలను నెరవేర్చి చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో గుంట.కిషోర్, నాని, గుండు.జిమ్మీ, కిట్టు , మింటు, ఏసుబాబు, శాంతి రాజు, వంశీ, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version