ఇల్లు కొంటున్నారా.. నాలాపై ఉందా చూడండి
ఇల్లు కొనుగోలు చేసే సమయంలో చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ తరహాలోనే నాలా ఆక్రమించి నిర్మాణం చేపట్టారా అన్నది కూడా చెక్ చేసుకోవాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పౌరులకు సూచించారు.
ప్రజావాణికి దృష్టికి వచ్చిన కొన్ని ఫిర్యాదులు
– ఘట్కేసర్ మండలం పోచారం మునిసిపాలిటీ పరిధి కొర్రెముల గ్రామం సర్వే నంబర్ 739 నుంచి 749 వరకు ఉన్న 147 ఎకరాల్లో ఏకశిలానగర్ లే అవుట్ను 1985లో అభివృద్ధి చేశారు. 2006లో అందులోని 47 ఎకరాలను వ్యవసాయ భూమిగా చూపుతూ ఓ వ్యక్తి లే అవుట్ స్వరూపం మార్చారు. ఇదే లే అవుట్లో రెండు బడా రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రహరీలు నిర్మించి కొంత మేర కాజేశాయి.
– కొర్రెములలోని సర్వే నంబర్ 796లో 11.20 ఎకరాల భూమి ఉండగా, ఇందులో 7.20 ఎకరాల్లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారు.
– పంజాగుట్ట ఆఫీసర్స్ కాలనీలో 1000 చ.గ పార్కు స్థలంలో సగం జాగాలో దుర్గాభవానీ ఆలయం నిర్మించారు. మిగతా 500 గజాల స్థలం కబ్జాకాకుండా పార్కు అభివృద్ధి చేయాలి.
– అల్వాల్ మండలం జొన్నబండ గ్రామంలోని వజ్ర ఎన్క్లేవ్లో 900 చ.గల పార్కు స్థలం కబ్జా అవుతోంది.
– తూముకుంట మునిసిపాలిటీ దేవరయాంజల్ గ్రామంలోని తురకొని కుంట శిఖం భూమిలో వేయింగ్ మిషన్ ఏర్పాటు చేస్తున్నారని సీతారామచంద్ర స్వామి దేవస్థానం భూముల పరిరక్షణ సమితి ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.