ఒకటవ వార్డు సేవకు సిద్ధం: కృష్ణారెడ్డి

ఒకటవ నంబర్ వార్డు నుంచి మున్సిపల్ కౌన్సిలర్‌గా అవకాశం కల్పిస్తే ప్రజలను సేవలు అందిస్తా

జహీరాబాద్ నేటి ధాత్రి:

భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తానని విద్యావేత్త కృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
సబ్ వెడ్డింగ్ 24/7 ప్రజాసేవ ప్రజల్లో ఉంటానని అన్నారు తాను గత 30 సంవత్సరాలుగా విద్యా రంగంలో సేవలందిస్తూ వేలాది మంది విద్యార్థులకు పాఠాలు చెప్పి వారిని ఉన్నత స్థాయికి చేర్చానని, విద్య ద్వారానే సమాజ మార్పు సాధ్యమని నమ్ముతూ నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు. వార్డు అభివృద్ధి, విద్యా సౌకర్యాల విస్తరణ, యువతకు ఉపాధి అవకాశాలు, మౌలిక వసతుల మెరుగుదల లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో పాటు పార్టీ పెద్దలు అవకాశం ఇస్తే బాధ్యతాయుతంగా సేవ చేసి వార్డును ఆదర్శంగా నిలుపుతానని కృష్ణారెడ్డి అన్నారు.

చేవెళ్ల 18వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా తెలుగు శిరీష

అభివృద్ధి చేస్తా ఆదరించండి

* 18వ వార్డు బీజేపీ అభ్యర్థిగా తెలుగు శిరీషశ్రీనివాస్

చేవెళ్ల, నేటిధాత్రి:

 

చేవెళ్ల మున్సిపల్ 18 వార్డు కౌన్సిలర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలుగు శిరీష శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చేవెళ్ల తొలి మున్సిపల్ ఎన్నికల్లో యువతకు అవకాశం ఇచ్చి 18వ వార్డు కౌన్సిలర్ గా పెద్ద మనసుతో ఆశీర్వదించాలని శిరీష విజ్ఞప్తి చేశారు.
తనను గెలిపిస్తే బీజేపీ కేంద్ర ప్రభుత్వ నిధులతో వార్డును ఆదర్శంగా అభివృద్ధి చేసి తీర్చి దిద్దుతానని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు. వార్డులో ప్రధాన వీధుల గుండా ప్రజలను కలుస్తూ, ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని, వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, కేంద్ర ప్రభుత్వ నిధులతో మరింత అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. వార్డులో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

వరద కలలువలు నిర్మించాలని బిజెపి పార్టీ

వరద కలలువలు నిర్మించాలని
బిజెపి పార్టీ అభ్యర్థులు జమ్మికుంట మున్సిపాలిటీ ముట్టడి

జమ్మికుంట: నేటిధాత్రి
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని వరద ముప్పు ప్రాంతాలైన హౌసింగ్ బోర్డ్ కాలనీ అంబేద్కర్ కాలనీ రామన్న పల్లె కృష్ణ కాలనీలలో వర్షాకాలం వచ్చిందంటే వరద వరద నీరు గతంలో ఇళ్లల్లో కూడా వచ్చినవి ఇట్టి సమస్యను పరిష్కరించాలని జమ్మికుంట కమిషనర్ కు వినతి పత్రం కూడా అందజేసిన కానీ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు కాలువ నిర్మాణాలు కూడా జరగలేదు అలాగే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గెలిచి అటువంటి సమయంలో నేను గెలిచిన తర్వాత ఈ కాలువ నిర్మాణాలు ఈ వరద నీరు రాకుండా ప్రజలకు ఇబ్బంది రాకుండా చేస్తానని వాగ్దానం చేశాడు కానీ ఒక్క రూపాయి అభివృద్ధి కూడా చేయలేదు అలాగే కమిషనర్ ఇంటి పన్నుల వసూలులో ప్రశంస పత్రం అందుకున్నప్పుడు మూడు కోట్ల నిధులు మున్సిపాలిటీ వచ్చినయ్ అట్టి నిధుల నుండి ఇట్టి నిర్మాణం చేస్తామని కూడా తెలిపారు కానీ ఎలాంటి అనుమతులు నిర్మాణానికి ఎవరికి ఇవ్వలేదు కనుక బిజెపి పార్టీ జమ్మికుంట మండల పట్టణ అధ్యక్షులు రాజు విమర్శించారు అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ చౌరస్తా నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ముట్టడించడం జరిగింది . ఇట్టి కార్యక్రమంలో వరద బాధితులు అలాగే హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రజలు నాయకులు జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ మాజీ అధ్యక్షుడు జీడి మల్లేశం,రమారెడ్డి,కోరే రవి,అప్ప మధు,బస్సు శివకుమార్,మాజీ కౌన్సిలర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version