వరద కలలువలు నిర్మించాలని బిజెపి పార్టీ

వరద కలలువలు నిర్మించాలని
బిజెపి పార్టీ అభ్యర్థులు జమ్మికుంట మున్సిపాలిటీ ముట్టడి

జమ్మికుంట: నేటిధాత్రి
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని వరద ముప్పు ప్రాంతాలైన హౌసింగ్ బోర్డ్ కాలనీ అంబేద్కర్ కాలనీ రామన్న పల్లె కృష్ణ కాలనీలలో వర్షాకాలం వచ్చిందంటే వరద వరద నీరు గతంలో ఇళ్లల్లో కూడా వచ్చినవి ఇట్టి సమస్యను పరిష్కరించాలని జమ్మికుంట కమిషనర్ కు వినతి పత్రం కూడా అందజేసిన కానీ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు కాలువ నిర్మాణాలు కూడా జరగలేదు అలాగే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గెలిచి అటువంటి సమయంలో నేను గెలిచిన తర్వాత ఈ కాలువ నిర్మాణాలు ఈ వరద నీరు రాకుండా ప్రజలకు ఇబ్బంది రాకుండా చేస్తానని వాగ్దానం చేశాడు కానీ ఒక్క రూపాయి అభివృద్ధి కూడా చేయలేదు అలాగే కమిషనర్ ఇంటి పన్నుల వసూలులో ప్రశంస పత్రం అందుకున్నప్పుడు మూడు కోట్ల నిధులు మున్సిపాలిటీ వచ్చినయ్ అట్టి నిధుల నుండి ఇట్టి నిర్మాణం చేస్తామని కూడా తెలిపారు కానీ ఎలాంటి అనుమతులు నిర్మాణానికి ఎవరికి ఇవ్వలేదు కనుక బిజెపి పార్టీ జమ్మికుంట మండల పట్టణ అధ్యక్షులు రాజు విమర్శించారు అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ చౌరస్తా నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ముట్టడించడం జరిగింది . ఇట్టి కార్యక్రమంలో వరద బాధితులు అలాగే హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రజలు నాయకులు జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ మాజీ అధ్యక్షుడు జీడి మల్లేశం,రమారెడ్డి,కోరే రవి,అప్ప మధు,బస్సు శివకుమార్,మాజీ కౌన్సిలర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version