ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ..
రామాయంపేట జూన్ 27నేటి ధాత్రి (మెదక్)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా శుక్రవారం రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో మంగలి నర్సమ్మ ఇంటి నిర్మాణానికి టీ పి సి సి కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు చేతుల మీదుగా భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇండ్లు లేని నిరుపేదలు ఉండకూడదు అనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం ఈ అవకాశాన్ని నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో , మాజీ కౌన్సిలర్ దేమే యాదగిరి, చింతల స్వామి, ప్రసన్నకుమార్, వార్డు ఆఫీసర్ శంకర్ , శరత్, మంగలి సత్యం మేస్త్రి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.