రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన.

రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ తహసీల్దార్……!

జహీరాబాద్ నేటి ధాత్రి;

పని పూర్తి చేసి, పరిహారం చెక్కు చేతికిచ్చిన తర్వాత కూడా లంచం కోసం వేధించిన ప్రభుత్వ అధికారుల బండారాన్ని ఏసీబీ అధికారులు బయటపెట్టారు.ఓ బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఇద్దరు ముఖ్య అధికారులను, ఒక డ్రైవర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో కలకలం రేపింది.జహీరాబాద్‌లోని జాతీయ పెట్టుబడులు, తయారీ మండలం (నిమ్జ్) కోసం ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. ఈ క్రమంలో ఓ వ్యక్తికి చెందిన భూమిని సేకరించి, దానికి సంబంధించిన ఫైల్‌ను అధికారులు ప్రాసెస్ చేశారు.

బాధితుడికి రూ. 52,87,500 పరిహారం చెక్కును కూడా అందజేశారు. అయితే.. ఈ పని చేసినందుకు గాను నిమ్జ్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న రాజారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సతీష్, వారి డ్రైవర్ దుర్గయ్య కలిసి బాధితుడిని రూ. 50వేలు లంచం డిమాండ్ చేశారు.దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు… బేరసారాల అనంతరం రూ. 15వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు.గురువారం బాధితుడి నుంచి రూ. 15వేలు లంచం తీసుకుంటుండగా ముందుగా వేసిన పథకం ప్రకారం ఏసీబీ అధికారులు లంచగొండి అధికారులను పట్టుకున్నారు. ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి._

సీజనల్ పై అప్రమత్తత అవసరం.

సీజనల్ పై అప్రమత్తత అవసరం…

డెంగ్యూ ప్రభలకుండా జాగ్రత్తలు పాటించాలి…

దోమ తెరలను ఉపయోగించాలి…

దోమలను తగ్గించడానికి, దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను వదిలించుకోవాలి…

పారిశుద్ధ్య నిర్వహణ పనులను సక్రమంగా చేపట్టాలి…

నేటి ధాత్రి -మహబూబాబాద్ -గార్ల 

వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. గ్రామాల్లో వైద్య, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు సమన్వయంతో శానిటేషన్ పక్కాగా నిర్వహించాలి. అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరిపడా వసతులు కల్పించాలి. ఔషధ నిల్వలను సరిపడా అందుబాటులో ఉండేలా చర్యలు పాటించాలి. సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యాధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాలి.డెంగ్యూ జ్వరం అనేది బాధాకరమైన, బలహీనపరిచే దోమల ద్వారా సంక్రమించే వ్యాధి, మరియు రెండవసారి డెంగ్యూ వైరస్ సోకిన వ్యక్తులు తీవ్రమైన వ్యాధిని అభివృద్ధి చేసే ప్రమాదం చాలా ఎక్కువ. డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు అధిక జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, కండరాలు మరియు కీళ్ల నొప్పులు. కొన్ని తీవ్రమైన కేసులు రక్తస్రావం మరియు షాక్‌కు దారితీస్తాయి, ఇది ప్రాణాంతకమవుతుంది.

 

 

డెంగ్యూ జ్వరం నాలుగు దగ్గరి సంబంధం ఉన్న డెంగ్యూ వైరస్‌లలో ఏదైనా ఒక దాని వల్ల వస్తుంది. ఈ వైరస్‌లు వెస్ట్ నైల్ ఇన్ఫెక్షన్ మరియు ఎల్లో ఫీవర్‌కి కారణమయ్యే వైరస్‌లకు సంబంధించినవి.సోకిన వ్యక్తి చుట్టూ ఉండటం ద్వారా డెంగ్యూ జ్వరం పొందలేరు. బదులుగా, డెంగ్యూ జ్వరం దోమల కాటు ద్వారా వ్యాపిస్తుంది. సోకిన దోమ మరొక వ్యక్తిని కుట్టినప్పుడు, వైరస్ ఆ వ్యక్తి రక్తప్రవాహంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. డెంగ్యూ జ్వరం నుండి కోలుకున్న తర్వాత, సోకిన వైరస్‌కు దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి ఉంటుంది – కానీ ఇతర మూడు డెంగ్యూ జ్వరం వైరస్ రకాలకు కాదు. భవిష్యత్తులో ఇతర మూడు రకాల వైరస్‌ల ద్వారా మళ్లీ సోకవచ్చని దీని అర్థం. రెండవ, మూడవ లేదా నాల్గవ సారి డెంగ్యూ జ్వరం ఉంటే, తీవ్రమైన డెంగ్యూ జ్వరం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.డెంగ్యూ లక్షణాలు, సాధారణంగా సంక్రమణ తర్వాత నాలుగు నుండి ఆరు రోజుల నుండి ప్రారంభమవుతాయి మరియు 10 రోజుల వరకు ఉంటాయి.డెంగ్యూ వచ్చిన వారికీ ఆకస్మిక అధిక జ్వరం (105 డిగ్రీలు), తీవ్రమైన తలనొప్పి,కళ్ళు వెనుక నొప్పి,తీవ్రమైన ఉమ్మడి మరియు కండరాల నొప్పి

 

అలసట,వికారం,వాంతులు అవుతున్నాయి.అతిసారం,చర్మంపై దద్దుర్లు, ఇది జ్వరం ప్రారంభమైన రెండు నుండి ఐదు రోజుల తర్వాత కనిపిస్తుంది.తేలికపాటి రక్తస్రావం (ముక్కు రక్తస్రావం, చిగుళ్ళలో రక్తస్రావం లేదా సులభంగా గాయాలు వంటివి.కొన్నిసార్లు, డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు తేలికపాటివి మరియు ఫ్లూ లేదా ఇతర వైరల్ సంక్రమణ లక్షణాలు కావచ్చు. చిన్నపిల్లలు మరియు మునుపెన్నడూ ఇన్ఫెక్షన్ లేని వ్యక్తులు పెద్ద పిల్లలు మరియు పెద్దల కంటే తేలికపాటి కేసులను కలిగి ఉంటారు. అయినప్పటికీ, వారు తీవ్రమైన సమస్యలను అభివృద్ధి చేయవచ్చు. డెంగ్యూ హెమరేజిక్ జ్వరం, అధిక జ్వరం, శోషరస మరియు రక్త నాళాలు దెబ్బతినడం, ముక్కు మరియు చిగుళ్ళ నుండి రక్తస్రావం, కాలేయం పెద్దదిగా మారడం మరియు రక్త ప్రసరణ వ్యవస్థ వైఫల్యం వంటి అరుదైన సమస్యలు ఇందులో ఉన్నాయి.

 

 

 

 

లక్షణాలు భారీ రక్తస్రావం, షాక్ మరియు మరణంగా మారవచ్చు. దీన్నే డెంగ్యూ షాక్ సిండ్రోమ్ (డి ఎస్ ఎస్ )అంటారు.బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలు ఉన్న వ్యక్తులు మరియు రెండవ లేదా పదేపదే డెంగ్యూ ఇన్ఫెక్షన్లు ఉన్న వ్యక్తులు డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్‌ను అభివృద్ధి చేసే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు.మీ రక్తనాళాలు దెబ్బతిన్నప్పుడు మరియు లీకేజీ అయినప్పుడు తీవ్రమైన డెంగ్యూ వస్తుంది. మరియు మీ రక్తప్రవాహంలో గడ్డకట్టే కణాల సంఖ్య (ప్లేట్‌లెట్స్) తగ్గింది. ఇది స్ట్రోక్, అంతర్గత రక్తస్రావం, అవయవ వైఫల్యం మరియు మరణానికి కూడా దారితీస్తుంది.తీవ్రమైన డెంగ్యూ జ్వరం యొక్క హెచ్చరిక సంకేతాలు, ఇది త్వరగా అభివృద్ధి చెందగల ప్రాణాంతక అత్యవసర పరిస్థితి.

 

 

 

 

హెచ్చరిక సంకేతాలు సాధారణంగా మీ జ్వరం తగ్గిన తర్వాత ఒకటి లేదా రెండు రోజులు ప్రారంభమవుతాయి మరియు క్రింది సంకేతాలు మరియు లక్షణాలను కలిగి ఉండవచ్చు.తీవ్రమైన కడుపు నొప్పి,తరచుగా వాంతులు,చిగుళ్ళు లేదా ముక్కు నుండి రక్తస్రావం,మూత్రం, మలం లేదా వాంతిలో రక్తం,చర్మం కింద రక్తస్రావం, ఇది గాయం లాగా ఉండవచ్చు.శ్వాస ఆడకపోవడం (కష్టం లేదా వేగవంతమైన శ్వాస),అలసిపోయాను,చిరాకు లేదా చంచలత్వం.ఇటీవల డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న ప్రాంతాన్ని సందర్శించినట్లయితే. మీకు జ్వరం వచ్చినప్పుడు మరియు పైన పేర్కొన్న హెచ్చరిక లక్షణాలు ఏవైనా ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

 

డెంగ్యూ జ్వరాన్ని నివారించడానికి ఉత్తమ మార్గం సోకిన దోమల నుండి కాటును నివారించడం. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి,ఇంటి లోపల కూడా దోమ తెరలను ఉపయోగించండి.బయట ఉన్నప్పుడు, పొడవాటి చేతుల చొక్కా మరియు పొడవాటి ప్యాంటును సాక్స్‌లో ఉంచి ధరించాలి.అందుబాటులో ఉంటే, ఇంట్లో ఎయిర్ కండిషనింగ్ ఉపయోగించాలి.విండో మరియు డోర్ స్క్రీన్‌లు సురక్షితంగా మరియు రంధ్రాలు లేకుండా ఉన్నాయని నిర్ధారించుకోవాలి.నిద్రపోయే ప్రదేశంలో స్క్రీన్ లేదా ఎయిర్ కండిషన్ చేయకపోతే, దోమతెరను ఉపయోగించాలి. డెంగ్యూ లక్షణాలు ఉంటే, వైద్యుడిని సంప్రదించాలి.

 

 

 

దోమల జనాభాను తగ్గించడానికి, దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను వదిలించుకోండి. బహిరంగ పక్షి స్నానాలు మరియు పెంపుడు జంతువుల నీటి వంటలలో నీటిని క్రమం తప్పకుండా మార్చండి, బకెట్ల నుండి నిలిచిపోయిన నీటిని ఖాళీ చేయాలి. దోమలు రాకుండా ఫాగింగ్ చేయాలి. వర్షాకాలంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలి. డెంగ్యూ పూర్తి నియంత్రణలో ఉండేలా చూసుకోవాలని ప్రజలు,ప్రజా సంఘాలు కోరుతున్నాయి.

’’మునిసిపల్‌ శాఖలో ‘‘ లో ‘‘అవినీతి జలగలు’’ టౌన్‌ ప్లానింగ్‌ లో ‘‘తిమింగలాలు’’! ఎపిసోడ్‌ -1

`కాసుల కక్కుర్తిలో ‘‘టౌన్‌ ప్లానింగ్‌’’ అధికారులు.

`పట్టుబడని బాలకృష్ణ లెందరో..

`ఆదాయానికి మించిన ఆస్తుల దిట్టలు.

`అవినీతి కంపు…అధికారుల పసందు!

`మునిసిపల్‌ శాఖ అంటేనే అవినీతికి తాతలుగా తయారైన అధికారులు.

`టౌన్‌ ప్లానింగ్‌ అంటేనే జనానికి హడల్‌.

`రెసిడెన్షియల్‌ పర్మిషన్‌..కమర్షియల్‌ బిల్డింగ్‌?

`జీ ప్లస్‌ వన్‌ పర్మిషన్‌.. ఆరు ఫ్లోర్లకు నిర్మాణం?

`ఇరుకు సందులు..ఇష్టానుసారం బిల్డింగులు!

`గాలి కూడా దూరనంత సందుల్లో అప్పార్టుమెంట్లు!

`భూమిని గుళ్ల గుళ్ల చేస్తూ బోర్ల మీద బోర్లు.

`నాణ్యత లేని నిర్మాణాలు..పేక మేడల భవంతులు.

`ఫైర్‌ సేఫ్టీ లేకుండానే దొంగ డాక్యుమెంట్లతో నిర్మాణాలు.

`అడుగు తీసి అడుగు వేయలేం.

`రెండు ఆటోలు ఎదురెదురు వస్తే ముందుకు వెళ్ళలేం.

`పదేళ్లలో లక్షల నిర్మాణాలు.

`నిత్యం లక్షలకు లక్షల సంపాదనలు.కోట్ల రూపాయల ఆస్థులు.

`ప్రకృతి విపత్తులొస్తే ఎంత ప్రాణాలు కోల్పోతారో!

`‘‘జిహెచ్‌ఎంసి’’ని చూసి జిల్లాలలో కూడా ఇదే అనుసరిస్తున్నాయి.
వ్రరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం లాంటి నగరపాలికలు కూడా అవినీతి కంపులో కూరుకుపోయాయి.

`ప్రకృతి విరుద్దంగా అధికారుల నిర్ణయాలు.

`‘‘డిల్లీ’’ భూకంపంతో ఒక్కసారిగా ఉలిక్కి పడాల్సి వస్తున్న నగరాలు.

`మున్సిపల్‌ శాఖల అడ్డగోలు అవినీతికి జరిగిన ప్రమాదాలే సాక్ష్యాలు.

`అయినా అధికారులు మారరు.

`ప్రజల ప్రాణాల గురించి క్షణం కూడా ఆలోచించరు.

`పాలకులు పట్టించుకోరు.

`అవినీతి అధికారులు తమ తీరు మార్చుకోరు.

`జిహెచ్‌ఎంసి టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో మరొక ‘‘బాలకృష్ణ’’. ఎపిసోడ్‌ – 2

`పదిలక్షలు ఇస్తే..ఆరు ఫ్లోర్ల వరకు కళ్ళు మూసుకుంట?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

రక్తం మరిగిన పులి, ఎలుకను వేటాడే పిల్లి ఎప్పుడూ ఒకటి కాదు. రెండూ ఆకలి కోసమే అనుకుంటాం. కాని పులి కోపంతో కూడా వేటాడుతుంది. కనిపించిన జంతువునల్నా చంపి తింటుంది. రక్తం మరిగిన పులిలో ఆకలి,కోపం తప్ప విచక్షణ కనిపించదు. సరిగ్గా అవినీతి అలవాటు పడిన కొందరు ఉద్యోగుల తీరు ఇంతకన్నా దారుణంగా వుంటోంది. ఎంత ఆకలైనా గడ్డి తినవు. కాని అవినీతి తిమింగలాలు మాత్రం గడ్డి, గాదం ఏదైనా తింటారు. పుణ్యానికి వస్తున్నాయంటే పినాయిలైనా తాగుతారు. అంత దరిద్రంగా మారిపోయారు. నీతి లేదు, నియమం లేదు. ధర్మాధర్మ విచక్షణ లేదు. కనికరం లేదు. ఉద్యోగం పోతుందన్న బెరుకు లేదు. భయం అసలే లేదు. ఎందుకంటే జీతం కంటే వందల రెట్లు అవినీతి సంపాదన చేతుల నిండా నిత్యం కనిపిస్తుంటే భయం ఎందుకుంటుంది? ఒకప్పుడు ఉద్యోగులంటే సగటు జీతగాళ్లు. నెల నెల వచ్చే జీతంతో బతికే మధ్య తరగతి జీవితాలు అనుకునే వారు. కాని ఇప్పుడు ఉద్యోగం అంటే ఒక కల్పతరువైపోయింది. నిత్య సంపాదనకు నెలవైపోయింది. జేబు నిండడం ఎనాడో మర్చిపోయారు. రోజూ సూట్‌ కేస్‌ నిండితే గాని ఆకలి తీరని జలగలు తయారయ్యారు. నిత్యం ఎంతో మంది పట్టుబడుతూనే వున్నారు. అయినా జంకు లేదు. బొంకడానికి కూడా ఇష్టపడడం లేదు. లంచం తీసుకొని కూడా కుర్చీలో దర్జాగా కూర్చొని ఫోటోలకు ఫోజులిస్తున్నారు. అలాంటి ఉద్యోగులలో రెవిన్యూ, మున్సిపల్‌ శాఖలు అందరికన్నా ముందున్నారు. తెలంగాణ వ్యప్తంగా ఒక్క రోజు జరిగితే అవినీతి అంత ఒక ఎత్తైతే ఒక్క జిహెచ్‌ఎంసిలో జరిగితే అవినీతి అంత ఎత్తుగా సాగుతోంది. ఇంత దుర్మార్గం ఏ రాష్ట్రంలోనూ లేదు. ఇంత విచ్చలవిడి తనం ఎక్కడా కనిపించదు. ఏరాష్ట్రంలోనూ ఇంతటి అవినీతి గలగలున్నట్లు వార్తలు కూడా వుండవు. తెలంగాణలో అధికారుల్లో అవినీతి ఉన్మాదం పెరిగిపోయిందా? అన్నట్లు సాగుతోంది. లంచాలకు బాగా అలవాటు పడ్డారు. జిహెచ్‌ఎంసికి వచ్చే ప్రజలను పీడిరచుకుతింటున్నారు. వారు చెప్పిందే లెక్క. అడిగిందే రొక్కం. అన్నట్లు సాగుతోంది. ఒకప్పుడు లంచమంటే వందలు అనుకునేవారు. ఇప్పుడు వేలు కూడ దాటిపోయింది. లక్షలు,కోట్లు వసూలు చేస్తున్నారు. ఆ మధ్య పట్టుబడిన కీసర ఎమ్మార్వో ఏక కాలంలో తీసుకున్న లంచం ఏకంగా రూ.100 కోట్లు. అది విన్న జనానికి గుండెలు అదిరాయి. అంటే తెలంగాణ వ్యాప్తంగా అవినీతి అనేది ఊడల మర్రిని మించిపోయింది. జిహెచ్‌ఎంసి అధికారులు, ముఖ్యంగా టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అంటే నిత్యం కరెన్సీలతోనే స్నానం అన్నట్లు అవినీతి సాగుతోంది. ఎలాంటి పర్మిషన్‌ కావాలన్నా సరే లక్షలు సమర్పించుకోవాల్సిందే. ఇలా జిహెచ్‌ఎంసిలోని అన్ని సర్కిళ్లలో అవినీతికి అంతు లేకుండాపోతోంది. అడ్డూ అదుపు లేని అవినీతి సంపాదన ఉద్యోగులకు చేరుతోంది. ఓ వైపు సామాన్యులను వేదించుకుతింటున్నారు. అడ్డగోలు నిర్మాణాలు చేసుకునేవారికి అమ్ముడుపోతున్నారు. నగరం ఎలా వుండాలి. ఎలా వుంటే భవిష్యత్తు తరాలకు ఇబ్బందులుండవు. సమాజానికి సమస్యలు ఎదురుకాకుండా వుంటాయన్న సోయి ఏ ఒక్క ఉద్యోగిలోనూ లేకుండాపోతోంది. జిహెచ్‌ఎంసిలో అదికారులు అనుసరిస్తున్న విధానం ప్రజల జీవితాలను ఆగం చేస్తున్నాయని చెప్పకతప్పదు. జిహెచ్‌ఎంసి అంటేనే అవినీతికి తాతలు అనే పేరు సార్ధకం చేసుకుంటున్నారు. ఇక టౌన్‌ ప్లానింగ్‌ అంటేనే జనం జడుసుకుంటున్నారు. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు తలుచుకుంటే ఏదైనా చేయగలరనే దాక వెళ్లిపోతున్నారు. అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్నారు. సక్రమ నిర్మాణదారులను వేదిస్తుంటారు. అక్రమ నిర్మాణదారులు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఎంత చెబితే అంత ముట్టజెబుతారు. అన్నీ వాళ్లే చూసుకుంటారు. అక్రమార్కులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు. బిల్డింగ్‌ మొదలు పెట్టిన నుంచి పూర్తయ్యే వరకు అక్రమ నిర్మాణదారులు ఉద్యోగులను ఇంటి అల్లుడిని చూసుకుంటున్నట్లు చూసుకుంటున్నారు. లంచాలు, విందులు, వినోదాలు అన్నీ అందిస్తున్నారు. కాని సామాన్యులు కనీసం లంచం ఇచ్చుకోలేరు. టౌన్‌ ప్లానింగ్‌ ఉద్యోగులు అడిగినంత సొమ్ము అసలే ఇచ్చుకోలేరు. ఇంకా ఇక్కడ వింతేమిటంటే 60 గజాలు, వంద గజాల స్ధలాలలో సహజంగా జివన్‌ ప్లస్‌ వరకు మాత్రమే అనుమతి వుంటుంది. అంత వరకే నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తారు. కాని అధికారులు అశీస్సులతో నిర్మాణదారులు ఆరు అంతస్ధులు వేసుకున్నా పట్టించుకోరు. అటు వైపు చూడరు. ఎందుకంటే నిర్మాణం చేసుకోపో..అని అభయమిచ్చేదే టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు. అలా ఒకరిని చూసి ఒకరు అదికారులు అడిగింత ముట్టజెప్పి నిర్మాణాలు చేసుకుంటూ పోతున్నారు. ముఖ్యంగా హైటెక్‌సిటీ, …..లలో ఐటి కంపనీలు ఎక్కువ. ఆ ప్రాంతాలలో కొత్తగా వెలిసిన కాలనీలు చూస్తే పద్మవ్యూహమైనా అర్దమౌతుందేమో కాని, ఆ కాలనీలు అర్ధం కావు. అన్ని ఆరు అంతస్ధుల బిల్డింగులే. ఎక్కడ చూసినా ఐటి ఉద్యోగులకు అవసరమైయ్యేలా నిర్మాణం చేసి ఇస్తున్న అద్దె బిల్డింగులే. అరవై, వంద గజాలలో ఆరు అంతస్ధుల నిర్మాణాలు. కనీసం గాలి కూడా దూరనంత సందు కూడా వుండనంత ఇరుగ్గా, పక్కపక్కనే బిల్డింగులు. ఇళ్లముందు రోడ్లు కూడా కనీసం పది ఫీట్లు కూడా వుండవు. రెండు ఆటోలు ఎదురెదురు వచ్చినా ముందుకు వెళ్లలేవు. నలుగురు ఏక కాలంలో నడుచుకుంటూ వెళ్లలేరు. ఆ రోడ్లమీదే కార్లు, బైక్‌లు. ఇలా అంతా చిందరవందర జీవితాలను తలపించేలా కాలనీలుంటాయి. ఇలాంటి నిర్మాణాలన్నీ అక్రమమే. ఏ ఒక్కటి సక్రమం కాదు. ఎందుకంటే 60, 100 గజాల స్ధలాలలో జిప్లస్‌ వన్‌ మాత్రమే నిర్మాణాలు చేసుకోవాలి. ఎట్టిపరిస్ధితుల్లోనూ ఐదారు ప్లోర్లకు అనుమతులు ఇవ్వకూడదు. అదికారులు చాక చక్యంగా నోటి మాట ద్వారా అనుమతులిస్తారు. నిర్మాణాలు పూర్తయిన తర్వాత వాటిని కూల్చివేసేందుకు కూడా వీలుండదు. కనీసం ఆ సందుల్లోకి జేసిబిలు కూడా వెళ్లలేవు. అంటే కూల్చడానికి వీలు లేనంత సందుల్లో నిర్మాణాలు చేపడతారు. 60, 100 గజాలలో ఆరు అంతస్ధులు నిర్మాణం చేసుకునేవారు ఓ పది లక్షల రూపాయలు టౌన్‌ ప్లానింగ్‌ అదికారులు చేతుల్లో పెడితే చాలు. అనుమతులు అర క్షణంలో ఇచ్చేస్తారు. మూడు నాలుగు నెలల్లో నిర్మాణాలు పూర్తి చేస్తారు. ఆరు నెలల్లో బిల్డింగులు అద్దెకిచ్చేస్తారు. ఇంత స్పీడ్‌గా నిర్మాణాలు జరిగిపోతుంటాయి. పక్క పక్కనే వెలసిన ఆరు అంతస్ధుల నిర్మాణాల కోసం విపరీతమైన బోర్లు వేస్తారు. భూమిని గుళ్ల గుళ్ల చేస్తారు. సహజంగా ఓ వంద గజాల స్ధలంలో ఓ నిర్మాణం చేపడితే ఓ పది మంది నివాసం వుండేందుకు ప్రకృతి సహకరిస్తుంది. స్వచ్చమైన గాలి, సరిపడినంత నీరు అందుతుంది. ప్రైగా మున్సిపల్‌ శాఖ ఏర్పాటు చేసే డ్రైనేజీ సిస్టమ్‌ కూడా అంత మేరకే వుంటుంది. కాని నిబంధనలకు విరుద్దంగా కమర్షియల్‌ నిర్మాణాలు చేసి, ఒక్కోబిల్డింగ్‌లో కనీసం వంద నుంచి నూటాయాభై మందికి వుంటున్నారు. ఇలా వేలాది నిర్మాణాలున్నాయి. అందుల్లో లక్షల్లో కిరాయిదారులుంటున్నారు. ఐటి కంపనీలు దగ్గరగా వుండడం వల్ల తప్పని పరిస్ధితుల్లో ఐటి ఉద్యోగులుంటున్నారు. ఐటి ఉద్యోగుల అవసరం గుర్తించిన వాళ్లు అక్రమంగా ఇలాంటి నిర్మాణాలు సాగిస్తున్నారు. ఏదైనా అనుకోని ఉపద్రవం ఎదురైతే ఒక్కరు కూడా బతికి బట్టకట్టే పరిస్ధితి వుండదు. భూకంపం లాంటి విపత్తులొచ్చినా బతికే చాన్సు వుండదు. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే బూడిత తప్ప మరేం మిగలదు. పర్మిషన్లు ఇచ్చే ముందు అదికారులు భవిష్యత్తు గురించి ముందూ వెనక ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు. లక్షలు చేతుల్లో పడుతున్నాయా? లేదా? అన్నదే చూసుకుంటున్నారు. అక్రమ పర్మిషన్లు ఇచ్చుకుంటూ పోతున్నారు. ఏది జరిగినా తప్పించుకునేందుకు జిప్లస్‌ వన్‌ మాత్రమే ఇచ్చామని చెప్పుకునేలా మాటతోనే పర్మిషన్లు ఇచ్చుకుంటూపోతున్నారు. ఎందుకంటే అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి అక్రమ నిర్మాణం జరిగే అవకాశమే లేదు. సామాన్యులు కాంపౌడ్‌వాల్‌ను ఒక ఇంచ్‌ ముందుకు తెస్తేనే కూల్చేస్తారు. అలాంటిది ఆరు ఫ్లోర్లకు అనుమతులిస్తున్నారు. అలాంటి అక్రమ నిర్మాణాలు, జిహెచ్‌ఎంసి సర్కిళ్ల అధికారులు అవినీతిపై మీ నేటిధాత్రిలో వరుస కథనాలు త్వరలో…

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) స్థానం లో పత్తి కొనుగోలు కు పీడీపీఎస్ విధానం అమలు విరమించుకోవాలి.

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) స్థానం లో పత్తి కొనుగోలు కు పీడీపీఎస్ విధానం అమలు విరమించుకోవాలి.

తెలంగాణ రైతు సంఘం డిమాండ్.

కారేపల్లి: నేటి ధాత్రి

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పత్తి మద్దతు ధర కు తెలంగాణ రాష్ట్రం లో పత్తిని కొనుగోలు చేస్తున్న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ని ఆ బాధ్యతల నుంచి తప్పించే ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలకాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. గురువారం కారేపల్లి మండలం లో పాట్టిమీద గుంపు బాజ్జుమల్లాయిగూడెం లలో పత్తి పంట పరిశీలన చేశారు. రైతుల నుంచి కౌలు రేట్లు వివిధ రకాల పంటల సాగు పరిస్థితి మిర్చి సాగు విస్తీర్ణం పై రైతుల నుంచి వివరాలు స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మద్దతు ధర కు పత్తి కొనుగోలు చేయకుండా ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీం ( పీడీపీఎస్) ను రాష్ట్రం లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది అని తెలంగాణ రాష్ట్రం లో అత్యధికంగా పత్తి పండించే ఆదిలాబాద్ జిల్లాలో ఈ వ్యవసాయ సీజన్ లో అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది అని పత్తి రైతులకు తీవ్రంగా నష్టం వాటిలే అవకాశం ఉందని రాంబాబు అన్నారు.
ఎంఎస్ పి విధానం లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల నుంచి పంటలు కొనుగోలు చేస్తుంది పీడీపీఎస్ విధానం వల్ల రైతు తన పత్తి పంటను బహిరంగ మార్కెట్లో విక్రయించిన తర్వాత మార్కెట్ ధర కన్నా ఎం.ఎస్.పి ఎంత తక్కువ ఉంటే ఆ మొత్తాన్ని నేరుగా డిబిటి (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) పద్ధతుల్లో రైతు ఖాతాల్లో జమ చేస్తారు అంటే ప్రభుత్వం రైతు దగ్గర పంటను కొనదు కానీ మార్కెట్లో రైతు నష్టపోయిన మొత్తాన్ని సర్దుబాటు చేస్తుందని నూతన పథకాన్ని ప్రవేశపెట్టారు గత వానాకాలం సీజన్లో 44 లక్షల ఎకరాల్లో 20 లక్షల మంది పైగా రైతులు పత్తి పంట సాగు చశారు ఇంత మంది రైతులకు బహిరంగ మార్కెట్లో విక్రయించిన తర్వాత వ్యత్యాసం ధర నగదు బదిలీ చేయడం సాధ్యం కాదు మధ్యప్రదేశ్ లో 2016-17 లోనే 8 ప్రధాన పంటలకు పీడీపీఎస్ విధానాన్ని అమలు చేసి రైతులకు వ్యత్యాసాలు నిర్ధారించడంలో లోపాలు వ్యత్యాసపు ధర చెల్లింపులు ఆలస్యం మార్కెట్ ధరలు తేడాలు నిజమైన రైతులకు కాకుండా దళారులకు చెల్లింపులు వంటివి చోటు చేసుకోవటం తో మరుసటి సంవత్సరమై ఆ పథకాన్ని నిలిపివేశారని ఇప్పుడు తెలంగాణలో పీడీపీఎస్ ప్రయోగించడం పత్తి రైతులను నాశనం చేస్తుందని వెంటనే ఈప ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మేరుగు సత్యనారాయణ తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దుగ్గి కృష్ణ సిఐటియు జిల్లా నాయకులు కుందనపల్లి నరేంద్ర రైతు సంఘం మండల కార్యదర్శి వజ్జా రామారావు బాదావత్ శ్రీనివాసరావు మన్నెం బ్రహ్మయ్య వడ్లమూడి మధు యనమద్ది రామకృష్ణ మహిళా రైతులు పాల్గొన్నారు.

ఈనెల 11న డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమం

ఈనెల 11న డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమం

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి డిపో పరిధిలోని వివిధ మండలాల ప్రజలకు వ్యాపారస్థులకు, ఉద్యోగులకు విద్యార్థులకు విజ్ఞప్తి చేయునది ఏమనగా ఈనెల 11న ఉ.11.00 గం. ల నుండి 12.00 గం. ల వరకు “డయల్ యువర్ డిపో మేనేజర్” కార్యక్రమము నిర్వహించబడును జరుగుతుంది
కావున ప్రజలు, వ్యాపారస్తులు, ఉద్యోగులు విద్యార్థులు సెల్: 9959226707 కు డయల్ చేసి ఆర్టీసీ అభివృద్ధికి అమూల్యమైన సలహాలు, సూచనలు చేయగలరు అని డిపో మేనేజర్ ఇందు తెలిపారు

డాక్టరేట్ పొందిన కెటిపిపి ఉద్యోగి నిరంజన్ రెడ్డి

డాక్టరేట్ పొందిన కెటిపిపి ఉద్యోగి నిరంజన్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ గా పనిచేస్తున్న పల్లెర్ల నిరంజన్ రెడ్డి డాక్టరేట్ ఆఫ్ లిటరేచర్ 2025 సంవత్సరమునకు గాను గ్లోబల్ హుమెన్ పీస్ యూనివర్సిటీ యూనివర్సిటీ యు ఎస్ ఏ ప్రకటించింది. అనివార్య కారణాల వల్ల 28/06/2025 రోజున చెన్నయ్ స్నాతకోత్సవంలో పాల్గొన లేకపోయారు ఈ డాక్టరేట్ ని గ్లోబల్ హుమెన్ పీస్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కందుకూరి విజయ్ మోహన్, సేవా రత్న జాతీయ అవార్డు గ్రహీత యునివర్సిటీ సభ్యులు బొమ్మకంటి రాజేందర్ ల ఆధ్వర్యంలో ఈ రోజు హానరరి డాక్టరేట్ పట్టా ప్రదానోత్సవం కెటిపిపి చీఫ్ ఇంజనీర్ చిట్టాప్రగడ ప్రకాష్ చేతుల మీదుగా జెన్ కో కాలనీలో నిరంజన్ రెడ్డి కి అందజేశారు
ఈ సంధర్భంగా గ్లోబల్ హుమెన్ పీస్ యూనివర్సిటీ సంఘ సేవకులకు, రచయితలకు, కవులకు మరియు అత్యంత ప్రతిభావంతులైన వారిని గుర్తించి ఈ గౌరవ డాక్టరేట్ అవార్డును అందజేయడం అందులో క్యాతపల్లి గ్రామ వాస్తవులైన పల్లెర్ల పుల్లారెడ్డి పూలమ్మ దంపతుల కనిష్ట కుమారుడైన పల్లెర్ల నిరంజన్ రెడ్డి మా కెటిపిపి ఇంజనీర్ కి అంతర్జాతీయ స్థాయి స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్ పట్టా పొందడం గర్వించదగ్గ విషయం అని మీ అత్యుత్తమ కృషి మరియు విజయాలకు గుర్తింపుగా, ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ ఆఫ్ లిటరేచర్ అవార్డును ప్రదానం చేయడానికి మేము సంతోషిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ రామ ముత్యాల రావు, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ లు కాటం రవి, మాకుల సంతోష్, జెరిపోతుల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

‘ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి’

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహిర్ మండలంలో వన మహోత్సవం కార్యక్రమంలో నాయబ్ తహశీల్దార్ వరప్రసాద్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడాలని, మొక్కల పెంపకంతో మానవజాతి మనుగడ సాధ్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

బీఎస్ఎన్ఎల్ ప్యానెల్ అడ్వకేట్ గా మరో సంవత్సరం పాటు పోరెండ్ల నరసింహా రాములు  కొనసాగింపు:-

బీఎస్ఎన్ఎల్ ప్యానెల్ అడ్వకేట్ గా మరో సంవత్సరం పాటు పోరెండ్ల నరసింహా రాములు  కొనసాగింపు:-

హన్మకొండ/వరంగల్, నేటిధాత్రి (లీగల్):-

ఉమ్మడి వరంగల్ జిల్లా కోర్టులో పొరెండ్ల నరసింహ రాములు ను భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బి. ఎస్. ఎన్.ఎల్) తమ ప్యానెల్ అడ్వకేట్ గా మరో సంవత్సర కాలం పొడిగించింది. ఆ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ లీగల్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ వారు  తేదీ: 25- 06- 2025 ఉత్తర్వులు జారీ చేసారు. ఇక నుండి నరసింహ రాములు గారు బి.ఎస్.ఎన్.ఎల్ సంస్థ కు సంబంధించిన కేసుల ను వరంగల్ జిల్లా కోర్టు మరియు సబ్ కోర్ట్స్ మరియు జిల్లా వినియోదారుల ఫోరంలలో బి.ఎస్.ఎన్.ఎల్ తరుపున వాదించనున్నారు. సీనియర్ న్యాయవాది అయిన పొరేండ్ల నరసింహ రాములును బి.ఎస్.ఎన్.ఎల్ సంస్థ తమ ప్యానెల్ న్యాయవాది గా మరో సంవత్సరం పాటు కొనసాగింపుగా ఉత్తర్వులు జారీ చెయ్యడం పట్ల తోటి న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు మరియు పలువురు న్యాయవాదులు నరసింహ రాములు గారికి అభినందనలు తెలిపారు.

శంకర్‌పల్లిలో “విజేత సూపర్ మార్కెట్” ప్రారంభం

శంకర్‌పల్లిలో “విజేత సూపర్ మార్కెట్” ప్రారంభం

చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం

 

“Vijetha Supermarket” launched in Shankarpally

శంకర్‌పల్లి, నేటిధాత్రి :
“విజేత సూపర్ మార్కెట్ ” తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు అంత ప్రఖ్యాతి పొందింది. అలాంటిది మన శంకర్‌పల్లి పట్టణంలోని వాణిజ్య రంగానికి కొత్త ఒరవడి తీసుకువచ్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన “విజేత సూపర్ మార్కెట్” గురువారం చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.

ప్రారంభోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ “ప్రజలకు నిత్యవసర వస్తువులు, ఆహార పదార్థాలు, ఇతర వినియోగ సామగ్రి నాణ్యతతోపాటు సరసమైన ధరలకూ అందుబాటులో ఉండేలా ఈ సూపర్ మార్కెట్ ఏర్పాటు చేయడం అభినందనీయం,” అని పేర్కొన్నారు.
స్థానిక యువత ఉద్యోగ అవకాశాలు పొందడంలో ఈ మార్కెట్ దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
అలాగే
విజేత సూపర్ మార్కెట్ యజమానులు మాట్లాడుతూ,
“ప్రజలకు అత్యుత్తమ సేవలందించాలన్నదే మా ముఖ్య లక్ష్యం. నిత్యం తక్కువ ధరలకు అధిక నాణ్యత కలిగిన వస్తువులను అందుబాటులో ఉంచుతాము. కస్టమర్ల విశ్వాసమే మా శక్తి” అని తెలిపారు.

సూపర్ మార్కెట్‌లో నిత్యవసర వస్తువులు, కూరగాయలు, పండ్లు, ప్యాకెజ్డ్ ఫుడ్, గృహోపయోగ వస్తువులు, మరియు ఇతర డైలీ నీడ్ ఉత్పత్తులు సమృద్ధిగా లభించనున్నాయి అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు, వ్యాపారవేత్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

పట్టణ అభివృద్ధిలో భాగంగా శంకర్‌పల్లిలో ఇటువంటి సదుపాయాలు ఏర్పడటం సంతోషకరమని స్థానికులు పేర్కొన్నారు.

ఇందిర మహిళ శక్తి సంబరాలలో కళాజాత బృందాల ప్రచారాలు

ఇందిర మహిళ శక్తి సంబరాలలో కళాజాత బృందాల ప్రచారాలు

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండల కేంద్రం లో గురువారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి సంబరాలల్లో భాగంగా ప్రభుత్వ కళాజాత బృందాలు ప్రచారాన్ని చేపట్టారు. ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇస్తున్న వడ్డీలేని రుణాలతోపాటు మహిళలకు ప్రమాద బీమా, కుట్టు మిషన్ కేంద్రాలు, సోలార్ ప్లాంట్స్, పెట్రోల్ పంపులు ,ఆర్టీసీ బస్సులు ,మార్కెట్ సెంటర్లు ,15 సంవత్సరాలు పైబడిన వారితోపాటు వృద్ధులను, వికలాంగులను మహిళా సంఘాలలో చేరచుటకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్న తరుణంలో వారిని సంఘ సభ్యులుగా చేర్పించడం పై మహిళా శక్తి ప్రత్యేక కృషి చేస్తుందని కళాజాత ప్రచార బృందాలు ప్రజలకు అవగాహన కల్పించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి ప్రభుత్వ కళాజాత ప్రచార బృందాలు మండల కేంద్రం ఓదెలలో ఇందిరా మహిళ. శక్తి సంబరాలు పై ప్రజలకు పూర్తిస్థాయిలో ఆహ్వాన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏపిఏం లతా మంగేశ్వరి తో పాటు సీసీలు దొడ్డ విజయ, మారెళ్ళ శ్రీనివాస్, మండల సమైక్య కార్యదర్శి అనూష విఓఏలు అనిత, రమ,ప్రణీత, పద్మ, లావణ్య లతోపాటు మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

గురు పౌర్ణమి సందర్భంగా సత్యసాయి మందిరంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు

గురు పౌర్ణమి సందర్భంగా సత్యసాయి మందిరంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు

వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి పట్టణంలో గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్య సాయి మందిరంలో షిరిడి సాయి సత్య సాయి బాబాకు అభిషేకాలు ప్రత్యేక పూజలు భజనలు ఘనంగా నిర్వహించామని శ్రీ సత్య సాయి సేవ సంస్థ కన్వీనర్ రమేష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు అనంతరం భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశామని ఆయన తెలిపారు

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే ఏకైక సంఘం పీఆర్టీయు

*ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే ఏకైక సంఘం పీఆర్టీయు*

 

నడికూడ,నేటిధాత్రి:


ఉపాధ్యాయుల యొక్క సమస్యలు పరిష్కరించి వారికి ఎల్లప్పుడూ అండగా ఉండే ఏకైక సంఘం పీఆర్టీయూ టీఎస్ మాత్రమే అని హనుమకొండ జిల్లా పీఆర్టీయు ప్రధాన కార్యదర్శి పలిత శ్రీహరి అన్నారు. గురువారం రోజు నడికూడ మండల శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి పలిత శ్రీహరి చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉపాధ్యాయ లోకానికి ఎన్నో సౌకర్యాలు కల్పించిన సంఘం పీఆర్టీయూ మాత్రమే అని, అతి త్వరలోనే జిపిఎఫ్ పెండింగ్ బిల్లులు అన్నీ చెల్లించే దిశగా సంఘం కృషి చేస్తుందని,మిగతా పెండింగ్ బిల్లులు అన్నీ కూడా సాధ్యమైన తొందరగా క్లియర్ చేయించే ప్రయత్నం చేస్తామని,ఉపాధ్యాయ బదిలీలు,పదోన్నతులు ఇప్పించిన సంవత్సరంలోనే మళ్ళీ త్వరలోనే పదోన్నతులు కల్పించే దిశగా పిఆర్టియు టి ఎస్ సంఘం కృషి చేస్తుందని,ఇంకా ఎన్నో సమస్యలు త్వరలోనే పరిష్కరించే దిశగా సంఘం కృషి చేస్తుందని అన్నారు. మండలంలోని కంఠాత్మకూర్, కౌకొండ,నడికూడ,వరికోల్, రాయపర్తి, నార్లాపూర్, చర్లపల్లి,పులిగిల్ల ఉన్నత పాఠశాలలు తిరిగి సభ్యత్వం నమోదు చేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు అచ్చ సుదర్శన్ ప్రధాన కార్యదర్శి కట్టుకోజ్వాల సతీష్,రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మోడం రాజేందర్ బాబు,నన్నేసాహెబ్,శ్రీధర్ రెడ్డి, బురుగు శంకర్ జిల్లా బాధ్యులు శరత్ గౌడ్,నగేష్ పాల్గొన్నారు.

మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది

 

The state government will stand by the fishermen.

*చేపల పెంపకంలో మత్స్యకారులు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి*

*రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్*

*సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి )*

The state government will stand by the fishermen.

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు మత్స్యకారుల రైతు వేదికలో నేషనల్ అగ్రో ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ మత్స్య రైతుల దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఉత్తమ ప్రతిభ కనబరిచిన సొసైటీ సభ్యులకు ప్రశంసా పత్రాలు అందజేసి సన్మానించారు..అనంతరం చేపల స్టాల్స్ ను సందర్శించారు. వారు మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మత్స్య సంపద పెంపొందించడానికి తన వంతు ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు..మొన్నటి రోజూ మంత్రీ శ్రీహరి కరీంనగర్ వచిన్నపడు వారితో చేపల పెంపకం,మత్స్యకారుల గురించి మాట్లాడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని చెరువుల్లోకి సకాలంలో చేప పిల్లలు పంపిణీ చేస్తుందనీ తెలిపారు.. బలహీన వర్గాల ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందజేస్తుందని అన్నారు.గతంలో మిడ్ మానేరులో చేపలను వదలడం జరిగిందని, మన ప్రాంతంలో మల్కపేట్ రిజర్వాయర్ కుడా అందుబాటులోకి వచ్చిందని వాటిలో కూడ చేపల పెంపకం ఏర్పాట్లు విధానం పరిశీలించాలన్నారు. గతంలో తెగిపోయిన చెరువులు మరమ్మత్తులు పూర్తి చేశామని అన్నారు.. ఇంకా ఎక్కడ చెరువులు మరమ్మత్తులు ఉంటే చేపడతానని తెలిపారు… ఎమ్మెల్యేగా గెలిచిన 3 నెలల్లోనే కథాలపూర్ మండలం లోని తెగిపోయిన చెరువులను మరమ్మత్తులు చేసినట్లు తెలిపారు. మల్కపేట రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చెసి ఎల్లారెడ్డిపేట వరకు రైతులకు సాగు నీరు అందించమని తెలిపారు.గతంలో మిడ్ మానేరు డ్యాంలో కేజీ కల్చర్ విధానంలో చేపల పెంపకం కోసం ముంపు గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించమని కేజీ కల్చర్ చేపల పెంపకం చేపట్టడం కోసం ముందుకు రావాలన్నారు.చేపల పెంపకంలో అధునాతన సాంకేతిను అందిపుచ్చు కోవాలన్నారు… కేజీ కల్చర్ విధానంలో చేపల పెంపకానికి ముందుకు వస్తె రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు అందజేస్తామని తెలిపారు..
దేశంలో మత్స్య సంపద పెరగాలని చేపలు ఆరోగ్యానికి మంచిదనీ ,ప్రభుత్వం మత్స్యకారులకు అనేక రకాలుగా ప్రోత్సాహకాలు అందజేస్తుందని తెలిపారు.గత ప్రభుత్వం పెట్టిన ఒక్క పథకాన్ని కూడా రద్దు చేయకుండా వాటిని కొనసాగిస్తూ నూతన పథకాలను అమలు చేస్తున్నామన్నారు..రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు మహిళ తల్లులకు ఉచిత బస్సు ప్రయాణం,500 కు సిలిండర్,10 లక్షల అరోగ్య శ్రీ,పది సంవత్సరాలుగా పేద ప్రజలు ఎదురు చూస్తున్నా ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డులను మంజూరు చేసినట్లు తెలిపారు.. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప, జిల్లా ఫిషరీస్ చైర్మన్ చొప్పరి రామచంద్రం, డి ఏ వో అఫ్జల్ బేగం, మల్లికార్జున్, పి కిషోర్, నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ సునీల్ కుమార్,, అడ్వైజర్ విద్యాసాగర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు

పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు

సారు.. మాకు న్యాయం చేయండి

భూపాలపల్లి నేటిధాత్రి

గత కొద్ది రోజులుగా ఇంటి పక్కన వారు తీవ్ర ఇబ్బంది పెడుతున్నారని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని, అధికారులు మాకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు జరుపుల గంగ- కిషన్ లు కోరారు. జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తాము గత 20 సంవత్సరాల క్రితం కారల్ మర్క్స్ కాలనీలో ఇల్లు కొనుగోలు చేసుకుని ఇక్కడే నివాసం వుంటున్నామని, మా ఇంటి పక్కన వున్న వ్యక్తి మా ఇంటి కి, పక్క ఇంటికి మధ్యలో వున్న మాకు చెందిన ఖాళీ స్థలంలో ఉన్న మిషన్ భగీరథ పైపులను కాల్చరన్నారు. మా స్థలంలో వున్న మా మామిడి చెట్టును వారే నరకడంతో వాళ్ళ ఇంటి పైనే పడి రేకుల పై పడటంతో మమ్మల్ని కారకులుగా చేస్తూ నానా ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఇప్పటికే వారి పై పలుమార్లు స్టేషన్ లో పిర్యాదు చేశామన్నారు. కానీ ఇంకా తరచూ మమ్మల్ని భూమి గెట్టు విషయమై వేధింపులకు గురి చేస్తున్నారని, ఈ విషయమై 100కు ఫిర్యాదు చేశామని, స్థానిక పోలిస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసినా, కానీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. వారి నుండి మా కుటుంబానికి ప్రాణహాని ఉందని అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు. కాగా ఈ విషయమై స్థానిక ఎస్సైని ఆంధ్రప్రభ ఫోన్లో వివరణ కోరగా నేడు విజిట్ చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

చంద్రగిరిలో శరవేగంగా క్రీడా వికాస్ కేంద్రం (ఇండోర్ స్టేడియం) పనులు

*చంద్రగిరిలో శరవేగంగా క్రీడా వికాస్ కేంద్రం (ఇండోర్ స్టేడియం) పనులు…

*హర్షం వ్యక్తం చేస్తున్న చంద్రగిరి పట్టణ ప్రజలు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు..

*అంకితభావంతో కృషి చేస్తున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కి కృతజ్ఞతలు తెలుపుకున్న ప్రజలు…

చంద్రగిరి(నేటి ధాత్రి) జూలై 10:

పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.
1.53 కోట్లతో మంజూరైన క్రీడా వికాస్ కేంద్రం (ఇండోర్ స్టేడియం) పునఃనిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనుల పురోగతి పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఈ క్రీడా వికాస్ కేంద్రం నిర్మాణం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఊపందుకుందిభూమిపూజతో పనులు ప్రారంభం కాగా ప్రస్తుతం నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. అధునాతన ఇండోర్ స్టేడియం అందుబాటులోకి వస్తే యువ క్రీడాకారులకు ఎంతో మేలు జరుగుతుందని, చంద్రగిరి క్రీడా రంగంలో మరింత ముందుకు దూసుకెళ్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పట్టణంలోని భగత్ సింగ్ నగర్ లో గల ప్రాథమిక పాఠశాలలో యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ దాతల సహకారం తో 56మంది విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు తవక్కల్ విధ్యాసంస్థల అధినేత, సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్ ,గాండ్ల సమ్మన్న మాజీ వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి ల చేతుల మీదుగా స్కూల్ బ్యాగ్ లు పంపిణీ చేశారు.ఈ సంధర్భంగా సీనియర్ నాయకులు మాట్లాడుతూ గురుపౌర్ణమి సంధర్భంగా యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ మంచి కార్యక్రమాన్ని చేయడం హార్షనీయమైన గత 8సంవత్సరాల నుంచి రామకృష్ణాపూర్ పట్టణంలో యువత జనం సభ్యులు సేవలు చేస్తున్నారనీ భవిష్యత్ లో కూడా ఇంకా ఎక్కువ మంది సేవలు చేయాలని సంస్థ సభ్యులనీ అభినందించారు … యువత అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేష్ మాట్లాడుతూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ కు సహాయం చేస్తున్న దాతలందరికీ ముఖ్య అతిథులకు కృతజ్ఞతలు చెప్పారు.. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు రమాదేవి శోభ నాయకులు గూడ సత్తన్న,కోక్కుల సతీష్ సంగ రవి యాదవ్ భాస్కర్ యువత ఉపాధ్యక్షుడు వెరైటీ తిరుపతి , కార్యదర్శి కరుణాకర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

విద్యుత్ ప్రమాదంలో గాయపడిన జన్నే అంజి కుటుంబానికి ఆర్థిక చేయూత,

విద్యుత్ ప్రమాదంలో గాయపడిన జన్నే అంజి కుటుంబానికి ఆర్థిక చేయూత,
– 5000 రూపాయలను అందించిన జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఐలు మారుతి.
నేటి ధాత్రి- మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి గ్రామానికి చెందిన జన్నె అంజి అనే విద్యుత్తు తాత్కాలిక ఉద్యోగి ఈనెల మూడవ తేదీన ప్రమాదవశాత్తు విద్యుత్తు పోలు నుండి విద్యుత్ షాక్ తగలడం వలన కిందపడి తీవ్ర గాయాలపాలు అయ్యాడు ప్రస్తుతం హైదరాబాదు యశోద హాస్పిటల్ లో మెరుగైన వైద్యం పొందుతున్నాడు,

గాయపడిన జన్నె అంజి నిరుపేద దళిత కుటుంబానికి చెందిన వాడు కావడంతో ఆ కుటుంబం దాతల సహాయం కోసం ఎదురుచూస్తోంది జన్నె అంజి తండ్రి సైతం మంచాన అనారోగ్యంతో లేవలేని స్థితిలో ఉండటంతో ఆ కుటుంబం దీనస్థితిలో ఉంది మొట్లపల్లి సబ్స్టేషన్లో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్న జన్నె అంజి కి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం లేకపోవడంతో.. అంజికి మెరుగైన వైద్యం అందని ద్రాక్షలా తయారయింది. అంజి దయనీయ పరిస్థితి గురించి వివిధ పత్రికలలో కథనాలు రావడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ అధినేత ఐలు మారుతి స్పందించి బాధిత కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించాడు అంతేకాకుండా భవిష్యత్తులో తన వంతు సహాయంగా చేతనందిస్తానని భరోసా ముట్లపల్లి తాజా మాజీ సర్పంచ్ నరహరి పద్మా వెంకటరెడ్డి 5000 రూపాయలను అందించగా బజ్జూరి వేణుగోపాల్ వెయ్యి రూపాయలు బజ్జూరి వీరన్న పెడిసిల్ల 1000 రూపాయలు గూడూరి రఘుపతి రెడ్డి 1000 రూపాయలు శ్రీ పల్లి రాజేష్ 2000 రూపాయలు దర్శనాల సురేష్ 2000 రూపాయలు టేకుమట్ల లైన్మెన్ రఘు వెయ్యి ఇలా చాలామంది దాతలు స్పందించి బాధిత కుటుంబానికి అందించి తమ ఔదార్యాన్ని చాటారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఆయిలు మారుతి. ఆలయ కమిటీ చైర్మన్ గూడూరు రఘుపతి రెడ్డి బజ్జూరి వేణుగోపాల్ బజ్జూరి వీరన్న సీనియర్ జర్నలిస్టు రాళ్ల బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు,

కోడిపందాల స్థావరంపై పోలీసుల మెరుపు దాడి

కోడిపందాల స్థావరంపై పోలీసుల మెరుపు దాడి

జైపూర్ ఎస్సై జాడి శ్రీధర్

జైపూర్,నేటి ధాత్రి:

కోడి పందాల స్థావరం పై జైపూర్ పోలీసులు బుధవారం మెరుపు దాడి నిర్వహించినట్లు తెలిపారు.జైపూర్ మండలం దుబ్బ పల్లి గ్రామ శివారులో కొందరు వ్యక్తులు కోడిపందాలు నిర్వహిస్తున్నారని నమ్మదగిన సమాచారం రావడంతో జైపూర్ ఎస్సై శ్రీధర్ తన సిబ్బందితో కలిసి కోడిపందాల స్థావరంపై దాడి చేసి అక్కడ ఉన్నవారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.వివరాల్లోకి వెళితే సిసిసి నస్పూర్ కు చెందిన గడ్డం సతీష్,లక్షేటి పేట కోమ్మగూడెంకు చెందిన లశెట్టి సురేష్,శ్రీరాంపూర్ తీగల పహాడ్ కు చెందిన చెట్టుకురి రాజేష్ అదుపులోకి తీసుకొని విచారించగా అక్కడినుండి పోలీసులను చూసి కొంతమంది పారిపోయినట్లు వారు తెలిపారు.అక్కడి నుండి పారిపోయిన వ్యక్తులు వివరాలు ఇందారం గ్రామానికి చెందిన కూరగాయల శ్రీకాంత్,యతి రాజు,వంశీ,మహేష్,వైద్య గణేష్ టేకుమట్ల గ్రామానికి చెందిన గోనె శరత్,గోదావరిఖనికి చెందిన పాకి సందీప్,నస్పూర్ కు చెందిన రంగు సాయి, అరుణక్కనగర్ శ్రీరాంపూర్ చెందిన ఉదయ్ పారిపోయినట్లు పేర్కొన్నారు. పట్టుబడిన నేరస్తుల వద్ద నుండి ఒక కోడి,31 కోడి కత్తులు,3840 రూపాయల నగదు,మూడు సెల్ ఫోన్లు,ఏడు వాహనాలు స్వాధీనపరచుకొని జైపూర్ పోలీస్ స్టేషన్ కి తరలించి వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు.

నర్సింగ్ కళాశాల విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోమనడం విద్యార్థుల హక్కులను కాల రాయడమే

*నర్సింగ్ కళాశాల విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోమనడం విద్యార్థుల హక్కులను కాల రాయడమే*

*బి.ఆర్.ఎస్ విద్యార్థి విభాగం కార్యదర్శి సబ్బని హరీష్*

*సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)*
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఈరోజు ప్రెస్ క్లబ్ లో బి.ఆర్.ఎస్ విద్యార్థి విభాగం సబ్బని హరీష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం లో నర్సింగ్ కాలేజీలో చాలా రోజులుగా ప్రభుత్వం స్టైఫండ్ రిలీజ్ చేయకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది చాలాదన్నట్టు కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థులందరూ మెస్ బిల్లు కడితేనే హాస్టల్ లో ఉండండి లేకపోతే బయటకు వెళ్లిపోండి అని బెదిరించడం జరుగుతుంది తెలంగాణ నలుమూలల నుండి పేద బలహీన దళిత వర్గాల చెందినటువంటి అమ్మాయిలు ఈ నర్సింగ్ కోర్సులు చేస్తుంటే ప్రభుత్వం స్టైఫండ్ కూడా రిలీజ్ చేయకుండా వాళ్లను చదువుకు దూరం చేసే కార్యక్రమాలు చేస్తుంది. దీనివల్ల వాళ్లు ఇంట్లో చెప్పుకోలేక కాలేజీలో ఉండలేక తీవ్రమైన నరకయాతన అనుభవిస్తున్నారు

బి.ఆర్.ఎస్ ప్రభుత్వం హయాంలో కెసిఆర్ పేద విద్యార్థులకు వైద్య విద్య చేరువలో ఉండాలని జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ మంజూరు చేసి పక్కా భవనాలు నిర్మించి సిబ్బందిని రిక్రూట్ చేసి అప్పటివరకు ఉన్న స్టైఫండ్ ను రెట్టింపు చేసి విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం తిండి పెట్టలేని పరిస్థితికి తీసుకొచ్చాయి.ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటినుండి విద్యా వ్యవస్థ పై సవతి తల్లి ప్రేమను చూపిస్తుంది.
ఇది మాత్రమే కాకుండా ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ విద్యాసంస్థలకు పెద్దపీట వేస్తూ పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్రకు తెర తీశారు.స్వయానా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి విద్యార్థులను గాలికి వదిలేసి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు గురుకులాల్లో విషాహారం, పాము కాట్లు విద్యార్థుల ఆత్మహత్యలు, ఇప్పుడు నర్సింగ్ కళాశాల విద్యార్థుల ను హాస్టల్ నుండి గెంటి వేతలు ఇటువంటి సంఘటనలు జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంది
ఈ నర్సింగ్ కళాశాల విద్యార్థుల హాస్టల్లోనే ఉండి చదువుకునే వాళ్ళ హక్కును ఈ ప్రభుత్వం కాలరాస్తుంటే మేము చూస్తూ ఊరుకోం వెంటనే వాళ్ళ స్టైఫండ్ విడుదల చేయాలి.
లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ కళాశాల విద్యార్థులు అందరితో కలిసి ఆయా కాలేజీల ముందు నిరసన కార్యక్రమాలు చేస్తామని
బిఆర్ఎస్వి పక్షాన హెచ్చరిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో మెట్టల సాయి దీపక్ రాచమల్ల మోహన్ కనుకుంట్ల వెంకటరమణ రాచమల్లు రామ్, భరత్,రాము,చిరంజీవి, నరేష్, సోఫీయాన్, మణి దిప్ సాయి తదితరులు పాల్గొన్నారు

మనిషి జీవితాన్ని మార్చే శక్తి చదువుకు వుంది

*మనిషి జీవితాన్ని మార్చే శక్తి చదువుకు వుంది…

*కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు..

*విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఉన్నత శిఖరాలకు ప్రభుత్వ విద్య..

*అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చెస్ క్రీడా పై శిక్షణ ఏర్పాటు చేస్తాం..

*తుడా ఛైర్మెన్ డాలర్స్ దివాకర్ రెడ్డి..

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 10:

విద్యార్థులు పట్టుదల, కృషితో చదివితే జీవితంలో ఉన్న స్థాయికి చేరుకోగలరని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. గురువారం తిరుపతి కొర్లగుంట లోని శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ నందు మెగా పేరెంట్స్ మీటింగ్ ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారుఈ సందర్భంగా ఆయన స్కూల్ ఆవరణలో మొక్కలు నాటి నీరు పొశారు. అనంతరం విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. నేడు కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులతో పాటు విద్యా ప్రమాణాలు మెండుగా ఉన్నాయని కొనియాడారు. యువ నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో డొక్కా సీతమ్మ నాణ్యమైన మధ్యాహ్న భోజనం, ఉచితంగా పుస్తకాలు, ఉచితంగా యూనిఫామ్, షూ లు అందిస్తున్నారని, అదేవిధంగా ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కింద 13000 జమ చేయడం జరిగిందని తెలియజేశారుదేశంలో మరే ఇతర రాష్ట్రంలో కూడా ఈ విధంగా ప్రభుత్వ విద్యను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాలు లేవని చెప్పారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ స్థాయికి వచ్చానని గుర్తు చేశారు. చదువుతోపాటు ఆటపాటల్లో విద్యార్థులు రాణించాలని సూచించారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు జీవితంలో కష్టాలను ఎదుర్కొనే శక్తి అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. గురువులను ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలకు వెళ్లాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల తెలివితేటలను పెంచేందుకు త్వరలో ప్రతి పాఠశాలలో చెస్ క్రీడ పై శిక్షణ ఏర్పాటు చేస్తామని ఈ విషయాన్ని తాను విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబుకు వివరించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలకు తుడా తోపాటు తన వ్యక్తిగతంగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని పాఠశాల అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులు ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్
మాస్టర్, రవిచంద్రన్, ఇన్ చార్జీ,
హెడ్
మా
స్టర్ రవికుమార్, పాఠశాల చైర్మన్ వాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version