రోహిత్-కోహ్లీకి అరుదైన గౌరవం.. ఆస్ట్రేలియాను మెచ్చుకోవాల్సిందే!
నేటిధాత్రి
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. ఈ ఇద్దరి విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా మంచి నిర్ణయం తీసుకుంది. మరి.. ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఆధునిక క్రికెట్పై చెరగని ముద్ర వేశారు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఆడిన ప్రతి దేశంలోనూ అదరగొట్టారీ స్టార్లు. టీ20, వన్డే, టెస్ట్ అనే తేడాల్లేకుండా బరిలోకి దిగితే చాలు.. పరుగుల వర్షం కురిపించడమే ధ్యేయంగా ఆడుతూ వచ్చారు. అయితే పొట్టి ప్రపంచ కప్-2024 తర్వాత టీ20లకు గుడ్బై చెప్పిన ఈ ద్వయం.. ఇటీవలే టెస్టులకూ రిటైర్మెంట్ ప్రకటించారు. ఇకపై వన్డేల్లో మాత్రమే కొనసాగుతామని వెల్లడించారు. దీంతో అభిమానులు తెగ బాధపడుతున్నారు. కనీసం ఫేర్వెల్ మ్యాచ్ ఆడకుండా రిటైర్ అవడం ఏంటని ఫీల్ అవుతున్నారు. సత్కరించే అవకాశం కూడా ఇవ్వరా అని వాపోతున్నారు. ఈ తరుణంలో రోహిత్-కోహ్లీ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా చేస్తున్న పని తెలిసి ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అసలు సీఏ ఏం చేసిందంటే..
మొదలుపెట్టిన టీమిండియా.. వీడియో చూస్తే ప్యూర్ గూస్బంప్స్!
నేటిధాత్రి:
భారత జట్టు వేట మొదలుపెట్టేసింది. 5 టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్ గడ్డ మీద అడుగుపెట్టిన టీమిండియా కుర్రాళ్లు.. బంతి, బ్యాట్ చేతపట్టి ప్రాక్టీస్ ప్రారంభించారు.
వేట మొదలుపెట్టిన టీమిండియా.. వీడియో చూస్తే ప్యూర్ గూస్బంప్స్!
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్.. ఈ ముగ్గురూ లేని భారత టెస్ట్ జట్టును ఊహించడం కష్టమే. గత కొన్నేళ్లుగా టీమిండియాకు అన్నీ తామై నిలిచారీ త్రిమూర్తులు. మన జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. అయితే తక్కువ వ్యవధిలోనే ముగ్గురూ రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్లో భారత్ ఎలా ఆడుతుందో అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ తరుణంలో ఇంగ్లీష్ గడ్డపై అడుగుపెట్టారు టీమిండియా ప్లేయర్లు. కొత్త కెప్టెన్ శుబ్మన్ గిల్ నేతృత్వంలోని కుర్రాళ్ల బృందం ఉరిమే ఉత్సాహంతో ప్రాక్టీస్ సెషన్ను మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
బెండు తీయడం ఖాయం!
ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియంలో గిల్ అండ్ కో ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంగా తీసిన వీడియోను బీసీసీఐ అభిమానులతో పంచుకుంది. ఇందులో జట్టు ఆటగాళ్లంతా పరుగులు తీస్తూ చెమటోడ్చుతూ కనిపించారు. రన్నింగ్తో పాటు ఫుట్బాల్ సాధన చేస్తూ దర్శనమిచ్చారు. కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఫీల్డింగ్ డ్రిల్స్ చేయడాన్ని వీడియోలో చూడొచ్చు. హెడ్ కోచ్ గౌతం గంభీర్ అటు ఫీల్డింగ్ సెషన్స్తో పాటు ఇటు ఫిట్నెస్ డ్రిల్స్ను కూడా దగ్గరుండి గమనిస్తూ కనిపించాడు.ఇంగ్లండ్ గ్రౌండ్స్కు తగ్గట్లు ఫీల్డింగ్లో చేసుకోవాల్సిన మార్పులపై కోచ్ టి దిలీప్ కుర్రాళ్లతో చర్చిస్తూ కనిపించాడు. అటు పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్తో మాట్లాడుతూ దర్శనమిచ్చాడు. ఇంగ్లండ్ జట్టు బెండు తీసేందుకు లండన్లో ల్యాండ్ అయిన భారత బృందం.. ఇలా జోరుగా ప్రాక్టీస్ చేస్తూ తాము వేటాడేందుకు సిద్ధమని చెప్పకనే చెప్పేశారు.
ఇంగ్లండ్కు బుమ్రా భయం.. ఒక్క వీడియోతో దడ పుట్టిస్తున్నాడు!
నేటిధాత్రి:
ఇంగ్లండ్కు గుబులు పుట్టిస్తున్నాడు టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా. అతడి పేరు చెబితేనే ఇంగ్లీష్ బ్యాటర్లు వణుకుతున్నారు. ఎక్కడ తమ బెండు తీస్తాడోనని భయపడుతున్నారు.
ఇంగ్లండ్కు బుమ్రా భయం.. ఒక్క వీడియోతో దడ పుట్టిస్తున్నాడు!
టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఇంగ్లండ్తో 5 టెస్టుల సిరీస్ కోసం లండన్కు చేరుకున్న బుమ్రా.. అలా ల్యాండ్ అయ్యాడో లేదో సాధన షురూ చేసేశాడు. ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియంలో బుమ్రా పరుగులు తీస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టీమ్ క్యాంప్లో జాయిన్ అయిన స్పీడ్గన్.. రన్నింగ్తో పాటు బౌలింగ్ డ్రిల్స్ చేస్తూ కనిపించాడు. గ్యాప్లో బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్తో కలసి అతడు మాట్లాడటాన్ని కూడా వీడియోలో చూడొచ్చు. బుమ్రా సాధన చూసి ప్రత్యర్థి బ్యాటర్లు వణుకుతున్నారని తెలుస్తోంది.
వణుకుతున్న బ్యాటర్లు!
కోచ్తో బుమ్రా సుదీర్ఘంగా చర్చించడం, గ్రౌండ్లో రేసుగుర్రంలా పరుగులు తీయడం, ఫుల్ ఫిట్గా కనిపించడంతో ఇంగ్లండ్ శిబిరంలో కలవరం మొదలైనట్లు తెలుస్తోంది. ఎక్కడ తమ పని ఫినిష్ చేస్తాడోనని ఇంగ్లీష్ బ్యాటర్లు భయపడుతున్నారట. అతడి ఫిట్నెస్ చూసి అవాక్కవుతున్నారట. 3 టెస్టులు ఆడితే గొప్ప అనుకుంటే.. ఇప్పుడు 5 టెస్టులు పక్కా ఆడేలా కనిపిస్తున్నాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆతిథ్య జట్టుకు దబిడిదిబిడేనని అంటున్నారు. స్టోక్స్ సేన కాచుకో.. అంటూ సవాల్ విసురుతున్నారు. కాగా, ఇంగ్లండ్ టూర్ కోసం ఇటీవల భారత జట్టును ప్రకటించిన సమయంలో బుమ్రా మూడు మ్యాచులు మాత్రమే ఆడే అవకాశం ఉందని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అన్నాడు. దీంతో అతడి ఫిట్నెస్పై అనుమానాలు నెలకొన్నాయి. అయితే భారత ట్రెయినింగ్ సెషన్లో మాత్రం పేస్ గన్ ఉత్సాహంగా పాల్గొనడం, ఫిట్గా కనిపించడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన టీమ్కు తిరుగులేదని అంటున్నారు.
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్లో కొత్త చాంపియన్గా కొకో గాఫ్ నిలిచింది. శనివారం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో 21 ఏళ్ల ఈ అమెరికన్.. 6-7 (5-7), 6-2, 6-4తో వరల్డ్ నెంబర్ 1 ఎరీనా సబలెంక (బెలారస్)ను ఓడించి ఎర్రకోటలో…
ఇద్దరూ ఇద్దరే.. ఒకరు వరల్డ్ నెంబర్ వన్ సబలెంక, మరొకరు వరల్డ్ నెంబర్ టూ కొకొ గాఫ్. బరిలోకి దిగిన పదిసార్లు కూడా సమాన విజయాలే. గ్రాండ్స్లామ్స్లోనే కాదు.. క్లే కోర్టుల్లోనూ తలపడిన రెండేసిసార్లూ పైచేయి. అలాంటి వీళ్లు ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో బరిలోకి దిగితే ఎలా ఉంటుంది? అంచనాలకు తగ్గట్టుగానే ఇద్దరూ నువ్వా.. నేనా? అనే రీతిలో ఆడి అభిమానులను ఉర్రూతలూగించారు. అయితే ఆఖరి పోరాటంలో చివరకు నల్ల కలువ గాఫ్కే ఫ్రెంచ్ కిరీటం దక్కింది. గెలుపు అవకాశాలను చేజార్చుకున్న సబలెంక రన్నరప్తో సరిపెట్టుకుంది.
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్లో కొత్త చాంపియన్గా కొకో గాఫ్ నిలిచింది. శనివారం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో 21 ఏళ్ల ఈ అమెరికన్.. 6-7 (5-7), 6-2, 6-4తో వరల్డ్ నెంబర్ 1 ఎరీనా సబలెంక (బెలారస్)ను ఓడించి ఎర్రకోటలో పాగా వేసింది. గాఫ్ కెరీర్లో ఇదే తొలి ఫ్రెంచ్ ఓపెన్ కాగా.. ఆమెకిది రెండో గ్రాండ్స్లామ్. 2023లో యూఎస్ ఓపెన్ గెలిచింది. అలాగే 2015లో సెరెనా తర్వాత మరో యూఎస్ క్రీడాకారిణి ఇక్కడ నెగ్గడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా సెరెనా (2002లో) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ను గెలిచిన యంగెస్ట్ అమెరికన్గానూ గాఫ్ నిలిచింది. ఇక సబలెంక కెరీర్లో ఆస్ట్రేలియన్, యూఎస్ ఓపెన్ గెలిచినా ఇప్పటిదాకా ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గలేకపోయింది. ఈ పోరులో సబలెంక 70 అనవసర తప్పిదాలకు పాల్పడి మూల్యం చెల్లించుకుంది. గాఫ్ 9 బ్రేక్ పాయింట్లు, 3 ఏస్లతో చెలరేగింది.
హోరాహోరీగా..: తొలి సెట్లో సబలెంక శక్తివంతమైన బేస్లైన్ ఆటతీరుతో పాటు గాఫ్ పదునైన సర్వీస్ రిటర్న్లతో పోరు రంజుగా సాగింది. సుదీర్ఘ ర్యాలీలు, డ్యూస్ల కారణంగా ఈ సెట్ గంటా 18 నిమిషాలు సాగింది. తొలి పాయింట్ గాఫ్దే అయినా సబలెంక ప్రత్యర్థి సర్వీస్లను బ్రేక్ చేస్తూ ఓ దశలో 4-1తో స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. కానీ తర్వాత పుంజుకున్న గాఫ్ వరు సగా 3 పాయింట్లతో స్కోరును సమం చేసింది. ఇక్కడి నుంచి కోర్టులో చిరుతల్లా ఇద్దరూ తలపడ్డారు. ఫలితంగా సెట్ 6-6తో టైబ్రేక్కు వెళ్లింది. ఇందులో సబలెంక ఆరంభంలో వెనుకబడినా పట్టు వదలకుండా ఆడి సెట్ను 7-6తో ముగించింది. అయితే కీలక రెండో సెట్లో చెలరేగిన గాఫ్ 35 నిమిషాల్లోనే 6-2తో గెలిచి పోటీలో నిలిచింది. ఇక నిర్ణాయక సెట్ తిరిగి రసవత్తరం గా మారింది.
మొదట గాఫ్ బ్రేక్ పాయింట్లతో 3-1తో హవా చూపింది. ఈ దశలో సబలెంక ఒత్తిడిని అధిగమిస్తూ గాఫ్ సర్వీస్ను బ్రేక్ చేస్తూ 3-3తో సవాల్ విసిరింది. కానీ సబలెంక అనవసర తప్పిదాలను సొమ్ము చేసుకుంటూ గాఫ్ రెండు వరుస పాయింట్లు ఖాతాలో వేసుకుంది. అయితే తొమ్మిదో గేమ్ను సబలెంక దక్కించుకున్నా.. 5-4 ఆధిక్యంతో గాఫ్ చాంపియన్షిప్ సర్వీస్కు దిగింది. ఇందులో సబలెంక పోరాడినా తన బ్యాక్ హ్యాండ్ విన్నర్ను బయటకు కొట్టడంతో.. గాఫ్ విజేతగా నిలిచింది.
ఇంగ్లండ్కు రాహుల్ వార్నింగ్.. ఒక్క ఇన్నింగ్స్తో లెక్కలు మార్చేశాడు!
KL Rahul:నేటి ధాత్రి:
టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లెక్కలు మార్చేస్తున్నాడు. 5 టెస్టుల సిరీస్కు ముందు ఇంగ్లండ్కు దడ పుట్టిస్తున్నాడీ సీనియర్ ఆటగాడు.
ఇంగ్లండ్తో 5 టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు సన్నద్ధం అవుతోంది. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకోవడంతో ఈ సిరీస్లో టీమిండియా ఎలా ఆడుతుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు. పేస్, స్వింగ్కు అనుకూలించే ఇంగ్లీష్ పిచ్లపై బ్యాటింగ్ చేయడం అంత సులువేమీ కాదు. ప్రస్తుత భారత జట్టులో ఈ వికెట్లపై ఆడిన అనుభవం ఉన్న బ్యాటర్లూ తక్కువే. దీంతో ఇంగ్లండ్ ఆధిపత్యం తప్పదని అనుకుంటున్న తరుణంలో స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లెక్కలు మార్చేసే ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ లయన్స్తో జరుగుతున్న టెస్ట్లో థ్రిల్లింగ్ నాక్తో అదరగొట్టాడు. సూపర్ సెంచరీతో ఆతిథ్య జట్టుకు హెచ్చరికలు పంపించాడు.
ఇది కదా కావాల్సింది..
ఇంగ్లండ్ లయన్స్తో పోరులో 168 బంతుల్లో 116 పరుగులు చేశాడు రాహుల్. ఇందులో 15 బౌండరీలతో పాటు 1 భారీ సిక్స్ ఉంది. ఇన్నింగ్స్ ఆసాంతం నింపాదిగా బ్యాటింగ్ చేశాడు రాహుల్. ఎలాంటి పొరపాట్లు, అలసత్వానికి తావివ్వకుండా ఆడాడు. ప్రతి బంతిని అంతే కచ్చితత్వంతో ఎదుర్కొన్నాడు. తొందరపాటుకు అవకాశం ఇవ్వకుండా క్రీజులో పాతుకుపోవడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేశాడు రాహుల్. కరుణ్ నాయర్ (40)తో కలసి మూడో వికెట్కు 86 పరుగులు జోడించారు. నాలుగో వికెట్కు ధృవ్ జురెల్ (52)తో కలసి 121 పరుగుల భాగస్వామ్యం జతచేశాడు. ఇది చూసిన నెటిజన్స్.. తన ఫామ్, ఫిట్నెస్, మైండ్సెట్ ఎలా ఉందో రాహుల్ నిరూపించాడని మెచ్చుకుంటున్నారు. రాబోయే సిరీస్లో పరుగుల వర్షం కురిపిస్తానని చెప్పకనే చెప్పాడని అంటున్నారు. టీమిండియా బ్యాటింగ్కు ఇకపై అతడే మూలస్తంభం అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంగ్లండ్ బౌలర్లకు ఇక దబిడిదిబిడేనని చెబుతున్నారు.
సిరికొండ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ ముగింపు కార్యక్రమం..
విజేతలకు నగదు షీల్డ్ అందజేసిన సిరికొండ ప్రశాంత్.
చిట్యాల, నేటి ధాత్రి :
చిట్యాల మండల కేంద్రంలో నిర్వహించిన సిరికొండ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ ముగింపు కార్యక్రమం జన్నె యుగంధర్ అధ్యక్షతన జరగగా ప్రశాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు పార్టీలకతీతంగా యువత కోసం ఎక్కడైనా వస్తానని ప్రాణమై నిలుస్తానని
ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఆటలకు యువత దూరమవుతున్న నేటి పరిస్థితులలో క్రీడలను ప్రోత్సహించాలని సిరికొండ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ క్రీడలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
క్రీడలు అంటే తనకు పంచ ప్రాణమని క్రీడలు ఆడేవారన్న చాలా ఇష్టమని అందుకనే పార్టీలకతీతంగా క్రీడలకు సహకరిస్తానని ఆయన తెలిపారు భూపాలపల్లి ని జిల్లా చేయడంతో పాటు అద్భుతమైన అభివృద్ధి చేసిన మాజీ స్పీకర్ బీ ఆర్ఎస్ పార్టీ నాయకులు శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి తనయుడిగా ఆయన ఆశయ సాధన కోసం అహర్నిశలు కృషిచేయడమే కాకుండా ప్రజల కష్టాలలో పాలుపంచుకుంటానని తెలిపారు గత వారం రోజులుగా క్రికెట్ క్రీడలను కొనసాగిస్తూ విజయవంతం చేసిన నిర్వాహకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
సిరికొండ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ గెలుకున్న విజేతలకు ప్రశాంత్ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.
విజేతలు మొదటి విజేతలుగా కేకేఆర్ జట్టు నిలువగా రెండవ విజేతలుగా విక్టరీ లేవన్ జట్టు మూడవ విజయంశాలుగా ఛాలెంజర్ జట్టు నాలుగవ విజేతలుగా ఎలిమినేటర్ జట్టు నిలిచాయి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విజేతగా దాసరపు మహేష్ నిలిచారు కాగ మొదటి జట్టుకు ట్రోఫీతో పాటు 40 వేల రూపాయల నగదును ద్వితీయ బహుమతిగా 20వేల రూపాయల నగదు షీల్డ్ ను సిరికొండ ప్రశాంత్ విజేతలకు అందించారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు చింతల రమేష్ శశికాంత్ గౌడ్ జన్నె యుగంధర్ మాజీ సర్పంచ్ రాములు కార్యక్రమం నిర్వాహకులు వేల్పుల రాజ్ కుమార్ గడ్డం నితిన్ లవన్ బాబులు రంజిత్ వెంకన్న ప్రకాష్ కన్నా పూర్ణ యాదవ్ గురుకుంట్ల కిరణ్ సంగా రాజేందర్ కోడెల రాజమల్లు కోడెల నంది గొల్లపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.
కరేటేలో ఝరాసంగం సిద్దు మాస్టర్ విద్యార్థుల ప్రతిభ జపాన్ కరాటే అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం సదాశివపేట పట్టణంలో బెల్ట్ గ్రేడింగ్ ఎగ్జామ్ ను తెలంగాణ చీఫ్ రాపోలు సుదర్శన్ మాస్టర్ జిల్లా ఎగ్జామినర్ శంకర్ గౌడ్ మాస్టర్ జిల్లా చీఫ్ చందర్ మాస్టర్ ఎగ్జామినేటర్గా విద్యార్థులను పరీక్షించారు. ప్రతిభ కనబరిచిన సైఫ్ సంగమేశ్వర్ విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెప్టెంబర్ లో గోవాలో జరిగే జాతీయస్థాయి పోటీలకు సిద్ధంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో సిద్దు మాస్టర్ సతీష్ గౌడ్. శ్వేత వారిని అభినందించడం జరిగింది
గెలిచిన సంతోషంలో ఉన్న శ్రేయస్ అయ్యర్తో పాటు ఓడిన బాధలో ఉన్న హార్దిక్ పాండ్యాకు గట్టి షాక్ తగిలింది.
ఇద్దరి జీతాలు కట్ చేసింది బీసీసీఐ.
ఎందుకిలా చేసిందో ఇప్పుడు చూద్దాం..
స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అదరగొట్టాడు.
తాను సారథ్యం వహిస్తున్న పంజాబ్ కింగ్స్ను ఐపీఎల్-2025 ఫైనల్కు చేర్చాడు. ముంబై ఇండియన్స్తో జరిగిన క్వాలిఫయర్-2లో పంజాబ్ను ఒంటిచేత్తో గెలిపించాడు అయ్యర్.
41 బంతుల్లో 87 పరుగుల కెప్టెన్సీ నాక్తో మ్యాచ్ ఫలితాన్ని శాసించాడు.
అటు ముంబైని ఫైనల్ చేర్చలేకపోయాడు సారథి హార్దిక్ పాండ్యా.
ఎంతగా పోరాడినా అతడి జట్టుకు విజయం దక్కలేదు.
ఈ తరుణంలో సంతోషంగా ఉన్న అయ్యర్తో పాటు ఓటమి బాధలో ఉన్న పాండ్యాకు గట్టి షాక్ తగిలింది.
వారిద్దరి జీతాలను కట్ చేసింది భారత క్రికెట్ బోర్డు. మరి..
ఉమ్మడి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కేంద్రంలో శనివారం రోజున ఉమ్మడి జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలను జయశంకర్ భూపాలపల్లి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ,
ఈ కార్యక్రమాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడా అయినా బాల్ బ్యాడ్మింటన్ క్రీడను ప్రోత్సహించడానికి ముందుకు వచ్చిన అసోసియేషన్ ను అభినందించడం జరిగింది.
ఒకప్పుడు నేను కూడా బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుని అని ఈ క్రీడను చిట్యాల మండల కేంద్రంలో నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు, అలాగే అంతరించిపోతున్న బాల్ బ్యాడ్మింటన్ క్రీడను విద్యార్థి దశలోనే అవగాహన కోసం అండర్ 14 బ్యాడ్మింటన్ క్రీడలు నిర్వహించడం కూడా గొప్ప విషయమై కొనియాడారు,
ఈ క్రీడల్లో పాల్గొనడానికి దాదాపు 24 టీములు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాల్గొనడం జరిగిందని, అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు, అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గూట్ల తిరుపతి మాట్లాడుతూ గ్రామీణ క్రీడ అయినా బాల్ బ్యాడ్మింటన్ క్రీడను ప్రోత్సహించే ఉద్దేశంతో
Sports
ఈ క్రీడలను నిర్వహించడం జరిగిందని అన్నారు గెలుపొందిన క్రీడాకారులకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను అసోసియేషన్ తరపున ఇవ్వడం జరుగుతుందని అలాగే అంతరించిపోతున్న బాల్ బ్యాడ్మింటన్ క్రీడలను ప్రోత్సహించేందుకు విద్యార్థి దశ అండర్ 14 నిర్వహిస్తున్నామని దీనికి సహకరిస్తున్న క్రీడాభిమానులకు
ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు, ఆర్ఎన్ఆర్ మాట్లాడుతూ బాల్ బాడ్మిట్ ఉమ్మడిజిల్లా స్థాయిలో నిర్వహించడం గొప్ప విషయమని క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి స్నేహ భావాన్ని పెంపొందించుకోవాలని అన్నారు,
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు గుట్ల తిరుపతి ప్రధాన కార్యదర్శి గుత్తికొండ సాంబయ్య ఉపాధ్యక్షులు వెంకట్రాంరెడ్డి బుచ్చిరెడ్డి స్వామి అంజద్ భాష కోశాధికారి రవీందర్ కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య జిల్లా నాయకులు చిలకల రాయకుమురు టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్ మండల్ నాయకులు బుర్ర శ్రీనివాస్ చిలుమల రాజమౌళి ఉమ్మడి జిల్లా క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ అకాడమీ & స్పోర్ట్స్ హాస్టల్ లో ప్రవేశమునకు ఎంపికల నిర్వహణ
సిరిసిల్ల జిల్లా యువజన మరియు క్రీడల శాఖ
సిరిసిల్ల టౌన్: ( నేటి ధాత్రి )
రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ అకాడమీ & స్పోర్ట్స్ హాస్టల్ లో ప్రవేశమునకు ఎంపికల నిర్వహణ తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ 2025 -2026 విద్యా సంవత్సరానికి గాను 1 జూన్,2025 నుండి వాలీబాల్ అకాడెమి రాజన్న సిరిసిల్ల, సరూర్నగర్ ఇన్డోర్ స్టేడియం, సిద్ధిపేట,మరియు మహబూబ్ నగర్ అకాడమి, ప్రాంతీయ క్రీడా హాస్టల్ – హన్మకొండ, అథ్లెటిక్స్ అకాడెమి – ఖమ్మం, సైక్లింగ్ మరియు రెజ్లింగ్ అకాడెమి – సైక్లింగ్ వేలోడ్రోమ్,O.U., హాకీ అకాడెమి – వనపర్తిలో మంజూరు చేయబడిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా, ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడం కొరకు ఎంపికలు/ సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించనుంది.
ఈ క్రింద తెలుపబడిన తేదీలలో, ఆయా సెంటర్లలో రాష్ట్రం లోని ప్రతి అకాడెమీకి/హాస్టల్ కు సంబంధించిన ఎంపికలు / సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించబడును.
ఎంపిక స్థలం / వేదిక క్రొత్తగా ప్రతిపాదించ బడిన తేదీలు నిర్ధారించబడిన వయసు
1 వాలీబాల్ అకాడెమి – రాజన్న సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల, వాలీబాల్ అకాడెమి , రాజీవ్ నగర్ మినీ స్టేడియం, సిరిసిల్ల 10 జూన్ 2025 Under 14 to 16 Years at Saroornagar & Rajanna Sircilla (30th June 2009 to 1st July -2011) (Under 16 to 18 years- only at Saroor nagar) ( 1st July-2009 to 30th June 2007)
వాలీబాల్ అకాడెమి, సరూర్ నగర్ 3 వాలీబాల్ అకాడెమి, (సిద్దిపేట) సిద్దిపేట, వాలీబాల్ అకాడెమి 1 జూన్ 2025 (Under 14 to 16 years) Between (30th June 2009 to 1st July -2011) 4 వాలీబాల్ అకాడెమి –మహబూబ్ నగర్ మెయిన్ స్టేడియం గ్రౌండ్ మహబూబ్ నగర్ 12, 13 జూన్ 2025 (Under 14 to 16 years) (30th June 2009 to 1st July -2011) 5 సైక్లింగ్ మరియు రెజ్లింగ్ అకాడెమి, సైక్లింగ్ వేలోడ్రోమ్,O.U., సైక్లింగ్ వేలోడ్రోమ్, O.U.,క్యాంపస్ 10 & 11 జూన్ 2025 (Under 14 to 16 years) (30th June 2009 to 1st July -2011) 6 Regional క్రీడా వసతి గృహం, హనుమకొండ DSA, జవహర్లాల్ నెహ్రు స్టేడియం, హనుమకొండ 10 & 11 జూన్ 2025 Under10-12 Years ( for Gymnastics & Swimming ) ( 30th June 2013 to 1st July 2015) Under 14 to 16 Years ( Athletics, Handball, Wrestling) ( 30th June 2009 to 1st July 2011) 7 హాకీ అకాడెమి, వనపర్తి DSA, హాకీ అకాడెమి, వనపర్తి 12 జూన్ 2025 (Under 14 to 16years)(30th June 2009 to 1st July -2011) 8 అథ్లెటిక్స్ అకాడెమి, ఖమ్మం DSA,సర్దార్ పటేల్ స్టేడియం, ఖమ్మం 12 జూన్ 2025 (Under 14 to 16 years) (30th June 2009 to 1st July -2011)కావున,రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆసక్తిగల బాల బాలికలు పైన తెలిపిన స్పోర్ట్స్ అకాడెమీలలో మరియు స్పోర్ట్స్ హాస్టల్ లో అడ్మిషన్ పొందాలనుకొనే వారు పైన తెలిపిన తేదీలలో ఆయా సెంటర్లలో నిర్వహించే ఎంపికలకు/ సెలక్షన్ ట్రయల్స్ కు హాజరు కాగలరని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి ఎ.రాందాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
6 నుంచి ఉమ్మడి జిల్లాలో ఉచిత క్రికెట్ వేసవి శిబిరం.
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈనెల 6 నుంచి నెల రోజులపాటు ఉచిత క్రికెట్ వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజేందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జహీరాబాద్, గజ్వేల్ లలో అండర్- 14, 16, 19, 23 వయసు వారు పాల్గొనవచ్చని చెప్పారు. శిక్షణలో పాల్గొనేవారు https://hycricket. org వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు.
మిని స్టేడియంలో కొనసాగుతున్న కబడ్డీ,రెజ్లింగ్ క్రీడల శిక్షణ
నర్సంపేట,నేటిధాత్రి:
వరంగల్ జిల్లా యువజన,క్రీడల అధికారిని టీవీఎల్ సత్యవాణి ఆధ్వర్యంలో నర్సంపేట మిని స్టేడియంలో కబడ్డీ ఇంచార్జ్ కోచ్ యాట రవికుమార్ ముదిరాజ్, రెజ్లింగ్ ఇంచార్జ్ కోచ్ సిరపురపు మహేశ్ శిక్షణలో ప్రతిరోజు ఉదయం 5:30 గంటల నుండి 7:30 గంటల వరకు సాయంత్రం 5:30 గంటల నుండి 7:30 గంటల వరకు బాల బాలికలకు కబడ్డీ,రెజ్లింగ్ క్రీడల శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి.
Kabaddi
ఈ శిక్షణలో పాల్గొనే విద్యార్థులు ప్రతిరోజు ఉదయం,సాయంత్రం మిని స్టేడియం నర్సంపేటలో జరిగే కబడ్డీ,రెజ్లింగ్ క్రీడల శిక్షణకు హాజరై శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు కబడ్డీ శిక్షణ కొరకు 9666623438, రెజ్లింగ్ శిక్షణ కొరకు 6305271260 నెంబర్లను సంప్రదించాలని డివైస్ ఓ టీవీఎల్ సత్యవాణి ఒక ప్రకటనలో తెలిపారు.
కబడ్డీ టోర్నమెంట్ ను ప్రారంభించిన చిలువేరు సమ్మయ్య గౌడ్.
యువత పట్ల సమ్మి గౌడ్ సహాయ సహకారాలు ఆదర్శనీయం – డివైఎఫ్ఐ యువజన సంఘం
కేసముద్రం మండలం తాళ్లపూస పల్లి గ్రామంలో సోమవారం డి వై ఎఫ్ ఐ యువజన సంఘం ఆధ్వర్యంలో కబడ్డీ టోర్నమెంట్ ను నిర్వహించిన సమ్మి గౌడ్ ఫౌండేషన్ అధినేత
కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి
కాంగ్రెస్ మండల నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై కబడ్డీ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సమ్మి గౌడ్ మాట్లాడుతూ క్రీడలు మానవ జీవితంలో అంతర్భాగమని క్రీడలు విద్యార్థుల మానసిక ఎదుగుదలకు సోపానాలని ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన మనసు ఉంటుందని ప్రతి ఒక్క విద్యార్థి క్రీడలలో పాల్గొనాలని పలికారు. అంతేకాదు క్రీడలతోనే ఉజ్వలమైన భవిష్యత్ ను పొందుతారని అన్నారు. క్రీడల వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉండడమే కాకుండా మానసిక శారీరక దృఢత్వాన్ని పెంచుకోవచ్చని, అదేవిధంగా డివైఎఫ్ఐ విద్యార్థి యువజన సంఘం వారు మాట్లాడుతూ క్రీడలు నిర్వహించాలని ఆలోచనతో సమ్మి గౌడ్ ఫౌండేషన్ చైర్మన్ సమ్మయ్య గౌడ్ వద్దకు వెళ్లి విషయం తెలిపిన వెంటనే వారు సానుకూలంగా స్పందించి యువత చెడు దారి పట్టుతున్న ఈ రోజుల్లో మీలో ఇలాంటి ఆలోచనలు రావడం గర్వించదగ్గ విషయమని మీరు ఇతరులకు ఆదర్శంగా నిలిచే విధంగా చేస్తున్న మీ కార్యక్రమాలకు నేను ఎల్లవేళలా అండగా ఉంటానని మాకు భరోసా కల్పించి మమ్మల్ని ముందుకు నడిచేలా ప్రోత్సహించి ప్రధమ బహుమతిగా రూ.10,116 లు అందజేస్తూ ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అండగా ఉంటానని భరోసా కల్పించి మా ఆహ్వానం మేరకు విచ్చేసి కబడ్డీ పోటీలను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తపరిచారు. అదేవిధంగా ద్వితీయ బహుమతిగా డి.ఈ విజయ్ రూ. 5,015 రూపాయలను అందిస్తున్నారని తెలిపారు..
ఈ కార్యక్రమంలో సురేష్ గౌడ్, కొండేటి కళాధర్, గొడిషాల వెంకన్న, రాచర్ల రాములు, గొర్రె వెంకన్న గౌడ్, కాలేరు వెంకన్న, కందుకూరి దాస్, తీగల సునీత, మేన్పు పద్మ, వల్లాల రాజేందర్, వల్లాల శ్రవణ్, అనిల్, శాల్వా సుమన్, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్టిపిపి లో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ విజయవంతం.
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ ఎస్టిపిపి టౌన్షిప్లో కరాటే శిక్షణా కేంద్రం 2021లో దారవత్ పంతుల విజన్తో, డైరెక్టర్ మరియు జీఎం (ఎస్టిపిపి)ఆమోదంతో స్థాపించబడింది.ఈ శిక్షణా కేంద్రం ద్వారా ఎస్ సి సి ఎల్, పవర్ మెక్ మరియు సి ఆర్ పి ఎఫ్ ఉద్యోగుల పిల్లలు తక్కువ ఖర్చుతో నాణ్యమైన కరాటే శిక్షణ పొందుతున్నారు. శారీరక దృఢతతో పాటు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతోంది. ఈ శిక్షణా కేంద్రం అభివృద్ధికి ప్రతిఫలంగా,2025 ఏప్రిల్ 6వ తేదీ,ఆదివారం జైపూర్ ఎస్టిపిపి ఓపెన్ ఆడిటోరియంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్టిపిపి పవర్ ప్లాంట్ సింగరేణి జనరల్ మేనేజర్ కొండారెడ్డి శ్రీనివాసులు హాజరై టెస్ట్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు బెల్ట్లు మరియు సర్టిఫికెట్లు అందజేశారు.
Karate beltt.
ఈ సందర్భంగా జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్కి ఎంపికైన విద్యార్థిని జనని ని ప్రత్యేకంగా అభినందించారు.ఈ ఘనత ఎస్టిపిపి కరాటే శిక్షణా కేంద్రానికి గర్వకారణంగా నిలిచింది.కరాటే కోచ్ శివ మహేష్ మాట్లాడుతూ… దారవత్ పంతుల ప్రోత్సాహం వల్లే ఈ కార్యక్రమం ఇవాళ ఈ స్థాయికి ఎదిగింది అని అన్నారు.జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థిని ఎంపిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాం అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డీజీఎంలు దారవత్ పంతుల, రాజేష్, జెంట్స్టోరియో స్టైల్ చీఫ్ కోచ్ రాజనర్స్,జూల శ్రీనివాస్ మరియు కోచ్ శివ మహేష్ పాల్గొన్నారు.
బెట్టింగ్స్ కు ఆకర్షతులై డబ్బులు నష్టపోయి జీవితాలను సర్వం నాశనం చేసుకోవద్దని మొగుళ్లపల్లి ఎస్సై బొరగల అశోక్ అన్నారు. ఐపిఎల్ క్రికెట్ సీజన్ ప్రారంబమైన నేపథ్యంలో. మండలంలోని యువతకు విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ. తల్లిదండ్రులు, తమ కష్టార్జితాన్ని కన్న బిడ్డలు, బెట్టింగుల రూపంలో. డబ్బులను దోపిడీ దొంగలపాలు చేసి చివరకు తమ ప్రాణాలను తీసుకుంటున్నారని. పిల్లల్లో ఏదైనా మార్పులు గమనించినట్లయితే తల్లిదండ్రులు, పెద్దలు, వెంటనే తగిన చర్యలు తీసుకొని బెట్టింగులకు పాల్పడకుండా వారి ప్రవర్తనలో మార్పు తేవడానికి ప్రయత్నం చేసి వారిని సరియైన దారిలోకి తేవాలని అన్నారు. బెట్టింగులకు పాల్పడే వారిపైనా ప్రత్యేక నిఘా ఉంచామని బెట్టింగులకు పాల్పడి కోలుకొని విదంగా ఆస్థి నష్టం జరిగి చివరికి ఆత్మహత్య చేసుకుని మీ కుటుంబాలను రోడ్డున పడేయద్దని ఎవరైనా బెట్టింగులకు పాల్పడితే మాకు సమాచారం ఇవ్వాలని మొగుళ్లపల్లి ఎస్సై బి అశోక్ మండల ప్రజలను కోరారు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) దేశంలోని 23 రాష్ట్రాల్లోని 50 నగరాల్లో tata ipl fan park లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది మరియు మార్చి 22 నుండి ఛాంపియన్షిప్ అంతటా ఇవి పనిచేస్తాయి.
ప్రత్యక్ష మ్యాచ్ స్క్రీనింగ్లు, సంగీతం, వినోదం, ఫుడ్ కోర్టులు, పిల్లల ఆట స్థలం మరియు వర్చువల్ బ్యాటింగ్ జోన్, నెట్స్ ద్వారా బౌలింగ్, ఫేస్-పెయింటింగ్ జోన్లు, రెప్లికా డగ్-అవుట్లు, చీర్-ఓ-మీటర్ మరియు 360 డిగ్రీల ఫోటో బూత్లతో సహా ఉత్తేజకరమైన యాక్టివేషన్లతో పూర్తి చేసిన ఫ్యాన్ పార్కులు అభిమానులను నిమగ్నం చేయడం మరియు దేశంలోని ప్రతి మూలకు ఐపీఎల్ థ్రిల్ను తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నాయని గురువారం మీడియా విడుదల తెలిపింది.
ఈ సీజన్లో మొదటి ఫ్యాన్ పార్కులు రోహ్తక్ (Haryana), బికనీర్ (Rajasthan), గ్యాంగ్టక్ (Sikkim), కొచ్చి (Kerala) మరియు కోయంబత్తూర్ (Tamil Nadu)లలో ప్రారంభమవుతాయి. ప్రతి వారాంతంలో వివిధ రాష్ట్రాలలో ఒకేసారి బహుళ ఫ్యాన్ పార్కులు నిర్వహించబడతాయి, గరిష్ట అభిమానుల నిశ్చితార్థాన్ని నిర్ధారిస్తాయి. కాకినాడ (ఆంధ్రప్రదేశ్), దిమాపూర్ (Nagaland), కరైకల్ (Puducherry), మన్భుమ్, పురులియా (West Bengal), రోహ్తక్ మరియు టిన్సుకియాలలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్లు జరగడం ఇదే మొదటిసారి. “భారతదేశం అంతటా అభిమానులకు టోర్నమెంట్ను దగ్గరగా తీసుకురావాలనే మా దార్శనికతలో ipl fan park లు కీలకమైన భాగం. బహుళ నగరాలు మరియు పట్టణాల్లో ఈ ఈవెంట్లను నిర్వహించడం ద్వారా, విద్యుదీకరించే స్టేడియం వాతావరణాన్ని తిరిగి సృష్టించడం మరియు అభిమానులు కలిసి ఐపీఎల్ను జరుపుకునేలా చేయడం మా లక్ష్యం. ఈ చొరవ దేశవ్యాప్తంగా క్రికెట్ ఔత్సాహికులతో మా బంధాన్ని బలపరుస్తుంది, వారు క్రీడ యొక్క ఉత్సాహం మరియు అభిరుచిని ఉత్సాహభరితమైన మరియు ఉత్సాహభరితమైన వాతావరణంలో అనుభవించేలా చేస్తుంది, ”అని ipl chairman anurag singh ధుమల్ అన్నారు.
ప్రశాంతతతోనే మెరుగైన ఫలితాలు ఫోటో కాన్ కరాటే మాస్టర్ సిద్దు స్వామి.
జహీరాబాద్.నేటి ధాత్రి:
ఝరాసంగం,ఎలాంటి ఒత్తిడి, భయాందోళనలు గురి కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు వ్రాస్తేనే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఫోటో కాం కరాటే మాస్టర్ సిద్దు స్వామి మార్గదర్శనం చేశారు. బుధవారం ఝరాసంఘం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 2024 – 25 విద్యా సంవత్సరానికి చెందిన 10 తరగతి విద్యార్థునులకు ఆత్మీయ వీడుకోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరాటే మాస్టర్ సిద్దు స్వామి10వ తరగతి విద్యార్థునులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ మేరకు పదవ తరగతి విద్యార్థునులకు పరీక్ష ప్యాడులను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
మైభారత్ యువభారత్ యువ ఉత్సవ్ యువతనుచైతన్య పంచడానికి క్రీడలు యువజన సర్వీసుల శాఖ స్వయం ఉపాధి అవేర్నెస్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశంలోని యువతకు ఆటల ద్వారా స్ఫూర్తి కలిగించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని సిద్దిపేట నెహ్రూ యువ కేంద్ర అధికారి కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలుపుతూ రామాయంపేట పట్టణంలో గత 40 సంవత్సరాలుగా క్రీడలకు ప్రోత్సహిస్తూ అనేక శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్న యువజ్యోతి స్పోర్ట్స్ అండ్ యూత్ క్లబ్ కు మెదక్ జిల్లాస్థాయి స్పోర్ట్స్. మీట్ కార్యక్రమాన్ని నెహ్రూ యొక్క కేంద్ర ఆధ్వర్యంలో స్థానిక యువజ్యోతి నిర్వహిస్తుందని తెలిపారు మెదక్ జిల్లా స్థాయి ఈ పోటీలలో వాలీబాల్ కబడ్డీ ఫుట్బాల్ బ్యాట్మెంటన్ సెటిల్ పోటీలను 13 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వరకు యువకులకు బాలురకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉచిత గాని క్రీడాకారులకు క్రీడలు నిర్వహిస్తామన్నారు భోజన సదుపాయము కల్పించడంతోపాటు క్రీడల్లో పాల్గొన్న వారికి కూడా కేంద్ర మంత్రిత్వ శాఖ క్రీడల వారి సర్టిఫికెట్ అందజేస్తామన్నారు క్రీడల్లో పాల్గొన్న వారికి అలాగే విజేతలకు మెరిట్ సర్టిఫికెట్ మెమోటోస్ అందజేయడం జరుగుతుందన్నారు ఈ క్రీడల్లో పాల్గొనడానికి స్థానిక రామాయంపేట యువజ్యోతి కోఆర్డినేటర్ సత్యనారాయణకు పేర్లు అందజేయాలని కోరారు 9 0 00752850 ఫోన్ నెంబర్ కు తెలియజేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు 18 మార్చి చివరి తేదీ కాగా 19 20 తేదీల్లో క్రీడలు నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు
68 వ అండర్ 14 రాష్ట్ర పుట్ బాల్ సెలక్షన్ పోటీలు ప్రారంభించిన
రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జల్లెల చిన్నారెడ్డి
వనపర్తి నేటిదాత్రి : వనపర్తి లో 68వ అండర్ 14 రాష్ట్ర స్థాయి బాల బాలికల ఫుట్ బాల్ సెలక్షన్ పోటీల ను రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ప్రారంభించారు .ఈసందర్భంగా డాక్టర్ చిన్నా రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కువగా ఇష్టపడే వారు గేమ్ ఫుట్ బాల్ అని అన్నారు.వనపర్తి లో హాకీ,ఫుట్ బాల్ క్రీడా పోటీలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది అనిఅన్నారు. వనపర్తి లో హాకీ క్రీడలో జాతీయస్థాయిలో ఆడిన క్రీడాకారులు చాలా ఎక్కువ మంది ఉన్నారని చిన్నారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే మైదానంలో ఫుట్ బాల్ క్రీడను ఆడేవారని చిన్నారెడ్డి గుర్తు చేశారు.రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ క్రీడల పై ఇష్ట పడే వారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసుకుంటున్నా క్వార్టర్స్ లో ఫుట్ బాల్ ఆడటానికి ఒక క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసుకుంటూరని అన్నారు.వనపర్తి పట్టణం లో ఫుట్ బాల్ ,హాకీ స్టేడియాలను నిర్మించుకోవడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని చిన్నారెడ్డి తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున క్రీడాకారులు ఎక్కువ నీళ్లు త్రాగాలని సూచించారు. పోటీపడే క్రీడాకారులు క్రీడా స్ఫూర్తి, స్నేహభావంతో ఆడి అండర్ 14 క్రీడలను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రస్థాయి నుంచి జాతీయస్థాయికి ఆడి తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, కృష్ణ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి, బాల్ రాజ్ ,వెంకట్,మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాగి వేణు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.