రామన్ పాడు గ్రామంలో క్రికెట్ పోటీలు ప్రారంభం

రామన్ పాడు గ్రామంలో క్రికెట్ పోటీలు ప్రారంభించిన సర్పంచ్

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా కొత్త కోట మండలం రామన్ పాడు గ్రామములో
క్రికెట్ టోర్నమెంట్ పోటీలు సర్పంచ్ అఫ్రీన్ బేగం అంజాద్ అలీ ప్రారంభించారు
గ్రామ యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ మూడు రోజులపాటు ఆడుతున్న సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్అఫ్రీన్ బేగం అంజాద్ అలీ ప్రారంభించి టాస్ ఎగర వేసారు ఈ సందర్భంగా సర్పంచ్ యువకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆటలు మానసిక ప్రశాంతతనం ఏకాగ్రతను ఇస్తూ శారీరక దృఢత్వని ఇస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు మాజీ ప్రజా ప్రతినిధులు గ్రామ యువకులు పాల్గొన్నారు

3 సూపర్‌ ఓవర్లతో రికార్డు .

3 సూపర్‌ ఓవర్లతో రికార్డు

 

క్రికెట్‌ మ్యాచ్‌ల్లో స్కోర్లు సమం కావడం అరుదుగా చోటు చేసుకుంటుంది. అలాంటి వేళ విజేతను తేల్చేందుకు సూపర్‌ ఓవర్‌ను నిర్వహిస్తుంటారు. అలాగే సోమవారం రాత్రి…
గ్లాస్గో: క్రికెట్‌ మ్యాచ్‌ల్లో స్కోర్లు సమం కావడం అరుదుగా చోటు చేసుకుంటుంది. అలాంటి వేళ విజేతను తేల్చేందుకు సూపర్‌ ఓవర్‌ను నిర్వహిస్తుంటారు. అలాగే సోమవారం రాత్రి నేపాల్‌-నెదర్లాండ్స్‌ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌ కూడా టై అయ్యింది. అయితే ఇక్కడ ఫలితం తేలేందుకు ఒక్క సూపర్‌ ఓవర్‌ సరిపోలేదు. ఏకంగా మూడుసార్లు ఇరు జట్లు బరిలోకి దిగాల్సి వచ్చింది. ఇప్పటి వరకు టీ20 లేక లిస్ట్‌ ‘ఎ’ మ్యాచ్‌ల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి. ముందుగా నెదర్లాండ్స్‌ 20 ఓవర్లలో 152/7 స్కోరు చేసింది. ఛేదనలో నేపాల్‌ చివరి ఓవర్‌లో రెండు ఫోర్లతో సరిగ్గా 152/8 స్కోరే చేసింది. దీనికి తోడు రెండు జట్లు కూడా తొలి సూపర్‌ ఓవర్‌లో 19, రెండో సూపర్‌ ఓవర్‌లో 17 పరుగులు సాధించడంతో మూడోసారి అనివార్యమైంది. అందులో నేపాల్‌ పరుగులేమీ చేయకుండా 4 బంతుల్లో 2 వికెట్లు కోల్పోగా.. నెదర్లాండ్స్‌ ఓ సిక్సర్‌తో మ్యాచ్‌ను విజయంతో ముగించింది.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version