పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు..

 పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు.. ఆర్సీబీ క్రికెటర్‌పై యువతి ఫిర్యాదు

 

 

 

 

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెటర్ యశ్ దయాల్‌పై ఆరోపణలు చేసింది. తనను మోసం చేసిన యశ్ దయాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ యూపీ సీఎం ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) క్రికెటర్ యశ్ దయాల్ (Yash Dayal) తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి ఆరోపించింది. ఉత్తరప్రదేశ్‌ (UttarPradesh)లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి ఈ ఆరోపణలు చేసింది. తనను మోసం చేసిన యశ్ దయాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ యూపీ సీఎం ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసింది.

ఈ నెల 14వ తేదీన మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశానని, కానీ, వారు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని తెలిపింది. తాను యశ్ దయాల్‌తో ఐదేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతడి ఇంటికి కూడా తీసుకెళ్లాడని తెలిపింది. కాబోయే కోడలు అంటూ ఇంట్లో కూడా పరిచయం చేశాడని, ఆ తర్వాత తనను శారీరకంగా, మానసికంగా హింసించాడని ఫిర్యాదులో పేర్కొంది. అతడికి ఇతర మహిళలతో కూడా సంబంధాలున్నాయని తెలిసిందని తెలిపింది.

యశ్ దయాల్‌తో తాను దిగిన ఫొటోలను, తీసుకున్న వీడియోలను, వీడియో కాల్స్, ఛాటింగ్ స్క్రీన్ షాట్స్‌ను కూడా ఆ ఫిర్యాదుతో పాటు ఆధారాలుగా ఆ యువతి జత చేసింది. యశ్ దయాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు స్పందించిన సీఎం కార్యాలయం సంబంధిత పోలీస్ అధికారుల నుంచి నివేదిక కోరినట్టు తెలుస్తోంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version