చిరకాల స్వప్నం నెరవేరిన వేళ మెదక్ మెడికల్ కాలేజీ మంజూరు చేస్తూ అనుమతులు రావడం శుభ పరిణామం శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు

– జిల్లాలోని యువత డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా తయారు కావాలి. మైనంపల్లి….

– వైద్యా కళాశాల అనుభవిజ్ఞులైన వైద్యాధికారులు పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్…..

 

– దీని వెనుక విశేష కృషి చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమాత్యులు దామోదర్ రాజనర్సింహ….

– జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మెడికల్ యంత్రాంగానికి ధన్యవాదాలు…..

– మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు…..

కొల్చారం, (మెదక్) నేటిధాత్రి :-

బుధవారం మెదక్ మెడికల్ కలశాల మంజూరి సందర్బంగా పీళ్ళికొటాలలో ఉన్న తాత్కాలిక మెడికల్ కళాశాల భవనాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తో కలిసి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పరిశీలించరు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం పక్కన నిర్మించనున్న శాశ్వత మెడికల్ కాలేజీ భవన నిర్మాణ స్థలాన్ని కలెక్టర్ రాహుల్ తో కలిసి ఎమ్మెల్యే రోహిత్ రావు జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏ బ్లాక్, సి బ్లాక్ భావనాలను, సమకూర్చిన, ఫర్నిచర్, పరికరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ మేము అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలలోనే మెడికల్ కాలేజీ మంజూరు అయిందన్నారు. జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేరిన వేళ వైద్య విద్యకు న్యాయం చేసిన వేళ జిల్లాలో యువత ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా తయారయ్యే వేల ఎన్నో అవాంతరాల తర్వాత ఎట్టకేలకు మెదక్ మెడికల్ కాలేజ్ మంజూరి చేసినందుకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కు జిల్లా కలెక్టర్ కు, అధికారులకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కృతజ్ఞతలు తెలిపారు.
నర్సింగ్ కళాశాల,మెడికల్ కళాశాల ఒకే ప్రాంగణంలో ఉండే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ కు ఎమ్మెల్యే సూచించారు.
జిల్లా అభివృద్ధికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అనంతరం పీళ్ళికొటాలలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన మెడికల్ కళాశాల భూమిని
శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ పరిశీలించి భవన నిర్మాణాలకు
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకున్నట్లు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లా పునర్విభజనలో భాగంగా మెదక్ ప్రత్యేక జిల్లా అయినా కూడా అంత అభివృద్ధి చెందలేదని జిల్లా అభివృద్ధిలో విద్యా ,వైద్యం సౌకర్యాలు మెరుగు ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పారు వైద్య కళాశాల మంజూరు కావడం దీని వెనక విశేష కృషి చేసిన జిల్లా మంత్రివర్యులు, శాసనసభ్యులు, హెల్త్ సెక్రెటరీ , ధన్యవాదాలు తెలిపారు. అనుభవజ్ఞులైన వైద్యాధికారులు ఉండడం స్థానికంగా ఉండి పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలని వైద్య కళాశాల అభివృద్ధికి కృషి చేస్తున్న మెడికల్ యంత్రాంగానికి అభినందనలు తెలిపారు.
అంతకుముందు మెదక్ పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు రాందాస్ చౌరస్తాలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి,మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చిత్ర పటాలకు పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి మిఠాయిలు తినిపించకుని సంబరాలు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రవీందర్, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ శివ దయాల్, తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్
వార్డ్ కౌన్సిలర్లు, వివిధ ప్రభుత్వ అధికారులు , మెడికల్ కళాశాల సిబ్బంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

మేడిపల్లి లో రాచకొండ కమిషనరేట్ నూతన భవన సముదాయ శంకుస్థాపన…

ప్రజా సంక్షేమానికే మా ప్రథమ ప్రాధాన్యం…

శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్న పోలీసు శాఖకు అండగా ఉంటాం హోం మంత్రి మహమూద్ అలీ…

 

*ప్రజల రక్షణ కోసం, ప్రజా సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు పాటుపడుతోందని తెలంగాణ హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ పేర్కొన్నారు.
ఈరోజు మేడిపల్లిలోని రాచకొండ కమిషనర్ నూతన భవన నిర్మాణ సముదాయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హోం మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత శాంతి భద్రత విషయంలో ఎన్నో సందేహాలు ఉండేవని, ముఖ్యమంత్రి కెసిఆర్ దార్శనికత వల్ల, వారు తీసుకున్న చర్యల వల్ల ఇప్పుడు తెలంగాణ ప్రశాంతంగా ఉందని పేర్కొన్నారు. రాచకొండ కమిషనరేట్ దేశంలోనే విస్తీర్ణపరంగా అతిపెద్ద కమిషనరేట్ అని, నగర పరిధినే కాక ఇతర సమీప జిల్లాలను కూడా కలుపుకొని పనిచేస్తూ జంట నగరాల శాంతిభద్రతల పరిరక్షణలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత పోలీసు శాఖకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం అధిక బడ్జెట్ కేటాయించడం నూతన పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా శాంతిభద్రతల వ్యవస్థను బలోపేతం చేశామని తెలిపారు. ఈరోజు సీసీటీవీలో కెమెరాల సంఖ్యలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని పోలీస్ పెట్రోలింగ్ కోసం ఇన్నోవాలను ఇచ్చిన ప్రథమ రాష్ట్రం తెలంగాణ అని హోమ్ మంత్రి పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న పోలీస్ శాఖకు అన్నివేళలా ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి అవసరమైన అన్ని రకాల తోడ్పాటును అందిస్తామని హోమంత్రి పేర్కొన్నారు.
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాచకొండ కమిషనరేట్ యొక్క నూతన భవన సముదాయ నిర్మాణాన్ని తమ నియోజకవర్గ పరిధిలో ఉన్న మేడిపల్లిలో ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాచకొండ పరిధిలో ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయని, నగరం విస్తరిస్తోందని తద్వారా నేరాలు కూడా పెరిగే అవకాశం ఉందని కానీ రాచకొండ పోలీసుల సమర్థవంతమైన పనితీరు, కృషి వల్ల నేరాలు జరగకుండా ప్రశాంతంగా ఉందని పేర్కొన్నారు.
రాచకొండ కమిషనర్ డి ఎస్ చౌహన్ ఐపీఎస్ మాట్లాడుతూ… విస్తీర్ణపరంగా రాచకొండ కమిషనరేట్ దేశంలోనే అతి పెద్దదని, నగరంలోని కొన్ని ప్రాంతాలతో పాటు పక్కనే ఉన్న జిల్లాలోని ప్రాంతాలను కూడా కలుపుకొని రాచకొండ కమిషనరేట్ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించడానికి తోడ్పడేలా కేటాయించిన స్థలంలో సువిశాల ప్రాంగణంలో నూతన కమిషనరేట్ భవన సముదాయ నిర్మాణం జరగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న వివిధ రకాల పోలీసు విభాగాల అధికారులు మరియు సిబ్బందికి సంబంధించిన భవనాలు అన్ని ఈ ప్రాంగణంలో ఉంటాయని కమిషనర్ పేర్కొన్నారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలను అదుపులో ఉంచడానికి నేరశాతం తగ్గించడానికి మహిళల పట్ల నేరాలను హింసను తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుండి నగరంలోకి వస్తున్న అక్రమ మాదకద్రవ్యాల ముఠాలను పట్టుకొని ఎన్నో కేసులు నమోదు చేశామని తెలిపారు. మానవ అక్రమ రవాణా అరికట్టడానికి ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి అటువంటి ముఠాల మీద ఉక్కు పాదం మోపుతున్నామన్నారు. ప్రజా సంక్షేమం కోసం శాంతి భద్రత పరిరక్షణ కోసం రాచకొండ కమిషనర్ ఎల్లవేళలా పాటుపడుతుందని కమిషనర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ట్రాఫిక్ అభిషేక్ మహంతి ఐపిఎస్, డీసీపీ మల్కాజ్గిరి జానకి ఐపిఎస్, ఎల్బీనగర్ డిసిపి సాయి శ్రీ, డీసీపీ సైబర్ క్రైం అనురాధ, ఐపీఎస్ SOT- 1 డిసిపి గిరిధర్ ఐపీఎస్, SOT- డీసీపీ మురళీధర్, రోడ్ సేఫ్టీ డీసీపీ శ్రీబాలా, అడిషనల్ డీసీపీలూ, ఏసిపిలు
పీర్జాదిగూడా మరియు బోడుప్పల్ మేయర్లు జక్క వెంకటరెడ్డి & సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్లు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి, రెండు కార్పొరేషన్ల మున్సిపల్ కమిషనర్లు,స్థానిక MRO, ఇతర వివిధ సంస్థల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు, అన్ని మీడియా ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

ఓటు బ్యాంకు రాజకీయాలు, తెలంగాణను అభివృద్ధి చేయడంలో బీజేపీ, కాంగ్రెస్ వైఫల్యాలపై కేటీఆర్ మండిపడ్డారు

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని, తెలంగాణ అవసరాలను తీర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు.

హైదరాబాద్: తెలంగాణ అవసరాలను తీర్చడంలో విఫలమైందని, విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు హామీలను అవహేళన చేస్తూ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రమైనా వాటిని అమలుచేస్తోందని సవాల్‌ విసిరారు.

మంగళవారం తెలంగాణ భవన్‌లోని బీఆర్‌ఎస్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన సత్యనారాయణతో పాటు ఇతర నేతలను రామారావు లాంఛనంగా చేర్చుకున్నారు.

సభను ఉద్దేశించి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశానికి, ముఖ్యంగా తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. “రాష్ట్రం ఏర్పడిన కొద్దిసేపటికే, బిజెపి నేతృత్వంలోని కేంద్రం పూర్వ ఖమ్మం జిల్లా నుండి ఐదు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేసింది, దిగువ సీలేరు జలవిద్యుత్ స్టేషన్‌ను అప్పగించింది మరియు గత తొమ్మిదేళ్లలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం నిబంధనలను అమలు చేయడంలో విఫలమైంది” అతను \ వాడు చెప్పాడు.

నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడానికి, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల సృష్టికి సంబంధించిన హామీలను ప్రధాని నెరవేర్చలేదని రామారావు మోదీ ఎన్నికల వాగ్దానాలను లక్ష్యంగా చేసుకున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను పణంగా పెట్టి మోదీ తన కార్పొరేట్ స్నేహితులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పెరుగుతున్న ఇంధనం, ఎల్‌పిజి సిలిండర్ ధరలను నియంత్రించడంలో బిజెపి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. గత యూపీఏ ప్రభుత్వాన్ని కూడా ఇవే అంశాలపై విమర్శించినప్పటికీ డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనాన్ని ఆయన ఎత్తిచూపారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు బీజేపీ వద్ద పరిష్కారాలు లేవని అన్నారు.

తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, కేంద్రంలో అధికారాన్ని నిలుపుకోవడానికి బిజెపి ఫిరాయింపు వ్యూహాల ద్వారా ‘చౌక రాజకీయాలను’ ఉపయోగిస్తోందని, మత ఉద్రిక్తతలను దోపిడీ చేయడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మరియు విభజించడానికి ప్రయత్నిస్తుందని పరిశ్రమల మంత్రి పేర్కొన్నారు. “ది కాశ్మీర్ ఫైల్స్”, “ది కేరళ స్టోరీ” మరియు ఇప్పుడు “రజాకార్ ఫైల్స్” వంటి చిత్రాలతో పాత గాయాలను తొలగించడానికి బిజెపి ప్రయత్నిస్తోంది, భావోద్వేగాలను మార్చడానికి బిజెపి ప్రయత్నిస్తోంది.

చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా వైజాగ్ విమానాశ్రయంలో ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు

మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి విమానంలో వచ్చిన తర్వాత ప్రయాణికులు భిన్నమైన ప్రవర్తనను ప్రదర్శించారు. ఆడారి కిషోర్ కుమార్ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ చురుగ్గా ఉండగా, అవతలి వ్యక్తి నిరసనలో పాల్గొనకుండా పక్కనే ఉన్నాడు.

విశాఖపట్నం: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ విశాఖపట్నం విమానాశ్రయంలో నిరసనకు దిగిన ఇద్దరు ప్రయాణికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అరైవల్ లాంజ్ నుండి బయటకు వచ్చిన వెంటనే, ప్రయాణీకులలో ఒకరు ప్లకార్డు ప్రదర్శించి తెలుగుదేశం పార్టీ (టిడిపి) అరెస్టును ఖండిస్తూ నినాదాలు చేశారు. రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ జోక్యాన్ని డిమాండ్ చేస్తూ “ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి” అని ఆయన అరిచారు.

మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి విమానంలో ప్రయాణికులు వచ్చారు. ఆడారి కిషోర్‌కుమార్‌గా గుర్తించిన వారిలో ఒకరు మాత్రమే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తుండగా, మరొకరు పక్కనే నిలబడి ఉన్నారు.

విమానంలో ప్రయాణీకుడు ‘సేవ్ డెమోక్రసీ’ ప్లకార్డును ప్రదర్శిస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.

371 కోట్ల స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో నంద్యాలలో సెప్టెంబర్ 9న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి) నయీంను అరెస్టు చేసింది. విజయవాడలోని కోర్టు అతడిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.

నయీం అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆందోళనలు చేస్తోంది.

బిజేపి అరువు…కాంగ్రెస్‌ కరువు!?

https://epaper.netidhatri.com/

`ఉన్న నేతలు ఊడుతున్న బిజేపి.

` సీనియర్లకు కూడా గెలుస్తామన్న నమ్మకం లేదా?

`కేంద్ర నాయకత్వం భరోసా అంతంత మాత్రమేనా?

` వస్తున్నారు…పోతున్నారు…కేంద్ర పెద్దలు.

`బండిని తొలగించడంతో వున్న వాళ్లు పోతున్నారు.

` కొత్త నేతలతో కాంగ్రెస్‌ లో పాత నేతలకు తలనొప్పులు.

` గెలుస్తామన్న విశ్వాసం సీనియర్లలోనే లేదు.

`ఖర్చు చేయడం అంటే వున్నది ఊడ్చేసుకోవడమే?

`పార్టీ గెలిచినా ప్రాధాన్యత వుంటుందన్న భరోసా లేదు.

`ముందట పడితే రేవంత్‌ కు మేలు చేసినట్లౌతుంది.

`రండి…రండి…అనకోవడమే.

`అభ్యర్థుల ప్రకటన చేస్తే ఓ తంట…చేయకుంటే మరో తంట.

`ముందడుగులు దేవుడెరుగు! అన్నీ వెనకడుగులే!!
హైదరబాద్‌,నేటిధాత్రి:

రాజకీయ పార్టీలకు ఉపు అంటే ఊరికే వచ్చేది కాదు. ప్రజా మద్దతు అంటే మాటలు కాదు. అధికారంలోకి రావడం అంటే ఆటలు కాదు. పాలించాలంటే పార్టీ ఒక్కటే కాదు, దాని పనితనం, దానిలో పనిమంతులు కూడా వుండాలి. తెలంగాణ విషయానికి వస్తే ప్రజలు అటు కాంగ్రెస్‌ను గాని, ఇటు బిజేపిని కాని ఎందుకు నమ్మాలే? అన్న ప్రశ్నకు సమాదానం ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే 2004 ఎన్నికల ముందు బిఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకొని, గెలిచి పదేళ్లపాటు తెలంగాణ ప్రజలను అరిగోస పెట్టించింది కాంగ్రెస్‌. 1998లో ఒక ఓటు రెండు రాష్ట్రాలంటూ తీర్మాణం చేసిన బిజేపి 1999లో కేంద్రంలో అధికారంలోకి వచ్చి రాజధాని నగరమే హైదరాబాద్‌లో వుంది. ఇక ప్రత్యేక రాష్ట్రమెందుకని మాట్లాడిరది బిజేపి. ఇలా రాజకీయ అవసరాల కోసం పిల్లిమొగ్గలేసి, తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకున్న పార్టీలు ఈ రెండు. వాటిని నమ్మాలంటే ప్రజలు ఇప్పుడు సుముఖంగా లేదు. తెలంగాణ ఆంధ్రలో విలీనం చేసి, 1956లో పెనం మీద వున్న తెలంగాణను పొయ్యిలో వేసిందే కాంగ్రెస్‌ పార్టీ. తెలంగాణ ప్రజలు అప్పటి నైజాం నవాబుకు వ్యతిరేకంగా రాజరికాన్ని దిక్కరించి సాయధ పోరాటం చేసి, తెలంగాణ దాస్య శృంఖలాలను తెంచుకొని స్వరాష్ట్రమై ఐదేళ్లు మూడేళ్లు స్వయం పాలన సాగింది. అలా మూడేళ్లు గడిచిందో లేదో బాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఆంధ్రలో కలిపి, గంగలో ముంచినంత పని చేశారు. తెలంగాణకు మళ్లీ వాతలు పెట్టారు. ప్రజల గోస పుచ్చుకున్నారు. ఆనాడే ఆంధ్రతో కలవమంటూ తెలంగాణ ప్రజలు ఎంత మొత్తుకన్నా వినకుండా ఆంధ్రలో కలిపేశారు. పెత్తనం వారి చేతిలో పెట్టి, తెలంగాణ మోచేతికి బెల్లం అంటించి నాకించారు. అలాంటి కాంగ్రెస్‌ పార్టీ తప్పని పరిస్ధితుల్లో, అనివార్యమై తెలంగాణ 2014లో ఇచ్చిందే కాని, తెలంగాణ ప్రజలమీద గౌరవంతో ఇవ్వలేదు. రాజకీయంగా పార్టీ నామరూపాలు లేకుండాపోయే ప్రమాదముందని గ్రహించి ఇచ్చారు. అయితే అప్పటికే పుణ్య కాలం పూర్తయింది. ఇక కాంగ్రెస్‌ను మళ్లీ నమ్మితే నట్టెట ముంచుతుందన్న భయంతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ అంటేనే ఆమడ దూరం తరిమేస్తున్నారు. అందులోనూ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కొందరు మాత్రమే జై తెలంగాణ అన్నారు. కాని అప్పటి కాంగ్రెస్‌ అధిష్టానం ఎలాగైనా తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం, భరోసా కల్గిన తర్వాతనే తెలంగాణ కోసం ఆలోచించారు. 2004 ఎన్నికల్లో తెలంగాణ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ 2009 ఎన్నికల దాకా ఆ ఊసే ఎత్తలేదు. పైగా కాంగ్రెస్‌ నాయకులు అడుగడుగునా ఉద్యమాన్ని అడ్డుకున్నారే గాని, సహకరించలేదు. ఎంత సేపు వైఎస్‌ కళ్లలో పడాలని, ఆయన చేత పదువుల పొందాలన్న తపన తప్ప, తెలంగాణ కోసం పోరాడేందుకు ఏ ఒక్క తెలంగాణ నాయకుడు ముందుకు రాలేదు. వైఎస్‌. మరణం తర్వాత గాని తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులకు సోయి రాలేదు. వైఎస్‌ మత్తు తొలగలేదు. 2009 డిసెంబర్‌ 9న తెలంగాణ ప్రకటన చేసి, కేంద్రం యూటర్న్‌ తీసుకుంటే రాజీనామా చేయమంటే కూడా చేయలేదు. కొందరు చేసినా, మళ్లీ వెంటనే వెనక్కి తీసుకున్నారు. ఇదీ కాంగ్రెస్‌ నాయకుల చరిత్ర. అయినా కనీసం ఆ నాయకుల పెత్తనం కూడా నేడు కాంగ్రెస్‌లో లేదు. తెలంగాణను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేసిన రేవంత్‌రెడ్డి నాయకత్వంలో నడుస్తోంది. అలాంటి కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం అనేది కల. ఇక పక్క రాష్ట్రంలో కాంగ్రెస్‌ గెలిచిందన్న ఊపు తప్ప, తెలంగాణ ప్రజల మన్ననలు చూరగొన్నది ఏనాడు లేదు. అసలు మొన్నటి దాక బిజేపి ఊపు చూపించింది. అప్పుడే నేటిధాత్రి కుండబద్దలు కొట్టిచెప్పింది. అది వాపు తప్ప బలం కాదని తేల్చి చెప్పింది. అదే బిజేపి విషయంలో నిజమైంది. ఉప ఎన్నికల పుణ్యమా? అని బిజేపిలో కదలిక వచ్చినట్లు కనిపించింది. కాని అదంతా డొల్ల అంటూ నేటిధాత్రి చెబుతూనే వచ్చింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్‌ పని అయిపోయినట్లే అన్నంతగా బిజేపి ఊపు మీద వున్నట్లు కనిపించింది. కాని కర్నాటక ఎన్నికల ఫలితాలతో బిజేపి గాలిబుడగ పగిలిపోయింది. బండి సంజయ్‌ ని అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో బిజేపిలో కొద్దో గొప్పో వున్న ఆ మాత్రం గాలి కూడా లేకుండాపోయింది. ఇప్పుడు పూర్తిగా చతికిలపడిపోయింది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఆది నుంచి బిజేపి తెలంగాణకు వ్యతిరేకంగానే వుంది. తెలంగాణ ఇస్తామని బిజేపి ఏనాడు చెప్పలేదు. ఒక ఓటు రెండు రాష్ట్రాల తీర్మానం చేసిన తర్వాత చత్తీస్‌ఘడ్‌, రర్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ మూడురాష్ట్రాలు ఏర్పాటు చేసింది. కాని తెలంగాణ ఇవ్వలేదు. అందుకు అప్పటి ఎన్డీయేలో చంద్రబాబు బాగస్వామి కావడమే. కేవలం చంద్రబాబు కోసం తెలంగాణ ఇవ్వకుండా అన్యాయం చేసింది బిజేపి. ఆ తర్వాత కూడ తెలంగాణ బలమైన ఆకాంక్ష కళ్లముందు కనిపించిన తర్వాత సుష్మాస్వరాజ్‌ మాత్రమే పట్టుబట్టి తెలంగాణకు న్యాయం జరగాలని కోరింది. తెలంగాణ పక్షం నిలిచింది. కాని ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఆది నుంచి తెలంగాణపై విషం చిమ్ముతూనే వున్నాడు. 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సమయంలో తల్లిని చంపి బిడ్డను బ్రతికించారాన్నరు. అంటే ఆయనకు తెలంగాణ ఇవ్వడం సుతారం ఇష్టం లేదన్నది తేలిపోయింది. అంతే కాదు పార్లమెంటు తలుపు మూసి తెలంగాణ ఇచ్చారని అన్నారు. ఇదే విషయాన్ని సాక్ష్యాత్తు పార్లమెంటులో కూడా చెప్పి, తెలంగాణపై కేంద్రానికి ఎంత అక్కసు వుందో చెప్పకనే చెప్పారు. మరి అలాంటి బిజేపి పెద్దలు తెలంగాణకు న్యాయం చేస్తారని ప్రజలు భావించడంలేదు. అందుకే బిజేపిని అక్కున చేర్చుకోడం లేదు. ఆదరించేందుకు ఇష్టపడడం లేదు. ఒక దశలో బిజేపిలోకి కాంగ్రెస్‌నుంచి పెద్దఎత్తున వలసలు వెళ్లాయి. కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని నిర్ధారించుకున్న ఎంతో మంది కాంగ్రెస్‌నేతలు బిజేపిలో చేరిపోయారు. ఆఖరుకు ఇక కాంగ్రెస్‌లో వున్నా లాభం లేదనుకున్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బిజేపిలోకి వెళ్లి మునుగోడు ఉప ఎన్నిక తెచ్చారు. ఇక ఆ ఎన్నికలో గెలిచి, సార్వత్రిక ఎన్నికల్లో బిజేపి అదికారంలోకి వస్తే నేనే సిఎం అన్నంతగా ఆశల పల్లకిలో ఊరేగారు. ఏమైంది ఉన్న పదవి పోయింది. మాజీ అన్నది వచ్చి చేరింది. చివరకు పార్టీలో తనకు గుర్తింపు లేకుండా పోతోందని మధనపడుతున్నాడు. కాంగ్రెస్‌లో వున్నంత కాలం కాంగ్రెస్‌కు రోజులు లేవన్నాడు. ఇప్పుడు బిజేపికి కష్టకాలమే అంటున్నాడు. బండి సంజయ్‌ అధ్యక్షుడిగా వున్న సమయంలో ఇక బిఆర్‌ఎస్‌నుంచి అదిగో వచ్చె, ఇదిగో వచ్చే అంటూ లెక్కలేసి మరీ చెప్పారు. ఆ మాటలు నమ్మి కాంగ్రెస్‌ నేతలు పార్టీ వదిలి కొంత మంది బిజేపిలో చేరారు. ఇప్పుడు వాళ్లంతా కాంగ్రెస్‌ వైపు అడుగులేస్తున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్‌ ఇప్పుడు నాయకుల కరువులో వుంది. బిజేపి అరువు నేతలు తిరిగి వలసలు వెళ్తుంటే కుమిలిపోతోంది…

చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన టిడిపి నేతలు

 

రామడుగు, నేటిధాత్రి:

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమంగా అరెస్టు చేయించి జైల్లో పెట్టడాన్ని నిరసిస్తూ కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి జంగం అంజయ్య ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి కేవలం రాబోవు ఎన్నికలలో ఓడిపోతానని భయంతో చంద్రబాబు నాయుడుకి సంబంధంలేని పాత కేసును తిరగదొడి ఎఫ్ఐఆర్ లో తన పేరు లేకున్నా కావాలని సిఐడినీ అడ్డం పెట్టుకొని అధికారం ఉంది కదా అని అరెస్టు చేయించి గత మూడు రోజులుగా చంద్రబాబు నాయుడుని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితిని తెలుగు ప్రజలు గమనిస్తున్నారు, అతన్ని జైలుకు పంపడంతో తెలుగు ప్రజలే కాక యావత్ భారతదేశం నిర్గాంత పోయింది, ఒక మచ్చలేని నాయకుడు ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిన నాయకుడిని అరెస్టు చేయడం తెలుగు ప్రజలను ఉక్రోసానికి గురిచేస్తుంది, ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూనీ చేయబడింది, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కాకుండా కేవలం రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పే అటువంటి రోజు దగ్గరలోనే ఉందని, బేషరతుగా చంద్రబాబు నాయుడుని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి దామెర సత్యం, మండల పార్టీ అధ్యక్షులు అమీరిశెట్టి సుధాకర్, కరీంనగర్ పార్లమెంటు ఎస్సీ సెల్ అధ్యక్షులు బోలుమాల సదానంద, పార్లమెంటు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు కోరే గట్టయ్య, మండల పరిషత్ ఉపాధ్యక్షులు పూరెల్ల గోపాల్ గౌడ్, మండల పార్టీ జనరల్ సెక్రెటరీ వెంకటేష్ గౌడ్, వార్డు మెంబర్ జవ్వాజి కాంతయ్య, గంటే మునిందర్, పూరెల్ల మనోజ్, గుర్రం శ్రీకాంత్, మిరియాల సంపత్ రెడ్డి, గోదారి కనకయ్య, వోడ్నాల అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

తుమ్మల నీ బలమెంత!

 

తుమ్మితే ఓడిపోయేంత!!

ఆనాడు ఎన్టీఆర్‌ కు ద్రోహం చేస్తివి.

ఇప్పుడు స్నేహనికి మచ్చ తెస్తివి.

తిన్నింటి వాసాలు లెక్కబెడితివి?

స్నేహానికి కేసిఆర్‌ విలువిస్తే, మిత్ర ద్రోహానికి పాల్పడితివి.

తెలంగాణ ఉద్యమంలో లేనే లేకపోతివి.

2014 తెలుగు దేశం నుంచి పోటీ చేసి ఓడిపోతివి.

అనారోగ్యం పాలైతే కేసిఆర్‌ కాపాడే.

ఓడిన నిన్ను తెచ్చి ఎమ్మెల్సిని చేసే.

తర్వాత మంత్రి పదవి ఇచ్చే.

పాలేరు నుంచి టికెట్‌ ఇచ్చి ఎమ్మెల్యేను చేసే.

2018 లో బిఆర్‌ఎస్‌ ప్రభంజనంలో కూడా ఓడిపోతివి.

బలమైన నాయకుడివే అయితే 2004 లో కూడా ఎందుకు ఓడితివి.

సత్తుపల్లి ప్రజలు నెత్తిన పెట్డుకుంటే పని చేయకపోతివి.

ఖమ్మం పారిపోయి పోటీ చేస్తివి.

ఖమ్మం ప్రజలు ఓడిస్తే రిటైర్‌ మెంటు తీసుకుంటా అంటివి.

బీఆర్‌ఎస్‌ దయతలిస్తే ఇంత కాలం రాజకీయంలో వుంటివి.

పదవులిచ్చి అందలమెక్కించినా ప్రజాభిమానం చూడగొనకపోతివి.

ఊపులో బిఆర్‌ఎస్‌ పార్టీ వున్నా ఒక్క ఓటుతోనైనా గెలవకపోతివి.

నమ్మకాన్ని వమ్ము చేస్తివి….స్నేహానికి ద్రోహం చేస్తివి.

హైదరబాద్‌,నేటిధాత్రి:

నమ్మిన వారికి సున్నం పెట్టుడు తుమ్మలకు ఆది నుంచి అలవాటే. ఆది నుంచి తుమ్మల నెరుపుతున్న రాజకీయం అదే. అది గమనించకనే ముఖ్యమంత్రి కేసిఆర్‌ కూడా తుమ్మల విషయంలో తప్పటడుగు వేశారు. ఎవరికైనా జీవితంలో ఆత్మ విమర్శ అనేది వుండాలి. అది లేకపోతే ఎంత ఎత్తుకు ఎదిగినా వృధానే. ఎంత పేరు సంపాదించకున్నా గంగపాలే. ఎవరి వల్ల పేరు వచ్చిందో వారికే సున్నం పెట్టడం అన్నది తుమ్మల లాంటి వారికి వెన్నతోపెట్టిన విద్యే. తిన్నింటి వాసాలు లెక్కపెట్టడంలో ముందుంటారు. నమ్మిన వారిని మోసం చేయడానికి ఎప్పుడూ సిద్దంగా వుంటారు. ఎవరైనా ఎప్పుడైనా నట్టెట ముంచడానికి వెనుకా ముందు ఆలోచించరు. అసలు తుమ్మలకు ఖమ్మంలో వున్న బలమెంత? ఏం చూసుకొని తుమ్మల తన బలమైన నాయకుడు అనుకుంటున్నారో అర్ధం కావడంలేదు. ఎందుకంటే నిజంగా తుమ్మల నాగేశ్వరరావు 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున ఖమ్మం నుంచి పోటీ చేసి ఓడిపోయిన నాయకుడు. ఆ తదనంతరం ఇక రాజకీయాలకు దూరం కావాలని కూడా నిర్ణయం తీసుకున్నాడు. తెలంగాణ రాజకీయాల్లో తనను ప్రజలు నమ్మకపోవచ్చు? అన్న మాట కూడా ఓ దశలో మాట్లాడాడు. భద్రాచల శ్రీరాముని సేవలో తరిస్తానంటూ వేదాంతం మాట్లాడాడు. ఎన్నికల్లో ఓడిన తర్వాత కొంత కాలానికి అనారోగ్యం చెందారు. ఈ విషయం తెలియడంతో ముఖ్యమంత్రి కేసిఆర్‌ స్వయంగా ఆసుపత్రికి తుమ్మలను పరామర్శించారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించారు. పైగా ఆయన కోలుకున్న తర్వాత శుభవార్త చెబుతానని చెప్పి ధైర్యం చెప్పారు. తుమ్మల కోలుకున్న తర్వాత ఆయనను మంత్రి పదవిలోకి తీసుకున్నాడు. అనంతరం ఎమ్మెల్సీ చేశాడు. అనుకోకుండా పాలేరుకు ఉప ఎన్నిక వస్తే, తుమ్మలను రంగంలోకి దింపి ముఖ్యమంత్రి కేసిఆర్‌ గెలిపించారు. ఇలా తుమ్మలకు ఎనలేని ప్రాధాన్యతనిచ్చారు. తెలంగాణలో ఎవరికీ ఇవ్వనన్ని డబుల్‌ బెడ్‌ రూంలు తుమ్మలకే ఇచ్చాడు. తొలి డబుల్‌ బెడ్‌ రూంల అందజేసే కార్యక్రమానికి తుమ్మల ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రకటనలకు కూడా అనుమతినిచ్చారు. నిజానికి అలాంటి కొత్త కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసిఆర్‌ హాజరు కావాలి. అయినా మిత్రుని కోసం, ఆయనకు పేరు కోసం తుమ్మలనే ముందుంచారు. అంతటి ప్రాధాన్యతనిచ్చారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో తెలంగాణలో బిఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టించింది. ఉప ఎన్నికలో 48వేల మెజార్టీతో గెలిచిన తుమ్మల, 2018 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా బిఆర్‌ఎస్‌ తిరుగులేని విజయం సాధించింది. కాని తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయారు. అంటే అంతటి బిఆర్‌ఎస్‌ గాలిలో ఓడిన తుమ్మల ఇంకా తనకు అన్యాయం జరిగిందని చెప్పడం విడ్డూరం. 2014లోనే తుమ్మల రాజకీయ జీవితానికి పుల్‌ స్టాప్‌ పడేది. కేవలం తుమ్మల స్నేహిడన్న కారణంతో అందలమెక్కిస్తే, తనకు అన్యాయం జరిగిందని తుమ్మల చెప్పడం హాస్యాస్పదం. నిజానికి తుమ్మల ఇలాంటి పరిస్ధితుల్లో ముఖ్యమంత్రి కేసిఆర్‌కు తోడుగా నిలబడాల్సిన సమయం. పార్టీకి అండగా వుండాల్సిన తరుణం. ఖమ్మంను బిఆర్‌ఎస్‌కు కంచుకోట చేయాల్సిన అసవరం. కాని వాటిని తుమ్మల విస్మరించారు. తన భవిష్యత్‌ రాజకీయం కోసం పార్టీ మారుతున్నారు. ఇలాంటి నీతి లేని నాయకులకు ప్రజలు కూడా గుణం పాఠం చెబుతారు.
సొంతంగా బలమైన నాయకుడే అయితే 1983లో ఎందుకు ఓడిపోయినట్లు. 2004లో ఎందుకు ఓడినట్లు. 2014లో ఎందుకు పరాజయం పాలైనట్లు.
తుమ్మల నిజంగానే తన రాజకీయ జీవితంలో ఓటమెరుగని నాయకుడు అంటే అది వేరే విషయం. కాని తెలుగుదేశం 1983లో టికెట్‌ ఇస్తే ఓడిపోయాడు. అయినా ఆనాడు ఎన్టీఆర్‌ మళ్లీ 1985లో టికెట్‌ ఇచ్చాడు. దాంతో ఎన్టీఆర్‌ గాలిలో గెలిచాడు. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైనా తుమ్మలకు ఎన్టీఆర్‌ మంత్రిని చేశారు. ఆ కృతజ్ఞత మర్చిపోయిన తుమ్మల 1994 తర్వాత జరిగిన పరిణామాలలో చంద్రబాబుకు తోడుగా నిలిచారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటులో సహకారం అందించారు. తర్వాత చంద్రబాబు కూడా ఎంతో ఆత్మీయంగానే చూసుకున్నారు. 1999లో కూడా మళ్లీ మంత్రి పదవి ఇచ్చారు. అలా రాజకీయ బిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీని వదిలే ప్రసక్తి లేదంటూ భీరాలు పలికారు. అయితే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకపోయినా, తెలంగాణ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పి బిఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు మళ్లీ తనకు బిఆర్‌ఎస్‌లో అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్‌ కండువా కప్పుకునేందుకు సిద్దమయ్యాడు. అంతే కాదు 2018లో తన ఓటమికి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కారణమంటూ పలుసార్లు చెప్పి, ఇప్పుడు అదే పొంగులేటి నేతృత్వంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకునేందుకు సిద్దపడడాన్ని ప్రజలు ఎలా స్వాగతిస్తారన్నది కూడా తుమ్మల మర్చిపోతున్నాడు.
పార్టీలను, నాయకులనే కాదు నియోజకవర్గాలకు కూడా తుమ్మల అన్యాయమే చేస్తూ వచ్చాడు.
తుమ్మలకు రాజకీయ జీవితం ఇచ్చింది సత్తుపల్లి నియోజకవర్గం. ఆయనను వరుసగా గెలిపిస్తూ వస్తున్నారు సత్తుపల్లి ప్రజలు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ గాలిలో తుమ్మల ఓటమిపాలయ్యారు. నిజంగా ఖమ్మంలో పార్టీ అప్పటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా వుంటూ ఓడిపోయారు. పదేళ్లు మంత్రిగా పనిచేసినా ప్రజలు గెలిపించలేదు. నిజంగా ఖమ్మం జిల్లాకు, ముఖ్యంగా సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పడితే 2004 ఎన్నికల్లో తుమ్మల ఎందుకు ఓడిపోయినట్లు. అంటే తుమ్మల స్వతహాగా ఎప్పుడూ గెలిచిన పరిస్ధితి లేదు. తెలుగుదేశం పార్టీ గాలిలో గెలవడం తప్ప, నిజమైన ప్రజాబలంతో గెలవలేదు. పైగా 2018లో బిఆర్‌ఎస్‌ ప్రభంజనం తెలంగాణ వ్యాప్తంగా సాగితే, తుమ్మల ఓడిపోవడం అంటేనే ఆయన బలమెంతో? అర్ధం చేసుకోవచ్చు. సత్తుపల్లి ప్రజలు తుమ్మితే ఓడిపోయి ఖమ్మం పారిపోయిన తుమ్మల అక్కడి నుంచి తరిమితే పాలేరు దారి పట్టారు. అక్కడ కూడా ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా ఇంకా నేను బలమైన నాయకుడిని అని తుమ్మల చెప్పుకోవడం విచిత్రం. ఆయన విడ్డూరం.
నిజానికి ముఖ్యమంత్రి కేసిఆర్‌ తుమ్మల నాగేశ్వరరావుకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు.
తనతోపాటు సుధీర్ఘ కాలంపాటు ఉద్యమ సహచరులై, మంత్రులైన వారికంటే కూడా తుమ్మలకు సీనియర్‌ నేతగా ఎంతో గౌరవం ఇచ్చారు. పార్టీలో మంత్రి కేటిఆర్‌తోపాటు, హరీష్‌రావు లాంటి వారికన్నా ఎక్కువ గుర్తింపు తుమ్మలకు కల్పించారు. అయినా అది తుమ్మల నిలుపుకోలేదు. తన ఓటమిని తానే కొని తెచ్చుకొని నీడనిచ్చిన బిఆర్‌ఎస్‌ను కాదనుకొని, అక్కున చేర్చుకున్న ముఖ్యమంత్రి కేసిఆర్‌ను కాదనుకొని వెళ్లి తుమ్మల సాధించేదేమీ లేదు. ఆయన రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్‌లో కనిపించడం లేదు. ఎందుకంటే తన జీవితాతంతం కాంగ్రెస్‌ని నిందిస్తూ రాజకీయం చేసిన తుమ్మల అదే కాంగ్రెస్‌ గూటికి చేరుకోవడం అంటేనే పదవుల కోసం, రాజకీయం అవసరాల కోసం ఆత్మాభిమానం తాకట్టు పెట్టుకోవమే..!

ఎంపీ వద్దిరాజు ఇనుగుర్తికి అంబులెన్స్ అందజేత

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నారు.తన సొంతూరు మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తికి అంబులెన్స్ అందించారు.రవిచంద్ర తాను ఎంపీ అయిన కొద్ది రోజుల్లోనే ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న ఇనుగుర్తి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయించడమే కాక అన్ని విధాలా అభివృద్ధిపరుస్తున్నారు.తాజాగా ఇప్పుడు తన ఎంపీ నిధుల నుంచి నిధులు మంజూరు చేసి ఇనుగుర్తి,దాని చుట్టుపక్కల గ్రామాల ప్రజల అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్స్ అందించారు.

దీనిని శనివారం వారి సోదరులు వద్దిరాజు కిషన్, వద్దిరాజు దేవేందర్ లతో కలిసి స్థానిక శాసనసభ్యుడు శంకర్ నాయక్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి అంబరీష్, ఇనుగుర్తి గ్రామ సర్పంచ్ రాంమూర్తి, సింగిల్ విండో ఛైర్మన్ దీకొండ వెంకన్న గౌడ్,సంబంధిత అధికారులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

హరీష్ మార్క్..బిజెపికి షాక్

సిద్ధిపేట జిల్లాలో బీజేపీకి భారీ షాక్.

నేటిధాత్రి సిద్దిపేట

బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షుడు మహ్మద్ నయిమోద్దీన్, బీజేపీ జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఖలీల్, బీజేపీ జిల్లా మహిళా మోర్ఛా ప్రెసిడెంట్ ఫర్జానా బేగం, సిద్ధిపేట టౌన్ మైనారిటీ ప్రెసిడెంట్ యాసీన్

సిద్ధిపేట జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షుడు మహ్మద్ నయిమోద్దీన్, బీజేపీ జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఖలీల్, బీజేపీ జిల్లా మహిళా మోర్ఛా ప్రెసిడెంట్ ఫర్జానా బేగం, సిద్ధిపేట టౌన్ మైనారిటీ ప్రెసిడెంట్ యాసీన్ హుస్సేన్ లు ఆ పార్టీకి రాజీనామా చేశారు.

రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ లో చేరారు. హైదరాబాదులో శుక్రవారం సాయంత్రం బీజేపీ జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షుడు మహ్మద్ నయిమోద్దీన్, బీజేపీ జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఖలీల్, బీజేపీ జిల్లా మహిళా మోర్ఛా ప్రెసిడెంట్ ఫర్జానా బేగం, సిద్ధిపేట టౌన్ మైనారిటీ ప్రెసిడెంట్ యాసీన్ హుస్సేన్ లు తమ అనుచరులతో రాష్ట్ర మంత్రి హరీశ్ రావు సమక్షంలో దాదాపు 60 మంది బీఆర్ఎస్ లో చేరారు. అనంతరం పార్టీ కండువాకప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ:

 

బీఆర్ఎస్ పార్టీలోకి మీ అందరికీ స్వాగతం.

తెలంగాణ అంటే గంగా జమున తెహజీబ్ లా కేసీఆర్ నిలిపారు.

రాష్ట్రాన్ని ముఖ్య మంత్రి మత కల్లోహాలు లేకుండా కాపాడుతున్నారు.

దేశంలోనే మన రాష్ట్రంలోమాత్రమే మైనార్టీలు భద్రంగా ఉన్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిద్రపోని పరిస్థితుల్లో ఉన్నారు.

మన దగ్గర సీఎం కేసీఆర్ ఉండబట్టే శాంతి భద్రతలు ఉన్నాయి.

అన్ని వర్గాలను కాపాడుకునే, అన్ని మతాలను గౌరవించే నాయకుడు కేసిఆర్ గారు.

దసరా, బతుకమ్మ పండుగలప్పుడు హిందువులకు, రంజాన్ మాసంలో ముస్లింలకు, క్రిస్టమస్ సమయంలో క్రిస్టియన్లకు బట్టలు పంపిణీ చేస్తారు.

దేశంలో మైనార్టీల విద్య కోసం ఎంత ఖర్చు చేస్తారో, వారి కోసం ఎన్ని స్కూళ్లు ఉన్నాయో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని ఉన్నాయి.

ముస్లిం సోదరుల కోసం అజ్మీర్ దర్గాలో తెలంగాణ హౌస్ కట్టిస్తూ అండగా నిలిచారు.

అలాగే సిద్దిపేటను జిల్లా చేసి, గోదావరి జలాలను తెచ్చి ఇప్పుడు సిద్దిపేటకు రైలు కూడా తెచ్చి అభివృద్ధి చేసి సిద్దిపేటను ఆదర్శంగా నిలిపింది ముఖ్య మంత్రి కెసిఆర్ గారు.

ముస్లిం మైనారిటీలకు బీఆర్ఎస్ రక్షణ కల్పిస్తుంది.

బీజేపీ జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షుడు మహ్మద్ నయిమోద్దీన్, బీజేపీ జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఖలీల్, బీజేపీ జిల్లా మహిళా మోర్ఛా ప్రెసిడెంట్ ఫర్జానా బేగం, సిద్ధిపేట టౌన్ మైనారిటీ ప్రెసిడెంట్ యాసీన్ హుస్సేన్ లు.. మాట్లాడుతూ.. జిల్లాలోని సిద్ధిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గ వర్గాలలోని అన్నీ మండలాల నుంచి మైనారిటీ మోర్చా మండల అధ్యక్షుడు, మహిళా అధ్యక్షురాలు, అంతా ఓకేతాటిపైకొచ్చి ఏకమై బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరుతున్నామని తెలిపారు.
బీఆర్ఎస్, సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, పేద ప్రజానీకానికి ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం చేయని విధంగా ఎనలేని కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ ద్వారా జరుగుతున్నాయని, సాధ్యం చేసి నిరూపిస్తున్నారని నయిమోద్దీన్ చెప్పారు.

బీఆర్ఎస్ ముస్లింలకు రక్షణ కల్పిస్తుందని, చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని షాదీ ముబారక్, మైనారిటీలకు లక్ష బంధు సాయం, ఇంకా మరెన్నో సంక్షేమ పథకాలు కార్యక్రమాలు చేపడుతున్నదని వివరించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన, అభివృద్ధి నాయకుడు, నిత్యం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ పరితపించే ప్రజా నాయకుడు హరీశ్ రావు పట్ల బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి ఆకర్షితుడినై పార్టీలో చేరినట్లు తెలిపారు. మంత్రి హరీశ్ రావు గారి నాయకత్వంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

బీఆర్ఎస్ చేరిన వారిలో..

మహ్మద్ నయిమోద్దీన్-బీజేపీ జిల్లా మైనారిటీ మోర్చా ప్రెసిడెంట్, మహ్మద్ ఖలీల్-బీజేపీ జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి, ఫర్జానా బేగం-బీజేపీ జిల్లా మైనారిటీ మహిళా మోర్చా ప్రెసిడెంట్, మహ్మద్ యాసీన్-బీజేపీ సిద్ధిపేట టౌన్ మైనారిటీ ప్రెసిడెంట్, మహ్మద్ ముస్తాఫా-బీజేపీ దుబ్బాక మండల మైనారిటీ ప్రెసిడెంట్, మహ్మద్ ముస్తాఫా-బీజేపీ దుబ్బాక మండల వైస్ ప్రెసిడెంట్, మహ్మద్ రజాక్-బీజేపీ జిల్లా మైనారిటీ వైస్ ప్రెసిడెంట్, మహ్మద్ ఇమ్రాన్ ఉద్దీన్- బీజేపీ టౌన్ మైనారిటీ వైస్ ప్రెసిడెంట్,
మహ్మద్ షాకేర్- బీజేపీ టౌన్ మైనారిటీ సెల్ కార్యవర్గ సభ్యుడు, అద్నాన్-బీజేపీ టౌన్ క్రియాశీలక కార్యకర్తలు, గోరేమియా, బీజేపీ మైనారిటీ చేర్యాల టౌన్ ప్రెసిడెంట్-మహ్మద్ కరిమోద్దీన్, చేర్యాల బీజేపీ మైనారిటీ నాయకులు సమీర్, పెద్ద షాదుల్లా, చిన్న షాదుల్లా, ఏండీ.సాజిద్, మహ్మద్ రహీం, ఖలీల్, షకీల్, బీజేపీ మైనారిటీ నాయకులు ఆర్షద్ హుస్సేన్, గౌస్, జానేమియా, సలా ఉద్దీన్, అబూ బకర్, షాహీద్, అజీజ్, గోరేమియా, షరీఫ్ అహ్మద్, దుబ్బాక మండల బీజేపీ మైనారిటీ ప్రెసిడెంట్ ఏం.డీ.ముస్తఫా, వైస్ ప్రెసిడెంట్ ముస్తాఫా తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

కార్యక్రమంలో.. మంత్రితో పాటు సిద్ధిపేట పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు జావేద్, అహ్మద్, దర్పల్లి శ్రీనివాస్, చాంద్, మజర్ తదితరులు పాల్గొన్నారు.

అవినీతి కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు

అవినీతి ఆరోపణల కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును శనివారం ఉదయం ఇక్కడ అరెస్టు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలిపారు.

నంద్యాల పట్టణంలోని జ్ఞానపురంలోని ఆర్‌కే ఫంక్షన్‌ హాల్‌ నుంచి ఉదయం 6 గంటలకు మాజీ ముఖ్యమంత్రిని సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేశారని ఓ అధికారి తెలిపారు.

సిఐడి ఆర్థిక నేరాల విభాగం (ఇఓడబ్ల్యు) డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నాయుడుకు అందజేసిన నోటీసులో, “మిమ్మల్ని అరెస్టు చేసినట్లు మీకు తెలియజేయడానికే… ఉదయం 6 గంటలకు జ్ఞానపురంలోని ఆర్ కె ఫంక్షన్ హాల్‌లో /o మూలసాగరం, నంద్యాల పట్టణం మరియు ఇది నాన్ బెయిలబుల్ నేరం.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిని సంబంధిత IPC సెక్షన్ల కింద అరెస్టు చేశారు, ఇందులో సెక్షన్లు 120B (నేరపూరిత కుట్ర), 420 (మోసం చేయడం మరియు నిజాయితీగా ఆస్తుల పంపిణీని ప్రేరేపించడం) మరియు 465 (ఫోర్జరీ) ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సీఐడీ కూడా ఆయనపై అవినీతి నిరోధక చట్టాన్ని ప్రయోగించింది.

CrPC సెక్షన్ 50 (1) (2) కింద నోటీసు అందించబడింది.

రేపటి రోజు రేవంత్‌ మాటకు విలువెంత?

https://epaper.netidhatri.com/

` రైతులు రుణాలు తీసుకుంటే తీర్చేదెవరు?

`గతంలో బండి సంజయ్‌ మాటలు ఏమయ్యాయో చూసిందే!

`దళిత బంధు విషయంలో ఈటెల మాటలు నమ్మితే ఏమయ్యేది?

`సీనియర్ల నుంచి కానిది కొత్త వారితో రేవంత్‌ కు చెక్‌ పడేనా?

`షర్మిల వస్తే రేవంత్‌ మాట చెల్లుబాటౌనా?

`షర్మిల రాకపై సీనియర్ల మౌనం దేనికి సంకేతం?

` కేవిపి ఇప్పుడు ఎందుకు నేను తెలంగాణ అంటున్నారు?

`సీనియర్ల మద్దతు లేకుండానే ఇదంతా జరుగుతోందా?

`రేవంత్‌ వద్దనుకున్న పొంగులేటి వచ్చాడు?

`పొంగులేటి వచ్చి షర్మిలకు మార్గం సుగమం చేశాడు.

`రేపు కేవిపి వస్తాడు?

`రేవంత్‌ ను పక్కన పెట్టకుండా వుంటారా?

` రేవంత్‌ కు మద్దతు ఇప్పుటికే కరువు?

`షర్మిల రాకతో రేవంత్‌ రాజకీయం కనుమరుగు?

https://epaper.netidhatri.com/

హైదరబాద్‌,నేటిధాత్రి:

పార్టీలో తన ఉనికికే నమ్మకం లేని చోట, తన పదవికే గ్యారెంటీ లేని పిసిసి. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పే మాటలు వింటూ సొంత పార్టీ నేతలే గొల్లున నవ్వుకుంటున్నారు. ప్రజలను నమ్మించాలంటే అబద్దాలే చెప్పాల్సిన అవసరం లేదు. నిజాలు చెప్పి కూడా ప్రజల విశ్వాసం చూరగొనొచ్చు. కాని రాజకీయాల్లో ఎవరు నిజాలు చెబుతున్నారో..ఎవరు అబద్దాలు చెబుతున్నారో కూడా తెలియని అయోమయ పరిస్ధితుల్లో ఎన్నికల తరుణం వచ్చేసింది. ఈ సమయంలో తన భవిష్యత్తును తానే కొండంత ఊహించుకొంటూ రేవంత్‌ రెడ్డి పెద్దపెద్ద మాటలే చెబుతున్నాడు. కాని కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి పదవికి గండం వచ్చే సూచన కూడా షర్మిల రూపంలో కనిపిస్తున్నాయన్నది మర్చిపోతున్నాడు. తాజాగా ఆయన రైతుల విషయంలో చేసిన వ్యాఖ్యలపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఆ మధ్య అమెరికా వెళ్లినప్పుడు చేసిన వ్యాఖ్యల దుమారం నుంచి తప్పించుకోవడానికి, రైతులు బ్యాంకుల నుంచి రెండు లక్షల అప్పులు తీసుకోండి. తర్వాత మాఫీ చేస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నాడు. అసలు ఎన్నికల దాకా తన పదవి వుంటుందో ఊడుతుందో కూడా తెలియని రేవంత్‌రెడ్డి చెబుతున్న మాటలను సొంత పార్టీ నేతలే నమ్మడం లేదు. రైతులు సాగు చేసుకునేందుకు ఎకరాకు ఎంత కరంటు కావాలో కూడా తెలియని రేవంత్‌రెడ్డి, బ్యాంకు రుణాల గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఎకరం భూమి వున్న చిన్న సన్న కారు రైతులకు బ్యాంకు ఎంత రుణం ఇస్తుందో రేవంత్‌ రెడ్డికి ఏమైనా అవగాహన వుందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. రైతుకు రెండు లక్షల అప్పు ఇవ్వాలంటే కనీసం పది ఎకరాల భూమి వుండాలి. బ్యాంకులు ఎకరానికి 15వేల రూపాయల నుంచి 18వేలు మాత్రమే ఇస్తుంది. అంటే రెండు లక్షల రుణం రావాలంటే పది ఎకరాల ఆసామి రైతులకే వర్తిస్తుంది. అక్కడ కూడా చిన్న సన్నకారు రైతులకు మేలు జరిగేదేమీ వుండదు. గతంలో ఎకరానికి మూడు గంటలు చాలని మిడిమిడి జ్ఞానంతో చెప్పి తెలంగాణ రైతాంగం చేత చీవాట్లు తిన్నాడు. ఇప్పుడు రెండు లక్షల రూపాయల రుణం తీసుకొమ్మని తన అజ్ఞానాన్ని మరోసారి రుజువు చేసుకున్నాడు. ఇలాంటి వారి చేతుల్లో పరిపాలన పెడితే తెలంగాణ మళ్లీ పాత రోజులను చూడాల్సి వస్తుంది. ఒక వేళ పొరపాటున అధికారంలోకి వస్తే ఇండ్లకు ఇరవై నాలుగు గంటలు ఎందుకు? అని పగలంతా కోతలు పెట్టినా పెడతారు? ఇప్పుడే ఇన్ని అవగాహన లేని మాటలు, అబద్దాలు చెబుతున్నవారు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో అర్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రజలను తప్పుదోవ పట్టిస్తే తప్ప అధికారంలోకి రాలేమని రేవంత్‌రెడ్డి లాంటి వారు అభిప్రాయపడుతున్నట్లున్నారు. ఆ మధ్య జిహెచ్‌ఎంసి ఎన్నికల సమయంలో అప్పటి బిజేపి రాష్ట్ర చీఫ్‌ బండి సంజయ్‌ ఇలాగే ప్రకటన చేశాడు. ఆదే సమయంలో కరిసిన వర్షాలకు నష్టపోయిన ప్రజలకు నష్టపరిహారం కోసం ఏం నష్టం జరిగినా వాటిని తీర్చుతామన్నాడు. బండ్లుపోయిన వారికి బండ్లు, ఇండ్లు కూలిన వారికి ఇండ్లు, కార్లు పోయిన వారికి కార్లు, వస్తువులు పోయిన వారికి వస్తువులు ఇస్తామని అలవి కాని హామీలు బండి సంజయ్‌ ఇచ్చాడు. తర్వాత తూచ్‌ అన్నాడు. ఇన్యూరెన్స్‌ కంపనీలతో మాట్లాడతామని తన సహజసిద్దమైన జ్ఞానాన్ని ప్రదర్శించాడు. ప్రజలకు పార్టీని మరింత దూరం చేశాడు. అంతే కాకుండా బిజేపిలో చేరిన ఈటెల రాజేందర్‌ కూడా దళిత బంధు విషయంలో కూడా ప్రజల్లో గందరగోళం సృష్టించి, లక్షాదికారులు కావాల్సిన దళితుల జీవితాలకు న్యాయం జరక్కుండా చేశాడు. మొదటి దఫా దళిత బంధు అందుకున్న రైతులను అయోమయంలో పడేసి, ప్రభుత్వం అందజేసిన దళిత బంధు చేతిలో లేకుండా కావడానికి పరోక్ష కారణం ఈటెల రాజేందర్‌ అన్న అపవాదును ఎదుర్కొంటున్నాడు. తమ రాజకీయాల కోసం ప్రజల్లో గందరగోళం సృష్టించి పబ్బం గడుపుకోవడానికి ప్రజల జీవితాలను ఆగం చేసే నాయకులు ఇలా వుంటారు. అందుకే ప్రజలు కూడా నాయకులు చెప్పే విషయాల్లో ఎంత నిజాయితీ వుందన్నది గమనించాలి.
ఇక అసలు రేవంత్‌రెడ్డి తన పదవికే గ్యారెంటీ లేదు.
ఆయన మాటలు నమ్ముకొని ఒక వేళ రైతులు రుణాలు తీసుకున్నా, తీర్చేందుకు పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు. రేవంత్‌రెడ్డి మాట నిలుపుకునేది లేదు. ఎందుకంటే ఆది నుంచి రేవంత్‌ను ఎలా దింపాలన్నదానిపై పార్టీలో అందివిచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలని సీనియర్లు ఎదురు చూస్తూ వున్నారు. ఇప్పుడు ఆ తరుణం రానే వచ్చింది. రేవంత్‌రెడ్డి పిపిసి. అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు చేసిన వ్యాఖ్యలతోనే సీనియర్లు గుర్రుగా వున్నారు. దానికి తోడు రేవంత్‌రెడ్డి సైన్యం పేరుతో సీనియర్లైన ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, విహనుమంతారావు లాంటి వారికి నిత్యం చుక్కలు చూపిస్తూ వస్తున్నారు. గత రెండేళ్లుగా వాళ్లు పార్టీ మారుతున్న చేయాల్సినంత ప్రచారం చేస్తూనే వున్నారు. ఆ కసి వారిలో నిగూడంగా వుంది. ఏ రెడ్డి నాయకత్వాన్ని ఏకం చేసి, రేవంత్‌ అందలమెక్కాలనుకున్నాడో అదే రెడ్డి వర్గం ఇప్పుడు ఆయనకు ఆశనిపాతంగా మారే రోజులు దగ్గర్లోనే వున్నాయి. అందుకు మొదటి అస్త్రం పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రూపంలో కాంగ్రెస్‌లో చేరనే చేరింది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాకను ముందు రేవంత్‌ రెడ్డి అంగీకరించలేదు. ఆయనపై కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు. ఆ తర్వాత అనివార్య పరిస్ధితుల్లో పొంగులేటిని పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు షర్మిల రూపంలో మరో అస్త్రం రానున్నది. షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వస్తున్నా అన్నప్పుడే రేవంత్‌ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దాంతో షర్మిల అడుగడుగునా రేవంత్‌పై సెటైర్లు వేస్తూ వచ్చింది. రేవంత్‌రెడ్డి పాదయాత్ర మీద అనేక విమర్శలు చేసింది. రేవంత్‌ రెడ్డి పాదయాత్రపై షర్మిల చేసిన కామెంట్లు పెద్దఎత్తున ట్రోల్‌ అయ్యాయి. ఇప్పుడు ఆమె తెలంగాణ కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేయనున్నదని తెలుస్తోంది. షర్మిల రాకతోపాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌. రాజశేఖరరెడ్డి ఆత్మ కేవిపి కూడా వచ్చి చేరుతుంది. అప్పుడు రేవంత్‌కు పార్టీలో చోటు లేకుండాపోతుందనేది కొందరి భావన. ఎందుకంటే రేవంత్‌ రెడ్డి పార్టీలోకి వస్తున్నప్పుడు అడ్డుకునేందుకు శత విధాల ప్రయత్నం చేసిన వాళ్లే ఇప్పుడు షర్మిల రాకను ఆహ్వానిస్తున్నారు. అందుకే షర్మిల పార్టీలోకి వచ్చే విషయంలో ఎవరూ స్పందించడం లేదు. అలా అని వద్దని కూడా అనడం లేదు. మౌనం కొన్నిసార్లు అర్ధాంగీకారమేకాదు, పూర్ణాంగీకారం కూడా అవుతుంది. షర్మిల వస్తే రేవంత్‌కు చెక్‌ పెట్టొచ్చన్న ఆలోచనతో సీనియర్లు వున్నారు. కాంగ్రెస్‌లో ఇప్పుడు అదే కనిపిస్తోంది. షర్మిల రాక, రేవంత్‌పోక రెండూ జరగడం ఖాయమంటున్నారు. ముందు ముందు ఏం జరుగుతుంతో చూద్దాం…

తెలంగాణ ప్రజల గుండెల నిండా కేసిఆరే: ఎంపి. వద్దిరాజు రవిచంద్ర.

https://epaper.netidhatri.com/

` గులాబీ జెండానే తెలంగాణ ప్రజలకు అండా దండ!

`కొత్తగూడెం, ఇల్లందు బిఆర్‌ఎస్‌ ఇన్‌ చార్జ్‌, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ…

`ఉమ్మడి ఖమ్మం మొత్తం గెలుస్తాం.

` కొత్త గూడెం, ఇల్లందులలో విజయ దుంధుబి మోగిస్తాం.

` దేశమంతా కరంటు కోతలు..

`ఒక్క తెలంగాణ లోనే కరంటు వెలుగులు.

`తెలంగాణ లో కనిపించే ప్రగతి దేశంలో ఎక్కడా లేదు.

`సంక్షేమ పథకాలలో నెంబర్‌ వన్‌.

`ఆదర్శవంతమైన పాలనలో నెంబర్‌ వన్‌.

`ఇలా చెప్పుకుంటూ పోతే అన్నట్లో తెలంగాణ నెంబర్‌ వన్‌.

`దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంది.

` కాంగ్రెస్‌ కల గనని, బిజేపి ఊహించని పథకాలు తెలంగాణలో అమలౌతున్నాయి.

` తెలంగాణ లో వుండేది, వున్నది ఒక్కటే బిఆర్‌ఎస్‌.

`తెలంగాణ లో ఇతర పార్టీలకు చోటు లేదు.

`ప్రజల్లో వున్నది బిఆర్‌ఎస్సే.

`ప్రజల కోసం పని చేసేది బిఆర్‌ఎస్సే.

` కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో కానరాని సంక్షేమం.

` డిల్లీ పెత్తనంతో తెలంగాణను మళ్ళీ ఆగం చేస్తారు.

` తెలంగాణ ను గోస పెడతారు.

` తలెత్తుకొని ఆత్మ గౌరవం నిండిన తెలంగాణను డిల్లీలో తాకట్టు పెడతారు.

`తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా వుండాలి.

`కాంగ్రెస్‌, బిజేపిలను దూరం పెట్టాలి.

`తెలంగాణ ప్రజల సంక్షేమం కేసిఆర్‌ మాత్రమే చూస్తాడు.

హైదరబాద్‌,నేటిధాత్రి:

కట్టా రాఘవేంద్రరావు: ప్రచారం మొదలు పెట్టినట్లున్నారు?
వద్దిరాజు రవిచంద్ర: కారు ఎప్పుడూ స్పీడే…అందులోనూ ప్రజల గుండెల్లో వున్నదే. అందుకే తెలంగాణ గడ్డమీద వుండాల్సింది, వుండేది గులాబీ జెండానే..ఆ జెండా తెలంగాణ తెచ్చింది. తెలంగాణకు ఆత్మ గౌరవం తెచ్చింది. స్వయం పాలన ఇచ్చింది. కేసిఆర్‌ నాయకత్వంతో తెలంగాణ లో ఆ జెండా రెపరెపలాడుతోంది. ఒకనాడు తెలంగాణ ప్రజల్లో చైతన్యం నింపింది. ఇప్పుడు విజయ పతాకగా తెలంగాణను చల్లగా చూస్తోంది. ముచ్చటగా మూడో సారి గులాబీ జెండా ప్రభంజనం సృష్టించనుంది. హాట్రిక్‌ తో గులాబీ జెండా కు, కారు గుర్తుకు ఎదురులేదని రుజువుకాబోతోంది. ఈసారి ఉమ్మడి ఖమ్మం మొత్తం గెలుస్తాం. కొత్త గూడెం, ఇల్లందులలో విజయ దుంధుబి మోగిస్తాం. నాకు ఇన్‌ చార్జిగా ప్రత్యక్ష పర్యవేక్ష బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ నమ్మకాన్ని నిలబెడతా!

కట్టా: తెలంగాణ అభివృద్ధి గురించి చెప్పమంటే ఏం చెబుతారు?
రవిచంద్ర: ఎక్కడి నుంచి మొదలు పెట్టి చెప్పమంటారు. సాగు నుంచి మొదలు పెడితే అంతులేని అభివృద్ధి తెలంగాణ లో జరిగింది. పాలమూరు-రంగారెడ్డితో పరిపూర్ణమౌతోంది. సాగు నీటి కష్టం తీరింది. మంచి నీటి కటకట పోయింది. కరంటు కష్టాలు తీరాయి. రోజంతా కరంటు కోత చూసిన తెలంగాణ, నిరంతర కరంటు చూస్తోంది. ఇప్పటికిప్పుడున్న పరిస్థితి. దేశమంతా కరంటు కోతలు..ఒక్క తెలంగాణ లోనే కరంటు వెలుగులు. ఇది మేం చెబుతున్న మాటే కాదు, సెంట్రల్‌ పవర్‌ గ్రిడ్‌ చెబుతున్న మాట. బిజేపి పాలిత, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో ఎక్కడా సాధ్యం కాలేదు. ఎందుకంటే అక్కడ కేసిఆర్‌ నాయకత్వం లేదు. తెలంగాణ లో సంక్షేమ నాయకత్వం వుంది. కేసిఆర్‌ పాలన సాగుతోంది. అందుకే తెలంగాణ లో ప్రజలకు ఏ కష్టం లేదు. సాగు కష్టం లేదు. కరంటు కష్టం లేదు. పండిన పంట ఎవరు కొంటారా? అన్న దిగులు లేదు. దళారుల మోసం లేదు. అంతా ప్రభుత్వమే ఇస్తోంది. సాగువాటుకు ముందే రైతు బంధు అందుతోంది. ప్రపంచంలోనే ఇంతటి రైతు క్షేమ పాలన ఎక్కడా కనిపించదు. రైతుకు పెట్టుబడి సాయమందిస్తే బంగారు పంటలు పండిస్తాడని గతంలో ఎప్పుడైనా , ఏ పాలకుడైనా ఆలోచించాడా? అదే కేసిఆర్‌ గొప్పతనం. గొప్ప గుణం. రైతు సంక్షేమం కాంక్షే ఏకైక నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ లో కనిపించే ప్రగతి దేశంలో ఎక్కడా లేదు.
సంక్షేమ పథకాలలో నెంబర్‌ వన్‌. ఆదర్శవంతమైన పాలనలో నెంబర్‌ వన్‌. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నట్లో తెలంగాణ నెంబర్‌ వన్‌. అందుకే దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంది. కాంగ్రెస్‌ కల గనని, బిజేపి ఊహించని పథకాలు తెలంగాణలో అమలౌతున్నాయి.

కట్టా: తెలంగాణ లో ప్రతిపక్షాల పరిస్థితి ఏమిటి?
రవిచంద్ర: తెలంగాణ లో ప్రతిపక్షాలు కూడా వున్నాయా? ఉనికి కోసం మాత్రమే కొట్లాడుకుంటున్నాయి. అసలు తెలంగాణలో ప్రతిపక్షాలకు చోటే లేదు. తెలంగాణ లో వుండేది, వున్నది ఒక్కటే బిఆర్‌ఎస్‌. ప్రజల్లో వున్నది బిఆర్‌ఎస్సే. ప్రజల కోసం పని చేసేది బిఆర్‌ఎస్సే. అసలు తెలంగాణకు కాంగ్రెస్‌ చేసిన మోసం అంతా ఇంతా కాదు. కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వలేదు. కేసిఆర్‌ పద్నాలుగు సంవత్సరాలు నిర్విరామంగా పోరాటం చేసి సాధించారు. అంతే తప్ప కాంగ్రెస్‌ ఇచ్చిందేమీ లేదు. తెలంగాణను నిండా ముంచిందే కాంగ్రెస్‌ పార్టీ. తెలంగాణ ను ఆంధ్రతో కలిపి, ఎప్పుడో అన్యాయం చేసింది. ఆ తర్వాత అడుగడుగునా అన్యాయం చేస్తూనే వచ్చింది. తెలంగాణ కోసం కొట్లాటను అడుగడుగునా అణచివేసింది. తెలంగాణ నోరెత్తకుండా చేసింది. సీమాంధ్ర నేతల మాట విని తెలంగాణ కు తీరని ద్రోహం చేసింది. అరవై ఏళ్లలో యాభై ఏళ్ళు పాలించిన కాంగ్రెస్‌ చెరువుల్లో తట్టెడు మట్టి తీయలేదు. బావులు ఎండిపోయి సాగుకు నీళ్లు లేక బోర్లు వేసుకుందామంటే వాల్టా చట్టం తెచ్చింది. తెలంగాణ సాగును సర్వం నాశనం చేసింది. అలాంటి కాంగ్రెస్‌ ఇప్పుడు ఇచ్చింది మేమే అంటే ప్రజలు నమ్ముతారా? తెలంగాణ ను ఆగం చేసిన వాళ్లకు ఒక్కసారి అవకాశం ఇస్తే మళ్ళీ తెలంగాణను వందేళ్ల వెనకకు తీసుకుపోతారు. అయినా తెలంగాణ లో నలుగురు నాయకులు తప్ప కాంగ్రెస్‌ లేదు. దానికి క్యాడర్‌ లేదు. ప్రజల్లో గుర్తింపే లేదు. కాంగ్రెస్‌ అధికారం లో వున్న రాష్ట్రాలలో సంక్షేమమే లేదు. డిల్లీ పెత్తనంతో తెలంగాణను మళ్ళీ ఆగం చేస్తారు. తెలంగాణ ను గోస పెడతారు. తలెత్తుకొని ఆత్మ గౌరవం నిండిన తెలంగాణను డిల్లీలో తాకట్టు పెడతారు. అందుకే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ విషయంలో అప్రమత్తంగా వుండాలి. మాటలకేముంది నరం లేని నాలుక ఎన్నో చెబుతుంది. ప్రజల మీద ప్రేమ కన్నా అధికారం మీద యావ వున్న కాంగ్రెస్‌ కట్టుకథలు మస్తు చెబుతుంది. వాటిని ప్రజలు నమ్మే పరిస్థితే లేదు.

కట్టా: ప్రచారం ఎలా సాగుతోంది?
రవిచంద్ర: చూస్తున్నారు కదా! ప్రజలు ఎలా కదిలి వస్తున్నారో..ఎలా స్వాగతం పలుకుతున్నారో…ఏ ఊరికి వెళ్లినా ప్రజలు ఎదురొచ్చి, దీవెనలు అందిస్తున్నారు. కారు గుర్తుకే ఓటేస్తామంటున్నారు. కేసిఆర్‌ ను గుండెల్లో పెట్టుకున్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కేసిఆర్‌ మాత్రమే చూస్తాడు. ఇది తెలంగాణ ప్రజల బలమైన నమ్మకం. అందుకే ఆయన నాయకత్వం కోరుకుంటున్నారు. ఒకనాడు తెలంగాణ అంటే ఏమిటి? ఇప్పుడు తెలంగాణ ఎలా వున్నది? అనేది మన కళ్ల ముందే వున్నది. సంక్షేమ రాజ్య భావన అనేది పుస్తకాలలో చదివిందే తప్ప గతంలో చూసింది లేదు. కానీ ఇప్పుడు కళ్లారా చూస్తున్నాము. తెలంగాణ ప్రజల యోగ క్షేమాల గురించే కాదు, భవిష్యత్తు తెలంగాణ కోసం కేసిఆర్‌ కష్టపడుతున్నారు. అందుకే తెలంగాణ తొమ్మిదేళ్లలో తొంభై ఏళ్ల అభివృద్ధి జరిగింది. పల్లెల్లో వెలుగొచ్చింది. పల్లెకు సిరి వచ్చింది. చెరువు బాగైంది. చెరువు నిండిరది. చెవుల నీటి పారకం మొదలైంది. చేపల పెంపకం జరుగుతోంది. తెలంగాణ కూడా మత్స్య సంపద చూస్తోంది. సాగు మొదలైంది. సాగు నీరందుతోంది. ఉచిత కరంటు వచ్చింది. ఇరవై నాలుగు గంటల వస్తోంది. రైతుకు రంది లేకుండా పోయింది. ఎన్ని బోర్లు వేసుకున్నా కరంటు ఇస్తోంది. నీళ్లు లేవన్న బాధలేదు. బోరు ఎండిపోయే ప్రసక్తి లేదు. బావుల్లో నీళ్లు అడుగంటింది లేదు. సాగుబడికి ఇబ్బంది లేదు. రైతు బంధుతో అప్పు బాధ లేదు. విత్తనాల కొరత లేదు. ఎరువుల బాధ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే రైతుకు ఎలాంటి దిగులు లేదు. కాలు మీద కాలేసుకొని తెలంగాణ రైతు వ్యవసాయం చేసే రోజులొస్తాయని ఎవరూ కలగనలేదు. అదీ తెలంగాణ అంటే…ఇదీ కేసిఆర్‌ నాయకత్వం అంటే. ఇక సంక్షేమ కార్యక్రమాలు.. పథకాల గురించి ఎంత చెప్పుకున్నా సమయం చాలదు. మరిన్ని తర్వాత చెప్పుకుందాం…ప్రచారానికి బయలుదేరుతున్నాం…
కట్టా: ధన్యవాదాలు.
రవిచంద్ర: నమస్తే

మహిళా రిజర్వేషన్ బిల్లును సోనియా గాంధీ మర్చిపోయారు: కవిత

అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలని, మరింత సమ్మిళిత ప్రజాస్వామ్యానికి మద్దతు ఇవ్వాలని ఇటీవల శ్రీమతి కవిత విజ్ఞప్తి చేశారు.

పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు సంబంధించిన అంశాలను చేర్చాలంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లును విస్మరించడాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.

“X” (గతంలో ట్విట్టర్) లో ఒక పోస్ట్‌లో, ఆమె తన నిరాశను వ్యక్తం చేసింది, “మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించాల్సిన ఆవశ్యకతను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ మరియు ఎంపీ శ్రీమతి పూర్తిగా విస్మరించారని చూడటం బాధగా ఉంది. ప్రధానికి సోనియా గాంధీ లేఖ.

ప్రధానికి రాసిన లేఖలో శ్రీమతి గాంధీ తొమ్మిది కీలకమైన అంశాలను వివరించారని, అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రస్తావనకు రాలేదని ఆమె తెలిపారు. ”మహిళల ప్రాతినిధ్యం జాతీయ ఆవశ్యకం కాదా? శ్రీమతి గాంధీ, లింగ సమానత్వం కోసం దేశం మీ శక్తివంతమైన న్యాయవాదం కోసం ఎదురుచూస్తోంది” అని శ్రీమతి కవిత అన్నారు.

అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలని, మరింత సమ్మిళిత ప్రజాస్వామ్యానికి మద్దతు ఇవ్వాలని ఇటీవల శ్రీమతి కవిత విజ్ఞప్తి చేశారు. భారత జాతీయ కాంగ్రెస్‌తో సహా పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్న 47 పార్టీల అధినేతలకు ఆమె లేఖ పంపబడింది మరియు ఆమె పిలుపుకు రాజకీయ స్పెక్ట్రం అంతటా నాయకుల నుండి విస్తృత మద్దతు లభించింది.

జూటా మాటల..జూటా పార్టీ.. బిజెపి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

బీజేపీ, కాంగ్రెస్ నేతల విమర్శలను తిప్పికొట్టిన ఎంపీ రవిచంద్ర

కేంద్ర సహకారం లేకున్నా తెలంగాణను కేసీఆర్ గొప్పగా అభివృద్ధి చేశారు:ఎంపీ రవిచంద్ర

కాళేశ్వరంకు 86పైసలు కూడా కేంద్రం ఇవ్వలే:ఎంపీ రవిచంద్ర

రేవంత్ నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్న:ఎంపీ రవిచంద్ర

బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ విలువైన సమయాన్ని వృధా పర్చింది:ఎంపీ రవిచంద్ర

సహచర ఎంపీలతో కలిసి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన ఎంపీ రవిచంద్ర

“నేటిధాత్రి” న్యూఢిల్లీ

అధికార బీజేపీ,ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ దేశం ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలపై చర్చించకుండా పార్లమెంట్ విలువైన సమయాన్ని వృధా పరుస్తున్నారని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు.లోకసభలో బీజేపీ సభ్యుడు నిషికాంత్ దూబే, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిలు మాట్లాడిన తీరు పట్ల ఆయన
అభ్యంతరం వ్యక్తం చేస్తూ, బలంగా తిప్పికొట్టారు.ఢిల్లీ లిక్కర్ కేసుతో బీఆర్ఎస్ కు ఎటువంటి సంబంధం లేదని తేలిపోయిందని,ఈ విషయంలో రేవంత్ అర్థంపర్థం లేని నిరాధార ఆరోపణలకు దిగడం శోచనీయమన్నారు.ఎంపీ రవిచంద్ర ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో గురువారం మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నాగేశ్వరరావు తదితర ఎంపీలతో కలిసి విలేకరులతో మాట్లాడారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులు ఇవ్వకున్నా,ఏ మాత్రం సహకరించనప్పటికీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు తెలంగాణను
అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారన్నారు.కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అద్భుతమైనదని, కేంద్ర ప్రభుత్వం దీనికి 86పైసల సాయం కూడా చేయలేదని ఎంపీ వద్దిరాజు సుస్పష్టంగా చెప్పారు.ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నిధులిచ్చినట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే నిండు లోకసభలో అబద్ధం చెప్పడం అభ్యంతరకరమన్నారు.సంవత్సరం పైగా అధికార బీజేపీ పార్లమెంట్ నడవకుండా,దేశం ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలపై చర్చించకుండా తప్పించుకుంటున్నదని ఆయన నిశితంగా దుయ్యబట్టారు.ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలు,అదానీ ఆర్థిక కుంభకోణాల గురించి చర్చించకుండా 50లక్షల కోట్ల జాతీయ బడ్జెట్ ను ఆమోదింపజేసుకున్న తీరును ఈ సందర్భంగా రవిచంద్ర గుర్తుచేశారు.అలాగే,ప్రస్తుత సమావేశాలలో మణిపూర్ రాష్ట్రంలో నెలకొన్న కల్లోల పరిస్థితులపై చర్చ జరుగకుండా,సభలో సమాధానం ఇవ్వకుండా అధికార పక్షం పార్లమెంట్ విలువైన సమయాన్ని వృధా పరుస్తున్నదని ఎంపీ వద్దిరాజు ఆవేదన వ్యక్తం చేశారు.

ఖబడ్దార్ రేవంత్ ! తెలంగాణ రైతులకుక్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టం

రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న – నారబోయిన రవి ముదిరాజ్

నేటిధాత్రి మునుగోడు

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మరియు విద్యుత్ శాఖ మాత్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపు మేరకు, రైతులకు మూడు గంటల కరెంటు చాలు అని వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి గారి మాటలకు నిరసనగా నేడు మునుగోడు మండల కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేసి వారి వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రజలకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్.

ఈ కార్యక్రమంలో మునుగోడు బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ఎంపీటీసీ లు సర్పంచ్లు ముఖ్య నాయకులు ఆయా గ్రామాల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వార్డ్ సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ప్రధాని మోదీ వరంగల్‌ పర్యటన.. షెడ్యూల్‌

హైదరాబాద్‌

నేటిధాత్రి  జులై 07

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఈనెల 8న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ ఖరారైంది. శనివారం 8న ప్రత్యేక విమానంలో ప్ర ధాని ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం 9.50కి హకీంపేట విమానాశ్రయంలో దిగుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 10.35 కి వరంగల్‌ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

ఉదయం 10.45 నుంచి 11.20 వరకు వరంగల్‌లో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొనడంతో పాటు వివిధ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేస్తారు. ఉదయం 11.30 గంటలకు హనుమ కొండ ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.15కి వరంగల్‌ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 1.10 గంటలకి తిరిగి హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరు కుంటారు. అక్కడి నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు..

*అభ్యర్థుల ఎంపికలో భట్టి కీ రోల్…నివేదిక కోరిన రాహుల్..?*


Rahul Gandhi gave importance to Bhatti :

తెలంగాణ వ్యవహారాలను రాహుల్ గాంధీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సీఎల్పీ నేత భట్టికి ప్రాధాన్యత పెంచారు. పీపుల్స్ మార్చ్ తో తెలంగాణలో పార్టీ జోష్ కి కారణమైన భట్టికి తాజాగా రాహుల్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఖమ్మం సభ తరువాత గన్నవరం బయల్దేరిన రాహుల్ తనతో పాటుగా భట్టిని వెంట బెట్టుకెళ్లారు.

ఆ సమయంలో రాష్ట్రంలో పార్టీలోని పరిస్థితులపైన ఆరా తీసారు. నేతల సమన్వయంపైన చర్చించారు.రాహుల్ గాంధీ స్వయంగా తెలంగాణలో కాంగ్రెస్ పరిణామాల పై ఆరా తీస్తున్నారు. కర్ణాటక తరువాత తెలంగాణ పైన కాంగ్రెస్ అధికారం దక్కించుకోవాలనే కసితో అడుగులు వేస్తోంది. ఈ సమయంలో ఎక్కడ ఏ విషయంలోనూ ఉపేక్షించ కూడదని రాహుల్ నిర్ణయించినట్లు కనిపిస్తోంది. పీపుల్స్ మార్చ్ యాత్ర ద్వారా భట్టి కష్టాన్ని రాహుల్ గుర్తించారు. తన సుదీర్ఘ యాత్ర ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపటంతో పాటుగా పేదల వద్దకు పార్టీ ని తీసుకు వెళ్ళటం, వారితో మమేకం అవ్వటం, వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించటం పార్టీకి మైలేజ్ పెంచిందని రాహుల్

విశ్వసించారు. అందులో భాగంగానే తానే స్వయంగా వచ్చి ఖమ్మం సభలో భట్టిని సత్కరించారు. ప్రత్యేకంగా భట్టి యాత్రను ప్రశంసించారు. సభ ముగిసిన తరువాత భట్టిని తనతో పాటుగా తీసుకెళ్లిన రాహల్ కీలక మంతనాలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

రాహుల్ కారులోనే భట్టికి పార్టీ వ్యూహాల పైన కీలక సూచనలు చేసారు. ఎన్నికల మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక కీలకం కావటంతో వీటి పైన భట్టి అభిప్రాయాలను కోరినట్లు సమాచారం. పార్టీలో నెలకొన్న పరిస్థితులను వివరించిన భట్టి.. టికెట్ల ఖరారు ఎంపిక పైన తన అభిప్రాయాలను వివరించారని తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా..సామాజిక వర్గాల సమీకరణాలు దెబ్బ తినకుండా పూర్తి అంచనాలతో నివేదిక కోరినట్లు విశ్వసనీయ సమాచారం. అభ్యర్థి ఎవరైనా గెలుపే ప్రామాణికం కావాలని భట్టి, రాహుల్ మంతనాల్లో నిర్ణయించారు. మొత్తం నియోజకవర్గాలకు సంబంధించి క్షేత్ర స్థాయి పరిస్థితులు..అభ్యర్థుల ఎంపికలో ఆయా నియోజకవర్గాల్లో తీసుకోవాల్సిన అంశాల పైన నివేదిక కోరినట్లు సమాచారం. దీంతో, భట్టికి రాహుల్ కీలక బాధ్యతలు అప్పగించినట్లైంది.

రాహుల్ కారులోనే భట్టికి పార్టీ వ్యూహాల పైన కీలక సూచనలు చేసారు. ఎన్నికల మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక కీలకం కావటంతో వీటి పైన భట్టి అభిప్రాయాలను కోరినట్లు సమాచారం. పార్టీలో నెలకొన్న పరిస్థితులను వివరించిన భట్టి.. టికెట్ల ఖరారు ఎంపిక పైన తన అభిప్రాయాలను వివరించారని తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా..సామాజిక వర్గాల సమీకరణాలు దెబ్బ తినకుండా పూర్తి అంచనాలతో నివేదిక కోరినట్లు విశ్వసనీయ సమాచారం. అభ్యర్థి ఎవరైనా గెలుపే ప్రామాణికం కావాలని భట్టి, రాహుల్ మంతనాల్లో నిర్ణయించారు. మొత్తం నియోజకవర్గాలకు సంబంధించి క్షేత్ర స్థాయి పరిస్థితులు..అభ్యర్థుల ఎంపికలో ఆయా నియోజకవర్గాల్లో తీసుకోవాల్సిన అంశాల పైన నివేదిక కోరినట్లు సమాచారం. దీంతో, భట్టికి రాహుల్ కీలక బాధ్యతలు అప్పగించినట్లైంది.

కాంగ్రెస్ “గ్యారంటీ” తో కొత్త మలుపు… బీఆర్ఎస్ లో కుదుపు

Congress Party :

తెలంగాణలో కాంగ్రెస్ సంచలనంగా మారుతోంది. రాహుల్ ఖమ్మం వేదికగా గర్జించారు. పార్టీ గెలుపు “గ్యారంటీ” చేసారు. బీఆర్ఎస్ ఆయువు పట్టునే దెబ్బ తీసారు. కర్ణాటక తరహాలో గెలుపుకు నాంది పలికారు. భట్టి యాత్రతో మొదలై..ఖమ్మంలో  తుఫాను గా మారిన కాంగ్రెస్ ప్రభంజనం ఇప్పుడు “గ్యారెంటీ ” తో అధికారం దిశగా దూసుకెళ్తోంది. రాహుల్ గాంధీ ప్రకటించిన చేయూత పథకం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలకు కారణమవుతోంది. పక్కా ప్రణాళికతో ప్రతీ కుటుంబానికి దగ్గరయ్యేలా ప్రకటించిన చేయూత బీఆర్ఎస్ కోటను కదిలించి బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ నే టార్గెట్ చేసారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేయూత పథకం ద్వారా రూ. 4000 పెన్షన్ ఇస్తామని ప్రకటన చేసారు.ఆదివాసీలకు పోడు భూములు ఇచ్చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్‌ బాదితులు, డయాలసిస్‌ రోగులకు రూ.4వేల చొప్పున పెన్షన్‌ అందిస్తామని తెలిపారు. అక్కడ ఫార్ములానే ఇక్కడ అమలు చేయటానికి రాహుల్ నిర్ణయించారు. బీఆర్ఎస్ తొలి నుంచి తాము అందిస్తున్న పెన్షన్ ..సంక్షేమం పైన భారీగా ప్రచారం చేసుకుంటోంది. అయినా..అమలులో మాత్రం భారీగా వైఫల్యం కనిపిస్తోంది.

ఈ సమయంలో రాహుల్ చేసిన ప్రకటన పైన పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తోంది. ఖచ్చితంగా ఇది ఓట్ల వర్షం కురిపిస్తుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. పెన్షన్ల పంపిణీలో కొర్రీలు..ఆలస్యం..సక్రమంగా లేని అమలు వంటి వాటితో లబ్దిదారులు విసుగు చెందారు. కర్ణాటకలో అమలు చేస్తున్న తరహా విధానం ఇప్పుడు ప్రజలను ఆకట్టుకుంటోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా రూ 75 ఉన్న పెన్షన్ ను రూ 200 కి పెంచి అమలు చేసి నమ్మకం నిలబెట్టుకుంది. తిరిగి ఇప్పుడు మరోసారి కాంగ్రెస్..అందునా రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటన చేయటంతో ప్రజల్లో నమ్మకం కనిపిస్తోంది. తెలంగాణలో మెజార్టీ ఓట్ బ్యాంక్ గా ఉన్న వర్గాలకు  మేలు చేయనుంది. ఫలితంగా పార్టీకి ప్రయోజనంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యులు, వారి ధనిక మిత్రులు ఓవైపు ఉంటే.. మరోవైపు రైతులు, దళితులు, మైనారిటీలు, ఆదివాసీలు, చిరు వ్యాపారులు ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలతో ప్రజల్లో ఆలోచన మొదలైంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వరంగల్‌లో రైతు డిక్లరేషన్ మరియు హైదరాబాద్‌లో యువజన డిక్లరేషన్‌ను ప్రకటించింది, నిన్న రాహుల్ గాంధీ సీనియర్ సిటిజన్‌లు మరియు వితంతువులకు నెలకు రూ.4,000 గ్యారెంటీ పెన్షన్ ప్రకటించారు. .

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే పోడు భూమిని ఆదివాసీలకు తిరిగి ఇచ్చేస్తానని హామీ ఇచ్చారు. ఇవన్నీ తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారం కు దగ్గర చేసే నిర్ణయాలుగా కనిపిస్తున్నాయి. కర్టాటకలో ఇవే తరహా హామీలతో ఓట్ల వర్షం కురిసింది. ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే తరహా ప్లాన్ రాహుల్ అమలు చేస్తుండటంతో అధికార బీఆర్ఎస్ కు షాక్ గా మారింది. కేసీఆర్ ఓట్ బ్యాంక్ చెల్లా చెదురు అవ్వటం ఖాయమనే విశ్లేషణలు మొదలయ్యాయి.

భట్టికి రాహుల్ ప్రాధాన్యత…ఒకే కారులో గన్నవరంకు..మంతనాలు

Khammam Janagarjana Sabha  Update :

ఖమ్మం సభ సక్సెస్ కావటం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. సభ నిర్వహణ పైన రాహుల్ ఖుషీ అయ్యారు. పీపుల్స్ మార్చ్ హీరో భట్టిని పదే పదే భజం తట్టి అభినందించారు. లక్షలాది మంది ప్రజల సమక్షంలో పార్టీ తరపున భట్టిని సత్కరించారు. పార్టీని కదిలించారు..కీపిట్ అప్ అంటూ ప్రశంసించారు. సభలో భట్టి ప్రసంగం..కార్యకర్తల నుంచి స్పందనను రాహుల్ నిశితంగా పరిశీలించారు. భట్టి తన యాత్రలో పేదలకు ఇచ్చిన అంశాలను పరిశీలించి మేనిఫెస్టోలో అవకాశం కల్పించాలని పార్టీ నిర్ణయించింది. సభ ముగిసిన తరువాత గన్నవరం వరకు రాహుల్ తో పాటుగా భట్టి ఒకే కారులో గన్నవరం వరకు వెళ్లారు. పార్టీ గురించి రాహుల్ కీలక సూచనలు చేసారు.

ఖమ్మం సభలో నేతలంతా ఒకే చోట…కార్యకర్తలంతా ఒకే సభ అన్నట్లుగా నిర్వహించటం పైన రాహుల్ హ్యాపీ ఫీలయ్యారు. గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఖమ్మం చేరుకున్న తరువాత రాహుల్ సభా ప్రాంగణంకు చేరుకొనే సమయానికి ఆ ప్రాంతమంతా పార్టీ కార్యకర్తలు..జెండాలతో నిండిపోయింది. సభలో రాహుల్ ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. బీఆర్ఎస్ తో పొత్తు పైన జరుగుతున్న ప్రచారానికి రాహుల్ ముగింపు పలికారు. బీజేపీకి బీ టీమ్‌గా మారారన్నారు. బీఆర్‌ఎస్‌ అంటే.. బీజేపీ రిష్తేదార్‌ (బంధుత్వ) సమితి అని అభివర్ణించారు. తెలంగాణలో బీజేపీ లేదంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలకు మంచి స్పందన కనిపించింది. కాంగ్రెస్..బీఆర్ఎస్ మధ్యనే పోటీ అని రాహుల్ ప్రకటించారు.

రాహుల్ ఇదే సభలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు రాష్ట్రంలో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినందుకు భట్టి విక్రమార్కకు అభినందనలు అంటూ చెబుతున్న సమయంలో సభలో హర్ష ధ్వానాలు మారు మ్రోగాయి. సభ ప్రాంగణంకు చేరుకున్న సమయం నుంచి తిరిగి వెళ్లే వరకు ప్రతీ సందర్భంలోనూ భట్టి విక్రమార్కకు రాహుల్ ప్రాధాన్యత ఇవ్వటం కనిపించింది. సభలో రాహుల్ కంటే ముందు ప్రసంగించే అవకాశం భట్టి..పొంగులేటికి కల్పించారు. భట్టి తన పాదయాత్ర అనుభవలాను వివరించారు. పేదల పక్షాల కాంగ్రెస్ నిలబడుతుందని రాహుల్ సమక్షంలో ప్రకటించారు. బీఆర్ఎస్ పైన ఖమ్మం వేదికగా గర్జించారు. కాంగ్రెస్ అధికారం ఖాయమని రాహుల్ ముందే ధీమా వ్యక్తం చేసారు.

ఎదుర్కోవటం పైన క్షేత్ర స్థాయిలో ఉన్న అంశాలు.. పార్టీలోని పరిస్థితుల పైన భట్టి వివరించినట్లు తెలుస్తోంది. పీపుల్స్ మార్చ్ యాత్ర..ఖమ్మం సభ నిర్వహణ పైన భట్టిని రాహుల్ ప్రత్యేకంగా అభినందించారు. సభకు తరలి వచ్చిన జనసందోహంతో ట్రాఫిక్ లో రాహుల్ చిక్కుకున్నారు. ఈ సభ ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దిశగా తొలి అడుగు సక్సెస్ అయిందని పార్టీ నేతలు ఖుషీ అవుతున్నారు

*కాంగ్రెస్ మేనియా..హోరెత్తుతున్న పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌*

janagarjana Sabha

Janagarjana Sabha In Khamma :

తెలంగాణను కాంగ్రెస్ మేనియా కమ్మేసింది. కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రం నలుమూలల నుంచి జనగర్జన సభకు హోరెత్తుతున్నారు. ఇప్పటికే సభకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసారు. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ రానుండ‌డంతో రాష్ట్రంలోని అన్ని దార్లు ఖ‌మ్మం న‌గ‌రం వైపే ప‌రుగులు తీస్తున్నాయి. అగ్ర‌నేత రాహుల్ గాంధీనే భ‌ట్టి విక్ర‌మార్క పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర ముగింపు స‌భకు హాజ‌రవుతుండ‌డంతో కాంగ్రెస్ పార్టీ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. సుమారు ఐదారు ల‌క్ష‌ల‌ మందితో జ‌న‌గ‌ర్జ‌న స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌నే ల‌క్ష్యంతో అన్ని సిద్ధం చేశారు. ఈ సభలో పార్టీలో చేరికలు, భట్టికి రాహల్ గాంధీ సన్మానంతో పాటుగా ప్రజలకు కాంగ్రెస్ తరపున స్పష్టమైన హామీలు ప్రకటించనున్నారు.

భ‌ట్టి విక్ర‌మార్క పాద‌యాత్ర ఇప్ప‌టికే రాష్ట్రంలోని 17 జిల్లాలు, 36 నియోజ‌క‌వ‌ర్గాల మీదుగా 1360 కిలోమీట‌ర్లు పూర్తి చేసుకుంది. భ‌ట్టి పాద‌యాత్ర‌తో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో కేసీఆర్ ఏకచ్ఛత్రాధిపత్య రాజకీయాలకు భ‌ట్టి విక్ర‌మార్క భరత వాక్యం పలికాడని రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇప్ప‌టికే బ‌లంగా వినిపిస్తోంది.

కాంగ్రెస్ ఎక్కడుందీ అన్న నోటి నుంచే హస్తం పార్టీనే ఇంకా బలంగా ఉందనిపించాడు. కారులో ఉక్కపోతకు గురవుతున్న నేతలకు, భవిష్యత్ లేక, అవకాశాలు రాని ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్ ను ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా నిలిపాడు. దీంతో కాంగ్రెస్ లో చేరేందుకు నాయకులంతా ఆసక్తి చూపుతున్నారు. కేసీఆర్ మీద వ్యతిరేకత లేదన్న నోళ్లే ఇప్పడు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తరువాత కేసీఆర్ కు ఇంక కష్టమే అనిపించడంలో భట్టి విక్ర‌మార్క తిరుగులేని విధంగా స‌క్సెస్ అయ్యాడు.

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ కు ముందు – వెనుక అనేలా మార్చేశారు. మొత్తం రాష్ట్ర రాజకీయ యంత్రాంగమంతా తన చుట్టూ తిరిగేలా చేసుకోవడంలో భట్టి తిరుగులేని విధంగా సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.

పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఇంత వరకూ ఎవరూ పలకరించని నిరుపేద వర్గాలను భట్టి విక్రమార్క నేరుగా కలవడం విశేషం. పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌తో సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క లేటెస్ట్ ట్రెండింగ్ గా నిలిచారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఎన్నో సంచలనాలకు..మరెన్నో ప్రజాసమస్యను గుర్తించ‌డానికి వేదికగా నిలిచింది.

ఇప్పటి వరకూ ఎవరూ క‌న్నెత్తి చూడ‌డానికి కూడా సాహసించని ప్రాంతాల్లో ప్రయాణిస్తూ, స్వ‌తంత్ర తెలంగాణ రాజ‌కీయాల‌కు ఒక చుక్కానిలా మారాడు. ఆదిలాబాద్ జిల్లా మొద‌లుకుని రాష్ట్ర‌వ్యాప్తంగా భట్టి పాద‌యాత్ర‌తో కాంగ్రేస్ మేనియా మొద‌లైంది. తాజాగా ఖ‌మ్మం న‌గ‌రంలో త‌ల‌పెట్టిన జ‌న‌గ‌ర్జ‌న స‌భ‌తో భట్టి విక్ర‌మార్క నామ‌స్మ‌రణం హోరెత్తుతున్నది.

ఏఐసీసీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతున్న జ‌న‌గ‌ర్జ‌న స‌భ‌ కోసం ఖ‌మ్మం న‌గ‌రం అందంగా ముస్తాబైంది. ఖ‌మ్మం న‌గ‌రంలో అడుగ‌డుగునా మూడు రంగుల జండాలే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఎటు చూసినా కాంగ్రెస్ ఫ్లెక్సీలతో సుంద‌రంగా మారింది. ప్ర‌త్యేకంగా  ఏర్పాటు చేసిన‌ కాంగ్రెస్ జెండాలు, హోర్డింగ్ ల‌తో అలంకరించారు.

ప‌ట్ట‌ణంలో ప్ర‌ధాన ర‌హదారులు, చౌర‌స్తాలు, కూడ‌ళ్లు, విద్యుత్ స్థంభాల‌ను కూడా కాంగ్రెస్ పార్టీ జెండాలు, ఫ్లెక్సీల‌తో అత్యంత సుంద‌రంగా అలంక‌రించారు. ప‌ట్ట‌ణంలో దాదాపు 45 అడుగుల కటౌట్స్, 20×20 అడుగుల స‌ర్కిల్ హోర్డింగ్ లు, భారీ క‌టౌట్ లు, పెద్ద‌పెద్ద బెలూన్స్ ఎగ‌రేశారు. రాహుల్ కు యూత్ కాంగ్రెస్ భారీ ద్విచక్ర వాహన ర్యాలీతో స్వాగతం పలకనుంది. ఈ సభ వైపే ఇప్పుడు యావత్ తెలంగాణ ఆసక్తిగా చూస్తోంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version