ఇందిరమ్మ ఇండ్లను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్.
చిట్యాల నేటి ధాత్రి :
జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ముచిన్పర్తి గ్రామాన్ని గురువారం రోజున ఏ సి ఎల్ బి అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి తనిఖీ చేయడం జరిగింది . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లను తొందరగా పూర్తి చేయాలని బేస్మెట్ లెవెల్ పనులను లబ్ధిదారులతో పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ డి ఆర్ డి ఏ ఎంపీడీవో జయశ్రీ, ఎంపీ ఓ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి అధికారులు తదితరులు పాల్గొన్నారు.