ఎమ్మెల్యే సహకారం తో ₹.5 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల పనులను ప్రారంభం
జహీరాబాద్ నేటి ధాత్రి
జహీరాబాద్ మండలం మల్చేల్మా గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే సహకారం తో ₹.5 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్ల పనులను శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు ఆదేశాల మేరకు గ్రామస్థుల కోరిక మేరకు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ గారు*ఇప్పేపల్లి PACS చైర్మన్ మచ్చండర్ ,మరియు మండల గ్రామ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తో కలిసి ప్రారంభించారు .ఈ సంధర్బంగా గ్రామ నాయకులు,ప్రజలు ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి,మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ గార్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ఆనందం మాజీ ఎంపీటీసీ లు ఇస్మాయిల్,మోయిన్,రాములు, ప్రేమ్ సింగ్, మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు వహీద్ అలీ, అధ్యక్షులు,మండల బిసి సెల్ అధ్యక్షులు అమిత్ కుమార్,మండల యూత్ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి మాజీ సర్పంచులు చిన్నారెడ్డి,నాయకులు గోరెప్ప,భీమ్ రావ్, దత్తు రెడ్డి,మోహన్ రాథోడ్,శ్రీకాంత్, పిజి శంకర్,యేసు, శ్రీనివాస్, పాపన్న కయ్యుమ్, నసీర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగినది. సిరిసిల్ల కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత్ జూడో యాత్రలో భాగంగా భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బడుగు బలహీన వర్గాల కులాల గురించి అన్ని గ్రామాల్లో కులగణన చేపడతామని, జనగణన తో పాటు కులాల వారీగా కుల గణన చేపడతామని, అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్య, వైద్య ఉపాధి, ఉద్యోగ, అవకాశాలపై ఏ కులాలకు ఎంత వాటాల రూపంలో తీర్చేందుకే ఈ కుల గణనను చేపట్టడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అని తెలిపారు. ఈ కుల గణన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆలోచన విధానం నుంచి వచ్చిందని, అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం ద్వారా కులగణన తెలంగాణ ప్రభుత్వంలో చేపట్టడం జరిగినదని. ఈ కులగణలలో 1,50,000 మంది సర్వేలో పాల్గొనడం జరిగింది అని తెలిపారు. అంతేకాకుండా ఈ కులగణలో బీసీల రిజర్వేషన్ శాతం 56.36% శాతం ఉన్న బీసీలకు విద్య, వైద్య, ఉపాధి కల్పనా రాజకీయంగా గాని బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో 42% శాతం అసెంబ్లీ ఆమోదం నిర్ణయించడం జరిగింది . అంతేకాకుండా కరీంనగర్ బీసీ ముద్దుబిడ్డ, బీసీ సంక్షేమ శాఖ, రోడ్డు రవాణా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో కులగణన ప్రవేశపెట్టడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలించే రాష్ట్రంలో కర్ణాటక తెలంగాణ వంటి రాష్ట్రాలలో బీసీ కులగనున చేపట్టడం జరిగింది. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను తోపాటు మన తెలంగాణ రాష్ట్రంలోని బిసి సంఘాలను ఏకం చేసుకుంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే విధంగా కుల గణన నిరసన తెలుపడం జరిగినది. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిరసన ఒత్తిడి తెచ్చింది అని అందుకు కేంద్ర ప్రభుత్వం కులగననకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కాంగ్రెస్ పార్టీ పిసిసి కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు కూసా రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు, ఎండి హమీద్, చుక్క శేఖర్, వెంగళ అశోక్, అడ్డగట్ల శంకర్, పైసా ఆంజనేయులు, నేరెళ్ల శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగినది. మొన్న జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల డి.సి.సి సమావేశంలో ప్రభుత్వ విప్ చీప్ ఆది శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ కార్యకర్తల ముందు చిటి ఉమేష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి దానిపై ఈరోజు కాంగ్రెస్ మండల స్థాయి నాయకులు సమావేశం నిర్వహించడం జరిగినది. ఇందులో భాగంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎప్పుడో ఒకసారి వచ్చే చీటీ ఉమేష్ రావు ఏ నాయకులను గాని ఏ కార్యకర్తలను గాని పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి. సిరిసిల్లలోని కాంగ్రెస్ కార్యకర్తలపై పార్టీ పరంగా గాని వ్యక్తిగతంగా గాని మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం సరైనది కాదని అందువల్ల అతనిపై టీ.పి.సీ.సీకి ఫిర్యాదు చేస్తూ చర్యలు తీసుకునే విధంగా చూస్తామని కాంగ్రెస్ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ టోనీ, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, మరియు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగినది.
అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరిలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి
పేదల కాలనీలో కనీస సదుపాయాలు కల్పనకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి
ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దొంతికి వినతి
నర్సంపేట,నేటిధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అర్హులైన నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి మంజూరు చేయాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. నర్సంపేట పట్టణంలో పేదలను నివసించే కాలనీలకు ప్రత్యేక నిధులు కేటాయించి కనీస వసతులు ఏర్పాటు చేయాలని కోరారు.బుదవారం ఎంసిపిఐ (యు) ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం స్థానిక నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కలిసి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ నర్సంపేట పట్టణం మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చెంది జనాభాపరంగా విపరీతంగా పెరుగుతున్నదని అదే స్థాయిలో కనీస వసతులు లేవని అందులో ముఖ్యంగా పేదల నివసించే కారల్ మార్క్స్ కాలనీ జ్యోతి బస్ నగర్ తదితర ఏరియాల్లో అంతర్గత రోడ్లు డ్రైనేజీ కాలువలు మంచినీటి నల్లాలు లేక అనేక అవస్థలు పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు.గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన పేదల కాలనీలో ఈ ప్రభుత్వంలోనైనా మెరుగుపడతాయని ఆశపడితే ఇంతవరకు కనీస దృష్టి పెట్టకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో సైతం పారదర్శకత లోపించిందని అర్హులైన నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వకుండా తమ ఇష్టానుసారంగా ప్రక్రియ చేపట్టారని ఇది సరైన చర్య కాదని ఆరోపించారు. ప్రభుత్వానికి ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉన్న అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లను కేటాయించి ప్రాధాన్యత క్రమంలో నిరుపేదలకు ఇండ్లు నిర్మించి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, యుపిఎన్ఎం రాష్ట్ర కార్యదర్శి కన్నం వెంకన్న, డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, పట్టణ నాయకులు ముప్పారపు రాజేందర్, బైరబోయిన నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ తూర్పు జర్నలిస్టులకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి.
బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్.
వరంగల్, నేటిధాత్రి
భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ఆధ్వర్యంలో జిల్లా అధికార ప్రతినిధి ఆడేపు వెంకటేష్ అధ్యక్షతన బుధవారం నాడు ఏకశిలా పార్క్ బాలసముద్రం వద్ద వరంగల్ తూర్పు జర్నలిస్టుల డబుల్ బెడ్ రూమ్ కొరకై మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ముందుండి పోరాడిన జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకపోవడం సిగ్గుచేటు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని కోరుతూ దేశాయిపేట ఇండ్ల ముందు నిరాహార దీక్ష చేపట్టిన వారికి మద్దతుగా బీజేపీ మద్దతు ప్రకటించి ఈరోజు ఇళ్ల స్థలాలు, ఇల్లు మంజూరు చేయాలనీ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ కలలను నిజం చేస్తూ డబుల్ బెడ్ రూమ్ లను గత బిఅర్ఎస్ కేటాయించినా ఇండ్లు ఇవ్వలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులు కావస్తున్న జర్నలిస్టులకు నీడ లేకపోయిందని విమర్శించారు.
BJP
ప్రభుత్వానికి, ప్రజలకు ప్రతినిధులగా వారి మధ్య జరిగే సమాచారాన్ని తెలియపర్చే వారు జర్నలిస్టులు. వారికి పేపర్ సంస్థ నుండి చాలీచాలని వేతనాలతో కుటుంబంతో జీవనాన్ని గడుపుతున్నారు. ఇంటి అద్దె కట్టలేక నాన అవస్థలు పడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
అప్పుడున్న రాజకీయ పరిణామాలు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడం వలన లబ్ధిదారులను ఎంపిక చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు.
ప్రభుత్వాలు ఏవి ఉన్నా జర్నలిస్టులను వాడుకోవడం, ప్రభుత్వం పోయాక మళ్ళీ వచ్చిన ప్రభుత్వం అదే తరహా జర్నలిస్టులను వాడుకుంటూ, గత ప్రభుత్వాల మాదిరిగానే చేస్తూ ఉండడం అనవాయితిగా మారింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తున్న గత ప్రభుత్వం చేసిన తప్పులనే ఈ ప్రభుత్వం చేస్తోంది.
ఇప్పడి లబ్ధి దారులకు ఇండ్లు ఇయ్యక పొవడం వలన శిథిలావస్థకు చేరుతుతున్నాయి. అసాంఘిక కర్యకలాపాలకు అడ్డాగా మారి జూదాలకి, వ్యభిచారులకు ఆశ్రయం ఐపోయి, తలుపులు, కిటికీలు, కరెంటు వైర్లు,నీటి పైపు లైను, ట్యాంకులు అన్ని ధ్వంసం చేశారు.
తూర్పులో శాసనసభ్యులుగా ఉన్న మంత్రి కొండా సురేఖ ఎన్నోసార్లు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ల దగ్గర పర్యటించినప్పటికీ జర్నలిస్టులపై అనుకూల భావన లేనట్లు కనిపిస్తుంది.
అదే నిజమైతే గత ప్రభుత్వంలో భూమి కేటాయింపు నిధుల కేటాయింపు శంకుస్థాపన ప్రారంభోత్సవం ఏ రకంగా చేశారు. దీనిని ప్రభుత్వాలు దేనికోసం నిర్మించాయి. సదరు పాలకులు గమనించాలి.
ప్రభుత్వాలు మారినప్పుడల్లా వారికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం సబబేనా అంటూ వరంగల్ తూర్పులో వర్కింగ్ జర్నలిస్టులు నిరాహార దీక్షలు చేపట్టారు.
సమస్య శాంతియుతంగా పరిష్కారం కాకపోతే నగర నడిబొడ్డున తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామన్నారు తెలిపారు.
ఇప్పటికైనా ప్రజాపాలన ప్రభుత్వం స్పందించి తూర్పు వర్కింగ్ జర్నలిస్టులకు త్వరగా కేటాయించాలని కోరారు.
BJP
12 ఏప్రిల్, 2021 రోజున వరంగల్ తూర్పు జర్నలిస్టుల కోసం డబల్ బెడ్రూంలు భూమి పూజ చేసిన అప్పటి మంత్రివర్యులు కేటీఆర్..
రెండు ఏండ్లలో 12 కోట్లు ఖర్చు పెట్టి, మొత్తం మూడు ఎకరాల భూమిలో, రెండు ఎకరాల్లో మొత్తం 9 బ్లాకులు కలిపి 200 డబల్ బెడ్ రూమ్ ల నిర్మాణం పూర్తి చేసిన అప్పటి తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, తేదీ 17 జూన్, 2023 నాడు నిర్మాణం పూర్తి చేసిన డబల్ బెడ్ రూం లు, అట్టహాసంగా ప్రారంభం చేసి, ఆరుగురు జర్నలిస్టులకు గృహ ప్రవేశం, జర్నలిస్ట్ ల కాలనీ, జర్నలిస్టుల కొరకు అని పేర్కొన్న అప్పటి ప్రభుత్వం.
రెండు ఏండ్లుగా నిరుపయోగంగా ఉండటం వలన చాలా వరకు కిటికీలు, ఎలెక్ట్రిక్ పరికరాలు, డోర్ లు, పైపులు ధ్వంసం అయ్యాయి.
వాటర్ ఇంటెక్స్ ట్యాంక్ లు మాయమయ్యాయి, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన తీరు కనిపిస్తుందని అన్నారు.
వరంగల్ జర్నలిస్ట్ ఐకాస ప్రధాన డిమాండ్లు
అర్హులైన జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ లను కేటాయించాలి.
జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ ( జేహెచ్ఎస్) పరిమితి రెండు లక్షల నుండి 10 లక్షలకు పెంచాలి.
అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో (జేహెచ్ఎస్) పనిచేయడంతో పాటు అన్ని వ్యాధులకు వర్తింపజేయాలి.
వరంగల్ ప్రెస్ క్లబ్ కు స్థలం కేటాయించాలని, అలాగే పలు డిమాండ్లతో వరంగల్ జిల్లా రెవెన్యూ అధికారికి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మెమొరండం ఇవ్వడం జరిగింది.
BJP
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఎలక్ట్రానిక్ & ప్రింట్ మీడియా మిత్రులు, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్, మాజీ శాసనసభ్యులు మార్తీనేని ధర్మారావు, మాజీ పార్లమెంట్ సభ్యులు అజ్మీర సీతారాం నాయక్, మాజీ శాసనసభ్యులు వన్నాల శ్రీరాములు, మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్, మాజీ పూర్వ జిల్లా అధ్యక్షులు చాడ శ్రీనివాసరెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్ , గురుమూర్తి శివకుమార్, రత్నం సతీష్ షా, వన్నాల వెంకటరమణ, జిల్లా ప్రధాన కార్యదర్శిలు బాకం హరిశంకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, డాక్టర్ గోగుల రాణా ప్రతాపరెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బన్న ప్రభాకర్, కార్పొరేటర్ చాడ స్వాతి, కాసు శిల్పా, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, వివిధ మోర్చా నాయకులు, బిజెపి జిల్లా నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
బుధవారం నాడు బసవేశ్వర జయంతి వేడుకల సందర్భంగా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు.సంఘ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెగారెడ్డి మాట్లాడుతూ 12వ శతాబ్దానికి చెందిన బసవేశ్వరుడు మానవులంతా.ఒక్కటే అని కుల మతాలు లేవని ప్రగాఢంగా నమ్మి ప్రజలకు అవగాహన కల్పించారని అన్నారు .మూఢ నమ్మకాలను నమ్మవద్దని, సమానత్వం, శోషలిజం వంటి సిద్ధాంతాలను ప్రచారం చేసి ప్రజలకు దిశానిర్దేశం చేశారని గుర్తు చేశారు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ బసవేశ్వరుడు శ్రమకు మించిన సౌందర్యం లేదని, ఏ పని చేసిన నిష్టతో అంకిత భావంతో పనిచేయాలని బోధించిన బోధనలు ప్రతి ఒక్కరికి స్పూర్తినిస్తాయని అన్నారు అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, డి.సి.డి.బి అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ,ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా అధికారులు, సంఘ నాయకులు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.
జహీరాబాద్: ఇందిరమ్మ ఇళ్ళ స్థలాలను పరిశీలించిన అదనపు కలెక్టర్
జహీరాబాద్ నేటి ధాత్రి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండల రాఘవ పూర్ గ్రామానికి నూతనంగా మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ళ స్థలాలను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ రావు బుధవారం ఉదయం స్వయంగా సందర్శించి, పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజశేఖర్ కౌలాస్ ఏపీఓ, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
డిసిసి అధ్యక్ష పదవి చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యంకి కేటాయించాలి- అనుపురం పరశురాం గౌడ్
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా డిసిసి అధ్యక్ష పదవిని చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యంకి కేటాయించాలని యువజన కాంగ్రెస్ రామడుగు మండల అధ్యక్షులు అనుపురం పరశురాం గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మేడిపల్లి సత్యం పీహెచ్డీ చేసిన ఒక విద్యావేత్త, యువ నాయకులు, పేదల ప్రజల అభివృద్ధి కోసం కృషి చేసే నాయకులు, పార్టీ కోసం అహర్నిశలు పాటుపడే గొప్ప వ్యక్తి. మంచి నాయకత్వ లక్షణాలు కలిగివున్న సత్యంకు డిసిసి అధ్యక్ష పదవిని అందించడం ద్వారా ముందు ముందు పార్టీ మరింత బలోపేతం కావడమే కాకుండా యువత కూడా రాజకీయంగా ముందుకు వెళ్తుందని ఆయన తెలిపారు.
రాజ్యాంగ పరిరక్షణలో భాగస్వాములు కావాలి -పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
తొర్రూరు (డివిజన్) నేటి ధాత్రి
భారత రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మంగళవారం ఏఐసీసీ మరియు పీసీసీ ఆదేశాల మేరకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ ఆధ్వర్యంలో మండలంలోని కర్కాల నుండి హరిపిరాల గ్రామ వరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ సన్నాహ సమావేశం నిర్వహించి పాదయాత్రను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ అమలుకు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ను అవమానించే విధంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా “జై బాపు, జై భీమ్” కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచిన గొప్ప రాజ్యాంగమని, దానిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందని గుర్తు చేశారు. రాజ్యాంగ పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చేతిలో గాంధీ అంబేద్కర్ చిత్రపటం పట్టుకొని పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తొర్రూర్ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, కాంగ్రెస్ నాయకులు గంజి విజయపాల్ రెడ్డి, డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు, దేవేందర్ రెడ్డి, చిత్తలూరి శ్రీనివాస్, ప్రసాద్ రెడ్డి,రామచంద్రయ్య, సురేందర్ రెడ్డి,అచ్చిరెడ్డి, అశోక్ రెడ్డి,శ్రావణ్ కుమార్,చెవిటి సధాకర్,యాకూబ్ రెడ్డి,ధరావత్ సోమన్న, రవి నాయక్, ఫింగిలి ఉష, ప్రశాంతి, వెంకట్ రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పీసీసీ సభ్యులు పెండెం
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణ కేంద్రానికి చెందిన విగ్నేశ్వర రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ బుదవారం ప్రారంభం చేశారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని రాజేందర్, మాజీ వైస్ ఎంపీపీ చింతల సాంబరెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఓర్సు తిరుపతి, నర్సంపేట మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి అజ్మీర మేఘ్య నాయక్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, నర్సంపేట మార్కెట్ డైరెక్టర్ కొల్లూరి మధుకర్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పంబి వంశీకృష్ణ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి చిప్ప నాగ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి బిట్ల మనోహర్, 13వ వార్డు ఇంచార్జ్ శ్రీరామోజు మురళి, బీరం భరత్ రెడ్డి, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్, విగ్నేశ్వర రైతు సంఘం అధ్యక్షులు చిలువేరు కుమారస్వామి, విజ్ఞేశ్వర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రేమిడి శ్రీనివాసరెడ్డి, ఇంచార్జ్ రాజా మల్లారెడ్డి, మేడబోయిన కుమార్, విగ్నేశ్వర రైతు సంఘం సభ్యులు, రైతులు, పాల్గొన్నారు.
రాష్ట్రీయ బసవ దళ్ పూజా కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు
◆ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి,
◆ మాజీ టిజిఐడిసి చైర్మన్ మహ్మద్.తన్వీర్*
జహీరాబాద్ నేటి ధాత్రి:
రాష్ట్రీయ బసవ దళ్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శంకర్ పటేల్ గారి ఆహ్వానం మేరకు మంగళవారం పట్టణం లోని బసవ మంటపం లో జరిగిన పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి ,మాజీ టిజిఐడిసి చైర్మన్ మహ్మద్.తన్వీర్ ఈ సంధర్బంగా డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి మాట్లాడుతూ అందరికీ ముందుగా బసవ జయంతి శుభాకాంక్షలు తెలిపారు,ప్రేమతత్వం, సమానత్వం,సౌభ్రాతృత్వాన్ని విశ్వమానవాళికి ప్రబోధించిన మహాత్మ శ్రీ బసవేశ్వరుడి చూపిన మార్గంలో నడవాలాన్నారు.బసవేశ్వరుడి జయంతి సందర్భంగా రక్త దాన కార్యక్రమాలు చేయడం ఒక పుణ్య కార్యం అని,బసవ జయంతి పురస్కరించుకొని రాష్ట్రీయ బసవ దళ్ వారు ప్రతి సంవత్సరం రక్త దాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు పి.నర్సింహారెడ్డి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పి.నాగిరెడ్డి, మాజీ కౌన్సిలర్ రాజశేఖర్,సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి,అశ్విన్ పాటిల్,రంగా అరుణ్ కుమార్, కుతుబోద్దిన్,తాజోద్దిన్,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి,నర్సింహా యాదవ్,బి.జి.సందీప్ మరియు రాష్ట్రీయ బసవ దళ్ తెలంగాణ అధ్యక్షులు శంకర్ పటేల్ ,రాష్ట్రీయ బసవ దళ్ డాక్టర్ శర్నప్ప ,వైద్యులు డాక్టర్ రాజ్ కుమార్,డాక్టర్ సచిన్ ,కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా చోప్పదండి నియోజకవర్గం రామడుగు మండల కేంద్రంలోని శ్రీపెద్దమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా ముఫై ఒకలక్షల రూపాయలు కేటాయించిన సందర్భంగా చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యంను రామడుగు ముదిరాజ్ కులస్తులు ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా శ్రీపెద్దమ్మ తల్లి దేవాలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా పునర్నిర్మాణానికి నోచుకోని శ్రీపెద్దమ్మ తల్లి ఆలయాన్ని నూతనంగా నిర్మించుకోవడానికి తన వంతు సహాయం చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు దీనికి సహకరించిన మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల తిరుపతి ముదిరాజ్, ముదిరాజ్ సంఘం పెద్దమనుషులకు, సొసైటీ సభ్యులకు, ముదిరాజ్ యువతకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో అధ్యక్షులు జిట్టవేణి రాజు, సదరు పెద్దమనిషి జిట్టవేణి రమేష్, వైస్ చైర్మన్ నీలం రవి, డైరెక్టర్లు, పెద్దమనుషులు ఉత్తం రాయమల్లు, సామంతుల తిరుపతి, రాగం రాజయ్య, మామిడి సుదర్శన్, రాగం వెంకటి, జిట్టవేణి అంజిబాబు, పెసరి రాజమౌళి, సామంతుల తిరుపతి, రాగం లచ్చయ్య, ఈగ రాజేశం, రాగం సంపత్, చిలువేరి కనకయ్య, ఉప్పరి మహేష్, నీలం లక్ష్మణ్ బొమ్మరివేని తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
లయన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి కి లయన్స్ అంతర్జాతీయ అవార్డు..
రామాయంపేట ఏప్రిల్ 28 నేటి ధాత్రి (మెదక్)
లయన్స్ క్లబ్ రామాయంపేట చార్టర్ సభ్యుడిగా 35 సంవత్సరాలుగా ఆర్తుల సేవయే పరమావధిగా ఆర్తులకు అన్ని రకాలుగా సేవలందిస్తూ గత రెండున్నర దశాబ్దాలుగా రక్త అవయవ దానాలకు కృషి చేస్తూ, అత్య వసర పరిస్థితులలో అవసరము ఉన్నవారికి సేవలందిస్తూ, రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ, రక్త అవయవ దానాల ప్రచారానికి కార్యక్రమాలు నిర్వహిస్తూ ముఖ్యంగా యువతి యువకులకు అవగాహన కల్పిస్తూ, వృద్ధులకు ఆపదలో ఉన్నవారికి అన్ని రంగాలలో సేవలందిస్తున్న లయన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి కి లయన్స్ అంతర్జాతీయ అధ్యక్షులు లయన్ ఫిబ్రయిషీయో అలివేరా అభినందిస్తూ **లయన్స్ అత్యంత ప్రతిష్టాకరమైన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ లీడర్షిప్ మెడల్ను.
లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ జి. బాబురావు కానిస్టిట్యూషనల్ ఏరియా లీడర్ ఆర్ సునీల్ కుమార్ అభినందిస్తూ ఆదివారం సాయంత్రం హైదరాబాదు, షామీర్పేట్ లోని ఎస్.ఎన్.ఆర్ పుష్ప కన్వెన్షన్ లో జరిగిన తెలంగాణ రాష్ట్రంలోని 8 లైన్స్ జిల్లాల నుండి పాల్గొన్న లయన్స్ ప్రతినిధులు పాల్గొన్న “మల్టీకాన్ కన్వెన్షన్” లో అవార్డును ప్రధానం చేశారు. కాగా రాజశేఖర్ రెడ్డి 54 మార్లు రక్తదానం చేసి ప్రాణాపాయకర స్థితిలో ఉన్నవారికి ప్రాణదానం చేస్తున్నారని, రక్తదాన శిబిరంలను నిర్వహిస్తూ, అవయవ దానం ల గురించి విస్తృత ప్రచారం నిర్వహిస్తూ, మారుమూల గ్రామాలలో సైతం అవయవ దానానికి ప్రజలను సంసిద్ధం చేస్తున్నారని అన్నారు. లయన్స్ ఏరియా కాన్స్టిట్యూషనల్ లీడర్ లయన్ రుమాళ్ళ సునీల్ కుమార్ మాట్లాడుతూ రక్త అవయవదానాలపై రాజశేఖర్ రెడ్డి కృషి అభినందనీయమని, గతంలో కూడా ఉత్తమ సేవలు అందించి నందులకు రాజశేఖర్ రెడ్డి కి పలుమార్లు అవార్డులు అందుకున్నట్లు గుర్తు చేశారు.మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ హనుమాన్ల రాజారెడ్డి మాట్లాడుతూ ప్రతి మాసం గోడపత్రిక, కరపత్రంల ద్వారా రక్త అవయవ దానాల ప్రచారానికి కృషి చేస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు రాజశేఖర్ రెడ్డి రూపొందించిన గోడపత్రికల ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని లోని ఎనిమిది లయన్స్ జిల్లాలలో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ, యువతి యువకులను ప్రోత్సాహ పరుస్తున్నారని గవర్నర్ లయన్ నగేష్ పంపాటి అన్నారు… లయన్స్ జిల్లా 320-డి గతంలో కూడా రక్త, అవయవ దానాలపై విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహించి రక్తా, నేత్ర అవయవ దానాలకు, కరపత్రంల ద్వారా గోడపత్రికల ద్వారా యువతి యువకులకు, ప్రజలకు అవయవాల ప్రాముఖ్యత, ఆవశ్యకతపైన అవగాహన ఏర్పడిందని తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా రక్త అవయవ దానాలకు ప్రజలు ముందుకు వస్తున్నారని లయన్ ఏ. అమర్నాథ్ రావు అన్నారు… లయన్ ఎమ్. విజయలక్ష్మి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ రామాయంపేట. రెడ్ క్రాస్ మెదక్ శాఖ సభ్యులు,మరియు రాజశేఖర్ రెడ్డి గ్రామీణ ప్రాంతాలలో వైద్య శిబిరాల ద్వారా రోగులకు, వివిధ సేవా కార్యక్రమాల ద్వారా ఆర్తులకు అన్ని రంగాలలో సేవలందిస్తున్నాయని అన్నారు, సేవలను ఇంకా విస్తృత పరిచి ప్రజలకు సేవా కార్యక్రమాలను అధికంగానిర్వహించాలని లయన్ డి. నరసింహారాజు తెలిపారు. 2024 -25 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలలో లయన్స్ ఉత్తమ సేవలందించారని ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి కి అప్పగించిన రక్త అవయవ దానం లపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని లయన్స్ నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ 2024- 25 లయన్స్ సంవత్సరం జిల్లా 320-డి లోని లయన్స్ సభ్యులు “ఎంపవర్” నినాదంతో కార్యక్రమాలను నిర్వహిస్తూ, 35 సంవత్సరాలుగా లయన్స్ క్లబ్, రామాయంపేట, రెడ్ క్రాస్ మెదక్ సంస్థల ద్వారా పరిసర ప్రాంతాలలో అన్ని విషయాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ముఖ్యంగా రక్త, అవయవదానాల అవగాహనకు యువతి యువకులకు, మారుమూల గ్రామస్తులకు, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తు, లయన్స్ జిల్లా 320-డి లోని నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్ ,సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలలో సామాజిక మాధ్యమాలలో మరియు పత్రికలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించి నందులకు లయన్స్ నాయకులు బీ.వి బన్సల్, జి. ఆర్ సూర్య రాజ్ సి. ప్రకాశరావు, గంప రమేష్ ఎం.నాగరాజు, ఆసపల్లి శ్రీధర్, వెంపటి మధు, కే. సూర్యనారాయణ ఇవి రమణ, రామ్ ఫనిధర్ రావు, కరుణాకర్, జనార్దన్ రెడ్డి, ప్రఫుల్ కుమార్, రమణారెడ్డి, తో పాటు పలువురు నాయకులు కొనియాడారు
సెలవు దినాల్లో పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి..
అందరూ ఆరోగ్యంగా ఉండాలి బాగుండాలి..
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల సెక్రటరీ బైరం శంకర్..
రామాయంపేట ఏప్రిల్ 28 నేటి ధాత్రి (మెదక్)
ఎండలు తీవ్రతరం అవుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు జాగ్రత్తలు డాక్టర్ల సూచనలు సలహాలు పాటించాలని కాంగ్రెస్ పార్టీ మండల ఎస్సీ సెల్ సెక్రటరీ బైరం శంకర్ విజ్ఞప్తి చేశారు. వయసు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు డాక్టర్ల సలహాలు సూచనలు పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా సెలవు దినాలు ఉన్నందున విద్యార్థులు చెరువుకుంటల వద్దకు ఈతలకు వెళ్లకుండా తల్లిదండ్రులు వారిని గమనించాలని కోరారు. ఉపాధి పని జరుగుతున్న గ్రామాల్లో ఉపాధి కూలీలకు అందుబాటులో తాగునీరు, టెంట్లు ఏర్పాటు చేసి అస్వస్థతకు గురైతే వారికి చికిత్స కోసం ప్రధమ చికిత్స బాక్సులు అందుబాటులో ఉంచాలని అన్నారు. అలాగే పని చేసే కూలీలను కూడా ఎండ తీవ్రం కాకుండా ముందే పని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
వరి ధాన్యం తెచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన ఏర్పాటు చేయాలి
వరి ధాన్యం కొనే సెంటర్లో వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని బస్వరాజుపల్లి, పరశురాంపల్లి, ధర్మారావుపేట, నగరంపల్లి, మైలారం, లక్ష్మారెడ్డిపల్లి గ్రామాలల్లో కన్య బోయిన కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్, ఐకేపీ, ఓడిసిఎంఎస్, మ్యాక్స్ సొసైటీ ల ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్తపడాలని రైతులకు సూచించారు. ధాన్యం తీసుకురాబోతున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అక్కడున్న వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేలా అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పీఏసీఎస్ చైర్మన్, ప్రజాప్రతినిధులు, పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, గణపురం మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ ఎండి చోట మియా మొలంగూరి రాజు అశోక్ రెడ్డి వివిధ శాఖల అధికారులు, ఎమ్మార్వో ఎంపీడీవో కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు ఉన్నారు.
మృతుల కుటుంబాలకు ఘన నివాళులు మెట్ పల్లి ఏప్రిల్ 26 నేటిదాత్ర
శనివారం పట్టణంలోని టిపిసిసి డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు నివాసములో కాశ్మీర్ పహల్ గావ్ లో భారతీయ పౌరులపై ఉగ్రవాదుల దాడిలో మరణించిన కుటుంబాలకు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో ప్రజలపై ఉగ్రవాదుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. మతోన్మాదులు పర్యాటకులను కాల్చి చంపడం హేయమైన చర్య అని అన్నారు. ప్రపంచ దేశాలు భారతదేశంపై సంఘీభావం ప్రకటించడం పట్ల భారతదేశం శాంతి యుత వాతావరణంలో ప్రజలను. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులను గుర్తించి కఠినంగా శిక్షించి మరొక సారి ఇలాంటి దాడులు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మృతిచెందిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా, కాంగ్రెస్ పార్టీ ఫిషర్మేర్ స్టేట్ జనరల్ సెక్రెటరీ రుత్త నారాయణ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవాదళ్ జనరల్ సెక్రెటరీ అందె మారుతి బాపూజీ,ఇబ్రహీపట్నం యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ నల్లూరి సాగర్, కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ జాఫర్, బైండ్ల శ్రీకాంత్, మామిడి రాజశేఖర్ రెడ్డి, ఇప్పపల్లి గణేష్ గౌడ్,తోగిటి నాగరాజ్, మొగలి రాజేందర్,కోరే రాజ్ కుమార్, చౌదరి తదిరితలు పాల్గొన్నారు.
టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈనెల ఏప్రిల్ 27 వరంగల్ లో ఎల్కతుర్తి లో ఏర్పాటు చేసిన రజితోత్సవ సభ కు తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజలంతా ఒక్కటై కదం తొక్కుతూ కదిలి రావాలని పరకాల నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల ప్రజలంతా భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో హాజరై బి ఆర్ ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని పరకాల శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ గందె వెంకటేశ్వర్లు కోరారు.ఈ సందర్భంగా గందెవెంకటేశ్వర్లు మాట్లాడుతూ టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలను ఆగమయ్యే రోజులు వచ్చాయని కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిందని మళ్లీ కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుతున్నారు.ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతాంగం ఆగమైందని ఇప్పటికైనా తెలంగాణ ప్రజలంతా మేల్కొని కాంగ్రెస్ పాలన నుండి విముక్తి పొందాలంటే బీఆర్ఎస్ పార్టీని మళ్లీ గెలిపించుకొని కెసిఆర్ ని ముఖ్యమంత్రి ని చెయ్యాలి. భారత రాష్ట్ర సమితి బి ఆర్ ఎస్ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పురస్కరించుకున్నందున ఈనెల 27న జరిగే జరగబోయే టిఆర్ఎస్ రజితోత్సవ సభకు పరకాల నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల నుండి గ్రామాల నుండి గులాబీ దండై ప్రజలంతా తరలిరావాలని బి ఆర్ ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరారు.
వీణవంక మండల పరిధిలోని వల్బాపూర్ గ్రామనికి చెందిన మాజీ సర్పంచ్ మరుమళ్ళ కొమురయ్య గారి తల్లి స్వర్గస్తులైన సమాచారం తెలిసిన వెంటనే వచ్చి భౌతికాయానికి పువ్వుల మాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని ఓదార్చి మనోధైర్యం కల్పించి వారికి అండగా ఉంటామని బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు లక్ష్మక్క పల్లి మాజీ ఉపసర్పంచ్ మేకల సమ్మి రెడ్డి గారి తండ్రి స్వర్గస్తులైన తెలుసుకున్న వెంటనే వారి కుటుంబాన్ని ఓదార్చారు ఈ కార్యక్రమంలో వారి వెంట బిజెపి నాయకులు మాజీ మండల అధ్యక్షుడు ఆదిరెడ్డి,మల్లారెడ్డి ,శ్రీనివాస్ యాదవ్, ఉడుత కుమార్,కొండల్ రెడ్డి, అప్పన కొమురయ్య, ఈదునూర్ కుమార్ ,సమ్మిరెడ్డి,శంకర్, మోటం శ్రీనివాస్, పల్లె రాయమల్లు, బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.
భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కథలాపూర్ మండల కేంద్రంలో ఉగ్రమూఖల దాడిలో అసువులు బాసిన పర్యాటకులకు అశ్రునివాళి అర్పించి, కొవ్వాత్తుల ర్యాలీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో హిందువులరా మేల్కొండి, ఉగ్రవాదం నశించాలి, పాకిస్థాన్ కుక్కలారా ఖబర్దార్ ఖబర్దార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది ముక్యంగా హిదువులను గుర్తించి మరి దాడి చేయడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మల్యాల మారుతి,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి,జిల్లా కౌన్సిల్ మెంబర్ కథలాపూర్ మహేష్, గడ్డం జీవన్ రెడ్డి,దండిక లింగం,బూమయ్య,సంతారం,రాజేష్,శ్రీకర్,ప్రసాద్,గణేష్,శివ, శ్రీహరి, మల్లేష్,గంగమల్లయ్య, చారి నాయకులు, బీజేపీ కార్యవర్గ సభ్యులు సురబీ నవీన్ పాల్గొన్నారు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు
అకాల వర్షం తో వడగండ్ల వానతో నష్టపైన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి
కోరుట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మానుక ప్రవీణ్ కుమార్ డిమాండ్.
ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి
మండలంలోని. వర్షకొండ ఇబ్రహీంపట్నం, కేశవాపూర్ ,ఎర్రపూర్, గోధుర్, కోమటి కొండాపూర్ రైతులను వెంటనే ఆదుకోవాలని మానుక ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇటీవల ఈదురు గాలులకు నువ్వుల పంట, సజ్జ ,వరి పంటలు, మొక్కజొన్న ,మామిడి, రైతులు తీవ్రంగా నష్టపోయారని ముఖ్యంగా వరి పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షంతో నష్టపోయారని ప్రవీణ్ కుమార్ తెలిపారు. అలాగే, పలువురు గుడిసెలు సైతం దెబ్బతిన్నాయని పంటలు నేలవాలయని నష్టపోయిన రైతులను పరామర్శించి రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకొని జిల్లా కలెక్టర్ ,వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే స్పందించి ప్రభుత్వం తరఫున రైతులను ఆదుకోవాలని, అలాగే నష్టపోయిన రైతులకు వెంటనే ఎకరానికి 50 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల టిడిపి అధ్యక్షులు ఎండి సాదుల్లా నియోజకవర్గ టిడిపి సభ్యులు రాజ గణేష్ ,కోరుట్ల పట్టణ టిడిపి ఉపాధ్యక్షులు మహదేవ్, ఇర్నాల గంగులు ,శ్రీనివాస్ ,బాలే మారుతి రైతులు రాములు ,మల్లయ్య, లచ్చయ్య, దయాకర్, లక్ష్మణ్ ,పెద్ది నరసయ్య ,రాజేశ్వర్, గంగాధర్, భాగ్యలక్ష్మి, చిన్న భూమయ్య, వెంకటి, నర్సారెడ్డి ,విజయ, రాజలింగం ,భూమన్న ,మురళి ,పెద్ద భూమయ్య తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.