బోర్ మోటార్ ని ప్రారంభం చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు..

బోర్ మోటార్ ని ప్రారంభం చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ సర్పంచ్ మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కోరటపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీ, ముదిరాజ్ కాలనీలలో చేతి పంపులు పని చేయక తాగునీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్న సమస్యను గుర్తుంచి వెంటనే స్పందించి తన స్వంత ఖర్చులతో బోర్ మోటార్ ఫిట్ చేపించి ఇబ్బందిని తీర్చిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ సర్పంచ్ మేకల ప్రభాకర్ యాదవ్. ఈసందర్భంగా గ్రామ ప్రజలు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో యువ మోర్చా మండల అధ్యక్షులు దురుశెట్టి రమేష్, బూత్ అధ్యక్షులు ఉప్పు తిరుపతి, మేకల అభిషేక్, దుర్శేట్టి అంజి, కనుకం మల్లయ్య, రాజయ్య, పోచయ్య, గణేష్, శ్రీకాంత్, గ్రామ ప్రజలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version