అమరుల త్యాగాలు మరువలేనివి.

అమరుల త్యాగాలు మరువలేనివి

బాలానగర్  నేటి ధాత్రి:

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల బీజేపి పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు గోపాల్ నాయక్ జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరుల త్యాగాలు మరువలేనివని, తెలంగాణ ఉద్యమ సమయంలో అసువులు బాసిన ఉద్యమకారులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బాలానగర్ మాజీ సర్పంచ్ మాజీ అధ్యక్షులు సాటి శ్రీనివాస యాదవ్, వంగూరి యాదయ్య, జిల్లా బీజేవైఎం ఐటి సెల్ కన్వీనర్ జరుపుల గణేష్, మాజీ అధ్యక్షులు శ్రీశైలం, బీజేవైఎం మండల అధ్యక్షులు కుమార్ నాయక్, శ్రీను, లక్ష్మయ్య, నాగేష్, సురేష్, శ్రీకాంత్, భరత్, చౌదరి, శ్రీనివాస్ రెడ్డి, నందు యాదవ్, ఆర్. శ్రీను తదితరులు పాల్గొన్నారు.

విహారయాత్రకు వచ్చిన 8మంది స్నేహితులు..

విహారయాత్రకు వచ్చిన 8మంది స్నేహితులు.. కట్ చేస్తే.. ట్రైన్ పైకెక్కి సెల్ఫీ దిగుతుండగా..

 

నేటిధాత్రి:

 

 

 

సెల్ఫీ మోజు ప్రాణం మీదికి తెచ్చింది. విహార యాత్ర తీవ్ర విషాదం మిగిల్చింది. కళ్ల ముందే తమ మిత్రుడు విద్యుత్‌ షాక్‌కు గురై తీవ్ర గాయాల పాలవడంతో విచారంలో మునిగిపోయారు అతని స్నేహితులు.. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మామండూరు రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.

సెల్ఫీ మోజు ప్రాణం మీదికి తెచ్చింది. విహార యాత్ర తీవ్ర విషాదం మిగిల్చింది. కళ్ల ముందే తమ మిత్రుడు విద్యుత్‌ షాక్‌కు గురై తీవ్ర గాయాల పాలవడంతో విచారంలో మునిగిపోయారు అతని స్నేహితులు.. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మామండూరు రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. తిరుపతి నుంచి ఇంటర్ సిటీ ప్యాసింజర్ ట్రైన్‌లో మామండూరు రైల్వే స్టేషన్‌కు జాన్సన్ సహా 8 మంది స్నేహితులు వచ్చారు.. మామండూరు జలపాతం చూసేందుకు వెళ్ళాలని అందరూ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో అందరూ.. ట్రైన్‌లో మామండూరు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడినుంచి జలపాతం వద్దకు వెళ్లాల్సి ఉంది.

ఈ క్రమంలోనే.. రైల్వే స్టేషన్‌లో ఆగివున్న గూడ్స్ రైలు పైకెక్కి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు జాన్సన్.. ఆ సమయంలో హైటెన్షన్ తీగలను తాకాడు. హైటెన్షన్ విద్యుత్ తీగలు చేతికి తాకడంతో విద్యుత్ షాక్‌కు గురై.. ఎగిరి రైలు పట్టాలపై పడ్డాడు.

విద్యుదాఘాతంతో తీవ్రంగా గాయపడ్డ జాన్సన్‌ను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు. జాన్సన్ పరిస్థితి విషమంగా ఉందంటున్నారు వైద్యులు. ఈ ఘటనపై రేణిగుంటు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లోఎమ్మెల్యే.

తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లోఎమ్మెల్యే కలెక్టర్ ఎస్పీ

వనపర్తి నేటిధాత్రి :

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలోవనపర్తి ఎమ్మెల్యే మె గారెడ్డి జిల్లాకలెక్టర్ ఆదర్శ్ సురబి ఎస్పీ రావుల గీరీదర్ మార్కెట్ కమిటి చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ అధికారులు పాల్గొన్నారు జరుపుకున్నారు కలెక్టర్ కార్యాలయ ఆవరణలో  జెండా ఎగరవేశారు

హార్దిక్-అయ్యర్ జీతాలు కట్.. బీసీసీఐ గట్టి షాక్!

హార్దిక్-అయ్యర్ జీతాలు కట్.. బీసీసీఐ గట్టి షాక్!

నేటి ధాత్రి

 

 

 

 

 

గెలిచిన సంతోషంలో ఉన్న శ్రేయస్ అయ్యర్‌తో పాటు ఓడిన బాధలో ఉన్న హార్దిక్ పాండ్యాకు గట్టి షాక్ తగిలింది.

ఇద్దరి జీతాలు కట్ చేసింది బీసీసీఐ.

ఎందుకిలా చేసిందో ఇప్పుడు చూద్దాం..

 

స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అదరగొట్టాడు.

తాను సారథ్యం వహిస్తున్న పంజాబ్ కింగ్స్‌‌ను ఐపీఎల్-2025 ఫైనల్‌కు చేర్చాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో పంజాబ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు అయ్యర్.

41 బంతుల్లో 87 పరుగుల కెప్టెన్సీ నాక్‌తో మ్యాచ్ ఫలితాన్ని శాసించాడు.

అటు ముంబైని ఫైనల్ చేర్చలేకపోయాడు సారథి హార్దిక్ పాండ్యా.

ఎంతగా పోరాడినా అతడి జట్టుకు విజయం దక్కలేదు.

ఈ తరుణంలో సంతోషంగా ఉన్న అయ్యర్‌తో పాటు ఓటమి బాధలో ఉన్న పాండ్యాకు గట్టి షాక్ తగిలింది.

వారిద్దరి జీతాలను కట్ చేసింది భారత క్రికెట్ బోర్డు. మరి..

బీసీసీఐ ఎందుకిలా చేసిందో ఇప్పుడు చూద్దాం..

 

శ్రేయస్ అయ్యర్-హార్దిక్ పాండ్యాకు జరిమానా విధించింది బీసీసీఐ.

ముంబై ఇన్నింగ్స్ సమయంలో పంజాబ్ కింగ్స్ నిర్ణీత టైమ్‌లో ఓవర్లు పూర్తి చేయలేదు.

దీంతో అయ్యర్‌కు రూ.24 లక్షల ఫైన్ విధించింది బోర్డు.

అతడితో పాటు పంజాబ్ ఆటగాళ్లందరి జీతాల్లోనూ కోత విధించింది.

ఆ టీమ్ ప్లేయర్లు చెరో రూ.6 లక్షలు కట్టాలి లేకపోతే మ్యాచ్ ఫీజులో నుంచి 25 శాతాన్ని జరిమానా కింద చెల్లించాలని బోర్డు ఆదేశించింది.

అటు ముంబై ఇండియన్స్ సారథి పాండ్యాకు రూ.30 లక్షల ఫైన్ వేసింది బీసీసీఐ.

స్లో ఓవర్ రేట్ కింద ఇతర ఎంఐ ప్లేయర్లు తలో రూ.12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో నుంచి 50 శాతం మొత్తాన్ని కట్టాలని స్పష్టం చేసింది.

రూ.12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో ఏది తక్కువగా ఉంటే అది చెల్లించాలని బోర్డు తెలిపింది.

పునరాలోచన చేస్తారా..

జరిమానా ద్వారా పంజాబ్ గెలిచిన సంతోషాన్ని బీసీసీఐ ఆవిరి చేసినట్లయింది.

అటు ఓడిన ముంబైకి కూడా ఫైన్ విధించడం ద్వారా వాళ్ల బాధను రెట్టింపు చేసినట్లయింది.

అయితే కోట్లకు కోట్లు పారితోషికాలు అందుకుంటున్న ప్లేయర్లకు ఈ జరిమానా చిన్న మొత్తంగానే చెప్పాలి.

కాగా, ఈ ఐపీఎల్‌లో స్లో ఓవర్‌ రేట్‌లు భారీగా నమోదయ్యాయి.

గతంలో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోతే జట్టు సారథికి జరిమానా విధించడమే గాక మ్యాచ్ బ్యాన్ కూడా వేసేది బీసీసీఐ.

కానీ ఈసారి నిషేధం ఎత్తేయడంతో కెప్టెన్లు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే బ్యాన్ చేయరనే ధీమాతో చాలా మ్యాచుల్లో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేదు.

బౌలింగ్ మార్పులు-ఫీల్డింగ్ పొజిషన్స్ సెట్ చేసేందుకు ఎక్కువ టైమ్ తీసుకున్నారు.

దీంతో మ్యాచులు ముగియడానికి అధిక సమయం పడుతోంది. మరి..

ఈ రూల్ విషయంలో తదుపరి సీజన్‌లో బీసీసీఐ పునరాలోచన చేస్తుందేమో చూడాలి.

 

కోల్డ్ బెల్ట్ ఏరియా లారీ యజమానుల రిలే నిరాహార దీక్షలు.

కోల్డ్ బెల్ట్ ఏరియా లారీ యజమానుల రిలే నిరాహార దీక్షలు

కోల్ బెల్ట్ ఏరియా పరిధిలో స్థానికంగా ఉన్న లారీలకు మాత్రమే లోడింగ్ ఇవ్వాలి

అసోసియేషన్ నిర్ణయించిన కిరాయి మాత్రమే చెల్లించాలి

ఇతర రాష్ట్రాల లారీలు తెప్పించి స్థానికంగా ఉన్న లారీ ఓనర్ల పొట్టగొడుతారా

నస్పూర్ (మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ తీగల్పాడు గోదాం వద్ద కోల్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యజమానుల ఆధ్వర్యంలో సోమవారం రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది.ఇక్కడ స్థానికంగా ఉండే లారీ యజమానుల పొట్ట కొట్టడానికి సిసిఐ గోదాం వాళ్లు తమిళనాడు,కేరళ నుండి తక్కువ కిరాయిలకు లారీలను తెప్పించి ఇక్కడ లోడింగ్ చేపియడం వల్ల మా లారీ యజమానుల బ్రతుకులు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.వందల మంది లారీ యజమానుల కుటుంబాలు లారీల మీద ఆధారపడి జీవిస్తున్నామని, మా లారీలు నడవనీయకపోతే మా పరిస్థితి ఏంటని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సీసీఐ వాళ్లు స్పందించి మా లారీలు లోడింగ్ చేసేలా చర్య తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి మా లారీ ఓనర్లకు తగిన న్యాయం చేయగలరని పై అధికారులని వేడుకుంటున్నాము. ఈకార్యక్రమంలో కోల్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుండా సురేష్ గౌడ్,వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ల సుమన్, జనరల్ సెక్రెటరీ రాందేని రమేష్,జాయింట్ సెక్రటరీ అరికోళ్ల రమేష్,కల్చర్ సెక్రటరీ గుడికందుల తిరుపతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ దాసరి పవన్,క్యాషియర్ కటకం ప్రశాంత్ మరియు లారీ యజమానులు పాల్గొన్నారు.

సిద్దు జొన్నలగడ్డ.. తెలుసుక‌దా రిలీజ్ డేట్ వ‌చ్చేసింది!

సిద్దు జొన్నలగడ్డ.. తెలుసుక‌దా రిలీజ్ డేట్ వ‌చ్చేసింది! ఎప్పుడంటే

 

నేటి ధాత్రి:

 

 

 

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నటిస్తోన్న నూత‌న‌ చిత్రం ‘తెలుసు కదా’

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నటిస్తోన్న నూత‌న‌ చిత్రం ‘తెలుసు కదా’ (Telusu Kada). స్టైలిస్ట్ నీరజ కోన (Neeraja Kona) ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం కాబోతుండగా.. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రాశీ ఖ‌న్నా (Raashii Khanna), క‌న్న‌డ భామ‌ శ్రీనిధి షెట్టి (Srinidhi Shetty) క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

ఎప్పుడో ఏడాది కింత మొద‌లైన ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు విడుద‌ల‌కు రెడీ అవుతోంది. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం ఈ సినిమాకు సంబంధించి కీల‌క అప్డేట్ ఇచ్చారు. అక్టోబ‌ర్‌17న సినిమా విడుద‌ల కానున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్బంగా హీరో హీరోయున్లు వీడియో కాల్‌లో క‌నెక్ట్ అయి డిటెయిల్స్ చెబుతూ చేసిన వీడియో ఆక‌ట్టుకునేలా ఉంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Telusu Kada

 

 

ఈ సినిమాలో టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తుండ‌గా, జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్ నవీన్ నూలి ఎడిటర్. బిజీ ప్రొడక్షన్ డిజైనర్లలో ఒకరైన అవినాష్ కొల్లా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్. శీతల్ శర్మ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. అయితే జాక్ డిజాస్ట‌ర్‌తో సిద్ధుకు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గ‌ల‌డంతో ఇప్పుడు ఆయ‌న ఆశ‌ల‌న్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి.

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.

రాష్ట్ర సాధనలో మాజీ సీఎం కెసిఆర్ ఆమరణ దీక్ష తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచి.

రాష్ట్రం సిద్ధించడంలో అమరవీరుల త్యాగాలు మరువలేనివి.

మాజీ జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న.

మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ భానోత్ సారంగపాణి.

నల్లబెల్లి నేటి ధాత్రి:

14 ఏళ్ల అలుపెరుగని పోరాటంతో తెలంగాణ ఉద్యమ రథసారథి కెసిఆర్ సారధ్యంలో సాధించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను మండల కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగృహం వద్ద బిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు అలాగే మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి పార్టీ జెండా ఎగరవేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరుల త్యాగాలు, ప్రభుత్వ ఉద్యోగులు విద్యార్థుల పోరాటాలు సబ్బండ వర్గాల సమిష్టి కృషితోనే ఆరో దశబ్దాల కల సహకారం అయిందని అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ తొలి 10 ఏళ్ల ప్రస్థానం యావత్ భారత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రతి ఆలోచన వెనుక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా దిక్సూచిగా నిలిచిందని పేర్కొన్నారు.

తెలంగాణ గడ్డపై పురుడుపోసుకున్న రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశానికి దారి చూపే దీప స్తంభంలా నిలవడం ప్రతి తెలంగాణ బిడ్డకు గర్వకారణమని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్ష చైర్మన్ చెట్టు పల్లి మురళీధర్ రావు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఉడుగుల ప్రవీణ్ గౌడ్, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, క్లస్టర్ ఇన్చార్జిలు గందె శ్రీనివాస్ గుప్తా, వైనాల వీరస్వామి, ఇంగ్లీశివాజీ, మాజీ సర్పంచులు నాన బోయిన రాజారాం యాదవ్, ఊరటి అమరేందర్ రెడ్డి, మామిండ్ల మోహన్ రెడ్డి, చీకటి ప్రకాష్, వెంకన్న, మాజీ ఎంపిటిసి జన్ను జయరావు, నాయకులు ఖ్యాతం శ్రీనివాస్, పాండవుల రాంబాబు, ఆకుల సాంబారావ్, బోట్ల పవన్, బూస సదయ్య, గుండాల శ్రీశైలం, గుమ్మడి వేణు, పరికి కోర్నిల్, రాజు, వేల్పుల రవి తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయండి.

జూన్ 4న కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయండి

CITU పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ పిలుపు

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు CITU పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బి.వై.నగర్ లోని కామ్రేడ్,అమృత్ లాల్ శుక్లా భవనంలో సి.ఐ.టి.యు జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది.
ఈ సందర్భంగా సి.ఐ.టి.యు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడుతూ 2023 సంవత్సరం బతుకమ్మ చీరలకు సంబంధించి గత నెల రోజుల క్రితం మొదటి విడతగా 3,000 మంది కార్మికుల ఖాతాలలో సబ్సిడీ డబ్బులు జమ చేయడం జరిగిందని ఇంకా సిరిసిల్ల మరియు టెక్స్ టైల్ పార్క్ లో దాదాపు 2200 మంది కార్మికులకు సంబంధించిన సబ్సిడీ డబ్బులు రావాల్సి ఉందని అధికారులను ఎన్నిసార్లు అడిగినా రేపు మాపు అంటూ దాటవేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు రెండవ విడత సబ్సిడీ డబ్బులు రాకపోవడంతో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆందోళన చెందుతున్నారని సబ్సిడీ రావలసిన కార్మికులకు కాలయాపన చేయకుండా అధికారులు వెంటనే రేపటి వరకు సబ్సిడీ అందించాలని డిమాండ్ చేశారు.మొదటి విడత సబ్సిడీ వచ్చి నెల రోజులు అవుతున్న సబ్సిడీ రానీ కార్మికులకు అందించడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ , వెంటనే సబ్సిడీ అందించాలని జూన్ 4 వ. తేదీ బుధవారం రోజున CITU ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఇట్టి ధర్నా కార్యక్రమంలో సిరిసిల్ల మరియు టెక్స్ టైల్ పార్క్ లో సబ్సిడీ డబ్బులు రాని కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షులు నక్క దేవదాస్ నాయకులు స్వర్గం శేఖర్,సందు పట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ అవతరణ దినోత్సవము వేడుకలు.

వేములపల్లిలో తెలంగాణ అవతరణ దినోత్సవము వేడుకలు అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రం …
గ్రామ శాఖ అధ్యక్షులు ఆరేళ్ల రమేష్

మొగుళ్ళపల్లి నేటిధాత్రి:

భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని వేములపల్లి బి ఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఆరేళ్ల రమేష్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో జెండా ఆవిష్కరణ జరిపారు గ్రామ శాఖ అధ్యక్షులు మాట్లాడుతూ అమరవీరుల త్యాగ ఫలితం తోనే తెలంగాణ రాష్ట్రం కల సహకారం అయిందని, నీళ్లు, నిధులు, నియామకాలతో మొదలెట్టిన తెలంగాణ ఉద్యమం, సకలజనులు సబ్బండవర్ణాల కలయికతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అన్నారు. దశాబ్దాలుగా 1969 నుండి 2014 వరకు వివిధ దశలో సాగిన తెలంగాణ ఉద్యమంలో వేలాదిమంది ఆత్మహత్య చేసుకున్నారుప్రత్యేక తెలంగాణ అంశంపై 2017 శ్రీకృష్ణ కమిటీ ఎప్పటి ఆరు ప్రతిపాదనలు చేసి ఆ ప్రతిపాదనలు జూలై 2013 జూలై 31 తెలంగాణ కొరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది 2013 అక్టోబర్ 3న కేంద్రం మండలి ఆమోదం లభించగా 2014 ఫిబ్రవరి 13 తెలంగాణ ఏర్పాటు బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతు లోకసభలో ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొంది 2014లో ఉమ్మడి రాష్ట్ర విభజన ఆదేశిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వికరణ చట్టం 2014 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు లేదా తెలంగాణ బిల్లు అని ప్రవేశపెట్టింది 2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించాక 2014 దేశంలో 29వ రాష్ట్రంగా నూతన రాష్ట్రంగా ఆవిర్భవించింది . తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్ అని 14 సంవత్సరాలు అలుపెరగని పోరాటంలో తెలంగాణ సాధించారని ఉద్యమ సారధి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించింది అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి పోచంపల్లి రమేష్ ఎండి రహీం బండారి తిరుపతి బీసీ సంఘం అధ్యక్షులు భాష బోయిన శ్రీశైలం వికలాంగుల అధ్యక్షులు రమేష్ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కరీంనగర్ నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట మార్కెట్ కమిటీ ఆద్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేణి తిరుమల తిరుపతి ముదిరాజ్. ఈకార్యక్రమంలో వైస్ చైర్మన్ పిండి సత్యం రెడ్డి, డైరెక్టర్ లు బడుగు ఎల్లయ్య, మ్యాకల స్వామి, జక్కుల బాబు, కుంబాల రాజేశం, వేణుగోపాల్ రెడ్డి, కోట్ల మల్లేశం, మార్కెట్ సిబ్బంది, రాజేశం, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

నాగారం మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నాగారం నేటిదాత్రి:

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం నాగారం మున్సిపల్ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు నాగారం మున్సిపల్ కమిషనర్ రాజేందర్ కుమార్ జాతీయ జెండా ఎగురవేశారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో నాగారం మాజీ వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు అనిత సుధాకర్ రెడ్డి, లావణ్య శ్రీనివాస్, సుమిత్ర సురేష్, మాజీ కోఆప్షన్ మెంబర్ షఫీ, మాజీ వార్డ్ మెంబర్ శ్రీనాథ్ గౌడ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

నల్లబెల్లి నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. మండల తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో ముప్పు కృష్ణ, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో నరసింహమూర్తి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై వి గోవర్ధన్, సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ రావు, మదర్ తెరిసా సమైక్య మండల కార్యాలయంలో అధ్యక్షురాలు ఊట్కూరి భాగ్యలక్ష్మి, రైతు వేదిక వద్ద ఏవో బన్న రజిత, జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం తెలంగాణ గీతాన్ని ఆలాపించి అమరవీరులకు జోహార్లు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మార్వో ముప్పు కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరుద్యోగ యువకులు, ఉద్యోగులు సబ్బండ వర్గాల త్యాగ ఫలితం తోటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం జరిగిందని. రాష్ట్రం కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసిన త్యాగమూర్తులను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేసే విధంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖలకు సంబంధించిన సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

కొత్తగూడలో స్వరాష్ట్ర తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

కొత్తగూడలో స్వరాష్ట్ర తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జాతీయ జెండా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరణ చేసిన వజ్జ సారయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు.

కొత్తగూడ నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని కొత్తగూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క సూచనల మేరకు జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గ్రామ కమిటీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించినారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు త్రివర్ణ పతాకం జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు తధానంతరం వారు మాట్లాడుతూ…
జూన్ 2 స్వరాష్ట్ర స్వప్నం సాకారం అయిన రోజు
ఆరున్నర దశాబ్దాల ఆకాంక్షలు నెరవేరిన రోజు
నాలుగున్నర కోట్ల ప్రజల ఆత్మగౌరవ నినాదం
ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితం
అలుపెరగని పోరాటాలతో సాధించిన అంతిమ విజయం
అసాధ్యభావనను, సుసాధ్యాం చేసిన శుభదినం స్వేచ్ఛ, సమానత్వం, సంక్షేమం, అభివృద్ధితో విరాజిల్లుతున్న మన ప్రజాపాలనకు నిలువెత్తు నిదర్శనం..తెలంగాణ ప్రజల కాంక్షను తీర్చిన తల్లి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ..రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి,
కొత్తగూడ బ్లాక్ అధ్యక్షులు సుంకరబోయిన మొగిలి.
లావణ్య వెంకన్న జిల్లా నాయకులు,
బానోత్ విజయ రూప్సింగ్ ఎక్స్ ఎంపీపీ & జిల్లా ప్రధాన కార్యదర్శి.
పులుసం పుష్పలత ఎక్స్ జెడ్పిటిసి.
బిట్ల శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శి.
ఇర్ప రాజేశ్వర్ మండల అధికార ప్రతినిధి.
బోయినేని ప్రశాంత్ రెడ్డి యూత్ మండల అధ్యక్షులు.
వల్లపు రంజిత్ జిల్లా ఓబీసీ నాయకులు.
నోముల ప్రశాంత్ యాదవ్ జిల్లా యూత్ నాయకులు
సిరిగిరి సురేష్ మండల సోషల్ మీడియా.
కే దాసుప్రసాద్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు.
బోడ ఈరియా నాయక్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు.
కట్రోజు బిక్షపతి బీసీ సెల్ మండల నాయకులు.
శిరబోయిన సాయి
యాదగిరి కిరణ్.
మెకానిక్ కృష్ణ. జితేందర్ తదితరులు పాల్గొన్నారు

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

నేటి ధాత్రి గార్ల:

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పిఎసిఎస్ కార్యాలయంలో జాతీయ జెండాను సొసైటీ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ,నీళ్లు, నిధులు,నియామకాల కోసం ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందని అన్నారు.అమరుల ఆకాంక్షలు, ఆశయాల కోసం సకల జనులందరూ కృషి చేయాలని ఆయన కోరారు.స్వరాష్ట్రము కోసం అసువులు బాసిన తెలంగాణ అమరవీరులందరికీ నివాళులు అర్పించారు. పోలీస్ స్టేషన్ లో ఎస్సై రియాజ్ పాషా, తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద విశ్వ జంపాల,తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శారదా, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మంగమ్మ జెండా ఆవిష్కరణ చేశారు.ఈ యొక్క కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ గంగావత్ లక్ష్మణ్ నాయక్,సొసైటీ డైరెక్టర్ శీలంశెట్టి ప్రవీణ్ నాయుడు, సిపిఎం పార్టీ జిల్లా నాయకులు కందునూరి శ్రీనివాస్,కడియం వెంకన్న, సొసైటీ సీఈవో వెంకటేశ్వర్లు, గిన్నారపు మురళి తారక రామారావు, భూక్యా నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

సమీకృత కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ.

సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుక

జిల్లా కలెక్టర్ సందీప్ ఝా జెండా ఆవిష్కరణ

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలో పాల్గొని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జెండా ఆవిష్కరించడం జరిగినది.
తదనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది.
అంతేకాకుండా జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నామని, ప్రభుత్వం నుండి గాని ప్రభుత్వ అధికారుల నుండి గాని జిల్లా ప్రజలకు అభివృద్ధిలో భాగంగా ముందుంటామని తెలపడం జరిగినది. తెలంగాణ అవతరణ దినోత్సవం లో భాగంగా జిల్లా కలెక్టర్ విద్యార్థిని, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేయడం జరిగినది.

ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.

ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

జాతీయ జెండాను, పార్టీ పతాకాన్ని ఎగరేసి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించిన బిఆర్ఎస్ శ్రేణులు

గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు

మరిపెడ నేటిధాత్రి:

14 ఏళ్ల అలుపెరగని పోరాటంతో తెలంగాణ జాతిపిత,ఉద్యమ రథసారథి కేసిఆర్ సారథ్యంలో సాధించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గo మరిపెడ మున్సిపల్ కేంద్రంలో ని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నవీన్ రావు హాజరై జాతీయ జెండా తోపాటు పార్టీ జెండాను ఎగరేసి సంబరాలు జరుపుకున్నారు.అమరుల త్యాగాలు, ప్రభుత్వ ఉద్యోగులు , విద్యార్థుల పోరాటాలు, సబ్బండ వర్గాల సమిష్టి కృషితోనే ఆరు దశాబ్దాల కల సాకారం అయిందని గుర్తు చేశారు,కొట్లాడి సాధించుకున్న తెలంగాణ తొలి పదేళ్ల ప్రస్థానం యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు,తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రతి ఆలోచన వెనుక రాష్ట్ర ప్రభుత్వనికి,కేంద్ర సర్కార్ కు కూడా దిక్సూచిగా నిలిచిందని పేర్కొన్నారు.తెలంగాణ గడ్డపై పురుడు పోసుకున్న రైతుబంధు,మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశానికే దారిచూపే దీపస్తంభంలా నిలవడం ప్రతి తెలంగాణ బిడ్డకు గర్వకారణమని అన్నారు,తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతో పాటు గత పదేళ్లపాటు సాగిన తెలంగాణ ఉజ్వల ప్రయాణంలో కేసీఆర్ అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు అన్నారు,మాయమాటలతో మభ్యపెట్టే ఢిల్లీ పార్టీలతో రాష్ట్ర ప్రయోజనాలు అడుగడుగునా దెబ్బతింటున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణ సమాజమంతా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు,జిల్లా సీనియర్ నాయకుడు రాంబాబు, మాజీ ఎంపీపీ గడ్డం వెంకన్న, మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు తాళ్లపల్లి రఘురాం,కేసముద్రం మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్, రైతు కోఆర్డినేటర్ కొమ్ము చంద్రశేఖర్,మైనారిటీ నాయకులు లతీఫ్,మాజీ కౌన్సిలర్లు వెంకటేశ్వర్లు,అజ్మీర రెడ్డి, బోడ భాస్కర్,గంధసిరి కృష్ణ, బిఆర్ఎస్ కార్యకర్తలు వివిధ గ్రామాల మాజీ సర్పంచులు,ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో తెలుగుదేశం.

తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో తెలుగుదేశం నేతలు

వనపర్తి నేటిధాత్రి :

 

 

 

 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వనపర్తి జిల్లా తెలుగుదేశం నేతలు ఘన o గా జరుపుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేశారు .

 

 

ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ పార్లమెంటు కన్వీనర్ బి రాములు న్యాయవాది షాకీర్ హుస్సేన్ కాగితాల లచ్చన్న చిన్నయ్య కృష్ణయ్య ,ఉపేంద్ర, రాజుఎం శేఖర్, కొత్తగొళ్ల శంకర్ దస్తగిరి డి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

జెండాను ఆవిష్కరించిన ఆర్డీవో రామ్ రెడ్డి.

జహీరాబాద్ జెండాను ఆవిష్కరించిన ఆర్డీవో రామ్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవవేడుకల సందర్భంగా సోమవారం జహీరాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జహీరాబాద్ ఆర్డిఓ రామ్ రెడ్డి జెండా ఎగురవేసి తెలంగాణ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మిథున్ రాజ్, ఎమ్మార్వో దశరద్ సింగ్, మోహన్ రెడ్డి, రైతుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చిట్టెంపల్లి బాలరాజ్, వివిధ పార్టీల కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

జెండాను ఆవిష్కరించిన ఎంపీడీవో.

జెండాను ఆవిష్కరించిన ఎంపీడీవో

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవవేడుకల సందర్భంగా సోమవారం ఝరాసంగం ఎంపీడీవో కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఝరాసంగం ఎంపీడీవో సుధాకర్ జెండా ఎగురవేసి తెలంగాణ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఆర్ఓ తిరుమల రావు ఏపీవో రాజ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమంతరావు పటేల్ అశ్రాఫ్ ఫలి రాజేందర్ సింగ్ మాజీ సర్పంచ్ పెంటయ్య పోలీసు అధికారులు వివిధ పార్టీల కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

తుమ్మనపల్లి గ్రామంలో ఆవిర్భావ దినోత్సవవేడుకల

ఝరాసంగం మండలంలోని తుమ్మనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి విక్రాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జండా సోమవారం ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు ఘనగా నిర్వహించరు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి సురేఖ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కోసం ఎందరో త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రన్ని సాధించుకున్నారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ మైనారిటీ నాయకులు షేక్ సోహెల్ ప్రధానోపాధ్యాయురాలు ఎక్స్ ఎంపిటిసి ఏ. నవాజ్ రెడ్డి మరియు కే శ్రీనివాస్ రెడ్డి మతిన్ ఆశప్ప మిటుషా. తదితరులు పాల్గొన్నారు

సిరిసిల్ల జిల్లా పోలీస్ పరేడ్ కేంద్రంలో.

సిరిసిల్ల జిల్లా పోలీస్ పరేడ్ కేంద్రంలో తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుక

వేడుకలో పాల్గొన్న, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ని జిల్లా పోలీస్ పరేడ్ కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వేములవాడ ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ పాల్గొని భారత త్రివర్ణ పతాక జెండా ఆవిష్కరించడం జరిగినది. తదనంతరం పోలీస్ పరేడ్ వందన కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది,ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ మాట్లాడుతూ.

తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలపడం జరిగినది. అంతేకాకుండా ఎందరో అమరుల త్యాగం వల్ల సిద్ధించిన తెలంగాణ, నేడు ప్రజా పాలన వ్యవస్థగా పురుడుపోసుకున్నదని తెలిపారు. అంతేకాకుండా తెలంగాణలో ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి, ప్రభుత్వం ద్వారా, పాలకుల ద్వారా, ప్రభుత్వ అధికారుల ద్వారా జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందించే ప్రతిఫలాలు పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కృషి చేస్తున్నామని.
అంతేకాకుండా జిల్లాను విద్యా,వైద్య, ఉపాధి కల్పనలో ముందుండడానికి ప్రభుత్వం మరియు ప్రభుత్వ అధికారులు అహర్నిశలు కష్టపడుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప తిరుపతిరెడ్డి,

రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు,ప్రభుత్వ అధికారులు పాల్గొనడం జరిగినది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version