జెండాను ఆవిష్కరించిన ఎంపీడీవో
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవవేడుకల సందర్భంగా సోమవారం ఝరాసంగం ఎంపీడీవో కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఝరాసంగం ఎంపీడీవో సుధాకర్ జెండా ఎగురవేసి తెలంగాణ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఆర్ఓ తిరుమల రావు ఏపీవో రాజ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమంతరావు పటేల్ అశ్రాఫ్ ఫలి రాజేందర్ సింగ్ మాజీ సర్పంచ్ పెంటయ్య పోలీసు అధికారులు వివిధ పార్టీల కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
తుమ్మనపల్లి గ్రామంలో ఆవిర్భావ దినోత్సవవేడుకల
ఝరాసంగం మండలంలోని తుమ్మనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి విక్రాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జండా సోమవారం ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు ఘనగా నిర్వహించరు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి సురేఖ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కోసం ఎందరో త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రన్ని సాధించుకున్నారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ మైనారిటీ నాయకులు షేక్ సోహెల్ ప్రధానోపాధ్యాయురాలు ఎక్స్ ఎంపిటిసి ఏ. నవాజ్ రెడ్డి మరియు కే శ్రీనివాస్ రెడ్డి మతిన్ ఆశప్ప మిటుషా. తదితరులు పాల్గొన్నారు