అమరుల త్యాగాలు మరువలేనివి.

అమరుల త్యాగాలు మరువలేనివి

బాలానగర్  నేటి ధాత్రి:

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల బీజేపి పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు గోపాల్ నాయక్ జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరుల త్యాగాలు మరువలేనివని, తెలంగాణ ఉద్యమ సమయంలో అసువులు బాసిన ఉద్యమకారులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బాలానగర్ మాజీ సర్పంచ్ మాజీ అధ్యక్షులు సాటి శ్రీనివాస యాదవ్, వంగూరి యాదయ్య, జిల్లా బీజేవైఎం ఐటి సెల్ కన్వీనర్ జరుపుల గణేష్, మాజీ అధ్యక్షులు శ్రీశైలం, బీజేవైఎం మండల అధ్యక్షులు కుమార్ నాయక్, శ్రీను, లక్ష్మయ్య, నాగేష్, సురేష్, శ్రీకాంత్, భరత్, చౌదరి, శ్రీనివాస్ రెడ్డి, నందు యాదవ్, ఆర్. శ్రీను తదితరులు పాల్గొన్నారు.

జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి.

జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి.

రామాయంపేట ఏప్రిల్ 5 నేటి ధాత్రి (మెదక్)

 

దివంగత బాబు జగ్జీవన్ రామ్ సెవెన్ మరువలేనివని రామాయంపేట లైన్స్ క్లబ్ సభ్యులు పేర్కొన్నారు. శనివారం రామాయంపేట పట్టణంలో ఆయన 117వ జయంతి వేడుకలను నిర్వహించారు. బడుగు బలహీనవర్గాల కోసం ఆయన ఎంతో సేవ చేశారని ఆయన సేవలు మరువలేనిది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ నాయకులు. ఏలేటి రాజశేఖర్ రెడ్డి, దేమే యాదగిరి, కైలాష్ తదితరులున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version