అమరుల త్యాగాలు మరువలేనివి
బాలానగర్ నేటి ధాత్రి:
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల బీజేపి పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు గోపాల్ నాయక్ జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరుల త్యాగాలు మరువలేనివని, తెలంగాణ ఉద్యమ సమయంలో అసువులు బాసిన ఉద్యమకారులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బాలానగర్ మాజీ సర్పంచ్ మాజీ అధ్యక్షులు సాటి శ్రీనివాస యాదవ్, వంగూరి యాదయ్య, జిల్లా బీజేవైఎం ఐటి సెల్ కన్వీనర్ జరుపుల గణేష్, మాజీ అధ్యక్షులు శ్రీశైలం, బీజేవైఎం మండల అధ్యక్షులు కుమార్ నాయక్, శ్రీను, లక్ష్మయ్య, నాగేష్, సురేష్, శ్రీకాంత్, భరత్, చౌదరి, శ్రీనివాస్ రెడ్డి, నందు యాదవ్, ఆర్. శ్రీను తదితరులు పాల్గొన్నారు.