ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
జాతీయ జెండాను, పార్టీ పతాకాన్ని ఎగరేసి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించిన బిఆర్ఎస్ శ్రేణులు
గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు
మరిపెడ నేటిధాత్రి:
14 ఏళ్ల అలుపెరగని పోరాటంతో తెలంగాణ జాతిపిత,ఉద్యమ రథసారథి కేసిఆర్ సారథ్యంలో సాధించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గo మరిపెడ మున్సిపల్ కేంద్రంలో ని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నవీన్ రావు హాజరై జాతీయ జెండా తోపాటు పార్టీ జెండాను ఎగరేసి సంబరాలు జరుపుకున్నారు.అమరుల త్యాగాలు, ప్రభుత్వ ఉద్యోగులు , విద్యార్థుల పోరాటాలు, సబ్బండ వర్గాల సమిష్టి కృషితోనే ఆరు దశాబ్దాల కల సాకారం అయిందని గుర్తు చేశారు,కొట్లాడి సాధించుకున్న తెలంగాణ తొలి పదేళ్ల ప్రస్థానం యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు,తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రతి ఆలోచన వెనుక రాష్ట్ర ప్రభుత్వనికి,కేంద్ర సర్కార్ కు కూడా దిక్సూచిగా నిలిచిందని పేర్కొన్నారు.తెలంగాణ గడ్డపై పురుడు పోసుకున్న రైతుబంధు,మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశానికే దారిచూపే దీపస్తంభంలా నిలవడం ప్రతి తెలంగాణ బిడ్డకు గర్వకారణమని అన్నారు,తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతో పాటు గత పదేళ్లపాటు సాగిన తెలంగాణ ఉజ్వల ప్రయాణంలో కేసీఆర్ అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు అన్నారు,మాయమాటలతో మభ్యపెట్టే ఢిల్లీ పార్టీలతో రాష్ట్ర ప్రయోజనాలు అడుగడుగునా దెబ్బతింటున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణ సమాజమంతా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు,జిల్లా సీనియర్ నాయకుడు రాంబాబు, మాజీ ఎంపీపీ గడ్డం వెంకన్న, మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు తాళ్లపల్లి రఘురాం,కేసముద్రం మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్, రైతు కోఆర్డినేటర్ కొమ్ము చంద్రశేఖర్,మైనారిటీ నాయకులు లతీఫ్,మాజీ కౌన్సిలర్లు వెంకటేశ్వర్లు,అజ్మీర రెడ్డి, బోడ భాస్కర్,గంధసిరి కృష్ణ, బిఆర్ఎస్ కార్యకర్తలు వివిధ గ్రామాల మాజీ సర్పంచులు,ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.