ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
నల్లబెల్లి నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. మండల తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో ముప్పు కృష్ణ, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో నరసింహమూర్తి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై వి గోవర్ధన్, సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ రావు, మదర్ తెరిసా సమైక్య మండల కార్యాలయంలో అధ్యక్షురాలు ఊట్కూరి భాగ్యలక్ష్మి, రైతు వేదిక వద్ద ఏవో బన్న రజిత, జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం తెలంగాణ గీతాన్ని ఆలాపించి అమరవీరులకు జోహార్లు అర్పించారు.